2024 నూతన సంవత్సరం వచ్చేస్తుంది. కొత్త సంవత్సరం వస్తుందంటే చాలామంది కొత్త కొత్త విషయాలను ప్రారంభించాలని అనుకుంటూ ఉంటారు. కొత్త సంవత్సరంలో ఫ్రెష్ గా మొదలు పెడితే సంవత్సరం అంతా ఉత్సాహభరితంగా పనిని చేస్తామని భావిస్తూ ఉంటారు.అయితే చాలామందికి ఏం చేయాలో అనేదానిపై స్పష్టత ఉండదు. కొందరు కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే, మరికొందరు పాత అలవాట్లను వదిలేయాలని అనుకుంటారు. అయితే ఏ పనులను ప్రారంభించాలి ఏ అలవాటులను ఎలా వదిలేయాలి అనే దాని పైన ఒకసారి వివరంగా చూస్తే…

1. లక్ష్యం పెట్టుకోండి:
ఏదైనా సాధించాలి అనుకుంటున్నప్పుడు కొత్త సంవత్సరంలో దాన్ని లక్ష్యంగా పెట్టుకోండి. చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుని వాటిని సాధిస్తూ మీరు అనుకుంటున్న పెద్ద టార్గెట్ ను చేరుకోండి. ఒక కొత్త ప్రణాళికతో ఈ కొత్త సంవత్సరాన్ని మొదలు పెట్టండి.
2. ఇన్వెస్ట్మెంట్స్:
ఎవరైనా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే గుర్తుండేందుకు కొత్త సంవత్సరంలో మొదలు పెడుతూ ఉంటారు. మీకు సంబంధించిన రియల్ ఎస్టేట్ అవ్వని, పొలాలు, బంగారం, లేదా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ అయినా కూడా ఈరోజు నుంచి మొదలు పెట్టండి.
3. హెల్దీ డైట్:
బాడీ మీద కంట్రోల్ పెంచుకునేందుకు ఆరోగ్యవంతమైన శరీరాన్ని మలుచుకునేందుకు న్యూ ఇయర్ ని వాడుకోండి. ఈరోజు నుండి ఏం తినాలి?ఎంత తినాలి? ఎలా తినాలి? ఏ టైం కి తినాలి? అని దానిపైన ప్రణాళిక సిద్ధం చేసుకోండి.
4. చెడు అలవాట్లకి దూరంగా ఉండండి:
చాలామంది చెడు అలవాట్లను మానేయాలనుకున్న మానుకోలేరు. అయితే కొత్త సంవత్సరం నుండి వాటిని క్రమక్రమంగా మానేస్తూ దూరంగా జరగండి. ఈరోజు మొదలుపెట్టి దాన్ని ప్రతిరోజు కొనసాగించండి.
5. డైరీ రాయండి:
ఇదివరకు రోజుల్లో నిత్యం డైరీ రాసేవారు, కానీ ఇప్పుడు ఎవరూ రాయడం లేదు.అయితే ఒక డైరీని పెట్టుకుని మీరు చేసిన పనులను చేయాలనుకున్న పనులను స్పష్టంగా రాసుకోండి. ఇలా చేయడం ద్వారా మీ జీవితం ఎలా సాగుతుందో మీకు అవగాహన వస్తుంది. తర్వాత ఎలా మార్చుకోవాలని స్పష్టత కూడా లభిస్తుంది.





మదురైకి చెందిన నందిని చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. చెన్నైలోనే తన బంధువుల ఇంట్లో నందిని ఉంటోంది. ఆమెకు పదవతరగతి నుండి పాండి మహేశ్వరితో స్నేహం ఉంది. పాండి మహేశ్వరి చెన్నైలో లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని, తన పేరును వెట్రిమారన్గా మార్చుకుంది. ఇద్దరూ చెన్నైలో సహజీవనం చేస్తున్నారని, లింగమార్పిడి తరువాత కూడా వారి సహజీవనం కొనసాగిందని తాంబరం పోలీస్ కమిషనర్ వెల్లడించారు. వారిద్దరూ గత ఎనిమిది నెలలుగా తోరైపాక్కంలోని ఒక ప్రైవేట్ ఐటీ కంపెనీలో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు.
అయితే నందిని రాహుల్ అనే వ్యక్తిని ప్రేమిస్తుందని తెలిసి, పగ పెంచుకున్నాడు. దీంతో ప్లాన్ ప్రకారం నందిని బర్త్ డే కోసం ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తానని చెప్పి బయటికి తీసుకెళ్ళాడు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి పలు ప్రాంతాలు తిరిగారు. గుడికి, ఆ తరువాత హోటల్ కి వెళ్ళి భోజనం చేశారు. చివరికి పొన్మార్ రోడ్ సమీపంలో ఫ్లాట్ కి నందిని తీసుకెళ్ళాడు. ప్లాట్కి తీసుకెళ్లాడు. సర్ ప్రైజ్చేస్తానని చెప్పి, నందిని కళ్లకు గంతలు కట్టాడు. ఆ తరువాత చేతులు, కాళ్ళు కట్టేసి, బ్లేడ్ తో మణికట్టు, మెడ కోసి, పెట్రోల్ పోసి నిప్పంటించి, అక్కడి నుండి పరారీ అయినట్టు పోలీసులు వెల్లడించారు.
గత ఏడాది బింబిసార వంటి సోషియో ఫాంటసీ చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించిన కథానాయకుడు కళ్యాణ్ రామ్ డిసెంబర్ 29న ‘డెవిల్’తో ఈ ఏడాది ఘనంగా పూర్తి చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్లకు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. 12 మిలియన్ వ్యూస్ను దాటి ట్రైలర్ దూసుకెళ్తోంది.







డిసెంబర్ 20న 191 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 21న 8 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. జుబేర్ ఖాన్ రామ్గఢ్ నియోజకవర్గం నుంచి గెలువగా, యూనస్ ఖాన్ దివానా నుంచి గెలిచారు. సంస్కృతంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం పై వీరిద్దరు స్పందించారు. యూనస్ ఖాన్ మాట్లాడుతూ “మేం మంచి పనిచేశామని ముస్లింలు సైతం ప్రశంసించారు” అని చెప్పారు. దేశంలో సంస్కృత భాష చాలా గొప్ప పురాతనమైన భాష అని, ఆ భాషలో ప్రమాణం చేయడం వల్ల ఎంతో గర్వపడుతున్నాను” అంటూ యూనస్ ఖాన్ వెల్లడించారు.
ఇక జుబేర్ ఖాన్ ఈ విషయం పై స్పందిస్తూ “సంస్కృతం మన దేశ పురాతన భాష. మేము భారత్ లోనే జీవిస్తున్న ఇండియన్ ముస్లింలం. అందువల్ల ఇక్కడి రాజ్యాంగాన్ని, సంస్కృతిని విశ్వసిస్తాం. సోదరభావం పై విశ్వాసం ఉంది. ప్రతి మతాన్ని గౌరవిస్తాం. సీనియర్ సెకండరీ దాకా నేను సంస్కృతం చదివాను. సంస్కృతంలో రెండోసారి ప్రమాణ స్వీకారం చేశాను. ముస్లిం అయిన నేను, ప్రమాణం సంస్కృతంలో చేయడం అందరికీ నచ్చింది” అంటూ జుబేర్ ఖాన్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లాలో ఉన్న హుకుంపేటలోని ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ స్కూల్ లో సుమారు 300 మందికి పైగా స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. మారుమూల ప్రాంతాలకు నుండి వచ్చిన గిరిజన పిల్లలు ఈ స్కూల్ లోనే చదువుకుంటూ, అక్కడే ఉంటున్నారు. ఆ పాఠశాలలో టీచర్లు, సిబ్బంది కలిపి 10 మంది వరకు ఉన్నారు. అయితే వారందరినీ అందరికీ నడిపించే హెడ్ మాస్టార్ మాత్రం ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఆయన తన వృత్తిపరమైన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తూ, ఆ స్కూల్ లోని స్టూడెంట్స్ పట్ల ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకుంటున్నారు.
ఈ పాఠశాలలో బాలాజీ ప్రధానోపాధ్యాయుడుగా పని చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడు అయినప్పటికీ ఆ పాఠశాలలోని విద్యార్థులను చాలా ప్రేమతో చూసుకుంటున్నాడు. వారి తల్లితండ్రులు తమ పై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా అక్కడి పిలల్లకు విద్య, వసతి సౌకర్యాలు చూస్తూ, ఓ కుటుంబ పెద్దలా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హెడ్ మాస్టార్ లా కాకుండా, స్టూడెంట్స్ కు అవసరమైన సేవలను సైతం చేస్తున్నారు. విద్యార్థుల్లో చదువుతో పాటు క్రమశిక్షణ కూడా ఉండాలని బోధిస్తూ, స్టూడెంట్స్ ను తీర్చిదిద్దుతున్నారు.
ఆ క్రమంలో స్వయంగా తానే విద్యార్థుల యూనిఫామ్, హెయిర్ స్టైల్ విషయంలో ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్నారు. బార్బర్ రాకపోవడంతో, జుత్తు పెరిగిపోయిన విద్యార్థులకు వారి సమ్మతితో హెడ్ మాస్టార్ బాలాజీ కత్తెర పట్టుకుని క్షురకుడులా మారి ఖాళీ సమయంలో హెయిర్ కట్ చేస్తున్నారు. ఆయన సందర్భాన్ని బట్టి స్టూడెంట్స్ కి అవసరమైన సేవ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. విద్యార్థులు అందరు పాఠశాలలో క్రమశిక్షణతో కనిపించాలని, వారికి క్రమశిక్షణ నేర్పించాలనే ఉద్దేశ్యంతో ఇలా సేవ చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు బాలాజీ వెల్లడించారు.