సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా అక్కడి పెద్దలు రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఆ సమయంలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారు జోగిని స్వర్ణలతను ఆవహించి ఎవరు చేసుకున్నది వారు అనుభవించక తప్పదు. కరోనాపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.భక్తి భావనతో ఐదు వారాలు శాక పోసి, యజ్ఞాలు చేయించండి.నా ప్రజలందరినీ కాపాడుకుంటాను అలాగే వారిని సుఖసంతోషాలతో చూస్తానని మాటిస్తున్నాను. గంగాదేవికి జలాలతో అభిషేకం, బోనం చేయండి అని భవిష్య వాణి వినిపించారు.






































