500 సంవత్సరాల తరువాత అంగరంగ వైభవంగా అయోధ్య రాముడు సొంత గడ్డపై కొలువుతీరాడు. సుకుమార సుందర రూపుడైనా రామ్ లల్లా ను దర్శించేందుకు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల నుంచి సైతం భక్తులు తరలివస్తున్నారు. దీనివలన రైళ్లలో రద్దీ పెరగటం చూసిన రైల్వే అధికారులు ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల నుంచి నేరుగా అయోధ్యకు రైలు ఏర్పాటు చేశారు. అయోధ్యకు వెళ్లి రాముల వారి దర్శనం చేసుకొని మరల తిరిగి అదే రైల్లో వారి స్వగ్రామాలకు వచ్చే విధంగా ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది రైల్వే శాఖ.
రాజమండ్రి,సామర్లకోట,తుని స్టేషన్ల నుంచి కాశీ పుణ్యక్షేత్రానికి వెళ్లాలనుకునే వారు ఇక రైళ్లు మారవలసిన అవసరం లేదు. గతంలో రాజమండ్రి నుంచి విశాఖకు ఒక రైలు, అక్కడి నుంచి భువనేశ్వర్ వరకు మరొక రైలు, అక్కడ నుంచి కాశీ లేదంటే అయోధ్యకు వెళ్లడానికి మరొక రైలు ఎక్కాల్సి వచ్చేది. ఇకమీదట అలాంటి ఇబ్బంది ప్రజలకు ఉండదు . ఎందుకంటే 07218 నెంబర్ తో ఈ నెల 11 నుంచి సామర్లకోట నుంచి అయోధ్య కి వెళ్లటానికి డైరెక్ట్ రైలు ఏర్పాటు చేశారు తిరిగి 14వ తేదీన అయోధ్యలో తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.

అలాగే గుంటూరు నుంచి మరొక రైలు రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి మీదుగా ప్రయాణించనుంది. ఏడవ తేదీన గుంటూరులో ప్రారంభమై అయోధ్యకు చేరుతుంది. తిరిగి పదవ తేదీన అయోధ్య నుంచి గుంటూరు కి చేరుతుంది. రైల్వే అధికారులు చేసిన ఈ ఏర్పాటుకు ఉభయగోదావరి జిల్లా వాసులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రెండు మూడు మైళ్ళు మారి వెళ్లవలసిన పని లేకుండా నేరుగా ఉమ్మడి జిల్లాల నుంచే ప్రత్యేక రైలు అందుబాటులో ఉండటంతో పెద్ద ఎత్తున రామ భక్తులు దర్శనం చేసుకుంటారని భావిస్తున్నారు రైల్వే శాఖ. అయితే నిజంగానే ఈ అవకాశాన్ని ఎలాగైనా ఉపయోగించుకుంటామని, రిజర్వేషన్ లేకపోయినప్పటికీ సాధారణమైన ప్రయాణం చేసైనా సరే సుందర రాముడిని దర్శించుకుంటాం అని చెప్తున్నారు ఉభయ గోదావరి జిల్లా వాసులు.






అయోధ్యలో రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ గ్రాండ్ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో తిరుపతి, అనంత పద్మనాభస్వామి దేవాలయం, షిర్డీ లాంటి దేవాలయాలకు భారీగా భక్తులు తరలివస్తుంటారు. దేశంలోనే ఈ దేవాలయాలు అత్యంత ధనిక దేవాలయాలుగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. పుణ్యక్షేత్రాలకు ప్రజలు ఎక్కువగా వెళ్తుంటారు. అది కూడా ఫ్యామిలీ అంతా వెళ్తుంది. దీనివల్ల ట్రాన్స్ పోర్ట్, రెస్టారెంట్లు, హోటల్స్ తో పాటు ఇతర బిజినెస్ లకు డిమాండ్ కూడా పెరుగుతుంది.
వివిధ రంగాలకు ఆదాయం పెరగడంతో టాక్స్ ల రూపంలో గవర్నమెంట్స్ కు పెద్ద మొత్తంలో ఆదాయం చేకూరుతుంది. ఇటీవల శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తుల తాకిడితో 2 నెలలకు గాను 357 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఇక ఇప్పుడు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరిగిన నేపథ్యంలో ఆధ్యాత్మిక టూరిజం పేరుగుతుందని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది.
ఎస్బీఐ నివేదిక ప్రకారం, యూపీలో రామ మందిరం నిర్మాణం మరియు అదనపు చర్యల వల్ల 2024-25 లో యూపీ గవర్నమెంట్ కు అదనంగా 25 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ మొత్తం సందర్శకుల రాకతో సమకూరనుంది. దీనివల్ల రోడ్డు, రైలు, వాయురవాణా పెరిగే ఛాన్స్ ఉంది. భక్తుల సేవల గాను హోటల్స్, హాస్పటల్స్ సైతం పెరుగుతాయి. 2027 వరకు మహారాష్ట్రతో పాటుగా ఉత్తర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 500 బిలియన్ డాలర్లను అధిగమించి, దేశ జీడీపీలో యూపీ వాటా పది శాతంగా ఉంటుందని తెలిపింది.


అయితే మరణంతో పోరాడిన విజయకాంత్ చివరికి చావు చేతిలో ఓడిపోక తప్పలేదు. అయితే ఈయన మరణం కోలీవుడ్ చిత్ర పరిశ్రమని దిగ్భ్రాంతికి గురి చేసింది. కడసారి చూపు కోసం పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, అభిమానులు అందరూ వచ్చారు. ఇప్పటికకీ ఈయన సమాధి వద్దకు వందలాది మంది అభిమానులు వచ్చి దర్శించుకుంటున్నారు. అయితే ఈ విషాద సంఘటన నుంచి విజయ్ కాంత్ కుటుంబం ఇంకా బయటపడలేదనే చెప్పాలి.






