సాధారణంగా ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన వారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తారనే విషయం తెలిసిందే. ఇక ప్రమాణ స్వీకారం చేసే ఎమ్మెల్యేలు వారి మాతృ భాషలో లేదా ఇంగ్లీష్ లో కానీ చేస్తుంటారు.
అయితే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలో గెలిచిన ఇద్దరు సంస్కృత భాషలో ప్రమాణ స్వీకారం చేయడం వైరల్ గా మారింది. ఎందుకంటే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ముస్లింలు. వీరిద్దరు ఇలా చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వీరి పై నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఇద్దరు ముస్లిం ఎమ్మెల్యేలు సంస్కృతంలో ప్రమాణ స్వీకారం ఎందుకు చేశారో ఇప్పుడు చూద్దాం..
బీబీసి తెలుగు న్యూస్ కథనం ప్రకారం, ఇటీవల రాజస్థాన్ లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో విజయం సాధించిన వారిలో ఇద్దరు ముస్లిం ఎమ్మెల్యేలు సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఈ ఇద్దరి ఎమ్మెల్యేల గురించి చర్చ జరుగుతోంది. ఒకరు యూనుస్ ఖాన్, బీజేపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. మరొకరు కాంగ్రెస్ పార్టీకి చెందిన జుబేర్ ఖాన్. రాజస్థాన్ లో 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 199 స్థానాలకు ఎలెక్షన్స్ జరిగాయి.
డిసెంబర్ 20న 191 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 21న 8 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. జుబేర్ ఖాన్ రామ్గఢ్ నియోజకవర్గం నుంచి గెలువగా, యూనస్ ఖాన్ దివానా నుంచి గెలిచారు. సంస్కృతంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం పై వీరిద్దరు స్పందించారు. యూనస్ ఖాన్ మాట్లాడుతూ “మేం మంచి పనిచేశామని ముస్లింలు సైతం ప్రశంసించారు” అని చెప్పారు. దేశంలో సంస్కృత భాష చాలా గొప్ప పురాతనమైన భాష అని, ఆ భాషలో ప్రమాణం చేయడం వల్ల ఎంతో గర్వపడుతున్నాను” అంటూ యూనస్ ఖాన్ వెల్లడించారు.
ఇక జుబేర్ ఖాన్ ఈ విషయం పై స్పందిస్తూ “సంస్కృతం మన దేశ పురాతన భాష. మేము భారత్ లోనే జీవిస్తున్న ఇండియన్ ముస్లింలం. అందువల్ల ఇక్కడి రాజ్యాంగాన్ని, సంస్కృతిని విశ్వసిస్తాం. సోదరభావం పై విశ్వాసం ఉంది. ప్రతి మతాన్ని గౌరవిస్తాం. సీనియర్ సెకండరీ దాకా నేను సంస్కృతం చదివాను. సంస్కృతంలో రెండోసారి ప్రమాణ స్వీకారం చేశాను. ముస్లిం అయిన నేను, ప్రమాణం సంస్కృతంలో చేయడం అందరికీ నచ్చింది” అంటూ జుబేర్ ఖాన్ వెల్లడించారు.
Also Read: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో తెలుసా..? ఒక రోజులో ఏం తింటారు అంటే..?

ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లాలో ఉన్న హుకుంపేటలోని ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ స్కూల్ లో సుమారు 300 మందికి పైగా స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. మారుమూల ప్రాంతాలకు నుండి వచ్చిన గిరిజన పిల్లలు ఈ స్కూల్ లోనే చదువుకుంటూ, అక్కడే ఉంటున్నారు. ఆ పాఠశాలలో టీచర్లు, సిబ్బంది కలిపి 10 మంది వరకు ఉన్నారు. అయితే వారందరినీ అందరికీ నడిపించే హెడ్ మాస్టార్ మాత్రం ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఆయన తన వృత్తిపరమైన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తూ, ఆ స్కూల్ లోని స్టూడెంట్స్ పట్ల ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకుంటున్నారు.
ఈ పాఠశాలలో బాలాజీ ప్రధానోపాధ్యాయుడుగా పని చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడు అయినప్పటికీ ఆ పాఠశాలలోని విద్యార్థులను చాలా ప్రేమతో చూసుకుంటున్నాడు. వారి తల్లితండ్రులు తమ పై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా అక్కడి పిలల్లకు విద్య, వసతి సౌకర్యాలు చూస్తూ, ఓ కుటుంబ పెద్దలా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హెడ్ మాస్టార్ లా కాకుండా, స్టూడెంట్స్ కు అవసరమైన సేవలను సైతం చేస్తున్నారు. విద్యార్థుల్లో చదువుతో పాటు క్రమశిక్షణ కూడా ఉండాలని బోధిస్తూ, స్టూడెంట్స్ ను తీర్చిదిద్దుతున్నారు.
ఆ క్రమంలో స్వయంగా తానే విద్యార్థుల యూనిఫామ్, హెయిర్ స్టైల్ విషయంలో ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్నారు. బార్బర్ రాకపోవడంతో, జుత్తు పెరిగిపోయిన విద్యార్థులకు వారి సమ్మతితో హెడ్ మాస్టార్ బాలాజీ కత్తెర పట్టుకుని క్షురకుడులా మారి ఖాళీ సమయంలో హెయిర్ కట్ చేస్తున్నారు. ఆయన సందర్భాన్ని బట్టి స్టూడెంట్స్ కి అవసరమైన సేవ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. విద్యార్థులు అందరు పాఠశాలలో క్రమశిక్షణతో కనిపించాలని, వారికి క్రమశిక్షణ నేర్పించాలనే ఉద్దేశ్యంతో ఇలా సేవ చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు బాలాజీ వెల్లడించారు.


సీఎం జగన్ ఆరోగ్యంగా ఉండేందుకే మొదటి నుండి ప్రాధాన్యతనిస్తారు. దానికి తగ్గట్లుగా ఆహారం తీసుకుంటారు. ఆయనకి మామిడికాయ తురుముతో చేసే పులిహోర అంటే చాలా ఇష్టం. ఉదయం 4.30కి సీఎం జగన్ రోజు మొదవుతుంది. ఉదయం 4.30 గంటల నుండి గంట సేపు యోగా, జిమ్ లాంటివి చేస్తారు. 5.30కి న్యూస్ పేపర్స్ చదవడంతో పాటు ముఖ్యమైన అంశాల గురించి నోట్స్ తయారు చేసుకుంటారు. ఆ సమయంలో టీ మాత్రమే తీసుకుంటారు. 7 గంటలకు జూస్ తాగుతారు.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు బదులుగా డ్రైఫ్రూట్స్ తింటారు. ఇక పాదయాత్ర చేసేనపుడు కూడా జగన్ బ్రేక్ ఫాస్ట్ కి దూరంగానే ఉన్నారు. సమీక్షలు చేసే టైమ్ లో చాక్లెట్ బైట్స్ తింటారట. మధ్యాహ్నం భోజనంలో అన్నం కన్నా పుల్కాలను తినడానికి ఇష్టపడతారు. అప్పుడప్పుడు మాత్రం రాగిముద్ద, మటన్ కీమాను తింటారు. ఇక కుండపెరుగు లేకుండా మధ్యాహ్నం భోజనం ముగించరని చెప్తుంటారు. చిత్రాన్నం అంటే జగన్ కు చాలా ఇష్టం. సాయంకాలం టీ మాత్రమే తాగుతారు. ఆయనకు పల్లీలు, మొక్కజొన్న పొత్తులన్నా ఇష్టం. వీలైనపుడల్లా వీటిని తింటారు.
పళ్ల రసాలకు ప్రాధాన్యమిస్తారు. వారాంతంలో పూర్తిగా ఫ్యామిలితో గడిపే సీఎం జగన్, ఆదివారం వస్తే చేపల పులుసు, బిర్యానీ, మటన్ లాంటి వాటిని ఆరగిస్తారు. ఎన్నిరకాల వంటకాలు ఇష్టపడినా కూడా జగన్ మితంగానే తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. టూరిజం మంత్రి రోజా సీఎం జగన్ తీసుకునే ఎనర్జీ డ్రింక్ గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. లీటరు పాలలో, పచ్చి అల్లం వేసి మరగించి, గ్లాసు పాలు అయ్యే వరకు మరగిస్తారు. అలా కాచిన పాలను రోజు ఆయన తాగుతారని రోజా వెల్లడించారు. అది ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిపారు.


తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణంలో, పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డీనరీ బస్సులలో మహిళలు తెలంగాణలో ఎక్కడి నుండి మరెక్కడికైనా ఉచితంగా జర్నీ చేయవచ్చు. దీంతో మహిళలు ఆటోలు, క్యాబ్ లలో ప్రయాణం చేయడం లేదు. దీంతో ఆటోలు, క్యాబ్ లు నడుపుకుని జీవనం సాగించేవారు విలపిస్తున్నారు. ఫ్రీ జర్నీ కావడంతో చిన్న పనికి కూడా మహిళలు ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్తున్నారు.
బస్సులలో డబ్బులు చెల్లించి ప్రయాణం చేసే వారికి చాలా ఇబ్బంది ఎదురవుతుంది. రీసెంట్ గా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఒక వ్యక్తి ఆందోళన చేశాడు. మగవారికి బస్సులో ఒక్క సీటు కూడా దొరకడం లేదంటూ మండిపడ్డాడు. సీట్లన్నీ మహిళలే ఆక్రమిస్తే మేమేలా ప్రయాణం చేయాలంటూ ప్రశ్నించాడు. అంతే కాకుండా బస్సు వెళ్ళకుండా అడ్డుగా నిలబడి తన నిరసన తెలిపాడు. తాజాగా ఓ యువతి బస్టాండ్ లో ఏడుస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. జగిత్యాలకు చెందిన ఆ యువతి కాలేజ్ లో చదువుతుంది. కాలేజీకి ఆమె బస్సులో వెళ్తుంది.
ఫ్రీ జర్నీ వల్ల తనకు రోజు సీటు దొరకట్లేదని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె కాలేజీకి వెళ్ళేటపుడు 40 నిమిషాలు, తిరిగి ఇంటికి వచ్చేప్పుడు 40 నిమిషాలు పడుతుంది. రోజు బస్సులో సీటు దొరకక గంటకు పైన నిలబడాల్సి వస్తుందని వెక్కి వెక్కి ఏడ్చింది. రోజూ టైమ్ కి కాలేజీకి వెళ్లలేకపోతున్నామని చెప్పింది. ‘బస్సులో ఉచిత ప్రయాణం చేసి నాలాంటి వాళ్లు జర్నీ చేయకుండా చేస్తున్నారు. ఇదే మా ఊరికి చివరి బస్సు, కొత్త బస్సు మాకు కావాలి’ అంటూ ఏడ్చింది. ఆ యువతి ఎక్కే బస్సు పూర్తిగా నిండిపోయి మహిళలు కూడా ఫుడ్ బోర్డ్ పై జర్నీ చేస్తున్నారు.
ఎంబీఏ చదివినా, అందుకు తగ్గ జాబ్ రాలేదని బాధపడకుండా మానస అనే మహిళ తనకు లభించిన ఉపాధితో పారిశుద్ధ్య కార్మికురాలిగా వర్క్ చేస్తోంది. హన్మకొండ జిల్లా, వెంకటాపూర్ గ్రామానికి చెందిన మానస, డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటపుడు బంధువు అయిన దిలీప్ కుమార్ ను ప్రేమించి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఆమె భర్త కూడా ఎంబీఏ మార్కెటింగ్ పూర్తి చేశారు. 2016లో ఆమె ఎంబీఏను పూర్తి చేశారు. మంచి ఉద్యోగం సాధించి, మంచి జీవితాన్ని పొందాలనుకున్న మానస లైఫ్ లో కొన్ని పరిణామాలు జరిగాయి.
దాంతో ఆమె వెంకటాపూర్ పంచాయితీ ఆఫీస్ లో పారిశుద్ధ్య కార్మికురాలిగా, ఎనిమిది వేల రూపాయల జీతానికి పని చేస్తున్నారు. ఆమె భర్త దిలీప్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ సంస్థలో ఆటో డ్రైవర్ గా చేస్తున్నారు. అలా ఎంబిఎ చేసిన ఆ భార్యభర్తలు ఇద్దరు పని చేస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నారు. మానస తండ్రి చనిపవడంతో, తల్లిని ఒంటరిగా వదిలేయలేక, ఆర్థిక పరిస్థితుల వల్ల సొంత గ్రామాన్ని వదల్లేక, ఇక్కడే ఉండిపోయామని మానస వెల్లడించారు. అక్కడే దొరికిన ఉపాధితో సంతోషంగా ఉన్నామని తెలిపారు.
ఇటీవల వచ్చిన పోలీస్ నోటిఫికేషన్ కు కూడా మానస దరఖాస్తు చేసింది. చాలా కష్టపడి పరీక్షలు రాసినప్పటికీ, ఆమె పోలీస్ సెలెక్షన్లలో సెలెక్ట్ కాలేదు. ఒక్క మార్కు తేడాతో ఉద్యోగాన్ని పొందలేకపోయానని మానస తెలిపారు. మానస తమ చదువుకు తగిన ఉద్యోగావకాశాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ వార్తను చూసిన నెటిజెన్లు ఎంబీఏ చదివి కూడా పారిశుద్ధ్య కార్మికురాలిగా చేస్తున్న మానస పై ప్రశంసలు కురిపిస్తున్నారు.