Ads
ప్రస్తుతం దేశం లో పలుచోట్ల కరోనా మహమ్మారి మూడవ వేవ్ కూడా కనిపిస్తోంది. మహారాష్ట్రలోనే ఎక్కువ కేసులు బయటపడుతున్నాయి. దాదాపు 9,928 మంది పిల్లలు కోవిడ్ -19 బారిన పడ్డారు. అయితే వారిలో 90 శాతం మందికి కరోనా లక్షణాలు కనిపించడం లేదు. ఎవరి పరిస్థితి తీవ్రంగా కనిపించడం లేదు. కానీ వారికి పాజిటివ్ గా తేలింది.
Video Advertisement
9,928 మంది పిల్లల లో 6,700 మంది 11 నుంచి 18 సంవత్సరాల వయసు లోపే ఉన్నారు. 3,100 మంది 1 నుంచి 10 సంవత్సరాల వయసు ఉంది. ప్రస్తుత పరిస్థితుల గురించి ఇన్ఛార్జి డాక్టర్ మాన్సీ మహానోర్ మాట్లాడుతూ, “ఈ కోవిడ్ కేంద్రంలో ప్రస్తుతం 52 కరోనావైరస్ పాజిటివ్ పిల్లలు చికిత్సలో ఉన్నారు. వారందరూ తేలికపాటి లక్షణాలను కలిగి ఉన్నారు. కానీ వారికి ఎటువంటి సమస్యలు లేవు.” అని చెప్పుకొచ్చారు. పిల్లలు ఈ వ్యాధి బారిన పడటానికి కారణం ఏమిటని అడిగినప్పుడు, ఒక ఆరోగ్య అధికారి మాట్లాడుతూ, “చాలా సందర్భాలలో, మైనర్లకు సంక్రమణ వారి తల్లిదండ్రులు లేదా కుటుంబంలోని ఇతర వయోజన సభ్యుల నుండి వస్తుంది.” పిల్లలను ప్రభావితం చేసే మూడవ కోవిడ్ -19 వేవ్ ను పరిశీలించడానికి జిల్లాలో 10 మంది సీనియర్ పీడియాట్రిషియన్లతో కూడిన టాస్క్ఫోర్స్ కూడా ఏర్పడింది.
End of Article