ఇన్ఫోసిస్ ఛైర్పర్సన్ అయిన సుధా మూర్తి ఓ కంపెనీ యజమాని కంటే కూడా ఎక్కువగా… ఆమె ప్రసంగాలతోనే అందరికీ బాగా తెలుసు. మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూ ఎంతో మంది ఆదరణ పొందారు. అయితే తాజాగా సుధా మూర్తి ఓ ఛానెల్ కి ఇస్తున్న ఇంటర్వ్యూలో మాట్లాడిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి.
వాస్తవానికి సుధా మూర్తి శాఖాహారి. కాబట్టి తన ఆహారపు అలవాట్లు కాస్త భిన్నంగానే ఉంటాయి. ఆమె ఆలోచనలు కూడా అంతే భిన్నంగా ఉంటాయి. అందుకే ఎంతో మంది ఆదరిస్తుంటారు. కానీ ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆహారానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు కాస్తా కాంట్రవర్సీగా మారాయి.

” నేను శాఖాహారిని కాబట్టి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను కానీ తేలికైన ఆహారాన్నే తింటాను వొండుతాను. కొన్ని సార్లు బయట హోటళ్లకు వెళితే మాంసాహారానికి ఉపయోగించిన గరిటెలే వాడతారేమో అనే భయంతో… పెద్దగ్గా హోటళ్లకు వెళ్ళను. వెళ్ళినా చాలా ఆచి తూచి ఆలోచించు చూసుకుని శాకాహార హోటల్ అయితేనే వెళతాను. ఇక నా వంటల విషయానికి వస్తే నేను వొంద రకాలు చెయ్యలేక పోవచ్చు కానీ… నాకు వచ్చిన వాటిల్లో చాలా తేలికగా అరిగే వంటకాలు చేస్తాను.

“టీ, అటుకులు, చారు, కూర, చపాతీలు వంటివి ఇలా చాలా సింపుల్ వంటకాలనే చెయ్యగలను. ఇదిలా ఉంటే ఫారెన కంటీలకు పని మీద వెళ్ళినప్పుడు కూడా నాతో ప్రత్యేకంగా ఒక చిన్న కుక్కర్ తీసుకు వెళతాను. 25,30 చపాతీలు, రోస్టెడ్ సూజీని తీసుకెళ్తాను. ఇవి చాలా సింపుల్ గా వేడి నీటిలో కలిపితే తినగలిగేలా ఉంటాయి. నేను మా భర్త ఇలానే చాలా సింపుల్ ఆహారాన్ని తీసుకుంటాం” అని ఆ ఇంటర్వ్యూలో సుధా మూర్తి చెప్పుకొచ్చారు.

ఈ వీడియో కాస్త వైరల్ గా మారి ట్విట్టర్ లో నెటిజన్లు దుమ్మేటిపోస్తున్నారు. ఇక సుధా మూర్తి అల్లుడు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా ఓ మాంసాహారేగా అంటూ సునాక్ నాన్ వెజ్ తింటున్న ఫోటోలను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. మరి వాళ్ళ అల్లుడికి ఇంకొక గరిట ఉంటుందా అంటూ విమర్శించారు. ఇంకొందరైతే ఇక ఇంతలా ఉన్న గొప్ప వ్యక్తి అసలు ముస్లింలు ఉండే ప్రాంతంలో కనీసం టీ అయినా తాగుతారా అంటూ తూట్లు పొడిచారు. మొత్తంగా ఒకప్పుడు సుధా మూర్తి మోటివేషన్ ఇచ్చేవిగా స్పీచ్ లు కాస్త… ఆ యూట్యూబ్ ఛానెల్ లోని ఇంటర్వ్యూ ద్వారా ఏకంగా ఇతర వర్గాల వారి మనోభావాలు దెబ్బ తీసాయనే చెప్పొచ్చు.
ALSO READ : మరి విడ్డూరం కాకపోతే..! ఇలాంటి కారణంతో కూడా జాబ్ ఇవ్వరా..?

ప్రతీక్ష జిక్కర్ అనే యువతి బెంగళూరులోని ఒక కంపెనీకి సంబంధించిన జాబ్ ప్రకటన చూసి ఆ ఇంటర్వ్యూకి హాజరు అయ్యింది. అలా వెళ్ళి ఆమె 3 రౌండ్ల వరకు జరిగిన ఇంటర్వ్యూలో నెగ్గింది. కానీ ఉద్యోగానికి మాత్రం సెలెక్ట్ కాలేదు. ఆమె జాబ్ కి సెలెక్ట్ ఎందుకు కాలేదో సదరు కంపెనీ కారణాన్ని తెలుపుతూ ఆమెకు మెయిల్ ను పంపించింది.
ఆ మెయిల్ లో ఏముందంటే, ‘జాబ్ పొందడానికి కావలసిన అన్ని అర్హతలు, నైపుణ్యాలు మీకు ఉన్నాయి. అయితే మీ స్కిన్ టోన్ మా టీంతో మ్యాచ్ అవలేదు. మీ స్కిన్ కలర్ తెల్లగా ఉండటం వల్ల మా టీంలో విభేదాలు వస్తాయని కంపెనీ యాజమన్యం భావించింది. అందువల్ల మీకు ఈ జాబ్ ఇవ్వలేం’ అని మెయిల్లో సదరు కంపెనీ పేర్కొంది. ఈ మెయిల్ తో ఖంగు తిన్న ప్రతీక్ష జిక్కర్ ఆ కంపెనీ నుంచి వచ్చిన ఆ మెయిల్ స్క్రీన్ షాట్ను తీసి సోషల్ మీడియాలో తన ఖాతాలో షేర్ చేసింది.
వాస్తవానికి కంపెనీ మెయిల్ ను చూసి చాలా ఆశ్చర్యపోయాను, మనిషి కలర్ బట్టి కూడా జాబ్ ఇస్తారని నేను అసలు ఊహించలేదు. మనిషి రంగును బట్టి కాకుండా టాలెంట్ ను బట్టి జాబ్ ఇవ్వాలని సదరు కంపెనీని ఈ పోస్ట్ లో కోరింది. ప్రతీక్ష షేర్ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ పోస్ట్ చూసిన నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.





భార్యను పూలమాలతో, శాలువాతో సత్కరించాడు. ఆ తరువాత కేక్ కట్ చేయించి, స్వీట్లు పంచిపెట్టాడు. భర్త చేసిన ఏర్పాట్లను చూసి దీనా ఆనంద భాష్పాలు రాల్చింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసిన వారు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రతి ఆడదాని సక్సెస్ వెనుక ఒక అర్థం చేసుకునే భర్త ఉంటాడని ఒకరు కామెంట్ చేశారు. అంతగా ప్రేమించి భార్య కోసం ఎఫర్ట్ పెట్టే వాళ్లు దొరకాలంటే రాసి పెట్టి ఉండాలని ఒకరు కామెంట్ చేశారు.



తాము ఇద్దరం కలిసి ఉండాలనుకుంటున్న విషయం కోర్టుకు చెప్పడంతో అందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కంపెనీలో పనిచేస్తోన్న ఈ జంట అప్పటి నుండి కలిసి జీవించడం మొదలుపెట్టారు. కానీ, అఫిఫా తల్లిదండ్రులు, బంధువులు వారు పని చేసే దగ్గరికి వెళ్ళి అఫిఫాను బలవంతంగా తీసుకెళ్లారు. దాంతో సుమాయా పోలీసు స్టేషన్లలో కంప్లైంట్ చేసినప్పటికీ, ఎలాంటి చర్యలు వారు తీసుకోలేదు. ఆ తర్వాత కేరళ హైకోర్టులో సుమాయా ఒక పిటిషన్ దాఖలు చేసింది. అఫిఫాను కోర్టు ముందు హాజరు పర్చాలని ఆదేశించింది.
అయితే వారు కోర్టు ఆర్డర్ పాటించకుండా తమకు టైమ్ కావాలని అడిగారు. ఆ తర్వాత జూన్ 10 రోజులకు అఫిఫాను కోర్టుకు ఆమె తల్లిదండ్రులు తీసుకొచ్చారు. తల్లిదండ్రులు బెదిరిచడంతో అఫిఫా కోర్టులో సుమాయాతో కలిసి ఉండాలనుకోవడం లేదని తెలిపారు. అలాగే తన తల్లిదండ్రులతో ఉండాలనుకున్నట్లు అఫిఫా చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అఫిఫా సుమాయాకు ఫోన్ చేసి, కోర్టు ముందు చెప్పిందంతా కావాలని మాట్లాడింది కాదని, తన తల్లిదండ్రులు వైద్య చికిత్స చేయించారని తెలిపింది.
వనజా కలెక్టివ్ సంస్థ ద్వారా సుమాయా పోలీసుల సహాయంతో అఫిఫాను తన తల్లిదండ్రుల నుంచి రక్షించారు. కోర్టులో సుమాయాతో వెళ్లలేనని చెప్పిన పరిస్థితులను అఫిఫా బీబీసీకి వివరించారు. శారీరక సంబంధం కోసం మాత్రమే తాము కలిసి ఉండాలని అనుకుంటున్నామని అనేవారని, ఇలా ఆలోచించే వారితో మాట్లాడటం కూడా అర్థరహితం. తమను అర్థం చేసుకునే విధంగా వారిని మార్చలేం’’ అన్నారు. డాక్టర్లే మా బంధాన్ని అర్థం చేసుకోలేదని, సొసైటీ, తల్లిదండ్రులు ఎలా అర్థం చేసుకుంటారని సుమాయా, అఫిఫా చెప్పుకొచ్చారు.




