తెలంగాణ ఎన్నికల పూర్తయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇప్పుడు స్పీకర్ ఎన్నిక కార్యక్రమం జరగనుంది. మెజార్టీ సభ్యులు ఉన్న కాంగ్రెస్ పార్టీ స్పీకర్ గా సీనియర్ నాయకుడైన గెడ్డం ప్రసాద్ ను ప్రతిపాదించింది. ఈరోజు రేవంత్ రెడ్డి స్పీకర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని నామినేషన్ పత్రాలు పైన సంతకం చేశారు.

ఇదిలా ఉండగా స్పీకర్ గెడ్డం ప్రసాద్ ప్రతిపాదనను బిఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది. స్పీకర్ నామినేషన్ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొన్నారు. నామినేషన్ పత్రాల పైన రేవంత్ రెడ్డి తో పాటు కేటీఆర్ కూడా సంతకం చేసి తన మద్దతును ప్రకటించారు. స్పీకర్ గా గెడ్డం ప్రసాద్ మంచి పని తీరు కనబరుస్తారని ఆయనకు వ్యక్తిగతంగా మంచి పేరు ఉందని మద్దతు తెలిపినట్లుగా బిఆర్ఎస్ పార్టీ చెప్పింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీతో టిఆర్ఎస్ ఏకీభవించడం శుభ పరిణామంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష విపక్ష పార్టీల మధ్య ఎటువంటి వాదోపవాదాలు జరుగుతాయో చూడాలి అని అంటున్నారు.

బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కీలక బాధ్యతలలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్, ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రత్యేక కార్యదర్శిగా చేశారు. ఆ బాధ్యతతో పాటు నీటిపారుదల శాఖ విధులు కూడా చూసుకున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంకు సంబంధించిన పనులు మరియు మిషన్ భగీరథకు సంబంధించిన పనులను పర్యవేక్షించారు. ఆమె ఎప్పటికప్పుడు ఆఫీసర్లతో సమీక్షలు నిర్వహిస్తూ, ప్రాజెక్ట్ లను సందర్శించి, నిర్మాణ పనులను పరిశీలిస్తూ ముఖ్యమైన పాత్రను పోషించారు. రాష్ట్రంలో డైనమిక్ ఆఫీసర్ గా స్మితా సబర్వాల్కు పేరుగాంచారు.
కాంగ్రెస్ ప్రభత్వం వచ్చినప్పటి నుండి స్మితా సబర్వాల్ ఎక్కడా కనిపించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నుంచి పలువురు ఐఏఎస్ ఆఫీసర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఆయా శాఖల మినిస్టర్లను కలుస్తున్నారు. కానీ సీఎంఓకు ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్ అయితే కనిపించట్లేదు. నీటి పారుదల శాఖ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టుల పై మొదటిసారిగా నిర్వహించిన సమీక్షకు సైతం స్మితా సబర్వాల్ హాజరవ్వకపోటం హాట్ టాపిక్ గా మారింది.
బీఆర్ఎస్ గవర్నమెంట్ లో సమీక్షలన్నింటిలో కనిపించటం, పలు ప్రాజెక్టుల విధులను కూడా పర్యవేక్షించిన స్మితా సబర్వాల్ ప్రస్తుతం కనిపించకపోవడానికి కారణాలేంటా అని నెట్టింట్లో చర్చ జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డితో సహా పలువురు నాయకులు బిఆర్ఎస్ గవర్నమెంట్ తో పాటు ఆఫీసర్ల పై అవినీతి చేసారంటూ ఆరోపణలు చేశారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ల పేరుతో కోట్లు వెనుకేసుకుందంటూ ఆరోపణలు చేశారు. స్మితా సబర్వాల్ పైన కూడా కాంగ్రెస్ నాయకులు పలు సందర్భాల్లో అవినీతి ఆరోపణలు చేశారు. వాటి వల్లనే స్మితా సబర్వాల్ కాంగ్రెస్ ప్రభుత్వంతో కలవట్లేదన్న టాక్ వినిపిస్తోంది.

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కీలక ఆఫీసర్ల మార్పులు జరుగుతున్నాయి. పలువురు ఆఫీసర్లను ఇప్పటికే బదిలీ చేస్తూ, ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. ఈ క్రమంలో సీఎంపేషీలో కొత్త ఆఫీసర్లు వచ్చేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డికి ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి వస్తున్నట్లు తెలుస్తోంది.
ఆమ్రపాలి కాట 1982లో ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్నంలో వెంకట్ రెడ్డి కాటా, పద్మావతి దంపతులకు నవంబరు 4న జన్మించారు. ఆమెకు ఒక తోబుట్టువు ఉన్నారు. విశాఖపట్నంలో సాయి సత్య మందిర్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత ఆమె జేఈఈ లో ఉత్తీర్ణత సాధించి, చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి ఎంబీఏ పూర్తి చేసింది. ఆమ్రపాలి 2010 లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో 39 వ ర్యాంక్ సాధించి, ఐఏఎస్ అధికారిణి అయింది. ఐఏఎస్ కు ఎంపికయిన అతి తక్కువ వయస్కులలో ఒకరిగా ఆమ్రపాలి నిలిచారు.
2013లో వికారాబాద్ సబ్ కలెక్టర్గా నియమితులైన ఆమె, 2014లో మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. మరుసటి ఏడాది తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లాకు జాయింట్ కలెక్టర్గా పనిచేసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2016లో ఆమ్రపాలి వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన తొలి మహిళ ఐఏఎస్ ఆఫీసర్. “యంగ్ డైనమిక్ ఆఫీసర్” గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఢిల్లీలో పీఎం కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న ఆమ్రపాలి తెలంగాణలో సీఎంఓలోకి రావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
2009, 2010 సంవత్సరాల సమయంలో చిన్నారి శాంభవి ఐదేళ్ల వయసులో బాల సన్యాసినిగా ఫేమస్ అయ్యింది. నంద్యాలలో కొంతకాలం నివసించిన శాంభవి, బ్రహ్మం గారి గురించి, భవిష్యత్తు గురించి మాట్లాడేది. శాంభవి మీడియా ముందు చెప్పే మాటలు జనాలను ఎంతగానో ఆకర్షించాయి. ఆమె మాట్లాడుతూ, “తాను, దలైలామా పూర్వ జన్మలో బౌద్ధులమని, మంచి స్నేహితులమంటూ చెప్పి సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చి ఆమెకు పూజలు చేశారు. అంతేకాక టిబెటన్ ప్రజల స్వాతంత్ర్యం కోసం పోరాడడమే లక్ష్యమని శాంభవి పేర్కొంది.
ఆ తర్వాత పలు కారణాల వల్ల చిన్నారి శాంభవి నంద్యాల నుండి హిమాలయాలకు వెళ్లిపోయారు. 13 ఏళ్ళ తరువాత యోగిని శాంభవి మళ్లీ నంద్యాలలోని కనిపించారు. కార్తీక మాసం సందర్బంగా సూర్యనంది, నంద్యాల బస్టాండ్ వద్ద ఉన్న శివాలయంలో శాంభవి ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో యోగిని శాంభవి మీడియాతో మాట్లాడుతూ “బ్రహ్మంగారు వీరభోగ వసంతరాయలుగా జన్మిస్తారని, బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విషయాలన్ని జరిగాయని, ఇంకా జరుగుతున్నాయని పేర్కొన్నారు. బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని హిందీ, ఇంగ్లీషులో ట్రాన్స్లేట్ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు హిమాచల్ ప్రదేశ్లో ఉంటూ, సంస్కృతం వేదాలు నేర్చుకున్నట్లుగా తెలిపారు.
బ్రహ్మంగారి అనుగ్రహం వల్లే గతంలో సూర్యనందికి వచ్చామని, ఆయన అనుగ్రహంతో సూర్యనంది నుండి హిమాలయాలకు వెళ్లామని అన్నారు. ఇక్కడ బ్రహ్మంగారికి ఆశ్రమం, గుడి కట్టాలనే సంకల్పం ఉందని అన్నారు. ఇక్కడి నుండే ధర్మ సంస్థాపన ప్రారంభిస్తానని వరం ఇచ్చారని, బ్రహ్మంగారికి నిలయంగా ఒక గుడి ఉండాలనే సంకల్పం ఉందని, త్వరలోనే దానిని మొదలుపెట్టబోతున్నామని, ఆ కారణంగానే సూర్యనందికి వచ్చానని తెలిపారు. మళ్లీ శాంభవి నంద్యాలకు రావడం, బ్రహ్మంగారి గురించి కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.







