కొన్ని కొన్ని సార్లు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అప్పటివరకు మన పక్కనే ఉన్న మన పిల్లలు క్షణకాలంలో ప్రమాదానికి లోనవుతూ ఉంటారు. అందుకే తల్లిదండ్రులు నిరంతరం తమ పిల్లల్ని సంరక్షించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ప్రమాదవశాస్తూ ఒక చిన్నారి స్కూలు బస్సు కిందపడి మరణించిన ఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది.
ఈనాడు కథనం ప్రకారం పూర్తి వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ పట్టణంలోని హబ్సిగూడా నందు రవీంద్ర నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ చిన్నారి తన తండ్రి అమ్మమ్మతో కలిసి తన సోదరుడిని స్కూల్ బస్సు ఎక్కించడానికి రోడ్డు మీదకు వచ్చింది. ఒకపక్క అమ్మమ్మ పిల్లవాడిని స్కూల్ బస్సు ఎక్కిస్తుంటే మరోపక్క తండ్రి మిథున్ స్కూలు బస్సు డ్రైవర్ తో మాట్లాడుతున్నారు.

ఈ లోగా చిన్నారి నాన్న వద్దకు వెళ్తానంటూ పరుగు పరుగున అటువైపు వెళ్ళింది. చిన్నారి రాకను గమనించని డ్రైవర్ బస్సులు ముందుకు పోనిచ్చాడు. అనుకోకుండా చిన్నారి స్కూల్ బస్సు టైర్ కింద పడి మృతి చెందింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే తమ చిన్నారి మరణించింది అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
చిన్నారి మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మునిరవుతున్నారు.




రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 1958లో జూన్ 20న ఒడిశాలోని రాయరంగ్పూర్ లో సాధారణ సంతాల్ గిరిజన కుటుంబంలో జన్మించారు. ఆమె భువనేశ్వర్లోని రమాదేవి మహిళా కళాశాలలో ఆర్ట్స్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. ఆ తరువాత ఒడిశా ప్రభుత్వంలో నీటిపారుదల మరియు విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసింది. ఆమె రాయ్రంగ్పూర్లోని శ్రీ అరబిందో సమగ్ర విద్యా కేంద్రంలో గౌరవ సహాయ ఉపాధ్యాయురాలు.
ద్రౌపది ముర్ము శ్యామ్ చరణ్ ముర్ముని వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పలు నివేదికల ప్రకారం, ఆమె కుమారులలో పెద్దవాడు లక్ష్మణ్ ముర్ము 25 ఏళ్ళ వయసులో 2009లో మరణించారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె రెండవ కుమారుడు 2012లో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. రెండు ఏళ్ళ తరువాత, ముర్ము భర్త గుండెపోటు కారణంగా మరణించారు. 2009-2015 మధ్య కేవలం ఆరేళ్లలో ద్రౌపది ముర్ము భర్త, ఇద్దరు కుమారులు, తల్లి మరియు సోదరుడిని కోల్పోయింది.
ఆమె కూతురు ఇతిశ్రీ ప్రస్తుతం ఒడిశాలోని యూకో బ్యాంకులో పనిచేస్తోంది. ఆమె 2015లో రగ్బీ ప్లేయర్ గణేష్ హెంబ్రామ్ని వివాహం చేసుకుంది. వారికి ఒక కుమార్తె ఉంది. 2015లో మే 18న జార్ఖండ్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు ముర్ము ఒడిశాలోని బీజేడీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా మరియు ఒకసారి మంత్రిగా పనిచేశారు. ఆమె ఒడిశా రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్, దేశంలో గవర్నర్గా పనిచేసిన మొదటి మహిళా గిరిజన నాయకురాలు.













