తెలంగాణ ఎన్నికల్లో పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ నుండి మామిడాల యశస్విని రెడ్డి విజయం సాధించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించి ఆమె విజయం సాధించి దేశవ్యాప్తంగా సంచలనమయ్యారు.
ఒకసారి ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి చూస్తే… యశస్విని రెడ్డి 1997 సంవత్సరంలో హైదరాబాదులో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు తిరుపతిరెడ్డి, మాధవి. యశస్విని రెడ్డికి ఒక చెల్లెలు కూడా ఉంది. టెన్త్ క్లాస్ వరకు ఎల్బీనగర్ శ్రీ చైతన్య స్కూల్లో చదివారు.

2018లో హైదరాబాదులోని శ్రేయస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి బిటెక్ పూర్తి చేశారు. తర్వాత 2019 సంవత్సరంలో ఝాన్సీ రెడ్డి రాజేందర్ రెడ్డి ల కుమారుడు రాజా రామ్మోహన్ రెడ్డి తో వివాహం జరిగింది. వీరి పెళ్లి సంగీత కార్యక్రమంలో బాహుబలి సినిమాలోని అనుష్క ప్రభాస్ గెటప్పులు వేసి వీరు డాన్స్ కూడా చేశారు. అయితే యశస్విని రెడ్డి రాజకీయ ప్రవేశం అనూహ్యంగా జరిగింది. ఆమె అత్త ఝాన్సీ రెడ్డి పాలకుర్తి టికెట్ పౌరసత్వం విషయంలో చిక్కుల రావడంతో ఆ టిక్కెట్ యశస్విని రెడ్డికి దక్కడం ఆమె ఎమ్మెల్యే గా నెగ్గడం జరిగింది.

యశస్విని రెడ్డి భర్త అమెరికాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు. యశస్విని రెడ్డి మామయ్య కార్డియాలజిస్ట్. యశస్విని రెడ్డి అత్తమామలు కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ పెట్టారు. వారికి 1000 యూనిట్స్ ఉన్నాయి. అవి బయట వేరే మేనేజ్మెంట్ కంపెనీకి ఇవ్వకుండా వీళ్లే మేనేజ్ చేసుకుని, లీజింగ్ ఆఫీస్ కూడా వీళ్లే చూసుకుంటారు. అది కాకుండా బాదం, పిస్తా తోటలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ ఆఫీస్ లు ఉన్నాయి. అవన్నీ వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఈ పనులన్నీ యశస్విని రెడ్డి భర్త చూసుకుంటారు.

ఝాన్సీ రెడ్డి అమెరికాలో రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణించేవారు. బాగా సంపాదించి తన సొంత ఊరికి ఎంత కొంత మేలు చేయాలని ఇక్కడ సేవా కార్యక్రమాలు చేశారు. యశస్వి రెడ్డి కూడా అమెరికాలో కంపెనీ వ్యవహారాలు చూసుకుని వారు. తర్వాత ప్రజలకు పూర్తిస్థాయిలో సేవ చేయాలని రాజకీయాల్లోకి అడుగు పెట్టడం జరిగింది. ఎస్ఎస్సి రెడ్డికి ఒక కుమార్తె కూడా ఉన్నారు. అయితే ఎమ్మెల్యేకి నెగిన తర్వాత ఎటువంటి అవినీతి లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి ప్రజలకు ఖర్చు పెడతానని ప్రకటించారు.

మదురైకి చెందిన నందిని చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. చెన్నైలోనే తన బంధువుల ఇంట్లో నందిని ఉంటోంది. ఆమెకు పదవతరగతి నుండి పాండి మహేశ్వరితో స్నేహం ఉంది. పాండి మహేశ్వరి చెన్నైలో లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని, తన పేరును వెట్రిమారన్గా మార్చుకుంది. ఇద్దరూ చెన్నైలో సహజీవనం చేస్తున్నారని, లింగమార్పిడి తరువాత కూడా వారి సహజీవనం కొనసాగిందని తాంబరం పోలీస్ కమిషనర్ వెల్లడించారు. వారిద్దరూ గత ఎనిమిది నెలలుగా తోరైపాక్కంలోని ఒక ప్రైవేట్ ఐటీ కంపెనీలో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు.
అయితే నందిని రాహుల్ అనే వ్యక్తిని ప్రేమిస్తుందని తెలిసి, పగ పెంచుకున్నాడు. దీంతో ప్లాన్ ప్రకారం నందిని బర్త్ డే కోసం ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తానని చెప్పి బయటికి తీసుకెళ్ళాడు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి పలు ప్రాంతాలు తిరిగారు. గుడికి, ఆ తరువాత హోటల్ కి వెళ్ళి భోజనం చేశారు. చివరికి పొన్మార్ రోడ్ సమీపంలో ఫ్లాట్ కి నందిని తీసుకెళ్ళాడు. ప్లాట్కి తీసుకెళ్లాడు. సర్ ప్రైజ్చేస్తానని చెప్పి, నందిని కళ్లకు గంతలు కట్టాడు. ఆ తరువాత చేతులు, కాళ్ళు కట్టేసి, బ్లేడ్ తో మణికట్టు, మెడ కోసి, పెట్రోల్ పోసి నిప్పంటించి, అక్కడి నుండి పరారీ అయినట్టు పోలీసులు వెల్లడించారు.
గత ఏడాది బింబిసార వంటి సోషియో ఫాంటసీ చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించిన కథానాయకుడు కళ్యాణ్ రామ్ డిసెంబర్ 29న ‘డెవిల్’తో ఈ ఏడాది ఘనంగా పూర్తి చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్లకు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. 12 మిలియన్ వ్యూస్ను దాటి ట్రైలర్ దూసుకెళ్తోంది.







డిసెంబర్ 20న 191 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 21న 8 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. జుబేర్ ఖాన్ రామ్గఢ్ నియోజకవర్గం నుంచి గెలువగా, యూనస్ ఖాన్ దివానా నుంచి గెలిచారు. సంస్కృతంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం పై వీరిద్దరు స్పందించారు. యూనస్ ఖాన్ మాట్లాడుతూ “మేం మంచి పనిచేశామని ముస్లింలు సైతం ప్రశంసించారు” అని చెప్పారు. దేశంలో సంస్కృత భాష చాలా గొప్ప పురాతనమైన భాష అని, ఆ భాషలో ప్రమాణం చేయడం వల్ల ఎంతో గర్వపడుతున్నాను” అంటూ యూనస్ ఖాన్ వెల్లడించారు.
ఇక జుబేర్ ఖాన్ ఈ విషయం పై స్పందిస్తూ “సంస్కృతం మన దేశ పురాతన భాష. మేము భారత్ లోనే జీవిస్తున్న ఇండియన్ ముస్లింలం. అందువల్ల ఇక్కడి రాజ్యాంగాన్ని, సంస్కృతిని విశ్వసిస్తాం. సోదరభావం పై విశ్వాసం ఉంది. ప్రతి మతాన్ని గౌరవిస్తాం. సీనియర్ సెకండరీ దాకా నేను సంస్కృతం చదివాను. సంస్కృతంలో రెండోసారి ప్రమాణ స్వీకారం చేశాను. ముస్లిం అయిన నేను, ప్రమాణం సంస్కృతంలో చేయడం అందరికీ నచ్చింది” అంటూ జుబేర్ ఖాన్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లాలో ఉన్న హుకుంపేటలోని ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ స్కూల్ లో సుమారు 300 మందికి పైగా స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. మారుమూల ప్రాంతాలకు నుండి వచ్చిన గిరిజన పిల్లలు ఈ స్కూల్ లోనే చదువుకుంటూ, అక్కడే ఉంటున్నారు. ఆ పాఠశాలలో టీచర్లు, సిబ్బంది కలిపి 10 మంది వరకు ఉన్నారు. అయితే వారందరినీ అందరికీ నడిపించే హెడ్ మాస్టార్ మాత్రం ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఆయన తన వృత్తిపరమైన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తూ, ఆ స్కూల్ లోని స్టూడెంట్స్ పట్ల ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకుంటున్నారు.
ఈ పాఠశాలలో బాలాజీ ప్రధానోపాధ్యాయుడుగా పని చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడు అయినప్పటికీ ఆ పాఠశాలలోని విద్యార్థులను చాలా ప్రేమతో చూసుకుంటున్నాడు. వారి తల్లితండ్రులు తమ పై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా అక్కడి పిలల్లకు విద్య, వసతి సౌకర్యాలు చూస్తూ, ఓ కుటుంబ పెద్దలా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హెడ్ మాస్టార్ లా కాకుండా, స్టూడెంట్స్ కు అవసరమైన సేవలను సైతం చేస్తున్నారు. విద్యార్థుల్లో చదువుతో పాటు క్రమశిక్షణ కూడా ఉండాలని బోధిస్తూ, స్టూడెంట్స్ ను తీర్చిదిద్దుతున్నారు.
ఆ క్రమంలో స్వయంగా తానే విద్యార్థుల యూనిఫామ్, హెయిర్ స్టైల్ విషయంలో ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్నారు. బార్బర్ రాకపోవడంతో, జుత్తు పెరిగిపోయిన విద్యార్థులకు వారి సమ్మతితో హెడ్ మాస్టార్ బాలాజీ కత్తెర పట్టుకుని క్షురకుడులా మారి ఖాళీ సమయంలో హెయిర్ కట్ చేస్తున్నారు. ఆయన సందర్భాన్ని బట్టి స్టూడెంట్స్ కి అవసరమైన సేవ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. విద్యార్థులు అందరు పాఠశాలలో క్రమశిక్షణతో కనిపించాలని, వారికి క్రమశిక్షణ నేర్పించాలనే ఉద్దేశ్యంతో ఇలా సేవ చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు బాలాజీ వెల్లడించారు.

సీఎం జగన్ ఆరోగ్యంగా ఉండేందుకే మొదటి నుండి ప్రాధాన్యతనిస్తారు. దానికి తగ్గట్లుగా ఆహారం తీసుకుంటారు. ఆయనకి మామిడికాయ తురుముతో చేసే పులిహోర అంటే చాలా ఇష్టం. ఉదయం 4.30కి సీఎం జగన్ రోజు మొదవుతుంది. ఉదయం 4.30 గంటల నుండి గంట సేపు యోగా, జిమ్ లాంటివి చేస్తారు. 5.30కి న్యూస్ పేపర్స్ చదవడంతో పాటు ముఖ్యమైన అంశాల గురించి నోట్స్ తయారు చేసుకుంటారు. ఆ సమయంలో టీ మాత్రమే తీసుకుంటారు. 7 గంటలకు జూస్ తాగుతారు.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు బదులుగా డ్రైఫ్రూట్స్ తింటారు. ఇక పాదయాత్ర చేసేనపుడు కూడా జగన్ బ్రేక్ ఫాస్ట్ కి దూరంగానే ఉన్నారు. సమీక్షలు చేసే టైమ్ లో చాక్లెట్ బైట్స్ తింటారట. మధ్యాహ్నం భోజనంలో అన్నం కన్నా పుల్కాలను తినడానికి ఇష్టపడతారు. అప్పుడప్పుడు మాత్రం రాగిముద్ద, మటన్ కీమాను తింటారు. ఇక కుండపెరుగు లేకుండా మధ్యాహ్నం భోజనం ముగించరని చెప్తుంటారు. చిత్రాన్నం అంటే జగన్ కు చాలా ఇష్టం. సాయంకాలం టీ మాత్రమే తాగుతారు. ఆయనకు పల్లీలు, మొక్కజొన్న పొత్తులన్నా ఇష్టం. వీలైనపుడల్లా వీటిని తింటారు.
పళ్ల రసాలకు ప్రాధాన్యమిస్తారు. వారాంతంలో పూర్తిగా ఫ్యామిలితో గడిపే సీఎం జగన్, ఆదివారం వస్తే చేపల పులుసు, బిర్యానీ, మటన్ లాంటి వాటిని ఆరగిస్తారు. ఎన్నిరకాల వంటకాలు ఇష్టపడినా కూడా జగన్ మితంగానే తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. టూరిజం మంత్రి రోజా సీఎం జగన్ తీసుకునే ఎనర్జీ డ్రింక్ గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. లీటరు పాలలో, పచ్చి అల్లం వేసి మరగించి, గ్లాసు పాలు అయ్యే వరకు మరగిస్తారు. అలా కాచిన పాలను రోజు ఆయన తాగుతారని రోజా వెల్లడించారు. అది ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిపారు.