బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్.. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కాంబోలో వచ్చిన యానిమల్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ మంచి పాజిటివ్ వాల్స్ నెలకొల్పిన ఈ మూవీ ఈ వీకెండ్ కలెక్షన్స్ లో ముందంజలో ఉంటుందని అంచనా. తెలుగు స్ట్రైట్ ఫిలిం లాగా ఇది తొలి రోజు బుకింగ్ తో అగరగొట్టింది. ఇక ఈ మూవీకి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సినిమా జనవరి 26 నుండి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వబోతుంది అని వార్త వైరల్ అవుతుంది. మొదటిరోజు సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. తండ్రి కొడుకులు మధ్య సెంటిమెంట్తో తెరకెక్కిన ఈ చిత్రంలో రణ్బీర్ ప్రేక్షకులు తన నటనతో బాగా ఆకట్టుకున్నాడు. పోటీగా పెద్దగా సినిమాలు కూడా లేకపోవడంతో ఈ మూవీ బాగా హీట్ అయ్యే ఆస్కారం కల్పిస్తుంది.
ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా అద్భుతమైన నటన కనబరిచింది. రన్బీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ బాగా ఆకట్టుకున్నారు. హీరోకి దీటుగా విలన్ పాత్ర లో బాబీ డియోల్ ఎక్స్ట్రాడినరీ పర్ఫామెన్స్ కనబరిచాడు. ఇక ఈ విషయం పక్కన పెడితే మూవీకి సంబంధించిన రన్ టైం కూడా చాలా పెద్దది. అందుకే ఒటిటి వెర్షన్ లో రష్మిక నటించిన మరికొన్ని సీన్స్ యాడ్ చేయనున్నారు అంట. రణ్బీర్కపూర్, రష్మిక మందన్నలపై చిత్రీకరించిన కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను నిడివి కారణంగా థియేటర్ వెర్షన్ లో కట్ చేసారంట. ఇప్పుడు అది ఒటిటి లో యాడ్ చేయనున్నారు అంట.




షర్మిల కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియల పెళ్లి ఫిబ్రవరి 17న జరగనుంది. ఈ క్రమంలో షర్మిల పాలిటిక్స్ కు అతీతంగా పలువురు రాజకీయ నేతలను కలిసి నిశ్చితార్ధంతో పాటు వివాహం, రిసెప్షన్కి కూడా ఆహ్వానిస్తున్నారు. ముందుగా అన్న జగన్ను కలిసి పెళ్లికి ఆహ్వానించింది. అన్న జగన్ కు ప్రత్యర్థులు అయిన టిడిపి అధినేత చంద్రబాబును షర్మిల కలిసి ఆహ్వాన పత్రిక ఇవ్వడం, తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు మధ్య ఉన్న స్నేహం గురించి చెప్పడం.
జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి ఆహ్వాన పత్రిక ఇవ్వడం చూస్తుంటే అన్న జగన్ పై ప్రతీకారం తీర్చుకోవడానికే అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే షర్మిల మాత్రం చంద్రబాబుతో భేటీని రాజకీయాలకు అతీతంగా చూడాలని అన్నారు. తెలంగాణలోనూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు.





వై ఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ ల కుమారుడు రాజా రెడ్డి వివాహం ప్రియా అల్లూరితో ఫిబ్రవరి 17న జరగనున్న విషయం తెలిసిందే. జనవరి 18న వీరి నిశ్చితార్ధం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎంగేజ్ మెంట్ మరియు పెళ్లికి ఆహ్వానిస్తూ షర్మిల తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు.
అంతేకాకుండా పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు, ప్రతిపక్ష నేతలకు స్వయంగా ఆహ్వాన పత్రికలను ఇచ్చారు. ఈ క్రమంలో ఎంగేజ్ మెంట్ మరియు పెళ్లి పత్రికలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. జనవరి 18న షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియ నిశ్చితార్ధం హైదరాబాద్ లో గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ వేదికగా జరగనుంది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి జగన్ హాజరవుతారని తెలుస్తోంది. వైఎస్సార్ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు, పలువురు రాజకీయ నాయకులు హాజరు కానున్నారని సమాచారం.
తెలంగాణ సీఎం రేవంత్, టీడీపీ అధినేత చంద్రబాబును కూడా షర్మిల ఆహ్వానించారు. అయితే ఈ నిశ్చితార్ధంకు నారా లోకేష్ అటెండ్ అవుతారని తెలుస్తోంది. ఈ ఆహ్వానంను రాజకీయాలకు అతీతంగా చూడాలని షర్మిల కోరిన విషయం తెలిసిందే. దాంతో ఈ వేడుక పై అందరి దృష్టి పడింది. ఎవరెవరు హాజరు అవుతారనే విషయాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ పథకంలో భాగంగా మహిళలు తెలంగాణలో ఏ మూల నుండి నుండి ఎక్కడికైనా సరే ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ పథకం పల్లె వెలుగు బస్సులలో, సిటీఆర్డీనరీ మరియు ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు ఉంది. ఈ పధకాన్ని డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
మొదటి వారం ఎలాంటి కార్డు లేకున్నా ఉచిత ప్రయాణించే సౌకర్యం ఉండగా, ఆ తర్వాత నుండి టీఎస్ఆర్టీసీ మహిళలకు జీరో టికెట్లు జారీ చేసింది. ఐడీ కార్డును తప్పనిసరి చేసింది. ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డుల్లో ఏదొ ఒకటి కండక్టర్కు చూపించాలి.ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తరువాత ఆర్టీసీ బస్సుల్లో విపరీతంగా రద్దీ పెరిగింది.
గతంలో పన్నెండు లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించగా, ఈ పథకం తరువాత దాదాపుగా 30 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ఉచిత బస్సు ప్రయాణం పై కీలక వ్యాఖ్యలు చేశారు. “ఫ్రీ ఎవరికి ఉండాలో వారికే ఉండాలి. పేయింగ్ కెపాసిటీ ఉండి నెలకు పది వేలు సంపాదిస్తూ ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తే, నా దృష్టిలో వారు బిచ్చమెత్తుకున్నట్లే” అంటూ వెంకటరమణా కామెంట్స్ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూవులు ఎన్నో ఏళ్ళ నుండి ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట జనవరి 22న జరుగనుంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి పెద్ద ఎత్తున భక్తులు, వీవీఐపీలు, అయోధ్యకు చేరుకోనున్నారు. ఇకపై అయోధ్య రామాలయం హిందూవులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం కానుంది. ఇక ప్రాణప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా 7 వేల కేజీల హల్వాను ప్రసాదంగా తయారు చేయనున్నారు. ఈ ప్రసాద తయారిని విష్ణు మనోహర్ దక్కించుకున్నారు. ఆయనెవరో కాదు దేశంలోనే ప్రముఖ చెఫ్. ఇప్పటికే విష్ణు మనోహర్ వంటలలో 12 వరల్డ్ రికార్డ్స్ ను సాధించారు.
విష్ణు మనోహర్ 1968లో ఫిబ్రవరి 18 నాగ్ పూర్ లోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. కుకింగ్ షో యాంకర్ మరియు చెఫ్. విష్ణు మనోహర్కి నాగ్పూర్, పూణే, ఔరంగాబాద్, ఇండోర్, థానే మరియు కళ్యాణ్ నగరాల్లో రసోయ్ పేరుతో చైన్ రెస్టారెంట్ ఉంది. 53 గంటల పాటు వంట చేసి ప్రపంచ రికార్డు సాధించిన ఏకైక చెఫ్. 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు ‘పొడవైన పరాటా’ చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. 3 గంటల్లో 7000 కిలోల మహా మిసల్ను తయారు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన ఏకైక చెఫ్ మనోహర్.
2018 డిసెంబర్ 20న భారతదేశంలో 3200 కిలోల వంకాయలతో వంట చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. 3000 కిలోల కిచిడీని తయారు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆ తరువాత ఒక కుండలో 5000 కిలోల కిచిడి చేసిన తన రికార్డును తానే బ్రేక్ చేశారు. ఎన్నో వంటల పుస్తకాలను కూడా రాశారు. తాజాగా 285 నిమిషాలలో అన్నంతో పాటు 75 రకాల డిషెస్ ను తయారు చేసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు రామ మందిర ప్రసాదంను తయారు చేసే బాధ్యతను విష్ణు మనోహర్ తీసుకున్నారు. 7000 కిలోల హల్వాను తయారు చేయడం కోసం 1400 కేజీల భారీ కడాయిని నాగ్ పూర్ నుండి అయోధ్యకు తెప్పించారు. ఈ ప్రసాదాన్ని 1.5 లక్షల భక్తులకు పంచిపెట్టనున్నారు.








