ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర పేరు గాంచింది. తెలంగాణ కుంభమేళ అయిన మేడారం జాతర 4 రోజుల పాటు జరుగుతుంది. వనాల నుండి ప్రజల మధ్యకు వచ్చిన వనదేవతలను దర్శించుకోవడానికి మేడారంకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు.
గత 3 రోజులుగా భక్తులతో పూజలు అందుకున్న సమ్మక్క, సారలమ్మలు ఈరోజు వన ప్రవేశం చేయబోతున్నారు. ఈ వనప్రవేశంతో జాతర ముగియనుంది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరలో కోట్లలో బిజినెస్ జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈ మేడారం జాతర ఒక మహిళ లైఫ్ ని మార్చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

తెలంగాణ కుంభమేళగా పిలిచే, మేడారం జాతరకు తెలంగాణ నుండే మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి లక్షలాది భక్తులు తరలి వస్తుంటారు. గత 3 రోజులుగా సమ్మక్క సారక్క దేవతలను కోటిమందికి పైగా భక్తులు దర్శించుకున్నట్లు తెలుస్తోంది. మేడారం జాతర సమయంలో కోట్లలో వ్యాపారం జరుగుతుంది. మేడారం జాతర ప్రారంభం అయినప్పటి నుండి అక్కడ చాలామంది చాలా రకాల వ్యాపారాలను చేస్తుంటారు. అయితే ముఖ్యంగా బంగారం (బెల్లం), కొబ్బరి కాయల వ్యాపారం బాగా సాగుతుంది. అమ్మవారికి బెల్లాన్ని బంగారంగా భక్తులు సమర్పిస్తుంటారు.

మేడారం జాతర ఒక మహిళ లైఫ్ ను మార్చింది. ఆమె మాట్లాడుతూ” మేడారం జాతర ఒక రకంగా నా లైఫ్ ను మార్చింది. 3 ఏళ్ళ నుండి కొబ్బరి కాయల వ్యాపారం చేస్తున్నాను. బాగానే లాభాలు ఉన్నాయి. ఈ వ్యాపరం బాగా సెట్ అయ్యింది. ఆ అమ్మవారి ఆశీస్సుల వల్ల బిజినెస్ బాగా సాగుతుంది. కొబ్బరికాయలను ఆంధ్రప్రదేశ్, తమిళ నాడు నుండి తెప్పిస్తుంటాము. జాతరలో కొబ్బరి కాయలు 50 రూపాయాలకు అమ్ముతాము.

దేవస్థానం ధర 40 రూపాయాలు, కుంకుమ, పసుపుతో పాటు కొబ్బరికాయలకు రూ. 50 తీసుకుంటామని అన్నారు. ఇక్కడ బిజినెస్ నిర్వహిస్తున్నందుకు 28 రోజులకు గాను గ్రామ పంచాయితీకి ప్రతిరోజూ లక్ష చొప్పున 28 లక్షల రూపాయలను చెల్లిస్తామని చెప్పారు. గత మేడారం జాతరకు వ్యాపారంలో లాభాలు మంచిగా వచ్చాయి. కొన్నిసార్లు ఈ బిజినెస్ లో నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రతిసారి ఈ జాతరకు వచ్చి వ్యాపారం సాగిస్తాము. మేడారం జాతర వల్ల చాలామంది వ్యాపారం చేసుకుని బతుకుతున్నారు” అంటూ చెప్పుకొచ్చారు.


తల్లి ఉషారాణి గృహిణి, అక్క సుచిత సైతం ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తుందని అన్నారు. మానసికంగా తన ఎదుగుదలలో ఫ్యామిలీ మెంబర్స్ పాత్ర కీలకమని ఆమె చెప్పుకొచ్చారు. చదువు విషయంలో ఎప్పుడూ ఇంట్లో నుండి ఒత్తిడి లేదని, టెన్త్ క్లాస్ లో 10 పాయింట్లు వచ్చినట్టుగా తెలిపారు. ఇంటర్మీడియట్ లో 985 మార్కులు తెచ్చుకున్నట్లు తెలిపారు. ఎంసెట్ లో 186వ ర్యాంక్ వచ్చిందని, సాఫ్త్ వేర్ ఫీల్డ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో జేఎన్టీయూలో కంప్యూటర్ సైన్స్ లో చేరినట్టు తెలిపింది.

























ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎంతో మంచి మనసున్నటువంటి వ్యక్తిగా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నటువంటి ఎంవీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి అనకాపల్లిలో ఎంపీగా పోటీ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు కానీ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలాంటి ఒక పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి పారిశ్రామికవేత్త తమ పార్టీలోకి వస్తే పార్టీకి ఆర్థికంగా సహాయంగా ఉండటమే కాకుండా తప్పకుండా విజయం సాధిస్తుందని పార్టీ నేతలు ఆకాంక్షిస్తున్నారు.


