స్మార్ట్ ఫోన్లు వచ్చిన తరువాత ఆన్లైన్ గేమ్లు ఆడటం బాగా పెరిగిపోయింది. పిల్లల దగ్గరి నుండి పెద్ద వాళ్ల దాకా అందరు గేమ్ లు ఆడుతున్నారు. కొందరు వీటికి అడిక్ట్ అవుతున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రపంచాన్ని మరిచి దానిలో లీనమవుతున్నారు. ఇక గేమ్స్ లో పబ్జీ గేమ్ కుండే క్రేజ్ వేరు.ఈ గేమ్ ని ఇండియాలో బ్యాన్ చేసినా కూడా కొంతమంది ఇతర మార్గాలలో పబ్జీని డౌన్లోడ్ చేసుకొని ఆడుతునేవున్నారు.
తాజాగా ఈ గేమ్ ఒక ఫ్యామిలీలో చిచ్చు పెట్టింది. ఈ గేమ్ లో పరిచమైన వ్యక్తి కోసం ఒక మహిళ తన భర్తను, తన దేశాన్ని విడిచి తన పిల్లలతో కలిసి పాకిస్తాన్ నుండి ఇండియాకు చేరుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
పాకిస్థాన్ మహిళ సీమా గులామ్ హైదర్ కు నోయిడాకు చెందిన సచిన్కు పబ్జీ గేమ్ ద్వారా పరిచయం కలిగింది. అయితే మహిళకు అప్పటికే పెళ్లి జరిగి, నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. సీమా, సచిన్ పబ్జీలో నిత్యం చాటింగ్ చేసేవారు. వీరి పరిచయం తరువాత ప్రేమగా మారింది. దాంతో ప్రియుడు కోసం పెళ్లి చేసుకున్న భర్తను విడిచి పెట్టేందుకు సైతం సిద్ధ పడింది.
సీమా గులామ్ హైదర్ తన నలుగురు పిల్లలను తీసుకుని సచిన్ నివసించే ఉత్తరప్రదేశ్కు ప్రయాణం అయ్యింది. పాకిస్తాన్ నుండి నేపాల్ మీదుగా అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించి, ఉత్తరప్రదేశ్ చేరుకుంది. బస్సులో గ్రేటర్ నోయిడాకు వచ్చింది. ఆ తరువాత సచిన్ అక్కడే ఒక ఇల్లు రెంట్ కు తీసుకుని జీవించడం మొదలు పెట్టారు.
అయితే పాకిస్థాన్ మహిళ అక్రమంగా జీవిస్తున్నట్టు స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సచిన్, సీమాను అదుపులోకి తీసుకున్నారు. తమకు కోర్టు పెళ్లి జరిగిందని, నలుగురు పిల్లలున్నట్లుగా వారు చెప్పారని అద్దెకు ఇల్లు ఇచ్చిన ఓనర్ బ్రిజేష్ పోలీసులకు వెల్లడించారు. అయితే సీమా కట్టు, బొట్టు చూస్తే, ఆమె పాకిస్తాన్ మహిళ అనే సందేహం రాలేదని అన్నారు.
Also Read: భార్య ఆనందం కోసం ఎవరూ చేయని పని చేశాడు..! ఈ సంఘటన చూస్తే కన్నీళ్లు ఆగవు..!




బిహార్ రాష్ట్రంలోని నవాడ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నవాడలో ఒక గ్రామానికి చెందిన యువకుడికి పెళ్లి జరిగింది. కానీ అతని భార్య అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తిని ప్రేమించింది. ఈ క్రమంలో పనిమీద ఒక రోజు బయటకు వెళ్లిన భర్త రాత్రికి ఇంటికి రాలేదు. దాంతో ఆ భార్య ఆమె ప్రియుడి దగ్గరికి వెళ్లింది.
ఆమె వెళ్ళడం చూసిన స్థానికులు మరియు ప్రియుడి బంధువులు ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని, చెట్టుకు కట్టేసికొట్టారు. తరువాతి రోజు ఊరిలోని గ్రామ పెద్దలందరు కలిసి పంచాయతీ పెట్టి, వారిద్దరినీ ఆ గ్రామం నుంచి బహిష్కరించాలని డిసైడ్ అయ్యారు. కానీ ఈ విషయం తెలిసి తిరిగి వచ్చిన ఆ యువతి భర్త, భార్యను ఏమి అనకుండా, కోపం తెచ్చుకోకుండా భార్యను, ఆమె ప్రియుడిని గుడికి తీసుకువెళ్లాడు.
ఆ తరువాత వారిద్దరికీ దండలు మార్పించి, వివాహం జరిపించాడు. ఈ సంఘటన చూసిన వారందరూ ఆశ్చర్య పోయారు. కొంత మంది అయితే ఆ భర్త అలా చేసినందుకు అతడిని తిట్టారు. ఇక ఈ సంఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సాధారణంగా గుళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ట్రాఫిక్ సిగ్నళ్లు వంటి ప్రదేశాల్లో భిక్షాటన చేసేవారు ప్రతిరోజూ కనిపిస్తూ ఉంటారు. సరైన తిండి, బట్టలు లేనివారిని చూడగానే ఎవరికైనా జాలి కలుగుతుంది. ఎవరికి తోచినంత వారు ఎంతో కొంత దానం చేస్తుంటారు. కటిక పేదరికంలో ఉన్నవారే అలా మారతారు. తమ పొట్ట నింపు కోవడం కోసం బిచ్చ మెత్తుకుంటూ బ్రతుకుతుంటారని అందరికి తెలుసు. అయితే అలా వచ్చిన డబ్బుతో కోటీశ్వరుడు అయినవారు ఉన్నారంటే ఆశ్చర్య పోతారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు ఇండియాలోనే ఉన్నాడు.
ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం ముంబైలో జీవిస్తున్న భరత్ జైన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు. భరత్ జైన్ ముంబైలో నివసిస్తాడు. అతనికి రూ. 1.4 కోట్ల ఖరీదు అయిన రెండు ఫ్లాట్లు ఉన్నాయి. తన డబ్బును షాపుల్లో పెట్టుబడిగా పెట్టాడు. థానేలో 2 షాపులను కొనుగోలు చేశాడు. వీటి ద్వారా అతనికి నెలకు 30వేల రూపాయల రెంట్ వస్తుంది. ఇక భారత్ జైన్ ఆస్తి విలువ 7.5 కోట్ల డాలర్లు. తాజాగా లెక్కల ప్రకారం భరత్ జైన్ నెలవారీ ఆదాయం సుమారు లక్ష రూపాయలు.
2014 సంవత్సరం నాటికి భరత్ జైన్ భిక్షాటన ద్వారా ప్రతిరోజూ రూ. 2000 – 2500, నెలకు 75వేలు సంపాదించేవాడట. ఆర్థిక ఇబ్బందుల వల్ల భరత్ జైన్ చదువును కొనసాగించలేకపోయాడు. అతనికి పెళ్ళై, ఇద్దరు కొడుకులు ఉన్నారు. తన పిల్లలను కాన్వెంట్ స్కూల్ లో చదివిస్తున్నాడు. భరత్ జైన్, అతని ఫ్యామిలీ పరేల్లో 1 BHK డ్యూప్లెక్స్ ఇంటిలో నివసిస్తున్నారు. తన ఫ్యామిలీలో మిగతావారు స్టేషనరీ షాప్ ను నిర్వహిస్తున్నారు. ఇంట్లోవారు భిక్షాటన వదులుకోమని ఎంత చెప్పినా, భరత్ జైన్ వినకుండా అదే పనిని చేస్తున్నాడు.
టమాట ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారాయి. ప్రస్తుతం కిలో టమాట ధర 100 రూపాయలకు పైన ఉంది. దీంతో సామాన్యులు అంత రేటు పెట్టి టమాటా కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని రోజుల క్రితం కిలో టమాటా 20 – 40 రూపాయల వరకు ఉన్నాయి. హఠాత్తుగా ధరలు పెరిగిపోవడంతో ఆందోళన పడుతున్నారు. మరో వైపు టమాటా ధరలు పెరగడంతో వాటిని దొంగతనం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం టమాటాకు డిమాండ్ ఉండడంతో దొంగలు దానిని క్యాష్ చేసుకుంటున్నారు. వీలైతే కూరగాయల షాపుల్లో, టమోటా పంటలను లూటీ చేస్తున్నారు.
కర్నాటకలకు చెందిన ధరణి అనే రైతు టమోటా పంట వేశాడు. ఈసారి ఎప్పటికంటే పంట బాగా పండింది. వారంలో మార్కెట్కు తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ ఆలోపు దొంగలు పంటనంతా దోచుకెళ్లారు. దాని విలువ రూ. 1.50 లక్షలు. ఇంతలా టమాటా ధరలు పెరగడానికి కారణాలు ఏంటంటే, ఉష్ణోగ్రతలలు పెరగడం, రుతుపవనాలు ఆలస్యం కావడంతో టమాటా దిగుబడులు తగ్గాయి. దాంతో టమాట ధరలు పెరిగాయని నిపుణులు అంటున్నారు.
దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల టమాటా పంటలు కూడా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో పెరిగిన వేడి వల్ల పంట దిగుబడి తగ్గింది. అందువల్ల టమాటాల సరఫరా తగ్గిపోయింది. నష్టాల వల్ల కొందరు రైతులు టమాటా సాగును తగ్గించారు. ఉత్తర ప్రదేశ్, హర్యాణారాష్ట్రాల నుంచి వచ్చే టమాటా సరఫరా చాలా తగ్గిపోయింది. అందువల్ల హోల్సేల్ మార్కెట్లలో టమాటా రేట్లు పెరిగాయని చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని బరేలీకి చెందిన జ్యోతి మౌర్యకు సంబంధించిన రకరకాల పోస్ట్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పిసిఎస్ అధికారి అయిన జ్యోతి మౌర్య ఉద్యోగం వచ్చిన తర్వాత తన భార్య నమ్మకద్రోహం చేసిందని ఆమె భర్త అలోక్ మౌర్య చేశారు. అంతేకాకుండా తన భార్య వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని ఆరోపించాడు. ఆమె పిసిఎస్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న సమయంలో తన సహాయాన్ని ఉపయోగించుకుందని అలోక్ ఆరోపించారు.
తాజాగా అలోక్ మౌర్య, జ్యోతి మౌర్యల పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఆ కార్డులో అలోక్ పారిశుధ్య కార్మికుడు అని కాకుండా గ్రామ పంచాయతీ అధికారి అని ఉంది. వైరల్ వెడ్డింగ్ కార్డ్ గురించి చెప్పడానికి జ్యోతి మౌర్య తండ్రి పరాస్ నాథ్ మౌర్య ముందుకు వచ్చారు. పెళ్లి సమయంలో అలోక్ పారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన విషయాన్ని చెప్పలేదని జ్యోతి తండ్రి అన్నారు. దానికి బదులుగా అలోక్ గ్రామ పంచాయతీ అధికారినని చెప్పాడని అన్నారు.
అలోక్ మౌర్య ఇప్పుడు తాను పారిశుద్ధ్య కార్మికుడిని అని అరుస్తున్నాడని, కానీ పెళ్లికి ముందు, అలోక్ మరియు అతని కుటుంబం అబద్ధాలు చెప్పారని ఆయన వెల్లడించారు. తప్పుడు సమాచారం వల్లనే పెళ్లి జరిగిందనీ, అలాంటి పెళ్లి వల్ల ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అని అన్నారు. జ్యోతి మౌర్య తండ్రి ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలోని చిరాయిగావ్లో నివసిస్తున్నారు.








హెగ్గనహళ్లికి చెందిన పవిత్ర అనే మహిళా తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది. ఆమె ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేసేది. ఈక్రమంలో పవిత్ర ఆ కంపెనీ ఓనర్ చేతన్గౌడను ప్రేమించింది. ఆ తరువాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన కొన్నాళ్ళ వరకు సజావుగా సాగింది. ఇటీవల చేతన్గౌడకు మరో మహిళతో సంబంధం ఏర్పడింది. దాంతో పవిత్ర, చేతన్గౌడ ల మధ్య గొడవలు జరిగేవి. పవిత్ర పిల్లలు కావాలని అనుకోగా, ఆమె భర్త అందుకు నిరాకరించాడు.
అప్పటి నుండి భార్యాభర్తల ఇద్దరి మధ్య గొడవలు మరింతగా పెరిగాయి. తాను ఉండగా మరో యువతితో వివాహేతర సంబంధం ఎందుకు పెట్టుకున్నావని పవిత్ర చేతన్గౌడను నిలదీసింది. తాను మగాడినని, ఏదైనా చేస్తానని, పవిత్ర తల్లి ముందే పవిత్ర పై దాడి చేశాడు. తీవ్ర మనోవేదన పడ్డ పవిత్ర, తాను భర్తతో గొడవపడిన వీడియోను, తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు రాసిన డెత్నోట్ను వాట్సాప్ స్టేటస్లో పెట్టింది.
ఆ స్టేటస్ చూసిన పవిత్ర తల్లి చూసి, వెంటనే కూతురి ఇంటికి వచ్చింది. అయితే పవిత్ర అప్పటికే ఉరి వేసుకుని, మరణించింది. దాంతో పవిత్ర తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు చేతన్గౌడ, అతని ప్రేయసి పై కేసు రిజిస్టర్ చేసి, దర్యాప్తు చేపట్టారు.