ఇందిరా గాంధీ భారతదేశపు తొలి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఇందిరా గాంధీ 1966 -1977 వరకు వరుసగా మూడు సార్లు, 1980లో నాలుగవ సారి ప్రధానమంత్రిగా దేశానికి సేవలందించారు. భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ.
ఇందిరా గాంధీ భర్త ఫిరోజ్ గాంధీ పూర్వీకులు పర్షియా నుండి ఇండియాకి వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. వారు పార్సీలు. ఫిరోజ్ గాంధీ మరణించిన తరువాత, హిందూ ఆచారాల ప్రకారం అంత్యక్రియలు జరిపించారు. పార్సీ ఆచారాల ప్రకారం చేయకుండా హిందూ ఆచారాల ప్రకారం ఎందుకు చేశారో ఇప్పుడు చూద్దాం..
బీబీసి న్యూస్ తెలుగు కథనం ప్రకారం, ఫిరోజ్ గాంధీ 48 వ పుట్టినరోజుకు 4 రోజుల ముందే గుండెపోటుతో సెప్టెంబరు 8న వెల్లింగ్టన్ హాస్పిటల్ లో కన్నుమూశారు. ఫిరోజ్ గాంధీ భౌతిక కాయాన్ని హాస్పిటల్ నుండి తీన్ మూర్తి భవన్కు తీసుకువచ్చారని కేథరీన్ ఫ్రాంక్ ‘ఇందిర’ పుస్తకంలో వివరించారు. ఫిరోజ్ గాంధీ భౌతికకాయానికి ఇందిరా గాంధీ స్వయంగా స్నానం చేయిస్తానని, అంత్యక్రియలకు సిద్ధం చేస్తానని, ఆ టైమ్ లో ఎవరూ అక్కడ ఉండకూడదని, కోరారు.
ఫిరోజ్ గాంధీ భౌతికకాయాన్ని సెప్టెంబర్ 9 ఉదయం అంత్యక్రియల నిర్వహించడానికి నిగంబోధ్ ఘాట్కు తరలించారు. అయితే ఫిరోజ్ గాంధీకి తొలిసారి గుండెపోటు వచ్చిన సమయంలో, “నా అంత్యక్రియలు హిందూ ఆచారం ప్రకారం జరగాలని కోరుకుంటున్నా” అని తన మిత్రులతో చెప్పారు. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం జరిగినా, ఫిరోజ్ గాంధీ భౌతిక కాయాన్ని దహనం చేయడానికి ముందు కొన్ని పార్శీ సంప్రదాయాలను ఇందిర పాటించారు. రాజీవ్ గాంధీ తండ్రి చితికి నిప్పంటించారు.
ఫిరోజ్ గాంధీ అంత్యక్రియల్లో హిందూ ఆచారం ప్రకారం వితంతువులు ధరించినట్లే ఇందిర గాంధీ కూడా తెల్ల చీరను ధరించారు. కానీ, ఫిరోజ్ గాంధీ మరణించిన తరువాత చాలా సంవత్సరాల వరకూ ఇందిరాగాంధీ తెల్లని వస్త్రాలే ధరించేవారు. అయితే తాను వితంతువు అనే కారణంతో తెల్లని వస్త్రాలు ధరించడం లేదని, “ఫిరోజ్ గాంధీ వెళ్లిపోయినప్పుడే, నా లైఫ్ లోని రంగులన్నీ నన్ను విడిచి వెళ్లిపోయాయి” అని అన్నారు.
“తనను తీవ్రంగా కుదిపేసింది ఫిరోజ్ మరణం. మా తాత, తల్లి, తండ్రి నా కళ్ల ముందే కన్నుమూయడం చూశాను. కానీ, ఫిరోజ్ గాంధీ మరణించడం నన్ను ఘోరంగా కుదిపేసింది” అని ఇందిరా గాంధీ డామ్ మోరెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. “నేను ఫిరోజ్ను ఇష్టపడేదాన్ని కాదు. కానీ, ఫిరోజ్ ని ప్రేమించేదాన్ని” అని ఇందిర గాంధీ మరోక చోట రాశారు.








బాబూరావు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఒక చిన్న గ్రామంలో పేద కుటుంబంలో జన్మించారు. పాఠశాల చదువు పూర్తి అయిన తరువాత ఏదైనా సాధించాలని హైదరాబాద్కు వచ్చారు. అయితే నగరానికి వచ్చిన తొలి రోజుల్లో ఎంతో కష్టపడాల్సి వచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్పై కూడా పడుకున్నాడు. మొదట్లో బట్టల షాప్ లో పనిచేశారు. కొన్ని చిన్న ఉద్యోగాలను చేశాడు. హోటల్ లో పనిచేస్తే కనీసం తినడానికి ఆహారం లభిస్తుందనే ఉద్దేశ్యంతో కేఫ్లో పని చేయాలని నిర్ణయించుకున్నాడు.
అలా కేఫ్లో క్లీనర్గా పనిచేయం ప్రారంభించిన బాబూరావు వెయిటర్గా ప్రమోషన్ పొందాడు. ఆ తరువాత బిస్కెట్లు, టీ తయారు చేశాడు. అలా ఒక్కోమెట్టు ఎక్కుతూ 1978 నాటికి బాబురావు కేఫ్ను నడిపే స్థితి వచ్చాడు. కేఫ్ నడిపే కాంట్రాక్ట్ పై సంతకం చేశారు. మొదట్లో లాభాలు వచ్చినప్పటికీ, బాబూరావు కేఫ్ యాజమాన్యానికి ప్రతి నెలా నిర్ణీత మొత్తం చెల్లించాల్సి వచ్చేది. కష్టపడుతూ 1993 సంవత్సరం నాటికి కేఫ్ను సొంతం చేసుకోవడానికి అవసరం అయిన డబ్బును సంపాదించాడు. అప్పటి నుండి బాబూరావు ఓనర్ గా మారి, కేఫ్ ను సక్సెస్ ఫుల్ గా నడుపుతున్నాడు. మూడు అవుట్లెట్ల యజమానిగా మారిన బాబూ రావు తన మూలాలను మర్చిపోలేదు.
ఈ కేఫ్ ద్వారా పేదవారికి సాయం చేస్తూ ఉంటారు. ప్రతి రోజూ షాపులో మిగిలిన బిస్కెట్లను, బ్రెడ్లను పేద వారికి పంచుతుంటారు. ఆయన తండ్రి కోరిక మేరకు 25 ఏళ్ల నుంచి ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నిలోఫర్ హాస్పిటల్ మరియు ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి చుట్టూ ఉన్న పేషంట్లకు, పేదవారికి ఆహారం అందిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు ఐదు వందల మందికి అల్పాహారం, మూడు వందల మందికి భోజనం అందిస్తున్నారు.























