మనం ఎక్కువగా ట్రైన్స్ లో, మెట్రోలలో ప్రయాణం చేస్తూనే ఉంటాం. ఆఫీస్ కి వెళ్లడానికో, లేదా ఏదైనా ఊరుకి వెళ్లడానికో.. జర్నీ చేస్తూనే ఉంటాం. అయితే.. స్మార్ట్ వినియోగం బాగా పెరిగిన ఈ రోజుల్లో ఛార్జింగ్ కూడా ఎక్కువ సార్లు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీనితో చాలా మంది జర్నీ టైములో కూడా ట్రైన్స్ లో ఇచ్చే ఛార్జింగ్ స్లాట్స్ ను ఉపయోగించుకుంటూ ఉంటారు.
అయితే.. ఇలా అస్సలు చేయకూడదట. ఇలా చేయడం వల్ల బ్యాటరీ డామేజ్ అవుతుంది. అలాగే.. హ్యాకర్స్ కూడా ఈ స్లాట్ ని ఓ హబ్ లాగ ఉపయోగించుకుంటున్నారు. మనం యుఎస్బి కనెక్టివ్ తో ఛార్జ్ చేసుకుంటున్నపుడు వారు మన డేటా ని హాక్ చేసే అవకాశం ఉంటుంది. 80 శాతం మందికి వారి ఫోన్ హ్యాక్ అయ్యింది అన్న విషయం కూడా తెలియదు. అందుకే పబ్లిక్ స్పాట్స్ లో ఉండే ఛార్జింగ్ స్లాట్స్ ని వాడకూడదు. జర్నీ సమయాల్లో అవసరం అవుతుంది అనుకుంటే పవర్ బ్యాంక్స్ ని ఉపయోగించాలి.

