తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త సంస్కరణలు తీసుకువస్తూ కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతుంది. అయితే ఇప్పుడు రేషన్ అందుకునే లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. కొత్త రేషన్ కార్డులు జారీ తో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించనుంది….!
ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు చేసారు. అర్హుల ఎంపిక క్షేత్ర స్థాయిలోనే జరిగే విధంగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు.

అర్హులైన వారికి కార్డులు అందించేందుకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమిస్తున్నారు.దీంతో ఈ నెల 28వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీ -సేవ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.అవసరమైన పత్రాలను ఆన్ లైన్ లో దరఖాస్తు సమయంలోనే సమర్పించాల్సి ఉంటుంది.

ప్రభుత్వం తాజాగా ఆరోగ్య శ్రీ పరిమితిని రూ 10 లక్షలకు పెంచింది. రేషన్ కార్డు ఉన్నవారికే ఆరోగ్య శ్రీ అమలు కానుంది. దీంతో రేషన్ కార్డు కోసం మరింత అవసరం ఏర్పడింది. రేషన్ కార్డులో పేరున్న ప్రతీ ఒక్కరికీ ఆరు కేజీల బియ్యం అందుతాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో గోధుమలు కూడా ఇస్తున్నారు.అయితే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేయాలని పిల్లల పేర్లు చేర్చాలని ఇప్పటికే ఎన్నో వినతులు వచ్చాయి. వాటిపై కూడా దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించింది


డిసెంబర్ 20న 191 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 21న 8 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. జుబేర్ ఖాన్ రామ్గఢ్ నియోజకవర్గం నుంచి గెలువగా, యూనస్ ఖాన్ దివానా నుంచి గెలిచారు. సంస్కృతంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం పై వీరిద్దరు స్పందించారు. యూనస్ ఖాన్ మాట్లాడుతూ “మేం మంచి పనిచేశామని ముస్లింలు సైతం ప్రశంసించారు” అని చెప్పారు. దేశంలో సంస్కృత భాష చాలా గొప్ప పురాతనమైన భాష అని, ఆ భాషలో ప్రమాణం చేయడం వల్ల ఎంతో గర్వపడుతున్నాను” అంటూ యూనస్ ఖాన్ వెల్లడించారు.
ఇక జుబేర్ ఖాన్ ఈ విషయం పై స్పందిస్తూ “సంస్కృతం మన దేశ పురాతన భాష. మేము భారత్ లోనే జీవిస్తున్న ఇండియన్ ముస్లింలం. అందువల్ల ఇక్కడి రాజ్యాంగాన్ని, సంస్కృతిని విశ్వసిస్తాం. సోదరభావం పై విశ్వాసం ఉంది. ప్రతి మతాన్ని గౌరవిస్తాం. సీనియర్ సెకండరీ దాకా నేను సంస్కృతం చదివాను. సంస్కృతంలో రెండోసారి ప్రమాణ స్వీకారం చేశాను. ముస్లిం అయిన నేను, ప్రమాణం సంస్కృతంలో చేయడం అందరికీ నచ్చింది” అంటూ జుబేర్ ఖాన్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లాలో ఉన్న హుకుంపేటలోని ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ స్కూల్ లో సుమారు 300 మందికి పైగా స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. మారుమూల ప్రాంతాలకు నుండి వచ్చిన గిరిజన పిల్లలు ఈ స్కూల్ లోనే చదువుకుంటూ, అక్కడే ఉంటున్నారు. ఆ పాఠశాలలో టీచర్లు, సిబ్బంది కలిపి 10 మంది వరకు ఉన్నారు. అయితే వారందరినీ అందరికీ నడిపించే హెడ్ మాస్టార్ మాత్రం ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఆయన తన వృత్తిపరమైన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తూ, ఆ స్కూల్ లోని స్టూడెంట్స్ పట్ల ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకుంటున్నారు.
ఈ పాఠశాలలో బాలాజీ ప్రధానోపాధ్యాయుడుగా పని చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడు అయినప్పటికీ ఆ పాఠశాలలోని విద్యార్థులను చాలా ప్రేమతో చూసుకుంటున్నాడు. వారి తల్లితండ్రులు తమ పై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా అక్కడి పిలల్లకు విద్య, వసతి సౌకర్యాలు చూస్తూ, ఓ కుటుంబ పెద్దలా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హెడ్ మాస్టార్ లా కాకుండా, స్టూడెంట్స్ కు అవసరమైన సేవలను సైతం చేస్తున్నారు. విద్యార్థుల్లో చదువుతో పాటు క్రమశిక్షణ కూడా ఉండాలని బోధిస్తూ, స్టూడెంట్స్ ను తీర్చిదిద్దుతున్నారు.
ఆ క్రమంలో స్వయంగా తానే విద్యార్థుల యూనిఫామ్, హెయిర్ స్టైల్ విషయంలో ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్నారు. బార్బర్ రాకపోవడంతో, జుత్తు పెరిగిపోయిన విద్యార్థులకు వారి సమ్మతితో హెడ్ మాస్టార్ బాలాజీ కత్తెర పట్టుకుని క్షురకుడులా మారి ఖాళీ సమయంలో హెయిర్ కట్ చేస్తున్నారు. ఆయన సందర్భాన్ని బట్టి స్టూడెంట్స్ కి అవసరమైన సేవ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. విద్యార్థులు అందరు పాఠశాలలో క్రమశిక్షణతో కనిపించాలని, వారికి క్రమశిక్షణ నేర్పించాలనే ఉద్దేశ్యంతో ఇలా సేవ చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు బాలాజీ వెల్లడించారు.

సీఎం జగన్ ఆరోగ్యంగా ఉండేందుకే మొదటి నుండి ప్రాధాన్యతనిస్తారు. దానికి తగ్గట్లుగా ఆహారం తీసుకుంటారు. ఆయనకి మామిడికాయ తురుముతో చేసే పులిహోర అంటే చాలా ఇష్టం. ఉదయం 4.30కి సీఎం జగన్ రోజు మొదవుతుంది. ఉదయం 4.30 గంటల నుండి గంట సేపు యోగా, జిమ్ లాంటివి చేస్తారు. 5.30కి న్యూస్ పేపర్స్ చదవడంతో పాటు ముఖ్యమైన అంశాల గురించి నోట్స్ తయారు చేసుకుంటారు. ఆ సమయంలో టీ మాత్రమే తీసుకుంటారు. 7 గంటలకు జూస్ తాగుతారు.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు బదులుగా డ్రైఫ్రూట్స్ తింటారు. ఇక పాదయాత్ర చేసేనపుడు కూడా జగన్ బ్రేక్ ఫాస్ట్ కి దూరంగానే ఉన్నారు. సమీక్షలు చేసే టైమ్ లో చాక్లెట్ బైట్స్ తింటారట. మధ్యాహ్నం భోజనంలో అన్నం కన్నా పుల్కాలను తినడానికి ఇష్టపడతారు. అప్పుడప్పుడు మాత్రం రాగిముద్ద, మటన్ కీమాను తింటారు. ఇక కుండపెరుగు లేకుండా మధ్యాహ్నం భోజనం ముగించరని చెప్తుంటారు. చిత్రాన్నం అంటే జగన్ కు చాలా ఇష్టం. సాయంకాలం టీ మాత్రమే తాగుతారు. ఆయనకు పల్లీలు, మొక్కజొన్న పొత్తులన్నా ఇష్టం. వీలైనపుడల్లా వీటిని తింటారు.
పళ్ల రసాలకు ప్రాధాన్యమిస్తారు. వారాంతంలో పూర్తిగా ఫ్యామిలితో గడిపే సీఎం జగన్, ఆదివారం వస్తే చేపల పులుసు, బిర్యానీ, మటన్ లాంటి వాటిని ఆరగిస్తారు. ఎన్నిరకాల వంటకాలు ఇష్టపడినా కూడా జగన్ మితంగానే తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. టూరిజం మంత్రి రోజా సీఎం జగన్ తీసుకునే ఎనర్జీ డ్రింక్ గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. లీటరు పాలలో, పచ్చి అల్లం వేసి మరగించి, గ్లాసు పాలు అయ్యే వరకు మరగిస్తారు. అలా కాచిన పాలను రోజు ఆయన తాగుతారని రోజా వెల్లడించారు. అది ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిపారు.


తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణంలో, పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డీనరీ బస్సులలో మహిళలు తెలంగాణలో ఎక్కడి నుండి మరెక్కడికైనా ఉచితంగా జర్నీ చేయవచ్చు. దీంతో మహిళలు ఆటోలు, క్యాబ్ లలో ప్రయాణం చేయడం లేదు. దీంతో ఆటోలు, క్యాబ్ లు నడుపుకుని జీవనం సాగించేవారు విలపిస్తున్నారు. ఫ్రీ జర్నీ కావడంతో చిన్న పనికి కూడా మహిళలు ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్తున్నారు.
బస్సులలో డబ్బులు చెల్లించి ప్రయాణం చేసే వారికి చాలా ఇబ్బంది ఎదురవుతుంది. రీసెంట్ గా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఒక వ్యక్తి ఆందోళన చేశాడు. మగవారికి బస్సులో ఒక్క సీటు కూడా దొరకడం లేదంటూ మండిపడ్డాడు. సీట్లన్నీ మహిళలే ఆక్రమిస్తే మేమేలా ప్రయాణం చేయాలంటూ ప్రశ్నించాడు. అంతే కాకుండా బస్సు వెళ్ళకుండా అడ్డుగా నిలబడి తన నిరసన తెలిపాడు. తాజాగా ఓ యువతి బస్టాండ్ లో ఏడుస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. జగిత్యాలకు చెందిన ఆ యువతి కాలేజ్ లో చదువుతుంది. కాలేజీకి ఆమె బస్సులో వెళ్తుంది.
ఫ్రీ జర్నీ వల్ల తనకు రోజు సీటు దొరకట్లేదని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె కాలేజీకి వెళ్ళేటపుడు 40 నిమిషాలు, తిరిగి ఇంటికి వచ్చేప్పుడు 40 నిమిషాలు పడుతుంది. రోజు బస్సులో సీటు దొరకక గంటకు పైన నిలబడాల్సి వస్తుందని వెక్కి వెక్కి ఏడ్చింది. రోజూ టైమ్ కి కాలేజీకి వెళ్లలేకపోతున్నామని చెప్పింది. ‘బస్సులో ఉచిత ప్రయాణం చేసి నాలాంటి వాళ్లు జర్నీ చేయకుండా చేస్తున్నారు. ఇదే మా ఊరికి చివరి బస్సు, కొత్త బస్సు మాకు కావాలి’ అంటూ ఏడ్చింది. ఆ యువతి ఎక్కే బస్సు పూర్తిగా నిండిపోయి మహిళలు కూడా ఫుడ్ బోర్డ్ పై జర్నీ చేస్తున్నారు.