మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కొన్ని సినిమాలలో హీరోగా నటిస్తూ ఉంటే మరికొన్ని సినిమాలు నిర్మిస్తున్నారు రామ్ చరణ్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా ఆ తర్వాత ఇటీవల విడుదల అయిన గాడ్ ఫాదర్ సినిమా నిర్మాణ పనుల్లో కూడా రామ్ చరణ్ ఒక కీలక పాత్ర పోషించారు.
అలాగే ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు జరుగుతోంది. రామ్ చరణ్, కియారా అద్వానీ కలిసి అంతకుముందు వినయ విధేయ రామ సినిమాలో నటించారు.
ఈ సినిమాలో ఎంతో మంది ప్రముఖ నటీనటులు ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి మరొక విషయం కూడా బయటికి వచ్చింది. ఈ సినిమా పాన్-ఇండియన్ సినిమాగా రూపొందుతోంది. ఇందులో అంజలి కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్, అంజలి కలిసి ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అందులో వారిద్దరితో పాటు ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. రామ్ చరణ్, అంజలి గెటప్ కూడా పాత కాలానికి తగినట్లు ఉంది. దాంతో చాలామంది రామ్ చరణ్ డబుల్ యాక్షన్ అని, బహుశా ఈ రామ్ చరణ్ తండ్రి పాత్ర పోషిస్తున్నారు ఏమో అని అంటున్నారు.
అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు బయటికి వచ్చిన విషయాల ప్రకారం సినిమా అవినీతికి హీరో ఎలా ఎదురు నిలుస్తాడు అనే అంశం మీద నడుస్తోంది అని అన్నారు. దాంతో చాలామంది ఈ సినిమా భారతీయుడు కానీ, జెంటిల్మన్ కానీ రీమేక్ చేస్తున్నారు ఏమో అని అంటున్నారు. ఈ రెండు సినిమాలకు శంకర్ దర్శకత్వం వహించారు. ఒకవేళ ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్క సినిమాకి ఈ సినిమా దగ్గరగా ఉన్నా కూడా ఫలితం అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. కానీ కొంతమంది మాత్రం పాన్-ఇండియన్ సినిమాగా రూపొందుతోంది కాబట్టి కొత్త కథ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు.