తాజాగా ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదం యావత్ దేశాన్ని ఒక్కసారిగా షాక్కు గురిచేసింది. బెంగళూరు- హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, షాలిమార్- చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలు.. బాలాసోర్లోని బహనాగా బజార్ స్టేషన్కు సమీపంలో ప్రమాదానికి గురయ్యాయి. సుమారు 290 మంది మరణించగా.. 1200 మందికి పైగా గాయపడ్డారు.
ఈ స్థాయిలో ప్రమాదం జరగడం.. ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. దేశ చరిత్రలో అతి భయానక రైలు ప్రమాదాల్లో ఒకటిగా ఈ ఘటన నిలిచిపోతుంది. అయితే ఈ ప్రమాదంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దినసరి కూలీల నుంచి ఎందరో పొట్ట చేతబట్టుకొని వచ్చిన వారు ఈ ప్రమాదంలో బలయ్యారు. కోరమాండల్ రైలు ప్రమాదంలో సాంకేతిక వైఫల్యాల కంటే మానవ తప్పిదమే ఉందని తెలుస్తోంది.

అయితే ఈ ప్రమాదం జరిగిన కోరమాండల్ ట్రైన్ లో ఎక్కబోయి చివరినిమిషాల్లో ప్రయాణం మానుకున్నారు లక్ష్మీ దాస్ సర్కార్. హౌరాలో నివసిస్తున్న లక్ష్మీ దాస్ జూన్ 2న వురమండల్ ఎక్స్ ప్రెస్ ఎక్కి తన కుమార్తెను కలవడానికి ఆమె చెన్నైకి వెళ్ళాలి అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో తన కుమార్తె యొక్క ఆఫీస్ కమిట్మెంట్ కారణంగా ఆమె తన ప్రయాణాన్ని రద్దు చేసుకోవలసి వచ్చింది. అదే ఆమెకు వరంగా మారింది.

ఆమె జూన్ 2 ప్రమాదం తర్వాత మొదటి రన్లో కోరమాండల్ ఎక్స్ప్రెస్లో ఎక్కింది. అప్పుడు ఆమె ఒక న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ.. “దేవుడి దయవల్ల ఆ రోజు నా ప్రయాణం క్యాన్సిల్ అయ్యింది. నా కుమార్తె రావద్దు అనడంతో నేను ఆగిపోయాను. ఇదంతా కృష్ణుడి దయవల్ల జరిగింది. ఇప్పుడు కూడా నేను నాతో కృష్ణుడిని తీసుకువెళ్తున్నాను. ఇక నాకు ఏ ప్రమాదం ఉండదు..” అని ఆమె అన్నారు.

మరోవైపు ఈ ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. “”పాయింట్ మెషిన్, ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్లో లోపాల కారణంగా ప్రమాదం జరిగింది. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సమయంలో జరిగిన మార్పులు ప్రమాదానికి కారణమయ్యాయి. ఇది ఎలా జరిగింది? ఎవరు చేశారు? అన్నది దర్యాప్తులో తెలుస్తుంది” అని పేర్కొన్నారు రైల్వేశాఖ మంత్రి.
Also read: కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఘటనలో నష్టపోయిన ఈ వ్యక్తి కథ వింటే కన్నీళ్లు ఆగవు..!!
























సాఫీగా సాగిపోతున్న రైలు ప్రయాణంలో తమ రైలు పట్టాలు తప్పిందని ప్రయాణికులు తెలుసుకునేలోగా ట్రైన్స్ ఢీ కొని కొందరిని మృత్యువు కబళించింది. కొందరు స్పాట్లోనే, మరికొందరు బోగీల్లో ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచారు. ప్రమదస్థలం భయనకంగా మారింది. కోచ్లు 30 వరకు నుజ్జునుజ్జయ్యాయి. యాక్సిడెంట్ జరిగిన విధానానికి మృతదేహాలు చెల్లాచెదురు అయిపోయాయి. బోగీల్లో చిక్కుకున్న బాధితుల హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లి పోయింది. అయితే ఈ ఇంత ఘోర ప్రమాదం జరగడానికి గల కారణం బయటకు వచ్చింది.
కానీ సిగ్నల్ ప్యానెల్ లో ఆ ట్రైన్ మెయిన్ లైన్ లోనే వెళ్తున్నట్టు చూపించింది. దాంతో మెయిన్ లైన్ వెళ్తుందనుకుని లూప్ లైన్లో వెళ్లి ఆ ట్రాక్ మీద ఉన్న గూడ్స్ ట్రైన్ ని ఢీకొట్టింది. దాంతో కోరమాండల్ భోగీలు కొన్ని గూడ్స్ భోగీల మీద ఎక్కాయి. కోరమాండల్ భోగీలు కొన్ని పక్కనే ఉన్న వేరే ట్రాక్ పై పడ్డాయి. కాసేపటికి పక్క ట్రాక్ పైకి వచ్చిన యశ్వంత్ పూర్ ట్రైన్ ట్రాక్ పై పడిన కోరమాండల్ భోగీలను ఢీకొట్టింది.|
ప్రస్తుతం ఓటీటీలకు ఉన్న క్రేజ్ ఏమిటో అందరికి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ లను చూస్తున్నారు. ఓటీటీలు ప్రతివారం కొత్త చిత్రాలు, సిరీస్ లు విడుదల చేస్తూ వాటి స్పేస్ ను పెంచుకుంటున్నాయి. అయితే ఓటీటీలో ఇప్పటివరకు ధూమపానం మరియు మద్యపానం గురించిన చట్టం ఏది లేదు. దాంతో ఓటీటీలో వచ్చే కంటెంట్ లో విచ్చల విడిగా సిగరెట్ మరియు మద్యం తాగే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ప్రసారం అయ్యే కంటెంట్ లో ఇక పై ధూమపానంకు సంబంధించిన దృశ్యాలు వచ్చినపుడు స్కిన్ క్రింది భాగంలో కనిపించేలా ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిపే హెచ్చరికను ప్రదర్శించాలని ఆదేశించింది. ఈ రూల్ ను అమలు చేయనట్లయితే కేంద్ర ఆరోగ్య, ప్రసార, సమాచార, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖలు ఆ ఓటీటీలకు నోటీసులు జారీ చేయడం జరుగుతుంది.
వివరణ ఇచ్చేందుకు, అలాగే మార్పులు చేయడానికి తగిన టైంను ఇస్తాయి. ఇక ఈ నిబంధనలు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఆడియో-విజువల్ ప్రోగ్రాములు, సీరియల్స్, టెలివిజన్ ప్రోగ్రాములు, వెబ్ సిరీస్, పాడ్కాస్ట్లు వంటి ఇతర కంటెంట్కు కూడా వర్తిస్తాయి.
