ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత 2014 లో ఏపీలో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం రాజధానిగా అమరావతిని నిర్ణయించింది. రాజధాని నిర్మాణంకు ప్రధాని నరేందర్ మోడి శంకుస్థాపన చేశారు. ఇది జరిగి ఎనిమిది సంవత్సరాలు దాటిపోయింది.
ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచింది. ఈ ఎనిమిది ఏళ్ళలో అమరావతి ఎలా ఉంది. బడ్జెట్ ఎంత కేటాయించారు. ఎంత ఖర్చుపెట్టారు అనే విషయన్ని ఇప్పుడు చూద్దాం..
బీబీసి న్యూస్ తెలుగు కథనం ప్రకారం, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఏపీ రాజధాని అమరావతి మాత్రమే కాదని, మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని ప్రకటించి నాలుగేళ్ళు పూర్తయ్యింది. అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, వైజాగ్ పరిపాలన రాజధానిగా ప్రకటించారు. అయితే అమరావతి శాసన రాజధాని అని చెప్పిన తర్వాత హైకోర్టు అలా చెల్లుబాటు తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పుకు ముందే గవర్నమెంట్ తాము చేసిన చట్టాలను ఉపసంహరించుకుని రాజధాని విషయంలో వెనుకడుగు వేసింది. చట్టాలను పగడ్బందీ రూపొందిస్తామని చెప్పింది. అయితే అది జరగలేదు.
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన కొన్ని నెలలకే ఏపీ కొత్త రాజధానిగా అమరావతిని నిర్ణయించారు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం జరిగిన తరువాత నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ 2015 అక్టోబర్ 22న శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పనులు వేగంగా జరిగాయి. ముందు తాత్కాలికమైన సచివాలయం, శాసనసభ రెడీ చేసి, 2017 నుండి ఉపయోగిస్తున్నారు. ఆ తర్వాత తాత్కాలిక హైకోర్టు బిల్డింగ్ ను సిద్ధం చేశారు. ఇందులో 2019 నుండి కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. వాటితో పాటు శాశ్వత వసతి కోసం పలు బిల్డింగ్స్ నిర్మించడానికి పనులు కూడా మొదలయ్యాయి. అందులో ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ క్వార్టర్స్ దాదాపు ఎనబై శాతం పనులు పూర్తయ్యాయి.

ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల నివాసాల పనులు 90 శాతం పూర్తి అయ్యాయి. గ్రూప్ 3, గ్రూప్ 4 క్యాడర్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ సగం పూర్తయ్యాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు కొంతవరకు పూర్తయ్యింది. ముఖ్యమయిన సెక్రటేరియేట్ టవర్స్ పనులు పునాది దశలోనే ఉన్నాయి. జడ్జీల క్వార్టర్స్ నిర్మాణం పనులు ప్రారంభం అయ్యాయి. ఇంతలోనే ఏపీలో గవర్నమెంట్ మారడం, రాజధాని విషయంలో విధానపరంగా నిర్ణయాలు కూడా మారిపోవడంతో రాజధాని అమరావతి కండిషన్ అయోమయంలో పడింది. అక్కడ నిర్మాణాల ఏ పరిస్థితిలో ఉన్నవి అక్కడే అర్థాంతరంగా నిలిచిపోయాయి.
సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణంలో వెచ్చించారు. అయితే రోడ్లు, భవనాలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. అమరావతి నగరాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు భారీగా వెచ్చించాయి. దాదాపుగా ఇరవై వేల కోట్లకు పైగా ఉంటాయని అమరావతి జేఏసీ హైకోర్టుకు తెలిపింది. అమరావతి కోసం కేంద్రం ఇప్పటి వరకూ దాదాపుగా రూ. 1500 కోట్లు రిలీజ్ చేసింది.
“2021 నవంబర్ 23 లెక్కల ప్రకారంగా, అమరావతి అభివృద్ధి కోసం రూ. 8,572 కోట్లు వెచ్చించారు. అందులో మౌలిక సదుపాయాల కోసం చేసిన ఖర్చు రూ.5,674 కోట్లు, 3 వేల కోట్ల రూపాయలను వడ్డీలు, కౌలు చెల్లింపు, కన్సల్టెన్సీ చార్జీలు,పెన్షన్ల నిమిత్తం ఖర్చయ్యాయి. ఈ నిధులు అమరావతి బాండ్లు, హడ్కో లోన్లు, కన్సార్షియం ద్వారా సేకరించారు. వీటికి వడ్డీల చెల్లించే భారం తమ ప్రభుత్వం భరిస్తోంది” అని ప్రభుత్వ సలహాదారు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

1976లో జన్మించిన కల్వకుంట్ల తారక రామారావు యూఎస్ లో ఎంబీఏ చేశారు. ఆ తరువాత అమెరికాలో కొన్నేళ్ల పాటు జాబ్ చేశారు. 2006లో తన జాబ్ కి రాజీనామా చేసి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ లో చేరి తన తండ్రి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ రాజకీయ ప్రవేశం చేశారు. జూన్ 2014లో తెలంగాణ తొలి ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.డైనమిక్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు సేవలందించారు. ప్రస్తుతం ప్రతి పక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు.
వ్యక్తిగత జీవితానికి వస్తే, 2003లో డిసెంబర్ 18న కేటీఆర్, శైలిమల పెళ్లి జరిగింది. ఈ దంపతులకు హిమాన్షు రావు, అలేఖ్య రావు అనే పిల్లలు ఉన్నారు. సోమవారం నాడు వీరి పెళ్లిరోజు సందర్భంగా, 20 సంవత్సరాల క్రితం నాటి పెళ్లి ఫొటోను, భార్య పిల్లలతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కేటీఆర్, “నా అందమైన భార్య శైలిమకు 20వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. గత 2 దశాబ్దాలుగా నాకు మద్దతుగా నిలిచినందుకు మరియు నాకు ఇద్దరు అందమైన పిల్లలను అందించినందుకు, ఈ ప్రయాణంలో గొప్ప భాగస్వామిగా ఉన్నందుకు ధన్యవాదాలు.
మన ప్రయాణం ఇలాగే మరెన్నో ఏళ్లపాటు కొనసాగాలని కోరుకుంటున్నాను.” అంటూ తన భార్య శైలిమకు పెళ్లి రోజు విషెస్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి. కేటీఆర్ పోస్ట్ చేసిన కొన్ని గంటలలోనే ఈ ట్వీట్ కు నెటిజెనల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పోస్ట్ కి రిప్లైగా కేటీఆర్ పెళ్లి ఫోటోలతో వీడియోలను క్రియేట్ చేసి షేర్ చేస్తున్నారు.



పాకిస్థాన్ లోని అహ్మద్పూర్ సియాల్లోని సీతా రామాలయం గొప్ప చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. శతాబ్దానికి పైగా నిర్మించబడిన ఈ ఆలయం ఆ ప్రాంతంలో నివసించే హిందువులకి ప్రార్థనా స్థలంగా ఉంది. ఈ ఆలయం క్లిష్టమైన చెక్కడాలు మరియు పవిత్ర చిహ్నాలతో అలంకరించబడిన అద్భుతమైన వాస్తుశిల్పం, మతపరమైన సరిహద్దులను చెరిపివేసి గొప్ప సాంస్కృతిక వారసత్వం యొక్క కథను తెలియచేస్తుంది. సీతా రామ మందిరం అహ్మద్పూర్ సియాల్లో మత వైవిధ్యానికి చిహ్నంగా ఉంది.
అయితే ఆలాంటి చారిత్రక సీతారామ ఆలయాన్ని చికెన్ షాప్గా మర్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ చేయడంతో, ఆ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “పాకిస్తాన్ లోని హిందూ దేవాలయాలను విముక్తి చేయాలి. లేకపోతే వారు భారతదేశం యొక్క మరొక వైపు చూస్తారు” అంటూ ఒకరు కామెంట్ చేయగా, “పాకిస్తాన్లో మైనారిటీ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. సీతా రామ మందిరం బయట చికెన్ షాప్ తెరవడం. అటువంటి పాపాలు చేసి ఈ వ్యక్తులు ఎంతగా దిగజారిపోతారు?” అంటూ మరొకరు కామెంట్ చేశారు.
ఈ సంఘటన పై అంతర్జాతీయ సంఘాలు మరియు మానవ హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైనారిటీ సమూహాల మతపరమైన మరియు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడవలసిన అవసరాన్ని ఎత్తి చూపుతున్నారు. ఈ సంఘటన దేశంలోని మానవ హక్కుల పరిస్థితిని ప్రతిబింబించెలా ఉండడంతో, ఇలాంటి సంఘటనల పై ఆ దేశ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అంతర్జాతీయ సమాజం నిశితంగా గమనిస్తోంది.



ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన కేసులో దావూద్ ఇబ్రహీం మరియు అతని సన్నిహితులపై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో పలువురిని అరెస్టు చేసింది. దావూద్ ఇబ్రహీం దేశంలోని పవర్ ఫుల్ లీడర్లను, వ్యాపారులను లక్ష్యంగా చేసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాడనే సమాచారం ఎన్ఐఏకు అందింది. దాంతో ఎన్ఐఏ విచారణలో భాగంగా దావూద్ ఇబ్రహీం హసీనా పార్కర్ సోదరుడు అలీషా పార్కర్ ను విచారించింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే, రెండవ పెళ్లి చేసుకున్నట్టుగా తెలిపినట్టుగా ఒక వార్తా సంస్థ వెల్లడించింది.
దావూద్ ఇబ్రహీం మొదటి భార్య పేరు జుబీనా జరీన్. ఆమె 1960లో ముంబైలో జన్మించారు. ఆమెకు మరో పేరు కూడా ఉంది. అదే మెహజబీన్ షేక్. 1990వ దశకంలో, జుబీనా జరీన్ దావూద్ ఇబ్రహీంను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆమె ఫోటోలు పబ్లిక్ డొమైన్ లో ఎక్కువగా లేవు. వీరి పెద్ద కుమార్తె మహర్ఖ్ ఇబ్రహీం, 2006 లో జావేద్ మియాందాద్ కుమారుడు అయిన జునైద్ మియాందాద్ను వివాహం చేసుకుంది. ఈ జంటకి ఒక పాప ఉంది.
జుబీనా జరీన్ రెండవ కుమార్తె, మెహ్రీన్ 2011లో పాకిస్థానీ-అమెరికన్ అయిన అయూబ్ను వివాహం చేసుకుంది. వీరికి మూడవ సంతానంగా 2012లో మరియా ఇబ్రహీం జన్మించారు. నివేదికల ప్రకారం జుబీనా 2017లో ముంబైకి వెళ్లి అక్కడ తన తండ్రి సలీం కాశ్మీరీని చూసింది. అయితే ఆమె తల్లి మరియు సోదరులు మరియు సోదరీమణుల గురించి ఇప్పటికీ ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.
డీఎస్పీ నళిని తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ఉద్యమం చేసేవారి పై లాఠీ ఎత్తలేను అంటూ తన ఉద్యోగాన్ని వదిలేసింది. మేర వర్గానికి చెందిన నళినికి వివాహం జరిగి, అప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఢిల్లీలో సైతం దీక్షలు చేసింది. రాజీనామా చేసిన తరువాత ఆమె కనిపించలేదు. కొత్త ప్రభుత్వం రావడంతో నళినిని తిరిగి జాబ్ లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతూ సామజిక మధ్యమాలలో పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం ఉద్యోగానికి రిజైన్ చేసిన నళినికి డీఎస్పీ పోస్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నళినికి ఉద్యోగం చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే విధులకి తీసుకోవాలని సీ.ఎస్ మరియు డీజీపీలను ఆదేశించారు.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు, 2009 డిసెంబర్ 9న నేను చేసిన రాజీనామా చాలా సంచలనం రేకెత్తించింది. అదే రాత్రి చిదంబరం గారు చేసిన ప్రకటన ఉద్యమాన్ని చప్పున చల్లార్చింది. నాటి సీఎం రోశయ్య గారు మహిళ దినోత్సవం రోజున నాకు నా ఉద్యోగాన్ని కానుకగా తిరిగి ఇస్తున్నట్లు ప్రకటిస్తే ,నేను రాజీనామాను విత్ డ్రా చేసుకొని డిపార్ట్మెంట్ లో చేరాను. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే. 18 నెలలు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు నేను ఎదుర్కొన్న ఒత్తిడి, అవమానాలు నాకు బ్యురోక్రసిపైనే నమ్మకం పోయేలా చేశాయి.
తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారికి, సోనియా గాంధీజీకి లేఖలు రాసి నా పరిస్థితిని, రాష్ర్ట దుస్థితినీ వివరించా. ప్రత్యక్ష ఉద్యమంలో నేను మళ్ళీ పాల్గొనడం అనివార్యం అనిపించింది. అందుకే 1.11.2011 న ఫార్మాట్ లో డీజీపీకి రాజీనామా ఇచ్చేసి ప్రజల్లోకి వెళ్ళాను. శ్రీ కృష్ణ కమిటీ ప్రభావంగా జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూ నా ఉద్యమ కార్యాచరణ ప్రకటించా. ప్రభుత్వం వెంటనే నన్ను సస్పెండ్ చేసింది. దేశ ద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు అందులో ఉన్నాయి. అన్ని పత్రికల్లో నా ఫోటోలు వేసి ఈ వార్తను పెద్దగా రాసి హై లైట్ చేశారు. ఆ నాడే నాకు డిపార్ట్మెంట్ పట్ల ఏహ్య భావం కలిగింది.
ఉద్యమములో నేను నిర్వహించిన కీలక మైన పాత్ర నన్ను ప్రజలకు దగ్గర చేసింది.కాని నా బంధు మిత్ర పరివారం మాత్రం అందరూ నన్ను వెలివేశారు. ఏకాంతవాసం అనే శిక్షను 10 ఏండ్లు అనుభవించా. పర్యవసానంగా ఇల్లు,కుటుంబం,ఆరోగ్యం,మనశ్శాంతి అన్నీ కోల్పోయాను. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను.జీవచ్చవం లా బతికాను. రెండేండ్ల క్రితం దేవుడి దయ వల్ల నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించాడు.వేదమాత, యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు.అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను.
అన్ని దానాల్లో గొప్పదైన విద్యా దానాన్ని చేస్తూ, పుణ్యం మూటకట్టుకోవాలనే కోరిక తప్ప నాకు ఇంకేమీ లేదు. పరమేశ్వరుడు నన్ను క్రిమినాలోజీ( న్యాయ దర్శనం) నుండి ఫిలాసఫీ( తత్త్వ శాస్త్రం) వైపు నడిపించాడు. గన్ స్థానంలో నా చేత వేదం పట్టించాడు.నా వాణి లో మాధుర్యం నింపి నన్ను ఆచార్య ను చేశాడు. నా ఈ ప్రస్థానం (డీఎస్పీ నుండి డిఎన్ఎ గా మారడం) చాలా సంఘర్షణ మయం, వేదనా భరితం. నన్ను ఈ ఉద్యోగం నుండి ఎవరూ సస్పెండ్ చేయలేరు.నేను దీనికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఎన్నడూ కలగవు.కాబట్టి అంతిమంగా నేను సీఎంగా మిమ్మల్ని కోరేది ఏమిటంటే నా పై కరుణ చూపి స్టేటస్ కో కు అనుమతించండి.
నాలా ఇంకే ఆఫీసర్ డిపార్ట్మెంట్ లో ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోండి.మీలో మంచి స్పార్క్ ఉంది.మీ నుండి చక్కని పాలన ఆశించవచ్చు అనిపిస్తుంది. మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే అని నా జీవితంలో రుజువైంది. కాబట్టి నాలో లోకేషన, విత్తేషనలు కూడా పోయాయి. ఇక నాకు మీరు న్యాయం చేయాలి అంటే నాకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా నా ధర్మ ప్రచారానికి ఉపయోగ పడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తాను. ఎందుకంటే మీరు రాజు, నేను బ్రాహ్మణిని. మీరు ఇచ్చే ప్రభుత్వ ఫండ్ ను నేను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద, యజ్ఞ , సంస్కృత సంబంధ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తాను.
( నేను మిమ్మల్ని కలవాలి. కాని ప్రస్తుతం సనాతన ధర్మానికి మూలాలైన ‘వేదం యజ్ఞం’ అనే పుస్తకాన్ని తెలుగు, హిందీ భాషల్లో రాస్తున్నాను. హిందీ ప్రూఫ్ చూసే పనిలో బిజీ గా ఉన్నాను. మహర్షి 200 వ జయంతి వరకు అది సిద్ధం కావాలి.సమయం ఎక్కువగా లేదు.అందుకే అది అయిపోగానే దాన్ని ప్రింటింగ్ కు ఇచ్చేసి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఈ లోగా మీడియా మిత్రులు నా ప్రతిస్పందన తెలుసుకోవాలి అని ఇంటర్వ్యూ అడుగుతున్నారు. అందుకే ఇలా నా ఫేస్బుక్ లో బహిరంగ లేఖ రాయాల్సి వస్తుంది)” అంటూ రాసుకొచ్చారు.