ప్రజా గాయకుడు గద్దర్ ఆదివారం నాడు కన్నుమూశారు. ఆయన మరణంతో తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతు ఒక్కసారిగా మూగబోయింది. అనారోగ్యంతో అమీర్పేట్లోని అపోలో స్పెక్ట్రా హాస్పటల్ లో చేరిన గద్దర్ ఆగస్టు 6 (ఆదివారం) నాడు చికిత్స తీసుకుంటూనే తుది శ్వాస విడిచారు.
తెలంగాణ ఉద్యమాన్ని తన పాటలతో ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన గొంతు మూగపోయింది. గద్దర్ మరణంతో తెలగాణ వ్యాప్తంగా విషాదం నెలకొంది. రాజకీయ, సినీ ప్రముఖులు గద్దర్ భౌతిక కాయానికి నిన్న నివాళులు అర్పించారు. పలువురు సామాజిక మాధ్యమాలలో తమ సంతాపాన్ని తెలిపారు.
ప్రజా గాయకుడు గద్దర్ అసలు పేరు విఠల్ రావు. ఆయన 1949లో తూప్రాన్లో జూన్ 5న జన్మించారు. మూడు రోజుల క్రితమే గద్దర్ అపోలో హాస్పటల్ లో గుండెకు చికిత్సను చేయించుకున్నారు. ఈ క్రమంలో వైద్యులు గుండె ఆపరేషన్ విజయవంతం అయినట్టుగా ప్రకటించారు. అయితే అంతలోనే గద్దర్ మరణించడం విషాదకరంగా మారింది. ఇక ఆయన చనిపోవడానికి గల కారణాల గురించి డాక్టర్స్ బులెటిన్ రిలీజ్ చేశారు. గద్దర్ మరణానికి గల ముఖ్యమైన కారణాలను అందులో తెలిపారు.
గద్దర్ ముఖ్యంగా ఊపిరితిత్తులు మరియు మూత్ర సమస్యలతో మృతి చెందినట్లు డాక్టర్స్ వెల్లడించారు. తీవ్రమైన గుండెజబ్బుతో గద్దర్ జూలై 20న హస్పటల్ చేరగా, ఆగస్టు 3వ తారీఖు ఆయనకు బైపాస్ సర్జరీ చేశారు. అది సక్సెస్ అయినా కానీ, గతంలో గద్దర్ కు ఉన్న లంగ్స్ సమస్య వల్ల ఆయన, కోలుకోలేక కన్నుమూసినట్లు వైద్యులు బులెటిన్లో ప్రకటించారు.
గద్దర్ అంత్యక్రియలను నేడు ఆల్వాల్ లోని మహా బోధా స్కూల్లో నిర్వహిస్తారని తెలుస్తోంది. గద్దర్ కు నివాళులు అర్పించడం కోసం ప్రజలతో పాటుగా, రాజకీయ, సినీ ప్రముఖులు, ప్రజాసంఘాల నేతలు ఎల్బీ స్టేడియానికి తరలివస్తున్నారు. గద్దర్ తో తమకున్న ఙ్ఞాపకాలను, అనుబంధాన్ని తల్చుకుంటూ వారు భావోద్వేగానికి లోనవుతున్నారు. జన సేనాని పవన్ కళ్యాణ్ గద్దర్ కన్నుమూసిన విషయం తెలిసిన వెంటనే వచ్చి, గద్దర్ బౌతీక కాయాన్ని సందర్శించి, ఆయన కుటుంబాన్ని పరామర్శించాడు.
Also Read: విశాఖపట్నం కానిస్టేబుల్ కేసులో బయటికొచ్చిన మరొక నిజం..! అసలు విషయం ఏంటంటే..?

విశాఖలోని వన్టౌన్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రమేష్ మర్డర్ కేసులో వీడియో లభించిన విషయం తెలిసిందే. అయితే ఆ వీడియో చూసిన పోలీసులు, రమేష్ వైఫ్ తెలివితేటలకు ఆశ్చర్యపోయారు. లవర్ రామారావుతో కలిసి రమేష్ భార్య మంగళవారం రాత్రి భర్తను ఊపిరాడకుండా చేసి చంపేసిన సంగతి తెలిసిందే. అయితే రమేష్ ను చంపడం కోసం ముందుగానే తన లవర్ తో కలిసి శివాని కుట్ర పన్నింది. హత్య విషయంలో తన పై సందేహం రాకుండా హత్య చేయకముందే రమేష్ తో చాలా ప్రేమగా ఉన్నట్లు వీడియో తీసింది.
మంగళవారం నాడు రాత్రి మటన్ కర్రీ చేసి, భర్తకు పెట్టి, మద్యం తాగించింది. తాను చాలా మంచిదని, మై వైఫ్, మై లైఫ్ అని రమేష్ తో చెప్పించి, వీడియోను రికార్డు చేసింది. ఆ తరువాత మద్యం మత్తులో ఉన్న భర్తను తీసుకెళ్ళి బెడ్ పై పడుకోబెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మర్దర్ కేసు తనపై పడకుండా ఉండడం కోసమే, తాను మంచిదాన్ని అని రమేష్ తో చెప్పించి, వీడియోను రికార్డ్ చేసినట్లు శివాని పోలీసులు ఎదుట ఒప్పుకుంది. దీంతో శివాని తెలివితేటలకు అందరూ షాక్ అవుతున్నారు.
విచారణలో శివాని తనకు పెద్దమ్మ కూతురు పైడమ్మ వల్లే రామారావుతో పరిచయం అయ్యిందని చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో రమేష్ మర్డర్ ఈ హత్య కేసులో పైడమ్మ హస్తం కూడా ఉందని శివాని పోలీసులను నమ్మించడానికి ప్రయత్నించిందని సమాచారం. ఇక ఈ కేసులో ప్రస్తుతం రమేష్ భార్య శివాని, ఆమె లవర్ రామారావు, మరియు అతని ఫ్రెండ్ నీలా మీద మాత్రమే కేసును నమోదు చేశామని పోలీసులు తెలిపినట్లు సమాచారం.
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అంజుకు పాకిస్తాన్ కి చెందిన నస్రుల్లాతో ఫేస్ బుక్ లో పరిచయం కావడం, ఆ తరువాత అది ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో లవర్ ను కలుసుకోవడం కోసం అంజు దేశ సరిహద్దులను దాటి పాకిస్తాన్ కు వెళ్లింది. అక్కడ ఇస్లాం మతంలోకి మారి, పేరు సైతం ఫాతిమా మార్చుకుని, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మరో వారి పెళ్లి విషయం తెలిసిన అంజు ఆమె భర్త వారి పెళ్లి చెల్లదని చెబుతున్నారు. కానీ ఫాతిమా గా మారిన అంజు మాత్రం ఇక్కడి సంప్రదాయాలను మర్చిపోయి, అక్కడి వాటిని నేర్చుకునే ప్రయత్నం చేస్తోంది.
ఫాతిమా, నస్రుల్లా పెళ్లి చేసుకోవడంతో బంధువులే కాకుండా అక్కడి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా వారి ఇంటికి వెళ్ళి మరి బహుమతులు ఇస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ బిజినెస్ మెన్ మహమ్మద్ ఖాన్ అబ్బాసీ అంజుకి బహుమతుల అందచేశారు. ఆమెకు ఇల్లు కట్టుకోవడం కోసం స్థలం మరియు డబ్బును కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ఇతర మతాల నుండి తమ మతంలోకి వచ్చే వారికి సౌకర్యాలు కల్పించడమే తమ ఉద్దేశమని వెల్లడించారు. ప్రస్తుతం అతను చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.
శోభు యార్లగడ్డ తన ట్వీట్లో ఇలా రాసుకొచ్చాడు. ‘ఈ మధ్య కాలంలో విజయాన్ని అందుకున్న ఒక యంగ్ హీరో తన ఆటిట్యూడ్ కారణంగా హిట్ చిత్రాన్ని వదులుకున్నాడు. సక్సెస్ వచ్చిన అనంతరం, దానిని ఎంతో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని, ఒక కొత్త దర్శకుడు స్క్రిప్ట్ చెప్పడం కోసం సదరు హీరో దగ్గరికి వెళ్ళిన సమయంలో అతను ఆటిట్యూడ్తో గౌరవం ఇవ్వలేదని, ఇలాంటి విధానం ఆ హీరో కెరీర్కు ఎంత మాత్రం కూడా మంచిది కాదు.
అయితే ఈ విషయాన్ని ఆ హీరో త్వరలోనే గ్రహిస్తాడని ఆశిస్తున్నాను అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసినవారు ఆ యంగ్ హీరో విశ్వక్ సేన్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే బేబీ మూవీ కథను చెప్పడానికి విశ్వక్ సేన్ వద్దకి వెళ్తే, కనీసం కథ కూడా వినకుండా రిజెక్ట్ చేశాడని దర్శకుడు సాయి రాజేష్ పరోక్షంగా తెలిపాడు.
దాని పై విశ్వక్ స్క్రిప్ట్ విని రిజెక్ట్ చేయడం కన్నా ముందే నో అని చెబితే బెటర్ అని ఇప్పటికే కౌంటర్ ఇచ్చాడు. దాంతో ఆ హీరో విశ్వక్ సేన్ అని భావించారు. అయితే శోభు యార్లగడ్డ విశ్వక్ సేన్ గురించి ఆ ట్వీట్ పెట్టలేదని క్లారిటీ ఇచ్చాడు. ఆ ట్వీట్ తో ఆ చర్చ ముగిసింది. మరి శోభు యార్లగడ్డ చెప్పిన ఆ హీరో ఎవరా అని నెటిజెన్లు మళ్ళీ వెతుకుతున్నారు.
వెంకన్న ప్రసాదాల్లో లడ్డు ముఖ్యమైనది. అన్ని హిందువుల పుణ్యక్షేత్రాల్లో దొరికే లడ్డుల కన్నా తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముఖ్యత వేరే దేనికి లేదని చెప్పవచ్చు. తిరుపతిలో దొరికే లడ్డు యొక్క రుచి, సువాసన వేరే లడ్డుకు ఉండదు. అందుకే తిరుపతి లడ్డుకు జియోగ్రాఫికల్ పేటెంట్ కూడా లభించింది. దాని ప్రకారం ఈ లడ్డు తయారీ పద్ధతి ఎవ్వరూ అనుకరించకూడదు.
మధురమైన తిరుపతి లడ్డుల తయారీ కోసం గత యాబై సంవత్సరాల నుండి నందిని నెయ్యిని ఉపయోగిస్తున్నారు. తిరుమలలో నిత్యం దాదాపు 3 లక్షల లడ్లు తయారు చేస్తారని తెలుస్తోంది. ఈ లడ్డుల తయారీలో సుమారు 700 మంది పోటు కార్మికులు పని చేస్తున్నారు. తాజాగా టీటీడీ అధికారులు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. లడ్డు తయారీలో నందిని నెయ్యిని ఉపయోగించకూడదని నిర్ణయాన్ని తీసుకున్నారు.
నందిని నెయ్యిని కేఎంఎఫ్ (కర్ణాటక మిల్క్ ఫెడరేషన్) తయారు చేస్తుంది. ఈ నెయ్యిని వాడకూడదని నిర్ణయించారు. ఈ మేరకు కేఎంఎఫ్తో ఇన్నాళ్ళూ ఉన్న కాంట్రాక్ట్ను రెన్యూవల్ చేయకూడదనే డిసైడ్ అయ్యారు. దీనికి కారణం కేఎంఎఫ్ నందిని నెయ్యి ధరను పెంచడమే. ఇక ఈ విషయాన్ని కేఎంఎఫ్ ఛైర్మన్ ధ్రువీకరించారు. టీటీడీ చెప్పిన ధరకు నందిని నెయ్యిని సరఫరా చేయలేమని తెలిపారు. నెయ్యిని తక్కువ ధరకు సరఫరా చేసే టెండర్ల విధానంలో పాల్గొనట్లేదని వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్ లోని బల్లియా జిల్లాకు చెందిన జానకీ దేవి భర్త కొన్నేళ్ళ క్రితం కనిపించకుండా పోయాడు. అప్పటి నుండి ఆమె తన భర్త కోసం వెతుకుతూనే ఉంది. ఇటీవల బల్లియాలోని జిల్లా హాస్పటల్ ముందు చాలా దయనీయంగా ఉన్న ఒక దివ్యాంగుడిని చూసింది. ఆ వ్యక్తి కనిపించకుండా పోయిన తన భర్తగా భావించి ఇంటికి తీసుకెళ్లింది. అతని గడ్డం మరియు జుట్టు అచ్చం తన భర్త వలె ఉండడంతో పొరబాటు పడింది. అతన్ని చిరిగిన బట్టలలో చూసి బాధపడిపోయింది.
ఆసుపత్రి బయట అతన్ని చూసి ఇన్నేళ్ల నుండి ఎక్కడికి వెళ్లిపోయావు? ఇంతకాలం ఎక్కడున్నావు? అని జానకీ దేవి అడిగింది. కానీ ఆ వ్యక్తి మాత్రం ఏం మాట్లాడలేదు. జానకీ దేవి అతన్ని ఇంటికి తీసుకొచ్చి, అతనికి షేవింగ్ చేయించిన తరువాత చూసి షాక్ అయ్యింది. ఆ తరవాత అతని పుట్టు మచ్చలు చూసి భర్త కాదో గుర్తు పట్టడం కోసం ప్రయత్నించింది. కానీ పుట్టు మచ్చలు కూడా కనిపించలేదు. దాంతో ఇంటికి తీసుకువచ్చిన వ్యక్తి తన భర్త కాదని గ్రహించింది.
అంతకు ముందు “నాన్న వచ్చాడు” అని తన పిల్లలతో ఆనందంగా చెప్పింది. ఒక కొత్త కుర్తాను తీసుకురమ్మని డబ్బులిచ్చి పిల్లలను పంపింది. కానీ చివరికి అతను తన భర్త కాదని, తప్పు తెలుసుకుని అతనికి క్షమాపణలు చెప్పి, అ వ్యక్తిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించింది. ఇదంతా చూసిన స్థానికులందరు ఆశ్చర్యపోయారు.





ప్రతీక్ష జిక్కర్ అనే యువతి బెంగళూరులోని ఒక కంపెనీకి సంబంధించిన జాబ్ ప్రకటన చూసి ఆ ఇంటర్వ్యూకి హాజరు అయ్యింది. అలా వెళ్ళి ఆమె 3 రౌండ్ల వరకు జరిగిన ఇంటర్వ్యూలో నెగ్గింది. కానీ ఉద్యోగానికి మాత్రం సెలెక్ట్ కాలేదు. ఆమె జాబ్ కి సెలెక్ట్ ఎందుకు కాలేదో సదరు కంపెనీ కారణాన్ని తెలుపుతూ ఆమెకు మెయిల్ ను పంపించింది.
ఆ మెయిల్ లో ఏముందంటే, ‘జాబ్ పొందడానికి కావలసిన అన్ని అర్హతలు, నైపుణ్యాలు మీకు ఉన్నాయి. అయితే మీ స్కిన్ టోన్ మా టీంతో మ్యాచ్ అవలేదు. మీ స్కిన్ కలర్ తెల్లగా ఉండటం వల్ల మా టీంలో విభేదాలు వస్తాయని కంపెనీ యాజమన్యం భావించింది. అందువల్ల మీకు ఈ జాబ్ ఇవ్వలేం’ అని మెయిల్లో సదరు కంపెనీ పేర్కొంది. ఈ మెయిల్ తో ఖంగు తిన్న ప్రతీక్ష జిక్కర్ ఆ కంపెనీ నుంచి వచ్చిన ఆ మెయిల్ స్క్రీన్ షాట్ను తీసి సోషల్ మీడియాలో తన ఖాతాలో షేర్ చేసింది.
వాస్తవానికి కంపెనీ మెయిల్ ను చూసి చాలా ఆశ్చర్యపోయాను, మనిషి కలర్ బట్టి కూడా జాబ్ ఇస్తారని నేను అసలు ఊహించలేదు. మనిషి రంగును బట్టి కాకుండా టాలెంట్ ను బట్టి జాబ్ ఇవ్వాలని సదరు కంపెనీని ఈ పోస్ట్ లో కోరింది. ప్రతీక్ష షేర్ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ పోస్ట్ చూసిన నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
