Ads
దూర ప్రయాణాలలో ఎక్కువ కంఫర్ట్ తో ప్రయాణించాలి అని అనుకునే వారు ఎక్కువ గా రైలు ప్రయాణాలనే ఎంచుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. మీక్కూడా రైలు ప్రయాణం అంటే ఇష్టమేనా మరి..? రైల్లో మనం ప్రయాణించే సమయం లో మనకు చాలా సార్లు అనుభవం అయ్యే విషయం ఏమిటంటే.. స్టేషన్ కు కొద్దీ దూరం లోనే ట్రైన్ ను కొంత సేపు వరకు ఆపి ఉంచేస్తూ ఉంటారు.
Video Advertisement
స్టేషన్ లో ఏదైనా ప్లాట్ ఫామ్ లో రైలు అక్కడి వారిని ఎక్కించుకుని వెళ్లిపోయేదాకా.. ఈ ట్రైన్ ను ఆపేస్తారు. ఇలా ఎందుకు చేస్తారో మనందరికీ తెలుసు. ఒకే పట్టాలమీద ప్రయాణించాల్సి వచ్చిన రైళ్లు ఒకదానికొకటి గుద్దుకోకుండా ఉండడం కోసం ఈ జాగ్రత్తలు తీసుకుంటారు. ఐతే.. రైల్వే రూల్స్ ప్రకారం ఒక ట్రైన్ స్టేషన్ నుండి బయలుదేరాలంటే.. ముందున్న ట్రైన్ ఎంత దూరం వెళ్లాలో తెలుసా..? కనీసం ఇరవై కిలోమీటర్ల దూరం.
ముందు ఉన్న ట్రైన్ కనీసం ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్లే వరకు ఈ ట్రైన్ ను ఇక్కడే ఉంచేస్తారు. ఈ విషయం ఎలా తెలుస్తుందో ఇప్పుడు చూద్దాం. రైలు పట్టాల మార్గం లో ప్రతి ఐదు కిలోమీటర్లకు ఓ లొకేషన్ బాక్స్ ఉంటుంది. ఇవి వచ్చే పోయే రైళ్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైల్వే అధికారులకు సమాచారం అందచేస్తూ ఉంటాయి. వీటి ద్వారా ఓ ట్రైన్ ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్ళగానే ఆ సమాచారం రైల్వే అధికారుల ద్వారా స్టేషన్ లో ఉన్న ట్రైన్ డ్రైవర్ కు సమాచారం అందుతుంది.
Read More: రైలు పట్టాల పక్కన ఈ అల్యూమినియం బాక్స్ ని గమనించారా?
ఈ సమాచారం అందిన వెంటనే సదరు డ్రైవర్ ట్రైన్ ను బయలుదేరదీస్తాడు. అలాగే.. ప్లాట్ ఫామ్ పైకి వచ్చే రైళ్లు స్టాండ్ బై లైన్ పట్టాలపై వస్తాయట. స్టేషన్ ను తిరిగి బయలుదేరాక ఓ పది కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయాక మెయిన్ లైన్ పట్టాలవైపు కు ట్రైన్ ను మార్చేసి ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇలా ట్రైన్ ని బట్టి అంటే పాసెంజర్ ట్రైన్ కు ఒక రూల్, ఎక్స్ప్రెస్ ట్రైన్ కి ఒక రూల్, గూడ్స్ రైలు ఒక రూల్ ఉంటాయి.
ఇలాంటి రూల్స్ సవాలక్ష ఉంటాయి. వీటన్నిటిని రైల్వే ఉద్యోగులకు నేర్పించడం కోసం కెరీర్ ప్రారంభం లో కనీసం రెండేళ్లు ట్రైనింగ్ ఇస్తారట. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం ఇండియన్ రైల్వే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది.
End of Article