టీం ఇండియా రీసెంట్ గా వెస్టిండీస్, ఐర్లాండ్ల లలో పర్యటిస్తూ తెగ బిజీగా ఉంది. ఆగస్టు 30న ప్రారంభం కాబోతున్న ఆసియా కప్ లో పాల్గొనడం కోసం త్వరలో టీమిండియా శ్రీలంకను పర్యటించనుంది. ఈ నేపథ్యంలో టీం ఇండియన్ ప్లేయర్ తీసుకున్న ఒక కీలక నిర్ణయం సంచలనంగా మారింది .
2023 ఆసియా కప్ టీం ఇండియా జట్టును ప్రకటించిన నేపథ్యంలో అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు. ఎప్పటిలాగా టీం రోహిత్ శర్మ నేతృత్వంలో, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్సీలో ముందుకు నడవండి.
ఇక ఎప్పటిలాగానే ఓపెనింగ్ జోడిగా హిట్మ్యాన్, శుభ్మాన్ గిల్ ఉన్నారు. ఢిల్లీలో సోమవారం నాడు సమావేశమైన కెప్టెన్ రోహిత్ శర్మ కోచ్ రాహుల్ ద్రావిడ్ మరియు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ 17 మంది సభ్యులతో కూడినటువంటి టీం ఇండియా జట్టును ప్రకటించడం జరిగింది.

అయితే ఆసియా కప్ సెలెక్ట్ చేసిన టీమ్ లో శిఖర్ ధావన్ పేరు ఎక్కడా లేదు. రికార్డులు ఒక్కసారి తిరగవేస్తే ఇంతకుముందు జరిగిన ఆసియా కప్ లో శిఖర్ ధావన్ ఏ స్థాయి ఆటగాడు అందరికీ అర్థమవుతుంది. అతను పర్ఫార్మ్ చేసిన స్థాయిలో మరి ఇంకెవరూ చేయలేరు. 2018 ఈ టోర్నమెంట్లో 9 మ్యాచులు ఆడిన ధావన్ రెండు సెంచరీలు రెండు అర్థ సెంచరీలు తో 534 పరుగులు సాధించాడు.
ఎన్నో రికార్డులు తన ఖాతాలో ఉన్న దావన్న పక్కన పెట్టి సరిగ్గా ఫిట్నెస్ కూడా సాధించని రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్లకు…వన్డే సిరీస్ సరిగ్గా ఆడడం చేతకాని సూర్య లాంటి ఆటగాళ్లను ఎందుకు బిసిసిఐ సెలెక్ట్ చేస్తోందో అర్థం కావడం లేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

అయితే మరోపక్క ధావన్ గురించి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రస్తుతం అతని వన్డే కెరియర్ ని పెద్ద ప్రశ్నార్ధకంగా మార్చింది. ఓపెనర్ గా ధావన్ టీమిండియా కు ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలను అందించాడు. అయితే ప్రస్తుతం ప్రెఫెర్డ్ ఓపెనర్లురో హిత్ శర్మ, ఇషాన్ కిషన్, శుభ్మాన్ గిల్ మాత్రమేనని అన్న అజిత్ అగర్కర్ మాటలు ధావన్ కు ఇకపై టీమిండియా తలుపులు తెరుచుకోవేమో అన్న సందేహాన్ని రేపుతున్నాయి. గతంలో ధావన్ కి ధోని ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు ధావన్ కి టీం లోకి తీసుకోడానికి సపోర్ట్ చేయడానికి ధోని కూడా లేదు అంటూ టీం ఇండియా ఫాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక ధావన్ రిటైర్ అవ్వాల్సిందే ఏమో అంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు.
ఫైనల్ టీం వివరాలు….
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ.

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం, 3 – 18 సంవత్సరాల వరకు అందరికీ చదువు తప్పనిసరి చేసింది. 2030 వరకు అందరికీ విద్య అందించడమే ఈ విధానం యొక్క లక్ష్యం. 5వ తరగతి వరకు మాతృ భాషలోనే పాఠాలను బోధిస్తారు. ఆరవ తరగతి నుండి కోడింగ్, ప్రోగ్రామింగ్ కరిక్యులమ్ ఉండేలా చర్యలు. అలాగే 6వ తరగతి నుండే వొకేషనల్ ఇంటిగ్రేషన్ కోర్సులు అమలులోకి వస్తాయి. ఎంఫిల్ కోర్సును పూర్తిగా తొలిగించనున్నారు. ప్రస్తుతం ఉన్న 10+2+3( టెన్త్, ఇంటర్, డిగ్రీ) విధానం, ఇక పై 5+3+3+4 విధానంలోకి మారనుంది. డిగ్రీ మూడు నుండి నాలుగు సంవత్సరాలు.
పీజీ సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు. ఇంటర్ చదువు ఉండదు. ఇంటిగ్రేటెడ్ పీజీ మరియు యూజీ ఐదు సంవత్సరాలు. దేశం మొత్తం ప్రాథమిక చదువుకు ఒకటే కరిక్యులమ్ ఉండనుంది. పాఠ్యాంశాల భారాన్ని తగ్గించి, కాన్సెప్ట్ ను విధ్యార్ధులకు నేర్పే ప్రయత్నం దిశగా మారనుంది. ఇక పై కస్తుర్బా గాంధీ బాలిక విద్యాలయ పన్నెండవ తరగతి వరకు మాత్రమే.
టీచింగ్ ఇంటెన్సివ్ లేదా రీసెర్చ్ ఇంటెన్సివ్ యూనివర్సిటీలు, మోడల్ మల్టీ డిస్సిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, అటానమస్ డిగ్రీ గ్రాంటింగ్ కాలేజీలను ఆమోదించనున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లో నాలుగు ఏళ్ల మల్టీ-డిసిప్లినరీ బ్యాచిలర్ డిగ్రీని ప్రతిపాదించింది. ఈ డిగ్రీలో వృత్తిపరమైన రంగాలకు చెంది ఉంటాయి. 1 ఏడాది రీసెర్చ్ పూర్తి అయ్యాక ఒక సర్టిఫికేట్, రెండు ఏళ్ల చదువు పూర్తి అయ్యాక డిప్లొమా సర్టిఫికెట్, మూడేళ్ళ ప్రోగ్రామ్ పూర్తి అయ్యాక బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్, నాలుగేళ్ళ మల్టీడిసిప్లినరీ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి అయ్యాక సర్టిఫికెట్ లు ఇస్తారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.





చంద్రయాన్ 3 సుమారు 41 రోజుల పాటు భూమి నుండి చంద్రుడి వైపు ప్రయాణించి ల్యాండర్ మాడ్యూల్ ‘విక్రమ్’ ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లి పై అడుగుపెట్టింది. చందమామ పై అడుగిడాలనే భారత్ ఎన్నో ఏళ్ల కల సాకారం అయ్యింది. చంద్రయాన్-3 వల్ల దేశానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 గత నెల బయలుదేరి, ఎట్టకేలకు ఆఖరి అంకానికి చేరుకుంది. కొన్ని గంటల్లో ల్యాండర్ చంద్రుని దక్షిణధ్రువం తొలి అడుగు పెట్టడానికి సిద్ధమైంది. ఆ క్షణం కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. దేశం మొత్తం ఇస్రో జయహో అని నినదిస్తోంది. ఈరోజు సాయంత్రం 5.27 గంటలకు ఈ ప్రక్రియ మొదలుకాబోతుంది. సరిగ్గా సాయంత్రం 6.04 గంటలకు చందమామ ఉపరితలం పై ల్యాండర్ను సురక్షితంగా ల్యాండ్ చేయడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లన్నిటిని పూర్తి చేశారు.


చిరుత దాడిలో చిన్నారి చనిపోవడం ఇటు ప్రజల్లో, అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తిరుమల నడకదారిలో చిరుతలు, లేదా ఇతర క్రూరమృగాలు ఎందుకు వస్తున్నాయనే అంశం తెరపైకి వచ్చింది.
తిరుమల కొండల పై అకేసియా చెట్లు పెంచడం వల్ల ఈ సమస్య వచ్చిందని భూమన్ తెలిపారు. గంటా మండపం, నామాల గవి వద్ద 225 ఎకరాలు ఉండేదని, అక్కడ 1985లో చెట్లు లేవని, టీటీడీ అకేసియా చెట్లను అక్కడ నాటింది. ఈ చెట్ల కారణంగా అక్కడ పెరిగే ఈత, శ్రీగంధం వంటి మిగతా చెట్లు ఎదగవని, ఇతర మొక్కలు కూడా బతకవని చెప్పారు. చెట్లు పెరిగినప్పటికీ, వాటికి కాయలు కాయకపోవడంతో అక్కడ ఆహారం లభించక ఇతర జంతువులు వెళ్లిపోయాయని అన్నారు. ఆ ప్రాంతంలో చిరుతలు కొన్ని స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయని చెప్పారు.
అయితే రీసెంట్ గా సుమారు ముప్పై ఎకరాల్లో ఉన్న అకేసియా చెట్లను కొట్టేశారు. అప్పటి దాకా ఆ చెట్ల నీడలో ఉండే చిరుతలు మనుషులకు సమీపంలో వాటి స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాయని భూమన్ చెప్పుకొచ్చారు. కానీ టీటీడీ డీఎఫ్వో శ్రీనివాసులు బీబీసీతో మాట్లాడుతూ అకేసియా చెట్లను కొట్టేసింది నిజమేనని, అయితే వాటిని కొట్టేయడం కారణంగా చిరుత పులులు నడకదారి వైపు వస్తున్నాయని చెప్పడంలో వాస్తవం లేదని చెప్పారు.
ప్రతిరోజూ రాకపోకలు సాగించే నేషనల్, ఇంటర్నేషనల్ విమానాలతో నిత్యం రద్దీగా ఉండే విమానాశ్రయం చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల పక్షులు ఎక్కువగా సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో విశాఖ ఎయిర్పోర్ట్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మల్లికార్జున ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం నాడు కలెక్టరేట్ లో జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మతో మరియు సివిల్ అడ్మినిస్ట్రేషన్, పోర్ట్ ట్రస్ట్, జీవీఎంసీ,ఇండియన్ నేవీ, ఎయిర్ పోర్ట్ అథారిటీ యొక్క ప్రతినిధులతో మీటింగ్ నిర్వహించారు.
దీనిలో రన్వేలో నీటి నిల్వ, విమానాశ్రయం పరిసరాల్లో చెత్త డంపింగ్, పక్షుల వల్ల జరిగే ప్రమాదాలు వంటి అంశాలపై చర్చలు జరిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ ఉన్న ప్రాంతం జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో ఉండడం వల్ల అధికంగా వ్యర్థాలు అక్కడ చేరుతున్నాయని అన్నారు. మేహాద్రి గెడ్డ కాలువలో మేకల, కోళ్ల మాంసపు వ్యర్థాలు ఎక్కువగా వేస్తున్నారని, అందువల్ల ఆ పరిసరాలు పక్షులు, కుక్కలకు ఆవాసాలుగా మారుతున్నాయని అన్నారు.
ఈ కారణంగా పక్షుల సంఖ్య పెరగడంతో విమానాల రాక, పోకలకు అవి ఆటంకం కలిగిస్తున్నాయని తెలిపారు. అందువల్ల ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, మీట్ షాప్ లను తొలగించాలని, పారిశుధ్య చర్యలను తీసుకోవాలని కలెక్టర్ జీవీఎంసీ ఆఫీసర్లను ఆదేశించారు. అలాగే ఈ విషయం పై జనాలకు కూడా అవగాహన కల్పించాలని చెప్పారు. వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించాలన్నారు. భారీ వర్షాల సమయంలో నీరు ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళకుండా కావాల్సిన నిర్మాణాలు, పూడికతీత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
సమంత, విజయ్ దేవరకొండ కలిసి మహానటి మూవీలో కనిపించారు. కానీ హీరో హీరోయిన్లుగా కాదు. ఖుషిలో వీరిద్దరూ జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. ఇప్పటికే మూవీ యూనిట్ ప్రమోషన్స్ను మొదలు పెట్టింది. ఇటీవల నిర్వహించిన మ్యూజికల్ కాన్సర్ట్లో విజయ్, సమంతల డ్యాన్స్ పర్ఫామెన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ కార్యక్రమంలో సింగర్స్ పాటలు పాడి, ప్రేక్షకులను అలరించారు. అయితే మజిలీ మూవీ పాటకు సమంత ఎమోషనలైనట్లుగా తెలుస్తోంది. స్టేజీపై సింగర్ ప్రియతమా పాటను పాడుతున్న టైమ్ లో సమంత భావోద్వేగానికి లోనైంది. గత జ్ఞాపకాలు ఆ పాట ద్వారా గుర్తుకు రావడంతో వస్తున్న కన్నీళ్లు ఆపడానికి ప్రయత్నించిందని, దానికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్గా అయ్యింది. ఆ వీడియోను చూసిన సమంత ఫ్యాన్స్ ఆమె పరిస్థితి పై జాలి పడుతున్నారు. కొందరు కాలమే సమంత బాధను నయం చేస్తుందంటున్నారు.
మరికొందరు అభిమానులు సమంతను అలా చూస్తుంటే తమకు కూడా ఏడుపు వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. నాగచైతన్యను సమంత మర్చిపోలేకపోతుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మజిలీ మూవీలో నాగచైతన్య, సమంత భార్యాభర్తలుగా నటించారు. వీరి పెళ్లి జరిగిన తరువాత కలిసి నటించిన మొదటి సినిమా కూడా ఇదే. ఈ చిత్రాన్ని శివ నిర్వాణ తెరకెక్కించాడు.
టీటీడీఎఫ్ఓ శ్రీనివాసులు బీబీసి న్యూస్ తో మాట్లాడుతూ చిన్నారి పై దాడి చేసిన చిరుత, బోనులో చిక్కిన చిరుత ఒక్కటేనా కాదా అనే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. చిరుత పులి కడుపులో మానవ మాంసమకు చెందిన ఆనవాళ్లు ఉన్నాయో? లేదా అనే దానిని తెలుసుకుంటాం. నిపుణులు చిన్నారి పై దాడి చేసిన చిరుత ఇదేనా కాదా అని నిజ నిర్ధారణ చేస్తారని తెలిపారు. ఆ తరువాత ఫారెస్ట్ ఆఫీసర్ల నిర్ణయం మేరకు బోనులో చిక్కిన చిరుతను జూలోనే ఉంచాలా? లేదా అడవిలో వదలాల అనే విషయాన్ని నిర్ణయిస్తామని తెలిపారు.
ఇక బోనులో చిక్కిన చిరుతపులి ఆడ చిరుత అని, దానికి నాలుగు ఏళ్లు ఉంటాయని వెల్లడించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి కూడా మాట్లాడుతూ చిన్నారి మరణించిన ప్రాంతంలోనే చిరుత పట్టుబడిందని అన్నారు. అయితే ఈ ప్రాంతంలో చిరుతల సంచారం ఇంకా ఉన్నట్టుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారని, చిరుతలను పట్టుకునే ప్రక్రియ కొనసాగుతుంది.
తిరుమల నడకదారిలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అటవీ శాఖ అధికారులు చెప్పేదాకా నిబంధనలు కొనసాగుతాయని అన్నారు. అంతేకాకుండా నడకదారిలో వచ్చే 15 ఏళ్లలోపు చిన్నారులను మధ్యాహ్నం 2 గంటల అనంతరం అనుమతించమని చెప్పారు. ఇక నడకమార్గంలో వచ్చే భక్తులు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని ధర్మారెడ్డి సూచించారు.