కాశీకి వెళ్తే కాయో, పండో వదిలేయాలని ఎక్కడా చెప్పలేదు..! మరి ఈ సంప్రదాయం ఎలా వచ్చింది..?

కాశీకి వెళ్తే కాయో, పండో వదిలేయాలని ఎక్కడా చెప్పలేదు..! మరి ఈ సంప్రదాయం ఎలా వచ్చింది..?

by Anudeep

Ads

కాశీ.. పరమ పవిత్ర పుణ్య క్షేత్రం. భారతీయులందరు తమ జీవితం లో ఒక్కసారి అయినా కాశీ ని దర్శించాలని కోరుకుంటూ ఉంటారు. అంతటి పుణ్య క్షేత్రాన్ని దర్శించిన వారు ధన్యులే. అయితే.. కాశీకి వెళ్లి గంగలో మునిగిన వారందరు తమకు ఇష్టమైన కాయనో, పండునో వదిలేసి.. ఆ కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అయితే.. ఇలా ఇష్టమైన వాటిని వదిలేయడం వెనుక అసలు మర్మమేంటో తెలుసుకుందాం.

Video Advertisement

kasi 1

కాశీ క్షేత్రం విషయం లో శాస్త్రం చెప్పిన విషయాన్నీ కాలానుగుణం గా మార్చేస్తూ వచ్చారు. అసలు అంతరార్ధం మాత్రం మరుగున పడిపోయింది. అసలు శాస్త్రం ఏమి చెప్పిందంటే.. కాశీ కి వెళ్లిన తరువాత కాయాపేక్ష, ఫలాపేక్షను వదిలి పెట్టాలని శాస్త్రం చెప్పింది. అంటే అర్ధం ఏంటంటే.. కాయము పై ఉన్న ఆపేక్ష (శరీరం పై మక్కువ) అలాగే.. కర్మ ఫలం పై ఆపేక్షను విడిచి పెట్టి ఆ విశ్వేశ్వరుని దర్శించాలని అర్ధం.

kasi 3

పూర్వం కాశీ కి వెళ్లాలంటే కాలి నడకనే వెళ్లేవారు.. జీవితం లో బాధ్యతలు పూర్తి చేసుకుని.. చివరకు వచ్చాక.. కాశీకి వెళ్లి కాయాపేక్షను, ఫలాపేక్షను విడిచిపెట్టి ఈశ్వరుని గూర్చిన చింతను చేస్తూ గడిపేవారు. కాలక్రమం లో.. ఈ కాయాపేక్ష, ఫలాపేక్ష కాస్త కాయో, పండో అన్నట్లు మారిపోయింది. కాశీకి వెళ్లిన వారంతా కాయనో, పండునో వదిలేసి వస్తున్నారు. కానీ.. దీనివలన వచ్చే పుణ్యం కానీ, ఉపయోగం కానీ ఏమి ఉంది..? ఇందులో అసలు అంతరార్ధాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాలి.

kasi 2

ఈసారి కాశీకి వెళ్ళినపుడు.. శరీరం పై ఉన్న మక్కువని, లేనిపోని కర్మ ఫలాలపై ఆపేక్షని విడిచిపెట్టి చిత్త శుద్ధితో ఈశ్వరుడిని దర్శించండి. ఇహలోక సుఖాలను త్యజించగలిగే ఆధ్యాత్మిక జ్ఞానం అలవడాలని ఈశ్వరుడిని ప్రార్ధించండి.


End of Article

You may also like