Puri Jagannadh: ‘లైగర్’ డిజాస్టర్ అవడంతో దర్శకుడు పూరీ జగన్నాధ్ ప్రస్తుతం ఎటు తోచని స్థితిలో ఉన్నాడు. తానొకటి తలిస్తే అన్నచందంగా అయ్యింది పూరీ పరిస్థితి. లైగర్ మూవీతో పాన్ ఇండియా హిట్ కొట్టాలని పూరీ జగన్నాధ్ ఎంతగానో తపించి, రెండు సంవత్సరాలకు పైగా కష్టపడ్డాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడం పూరీని తీవ్ర నిరాశపరిచింది.
మూలిగే నక్క పై తాటి పండు అన్నట్టుగా లైగర్ డిజాస్టర్ బాధలో ఉన్న ఈ మూవీ ప్రొడ్యూసర్స్ పై మనీలాండరింగ్ కేసు ఫైల్ అవడం మరింత ఇబ్బంది పెట్టింది. ఇటీవల పూరీ జగన్నాధ్, ఛార్మి, హీరో విజయ్ దేవరకొండను ఈడీ ప్రశ్నించిందని వార్తలు వచ్చాయి. మరి ఈ ఇష్యూ ఎక్కడికి దాకా వెళ్తుందో చూడాలి. పూరీ జగన్నాధ్ ప్రస్తుతం కఠినమైన దశను ఎదుర్కొంటున్నాడనే చెప్పాలి
ప్రస్తుతం పూరీ జగన్నాధ్ రాబోయే సినిమా గురించి ఎటువంటి అప్ డేట్ లేదు. పూరీ ఇప్పటివరకు తదుపరి మూవీ గురించి ఏ వివరాలను కూడా ప్రకటించలేదు. అయితే పూరీ జగన్నాధ్ తన కుమారుడు ఆకాష్ పూరీ హీరోగా, ఓ సినిమాకు దర్శకత్వం చేస్తాడని వినిపించాయి. ఆ విషయం పై ఎలాంటి సమాచారం లేదు. తాజా సమాచారం ప్రకారం పూరీ జగన్నాధ్ కొత్త ప్రాజెక్ట్ కోసం హీరో రవితేజతో చర్చలు జరుపుతున్నాడని తెలిస్తోంది.
ఇంతకుముందు పూరీ, రవితేజ కాంబినేషన్ లో పలు సూపర్ హిట్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో రవితేజ పూరి దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? ఎందుకంటే రవితేజ ఒప్పుకున్న సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. మరో రెండేళ్ల వరకూ డేట్స్ ఖాళీగా లేవని వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ కెరీర్ ఎదుగుదలకు కావాల్సిన హిట్స్ ఇచ్చిన పూరి జగన్నాథ్ కోసం డేట్స్ తప్పకుండా ఇస్తాడని అందరు అనుకుంటున్నారు. ఇంకా చర్చల దశలో ఉన్న ఈ సినిమా, రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తుందో లేదో చూడాలి.

అయితే ఆయన దాని గురించి పట్టించుకోకుండా, దృష్టంతా షూటింగ్ పైనే పెట్టారు. ఆయన ఎప్పుడు ఆడియెన్స్ కి కథను గొప్పగా చూపించాలనే ఆలోచించారు. షూటింగ్ లో చాలా దుమ్ము ఉన్నా కూడా పని చేస్తూనే ఉన్నారు. ఆయన మూవీ అద్భుతంగా ఉండాలని ఎల్లప్పుడూ తాపత్రయపడతారు’ అని తెలిపారు. ఇక RRR మూవీ బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డ్స్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచానికి తెలుగు సినిమా స్టామినాని చాటి చెప్పింది ఈ సినిమా. బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం నమోదు చేసింది.
రామ్ చరణ్, ఎన్టీఆర్ నటన, రాజమౌళి దర్శకత్వం సినిమాకు విజయాన్ని ఇచ్చింది. ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియ శరణ్, అలియా భట్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ, ఆస్కార్ బరిలో కూడా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీకి గానూ దర్శక ధీరుడు రాజమౌళికి ఉత్తమ డైరెక్టర్ గా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు వచ్చింది. ఇండియా తరపున ఈ అవార్డు పొందిన తొలి డైరెక్టర్ రాజమౌళి అవడం విశేషం.
అడవి శేషు హీరోగా హిట్ 2 అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.నేచురల్ స్టార్ నాని మరియు ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ మూవీకి శైలేష్ కొలను డైరెక్టర్. డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఒక జర్నలిస్ట్ హిట్ సిరీస్ మూవీస్ లో సమంత లాంటి స్ట్రాంగ్ ఫిమేల్ విలన్ గా చేస్తే బావుంటుండి అని ట్వీట్ చేసాడు. అయితే దీనిని అడవి శేషు రీ ట్వీట్ చేయడమే కాక, ఇది అద్భుతమైన ఆలోచన సమంత ఏమంటావ్ అని సమంతను అడిగాడు. దానికి సమంత సమాధానంగా బాడ్ యాస్ కాప్,ఇది వినడానికి చాలా ఫన్నీగా ఉంది అని కామెంట్ పెట్టింది.
అంతేకాక నీ సినిమా హిట్టు అయినందుకు కంగ్రాట్స్, నిన్ను ఎప్పటికీ చీర్ చేస్తూనే ఉంటా అని కామెంట్ చేసింది. అయితే సమంత హిట్ సిరీస్ లో నటించే అవకాశాలు ఉన్నాయని హింట్ ఇచ్చేసింది. ఇంకో వైపు సమంత అభిమానులు ఆమె ట్వీట్ చేసిందంటే అనారోగ్యంతో లేదని, బాగానే ఉందని సంతోషపడుతున్నారు. ఇది ఇలా ఉంటే, హిట్ సిరీస్ను 8 భాగాలుగా రూపొందించాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. హిట్ 2 ప్రమోషన్స్ లోనే 3వ పార్ట్ గురించి తెలిపారు. అయితే హిట్ 3 లో నాని హీరోగా, కీలక పాత్రలో అడివి శేష్ నటిస్తాడని తెలిపారు.
ఇది ఇలా ఉండగా త్రివిక్రమ్ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఇక ఈ లగ్జరీ కారు ఖరీదు రూ. 1.34 కోట్లు అని తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ గ్యారేజీలో లగ్జరీ కార్లు ఉన్నాకూడా, తాజాగా కొత్త కారును కొన్నారు. త్రివిక్రమ్ బీఎండబ్ల్యూ కారు కొంటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న కారు రంగును చూస్తే, BMW 7 సిరీస్ 740 లీటర్ మోడల్ కారుగా అంచనా వేయబడింది. కారు ఖరీదు విని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ బీఎండబ్ల్యూ కారును తన భార్యకు బహుమతిగా ఇచ్చారని సమాచారం.
డైరెక్టర్ త్రివిక్రమ్ భార్య సౌజన్య మంచి క్లాసికల్ డ్యాన్సర్. ఆమె ఇప్పటికే చాలా వేదికలపై తన నృత్య ప్రదర్శన చేసారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో చేస్తున్న సినిమా పూర్తి అయిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం త్రివిక్రమ్, మహేష్ SSMB28 సినిమాలో సీనియర్ హీరోయిన్ శోభన ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతుంది.
ఎందుకంటే ‘ఆచార్య’లో చిరంజీవి హీరోగా నటించగా, రామ్ చరణ్ ముఖ్యపాత్రలో నటించాడు. ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ‘లూసిఫర్’ రీమేక్ గా వచ్చిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటించాడు. గాడ్ ఫాదర్ కి పాజిటివ్ టాక్ వచ్చి, వసూళ్లు కూడా బాగానే ఉన్నా, ఫలితం మాత్రం హిట్ అయితే కాలేదు. రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమాలూ నిరాశపరిచాయి.దీంతో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా పరిస్థితి ఎలా ఉండబోతుందో అని మెగా ఫ్యాన్స్ కలవర పడుతున్నారు.
అమితాబ్ బచ్చన్ వీరాభిమాని అయిన రవితేజ సినిమాల్లోకి రావడానికి, కష్టపడి ఈ స్థాయికి ఎదిగిన మెగాస్టార్ చిరంజీవే కారణం అని ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. రవితేజ ఇంతకు ముందు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ‘అన్నయ్య’ సినిమాలో మెగాస్టార్ తమ్ముడిగా నటించాడు. 20 సంవత్సరాల తర్వాత మళ్లీ చిరంజీవితో కలిసి నటిస్తున్నాడు. ఈ సినిమాలో కథను మలుపు తిప్పే ముఖ్యమైన పాత్రలో రవితేజ కనిపిస్తాడని తెలుస్తోంది.
ఈమధ్య కాలంలో మోహన్ బాబు కుటుంబం తరచూ వివాదాల్లో ఉండటం కూడా ఈ మూవీ పై ప్రభావం చూపిందని అంటున్నారు. థియేటర్లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ మూవీగా నిలిచిన జిన్నా నేటి నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈ మూవీకి దర్శకుడు నాగేశ్వర రెడ్డి స్టోరీ అందించగా, కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాలో రఘు బాబు, అన్నపూర్ణమ్మ, సీనియర్ నరేష్, వెన్నెల కిశోర్, సునీల్, చమ్మక్ చంద్ర, తదితరులు నటించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
స్టోరీ :
Matti Kusthi Review in Telugu రివ్యూ :

విజయ్ దేవరకొండ టాక్సీవాలా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి హాజరైన అల్లు అర్జున్ గివెన్చీ స్వెట్షర్ట్ ధరించి కనిపించాడు. గివెన్చీ స్వెట్షర్ట్ ధర 65,000, అతని బూట్లు ధర సుమారు 53,000. ఇంకా ఫెండీ సన్ గ్లాసెస్ ధరించాడు. దీని ధర 25,000. మొత్తం మీద, ఈ ఈవెంట్ కోసం అల్లు అర్జున్ దుస్తులకు,మిగతా వాటికి కలిపి దాదాపు 1,50,000 ఖర్చు అవుతుంది. అల్లు అర్జున్ స్వెట్షర్ట్ మరియు బూట్ల ధరలు తెలుసుకుని అభిమానులు విస్తుపోయారు. దీని పై కొన్ని ఫన్నీ మీమ్స్ కూడా చేసారు.
అంతే కాకుండా తన లగ్జరీ లైఫ్, స్టైలిష్ డ్యాన్స్ తో బన్నీ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. చిన్న వయసులోనే గంగోత్రి,ఆర్య, దేశముదురు, DJ.. పుష్ప వరకు సూపర్ హిట్ సినిమాలతో స్టార్డమ్ని సొంతం చేసుకున్నారు.అంతే కాకుండా అతను బ్రాండెడ్ వస్తువులను వాడుతాడు. అతని దగ్గర చాలా ఖరీదైన వస్తువులు ఉన్నాయి. వీటిలో రూ. 1.45 లక్షల విలువైన షూలు, రూ. 65,000 విలువైన టీ-షర్ట్, హైదరాబాద్ లో రాజభవన లాంటి బంగ్లా, రూ. 7 కోట్ల విలువైన సూపర్ ఖరీదైన వ్యానిటీ వ్యాన్, ఖరీదైన స్టైలిష్ కార్లు ఉన్నాయి.
నమ్రత తాజాగా కొడుకు గౌతమ్ వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసారు. ఈ వీడియో సూపర్ స్టార్ అభిమానులను ఖుషి చేస్తుంది. ఆ వీడియో ఏంటీ అనుకుంటున్నారా, అది గౌతమ్ ఫస్ట్ థియేటర్ ప్రొడక్షన్ వీడియో. ఎప్పుడూ సైలెంట్ గా కనిపించే గౌతమ్ గతంలో స్విమ్మింగ్లో రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. నమ్రతా షేర్ చేసిన గౌతమ్ స్విమ్మింగ్ వీడియో కూడా వైరల్ అయ్యింది. తాజాగా గౌతమ్ తన స్కూల్లో క్లాస్మెట్స్తో కలిసి స్కిట్ చేశాడు.
తన మిత్రులతో కలిసి చక్కని హావా భావాలతో నటించాడు. దానిలో గౌతమ్ లుక్ కూడా డిఫరెంట్గా ఉంది. గౌతమ్ ఇంగ్లీష్ మాడ్యులేషన్ సూపర్ గా ఉంది. ఈ స్కిట్ లో గౌతమ్ని చూసి మహేష్ అభిమానులు, నెటిజన్లు, మహేష్ లానే ఉన్నాడని, ఫ్యూచర్ ప్రిన్స్ అని కామెంట్స్ చేస్తున్నారు. నమ్రత్ షేర్ చేసిన గౌతమ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మహేష్ అన్నయ్య రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ప్రస్తుతం అమెరికాలో నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. త్వరలో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గౌతమ్ తన స్టడిస్ పూర్తయిన తరువాత హీరోగా ఎంట్రీ ఇస్తాడని సమాచారం.
బరువు తగ్గడం వృత్తిపరంగా అవసరం అయితే తాను బరువు తగ్గడానికి కూడా సిద్ధమేనని తెలిపారు. నేను ఖచ్చితంగా చేస్తానని తెలిపారు. నిజానికి మా పెళ్లిలో కూడా కొంత మంది దీని పై కామెంట్ చేశారు. ఇంతకు ముందు ఇలాగే ఉండేవారు. నా శరీరంతో ఇప్పుడు నేను కంఫర్టబుల్గా ఉన్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు బరువు తగ్గవచ్చని, ఫిట్నెస్ తో ఉన్నాను. నేను నా శరీరంతో సంతోషంగా ఉన్నాను. నేను లావుగా ఉండడం వల్ల ఇతరులకు ఎలా, ఎందుకు ఇబ్బందిగా ఉందో నాకు తెలియడం లేదు అని తెలిపింది.
నటి మంజిమా మోహన్ కొన్ని నెలలుగా షూటింగ్స్ నుండి విరామం తీసుకుంది. పెళ్లి తరువాత మీరు సినిమాల్లో నటిస్తారా అన్న ప్రశ్నకు సినిమాలు చేయడానికి సిద్ధమేనని మంచి స్టోరీ కోసం చూస్తున్నానని, త్వరలోనే కొత్త సినిమా గురించి వివరాలను తెలియచేస్తానని చెప్పారు.
ట్రోల్స్ పై మంజిమా మోహన్ స్పందించిన నేపథ్యంలో ఇప్పటి నుండి అయిన ఆమె పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆగుతాయో చూడాలి మరి. మంజిమా మోహన్ కు తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటి. నాగచైతన్య తో నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.