సినిమాలు ఉన్నా లేకపోయినా చేసే పనులతో నిత్యం ట్రోలింగ్స్ లో ఉండే ప్రముఖులలో మంచు ఫ్యామిలీ మెంబర్స్ ఒకరు. వీళ్ళు తీసే సినిమాలతో కన్నా చేసే చేతల ద్వారానో,మాట్లాడే మాటల ద్వారానో ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా ప్రజల నోళ్ళలో నానుతూ ఉంటారు. ఇక మంచు లక్ష్మి విషయానికి వస్తే తను నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

అలాంటి మంచు లక్ష్మి ఈమధ్య తను ముంబైకి షిఫ్ట్ అయిపోయినట్లు, తనకి నచ్చిన విధంగా ఉండే ఒక ఇల్లు తీసుకున్నాను అంటూ ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టింది. తన ఇంటిని ఆ వీడియోలో కూడా చూపించింది. ముంబై హౌస్ హోమ్ టూర్ అంటూ ఆ ఇంటి గురించి చెప్పింది. ముంబైలో దాదాపు 28 ఇల్లు చూశాక ఈ ఇల్లు నచ్చిందని తెలిపింది మంచు లక్ష్మి. ముంబై కొత్త ఇంట్లో పెద్ద హాలు, మూడు బెడ్రూమ్స్.
చిన్న పిల్లలకు ఇంకొక బెడ్ రూమ్, కిచెన్, బాల్కనీ, మేకప్ రూమ్, బాత్రూమ్స్ ఇలా అన్ని చాలా లగ్జరీగా ఉన్నాయి. ఇంట్లోకి కావలసిన సామాను కొంత ముంబైలో కొనుక్కుంటే కొంత హైదరాబాదులోని తన ఇంటి నుంచి షిఫ్ట్ చేసుకున్నట్లు తెలిపింది. అయితే ఇంత సడన్గా ఇప్పుడు ముంబై ఎందుకు షిఫ్ట్ అయింది అంటే వృత్తి పరమైన పనుల రీత్యా అక్కడకు షిఫ్ట్ అయినట్లు ఆమె వెల్లడించింది. ప్రస్తుతం ఆమె అక్కడ సినిమాలు, వెబ్ సీరీస్ లు చేసేందుకు ప్లాన్ చేస్తుంది.
సౌత్ లో చాలా రకాల రోల్స్ చేసాను. ఇంకా విభిన్నమైన పాత్రలు చేయాలనుకుంటున్నాను ముంబైలో అయితేనే అలా చేయటానికి వీలవుతుంది. సినిమాలు వెబ్ సిరీస్ లు చేసేందుకు రెడీగా ఉన్నాను. ఆడిషన్స్ కు కూడా సిద్ధమే కొత్తగా ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను దానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నాను అంటూ తన ముంబై జీవితాన్ని గురించి చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి.

కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ గతంలో భారత్ జోడో యాత్ర చేసిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా జనవరి 14 నుండి ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రారంభించబోతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో మణిపూర్ నుండి మొదలయ్యే ఈ యాత్ర 15 రాష్ట్రాల గుండా 6,500 కిలోమీటర్లు సాగి ముంబైలో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ యాత్రకు సంబంధించిన పోస్టర్స్, వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.
భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ బస్సు మరియు కాలినడకన, 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా సాగుతుంది. ఈ క్రమంలో వంద లోక్సభ స్థానాలను చూడుతూ ఈ యాత్ర ముంబైలో ముగుస్తుంది. ఇండియా కూటమి నాయకులను కూడా ఈ యాత్రకు ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ యాత్రకు సంఘీభావంగా యాత్రకు సంబంధించిన పోస్టర్ ను స్వయంగా తానే తన వాహనానికి అతికించారు. ఆ పోస్టర్ లో రాహుల్ గాంధీ ఫోటోతో పాటు, భారత్ జోడో న్యాయ్ యాత్ర అని ఉంది. ఈ పోటోలను ‘ఎక్స్’ లో పోస్ట్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు.
“ఈ నెల 14న భారతదేశంలో మరో మహా యాత్రకు శ్రీ రాహుల్ గాంధీ శ్రీకారం చుడుతున్నారు. గాయపడ్డ మణిపూర్ నుండి ముంబై వరకు భారత్ జోడో న్యాయ్ యాత్రకు సిద్ధమవుతున్నారు. నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తగా నాయకుడి యాత్రకు నా సంఘీభావాన్ని సింబాలిక్ గా తెలిపేందుకు యాత్ర పోస్టర్ ను నేనే స్వయంగా నా వాహనానికి అతికించి ప్రతి కార్యకర్తకు కర్తవ్య బోధ చేస్తున్నాను.”
అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలని ఎన్నో ఏళ్లుగా పోరాటం చేశారు. ఝార్ఖండ్ లోని ధన్బాద్ జిల్లా, కరమ్తాండ్ కు చెందిన సరస్వతి దేవి కు శ్రీరాముడంటే అమితమైన భక్తి. 1992లో బాబ్రీ మసీదు కూల్చిన అనంతరం సరస్వతి అయోధ్యను సందర్శించారు. ఆ సమయంలో అక్కడ తిరిగి రామ మందిరం నిర్మించే వరకూ మౌనవ్రతం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఇక అప్పటి నుండి తనకు ఏం కావాలన్నా సైగలతో మాత్రమే అడగటం ప్రారంభించారు. అయితే రోజులో సరస్వతి గంట సేపు మాత్రమే తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉండేవారు.
2020లో ప్రధాని మోదీ అయోధ్యలో రామమందిర నిర్మించడం కోసం భూమి పూజ చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన తరువాత సరస్వతి దేవి 24 గంటల పాటు మౌనవ్రతం పాటిస్తూ వస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. జనవరి 22న అయోధ్య రామమందిరంలో రాముని ప్రాణ ప్రతిష్ట తరువాత ఆమె మౌనం వీడనుంది. ఇక రామ మందిర ప్రారంభోత్సవంకు ఆమెకు ఆహ్వానం అందింది.
సరస్వతి దేవి సోమవారం నాడే అయోధ్యకు ప్రయాణం అయ్యారు. రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత ఆమె మౌనవ్రతాన్ని వీడుతుందని ఆమె కొడుకు హరే రామ్ అగర్వాల్ వెల్లడించారు. స్థానిక ప్రజలు ఆమెను ‘మౌనీమాత’ అని పిలుస్తారు. 1986లో సరస్వతి దేవి భర్త మరణించిన తర్వాత ఆమె తన జీవితాన్నిరామ స్మరణకే అంకితం చేసిందని, యాత్రలు ఎక్కువగా చేస్తారని హరేరామ్ చెప్పుకొచ్చారు.


అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణప్రతిష్టకు శుభముహూర్తం ఆసన్నమైంది. రామ భక్తులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న తరుణం కొన్ని రోజుల్లోరాబోతుంది. అయోధ్య రామ మందిరంను దర్శించుకోవడానికి భక్తులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. రామయ్యకు చాలా మంది భక్తులు భారీగా కానుకలను సమర్పించుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రామయ్యకు బంగారు పాదుకలు సమర్పించడానికి చల్లా శ్రీనివాస శాస్త్రి పాదయాత్ర మొదలు పెట్టారు.
శ్రీనివాస శాస్త్రి హైదరాబాద్కు చెందినవారు. అయోధ్య భాగ్యనగర సీతారామ ఫౌండర్ కూడా. రాముడు అయోధ్య నుండి లంకకు నడుచుకుంటూ వెళ్లిన మార్గంలో శ్రీనివాస శాస్త్రి నడుస్తున్నారు. రామేశ్వరంలో మొదలైన ఈ పాదయాత్ర, అరణ్య వాసంలో రాముడు తిరిగిన ప్రాంతాల గుండా వెళ్తున్నారు. దారిలో కంచి, శృంగేరీ, పూరీ, ద్వారకా పీఠాధీశుల ఆశీస్సులు తీసుకుని అయోధ్య వైపుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
64 ఏళ్ళ వయసు ఉన్న శ్రీనివాస శాస్త్రి తలపై బంగారు పాదుకలు పెట్టుకుని అయోధ్యకు ఎనిమిది వేల కిలోమీటర్ల నడుస్తూ, భక్తిని చాటుకుంటున్నారు. రామ మందిర నిర్మాణం కోసం ఇప్పటికే ఐదు లక్షల ఇటుకలను దానం చేశారు. శ్రీనివాస్ శాస్త్రి మాట్లాడుతూ. తన తండ్రి రామ భక్తుడని, అయోధ్యలో రామ మందిర నిర్మాణం చూడాలనేది తన కల అని ఎప్పుడు చెప్పేవారు. తండ్రి కలను నెరవేర్చడం కోసం బంగారు పాదుకలతో పాదయాత్ర చేస్తూ, అయోధ్యకు వెళుతున్నానని చెప్పుకొచ్చారు.


ఒక రైతుగా సాధారణ జీవితం గడుపుతున్న తనకు అయోధ్య నుంచి ఆహ్వానం అందడంతో భావోద్వేగానికి లోనయ్యాడు అతడు. బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలో 1992 డిసెంబర్ 2 వ తేదీ నుంచి 4, 5 రోజుల పాటు అయోధ్యలో ఉన్న మహ్మద్ హబీబ్ తనతో ఉన్న వారితో కలిసి కరసేవకుడిగా కొట్లాడాడు. ఆ సమయంలో మహ్మద్ హబీబ్ చేసిన పోరాటాన్ని గుర్తించిన అయోధ్య రామమందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్, శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని అతనికి ఆహ్వానం పంపించింది. హిందువుల ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి ఒక ముస్లిం కి ఆహ్వానం పంపడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది. భారతదేశం ఎందుకు మత సామ్రాస్య దేశమో అర్థం అవుతుందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు



