ప్రస్తుతం రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలంటే రాజకీయ వారసత్వం ఉండాలి. లేదంటే కుప్పల తెప్పలుగా డబ్బు ఉండాలి. ఇంకా వేరే దారి ఏదైనా ఉందంటే దానికి మించి పలుకుబడి ఉండాలి. ఇవేమీ లేకుండా ఎమ్మెల్యే అవ్వడం ఈ రోజుల్లో చాలా కష్టం. ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్న దగ్గర నుండి ఎన్నికలు అయ్యేంతవరకు విపరీతంగా ఖర్చు చేయాలి.
అడిగిన వాడికి అడిగినంత ఇవ్వాలి, ఓట్లకు డబ్బు పంచాలి ప్రచారానికి డబ్బు ఖర్చు పెట్టాలి, కూడా తిరిగేవారికి డబ్బు ఇవ్వాలి, ఇలా రాజకీయాల్లో ఉండే ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంటుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు అనూహ్యంగా తొలిసారి అవకాశం దక్కించుకుని విజయాన్నీ సాధించారు. వీరిలో కొందరు రాజకీయాల్లో ఉద్దండులనూ మట్టికరిపించి సంచలనం సృష్టించారు. ఇక ఈ ఎన్నికల్లో సామాన్యులు కూడా సత్తా చాటారు. ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకున్నా.. ప్రజల ఆశీర్వాదంతో అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు
అయితే రాజకీయాల్లో సామాన్యులు రాణించడం కష్టమనే అభిప్రాయం నిజం కాదని నిరూపించాడు ఆదివాసీ గోండు బిడ్డ వెడ్మ బొజ్జు. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇంట్లోనే నివాసముంటున్న బొజ్జు నేడు ఆ పార్టీ ఇచ్చిన టికెట్పై పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వెడ్మా బొజ్జు పటేల్ అనూహ్యంగా గెలుపొందారు. భాజపా నుంచి మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, బీఆర్ఎస్ నుంచి ఎన్నారై, కేటీఆర్ ఫ్రెండ్ భూక్యా జాన్సన్లతో పోటీపడినా ఓటర్లు మాత్రం బొజ్జుకే పట్టంకట్టారు. ఆదివాసీ గోండు బిడ్డ అయిన వెడ్మ బొజ్జుది సామాన్య నేపథ్యం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలం కల్లూర్గూడకు చెందిన నిరుపేద ఆదివాసీ దంపతులు వెడ్మ భీంరావు, గిరిజాబాయిల కుమారుడు వెడ్మబొజ్జు పటేల్. ఆయన ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇంట్లో నివాసముంటున్నారు.

పీజీ వరకు చదివిన బొజ్జు తొలుత ఆదివాసీ విద్యార్థి సంఘంలో,తర్వాత ఆదివాసీ హక్కుల పోరాట సమితిలో సలహాదారుడిగా, అనంతరం కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేశారు. రెండేళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి అధిష్టానం ఆశీస్సులతో టిక్కెట్ దక్కించుకున్నారు.తనకు రూ.8.42 లక్షలు అప్పులున్నాయని, ఉమ్మడి ఏపీలో ఇందిరమ్మ పథకం కింద వచ్చిన ఇంట్లోనే నివాసం ఉంటున్నట్లు నామినేషన్ లో పేర్కొన్నారు. బొజ్జు చదువుకునే సమయంలో పేపర్ బాయ్గాను పని చేశారు.ఖానాపూర్ నియోజకవర్గం ఏర్పడ్డాక గోండు సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి కోట్నాక్ భీంరావు ఒక్కరే ఇక్కడ విజయం సాధించారు. మూడు దశాబ్దాల తర్వాత ఆ ఘనత సాధించిన రెండో వ్యక్తిగా బొజ్జు రికార్డు సృష్టించారు.
మూడు దశాబ్దాల తర్వాత ఆ ఘనత సాధించిన రెండో వ్యక్తి..హ్యాట్సాఫ్.! 🙏🙏

స్మితా సబర్వాల్ 1977 లో పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో బెంగాలీ ఫ్యామిలిలో ఆర్మీ అధికారి కల్నల్ ప్రణబ్ దాస్, పురబీ దాస్లకు జూన్ 19న జన్మించారు. ఆమె సికింద్రాబాద్లోని సెయింట్ ఆన్స్ హైస్కూల్లో చదువుకున్నారు. ఐసీఎస్ఈ పరీక్షలో స్మితా సబర్వాల్ ఆల్ ఇండియా టాపర్ గా నిలిచారు. హైదరాబాద్లోని సెయింట్ ఫ్రాన్సిస్ ఫర్ ఉమెన్ కాలేజ్ నుండి కామర్స్లో పట్టా తీసుకున్నారు. 2000లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్ష రాసిన ఆమె, ఆల్ ఇండియా స్థాయిలో 4వ ర్యాంక్ సాధించింది. అప్పుడు ఆమె వయసు 22 ఏళ్ళు.
2001లో ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో స్మితా సబర్వాల్ అడ్మినిస్ట్రేటివ్ శిక్షణ పూర్తి చేసింది. తన ప్రొబేషన్ టైమ్ లో ఆదిలాబాద్ జిల్లాలో ట్రైనింగ్ పొందారు. ఆ తరువాత చిత్తూరులోని మదనపల్లి సబ్ కలెక్టర్గా ఆమె మొదటిసారి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత కడప డిఆర్డిఎ ప్రాజెక్టు డైరెక్టర్గా గ్రామీణాభివృద్ధి విభాగంలో పనిచేశారు. ఆ తరువాత వరంగల్ మునిసిపల్ కమీషనర్గా పనిచేశారు. ఆమె “ఫండ్ యువర్ సిటీ” అనే పథకాన్ని ప్రవేశపెట్టింది.
ట్రాఫిక్ జంక్షన్లు, ఫుట్ ఓవర్బ్రిడ్జ్లు, బస్-స్టాప్లు, పార్కులు వంటి పెద్ద సంఖ్యలో పబ్లిక్ యుటిలిటీలను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో (PPP) క్రియేట్ చేశారు. ఆ తర్వాత విశాఖపట్నంలో వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు. 2011 ఏప్రిల్ లో, సబర్వాల్ కరీంనగర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అక్కడ ఆమె ఆరోగ్యం మరియు విద్యా రంగంలో చాలా కృషి చేశారు. ప్రజాప్రతినిధుల సహకారంతో కరీంనగర్ సిటీలో విశాలమైన రోడ్లు, ట్రాఫిక్ జంక్షన్లు, బస్టాప్లు, మరుగుదొడ్లు మరియు ఇతర ప్రజా ప్రయోజనాల రూపంలో కొత్త రూపురేఖలను సంతరించుకునేలా చేశారు.
2012–2013లో ప్రధానమంత్రి 20 పాయింట్ల కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఉత్తమ జిల్లాగా అవార్డు పొందింది. 2014 సార్వత్రిక ఎన్నికల టైమ్ లో ఆమె మెదక్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఆమె కలెక్టర్ గా కరీంనగర్ మరియు మెదక్ జిల్లాలను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపింది. ఇది ఇలా ఉంటే, తాజాగా ఆమె పై మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి సంచలన కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వంలో చేసే తప్పులు చేసి, ఇప్పుడు కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళడం ఫ్యాషన్ అయ్యిందని, ఆమెని వెళ్ళకుండా చూడాలని ‘దేశం మొత్తంలో హెలికాప్టర్లో వెళ్లి పనులను పర్యవేక్షించే ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ ఈమెగారు మాత్రమే’ అంటూ పోస్ట్ లో రాసుకొచ్చారు.
వచ్చే అసెంబ్లీ ఎలెక్షన్స్ లో 175 నియోజకవర్గాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు వేస్తున్న వైసీపీ, తాజగా 11 నియోజకవర్గాల్లో ఇన్చార్జులను మార్చింది. కొండెపి- ఆదిమూలపు సురేష్, మంగళగిరి- గంజి చిరంజీవి, ప్రత్తిపాడు- బాలసాని కిరణ్ కుమార్, వేమూరు- వరికూటి అశోక్ బాబు,సంతనూతలపాడు- మేరుగ నాగార్జున, తాడికొండ- మేకతోటి సుచరిత, చిలకలూరిపేట- మల్లెల రాజేశ్ నాయుడు, అద్దంకి- పాణెం హనిమిరెడ్డి, గుంటూరు పశ్చిమ- విడదల రజినీ, గాజువాక- వరికూటి రామచంద్రరావు, రేపల్లె- ఈవూరు గణేష్ లను ఇన్చార్జులగా నియమించారు.
యర్రగొండపాలెం నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆదిమూలపు సురేష్ను తాజాగా కొండెపికి ఇన్చార్జిగా మార్చడం చర్చకు దారి తీసింది. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకుడు డోలా బాలవీరాంజనేయస్వామి స్థానం ఇది. 2014 మరియు 2019 ఎలెక్షన్స్ లో ఇక్కడి నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. అందువల్ల వచ్చే ఎన్నికలలో కూడా ఆయనే పోటీ చేసే అవకాశం ఉండవచ్చు.
కొండెపికి ఇన్చార్జిగా మార్చడం పై తాజాగా ఆదిమూలపు సురేష్ మాట్లాడారు. నియోజకవర్గ మార్పు విషయంలో పార్టీ నిర్ణయమే పాటిస్తానని, అధిష్టానం ఆదేశాల మేరకు పని చేస్తానని వెల్లడించారు. పార్టీ నిర్ణయాన్ని శిరసావహిస్తానని, సైనికుడిలా పార్టీ విజయం కోసం పనిచేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ తమకు కెప్టెన్ అని అన్నారు. కొండెపి నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని వెల్లడించారు.
బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కీలక బాధ్యతలలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్, ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రత్యేక కార్యదర్శిగా చేశారు. ఆ బాధ్యతతో పాటు నీటిపారుదల శాఖ విధులు కూడా చూసుకున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంకు సంబంధించిన పనులు మరియు మిషన్ భగీరథకు సంబంధించిన పనులను పర్యవేక్షించారు. ఆమె ఎప్పటికప్పుడు ఆఫీసర్లతో సమీక్షలు నిర్వహిస్తూ, ప్రాజెక్ట్ లను సందర్శించి, నిర్మాణ పనులను పరిశీలిస్తూ ముఖ్యమైన పాత్రను పోషించారు. రాష్ట్రంలో డైనమిక్ ఆఫీసర్ గా స్మితా సబర్వాల్కు పేరుగాంచారు.
కాంగ్రెస్ ప్రభత్వం వచ్చినప్పటి నుండి స్మితా సబర్వాల్ ఎక్కడా కనిపించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నుంచి పలువురు ఐఏఎస్ ఆఫీసర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఆయా శాఖల మినిస్టర్లను కలుస్తున్నారు. కానీ సీఎంఓకు ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్ అయితే కనిపించట్లేదు. నీటి పారుదల శాఖ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టుల పై మొదటిసారిగా నిర్వహించిన సమీక్షకు సైతం స్మితా సబర్వాల్ హాజరవ్వకపోటం హాట్ టాపిక్ గా మారింది.





తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కీలక ఆఫీసర్ల మార్పులు జరుగుతున్నాయి. పలువురు ఆఫీసర్లను ఇప్పటికే బదిలీ చేస్తూ, ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. ఈ క్రమంలో సీఎంపేషీలో కొత్త ఆఫీసర్లు వచ్చేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డికి ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి వస్తున్నట్లు తెలుస్తోంది.
ఆమ్రపాలి కాట 1982లో ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్నంలో వెంకట్ రెడ్డి కాటా, పద్మావతి దంపతులకు నవంబరు 4న జన్మించారు. ఆమెకు ఒక తోబుట్టువు ఉన్నారు. విశాఖపట్నంలో సాయి సత్య మందిర్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత ఆమె జేఈఈ లో ఉత్తీర్ణత సాధించి, చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి ఎంబీఏ పూర్తి చేసింది. ఆమ్రపాలి 2010 లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో 39 వ ర్యాంక్ సాధించి, ఐఏఎస్ అధికారిణి అయింది. ఐఏఎస్ కు ఎంపికయిన అతి తక్కువ వయస్కులలో ఒకరిగా ఆమ్రపాలి నిలిచారు.
2013లో వికారాబాద్ సబ్ కలెక్టర్గా నియమితులైన ఆమె, 2014లో మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. మరుసటి ఏడాది తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లాకు జాయింట్ కలెక్టర్గా పనిచేసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2016లో ఆమ్రపాలి వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన తొలి మహిళ ఐఏఎస్ ఆఫీసర్. “యంగ్ డైనమిక్ ఆఫీసర్” గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఢిల్లీలో పీఎం కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న ఆమ్రపాలి తెలంగాణలో సీఎంఓలోకి రావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

