సపోటా పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తప్పక తెలుసుకోండి..!

సపోటా పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తప్పక తెలుసుకోండి..!

by kavitha

Ads

సీజన్ ప్రకారం వచ్చే ఫలాలను ఆయా సీజన్ లో తినడం వల్ల పోషకాలు అధికంగా లభిస్తాయి. ఇక ఈ సీజన్ లో ఎక్కువగా లభించే సపోట పండ్లు విరివిగా దొరుకుతాయి. సపోటా పండు ఎంతో రుచికరంగా ఉంటుంది. ఈ పండు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Video Advertisement

ఈ ఫలంలో ఉండే ఫైబర్, కాల్షియం, ఐరన్, పొటాషియం, కాపర్, విటమిన్ బీ, విటమిన్ ఎ, విటమిన్ సి లాంటి పోషకాలు ఉంటాయి. ఈ పండును రోజుకు రెండు తినడం వల్ల మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ రేటు మెరుగుపడుతుంది. పొట్టలో ఉన్న వ్యర్థాలను తొలగించడంలో ఉపయోగపడుతాయి. అంతే కాకుండా కడుపు, ప్రేగులు శుభ్ర పడుతాయి.
sapota-uses1 ఈ పండ్లు తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. అలాగే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. వృద్ధాప్య ఛాయలు కూడా దగ్గరకు రాకుండా చేస్తాయి. ఈ పండ్లు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా  పెరుగుతుంది. బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల వచ్చే వ్యాధుల బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇక నీరసంగా ఉన్న సమయంలో ఈ పండు తినడం వల్ల వెంటనే శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఈ పండ్లను తీసుకుంటే మంచి ఫలితము ఉంటుంది.
sapota-uses2ఈ పండ్లను గర్భిణీ స్త్రీలు, బాలింతలు తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కిడ్నీల సమస్యలతో ఇబ్బంది పడేవారు సపోటా పండ్లను తినడం వల్ల మేలు కలుగుతుంది. మూత్ర పిండాల్లోని స్టోన్స్ కూడా కరుగుతాయంట. ఈ పండ్లు బరువు తగ్గడంలోనూ, ఎముకలను ధృడంగా ఉంచడంలో, జుట్టు రాలే సమస్యను తగ్గించడంలో ఉపయోగపడుతాయి. ఈ పండ్లు రక్తపోటును కంట్రోల్ గా ఉంచడంలో ఉపయోగపడుతాయి. అంతే కాకుండా శరీర బలహీనతను, నరాల ఒత్తిడిని తగ్గించడంలో ఈ పండ్లు ఎంతో ఉపయోగపడుతాయి.
sapota-usesAlso Read: వేసవి కాలంలో ఈ ఆహారం తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా చలవ కూడా చేస్తుంది..


End of Article

You may also like