భారత్-పాకిస్తాన్ చిరకాల ప్రత్యర్థులు. రెండిటి మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగిందంటే అది హోరాహోరీగా సాగుతుంది. రెండు టీములు కూడా గెలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉంటాయి. అయితే ఇప్పటివరకు పాకిస్తాన్ మీద భారతదే పై చేయిగా ఉంది. వరల్డ్ కప్ లాంటి టోర్నమెంటులో అయితే తాను నెగ్గకపోయినా పర్వాలేదు భారత్ ఓడిపోవాలని పాకిస్తాన్ ఎప్పుడూ కోరుకుంటూ ఉంటుంది.
అలాంటిది భారత్ గెలిచిందని పాకిస్తాన్ హ్యాపీగా ఉందంట. అసలు ఎందుకు పాకిస్తాన్ కి అంత హ్యాపీ. ఈ స్టోరీ చదవండి.లక్నో వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ ఇంగ్లాండ్ ని 100 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది.

అయితే ఇంగ్లాండ్ ఇంకా మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ మూడింట ఇంగ్లాండ్ నెగ్గిన కూడా మాక్సిమం ఎనిమిది పాయింట్లు మాత్రమే సాధిస్తుంది. భారత్ కన్నా ముందు శ్రీలంక చేతిలో కూడా ఇంగ్లాండ్ దారుణమైన ఓటమిని పొందింది.ఇప్పుడు టేబుల్ లో టాప్ మూడు ప్లేసుల్లో ఉన్న భారత్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా జట్టులు దాదాపు సెమీస్ అవకాశాలను ఖరారు చేసుకున్నాయి. ఇక మిగిలిన ఒక స్థానం కోసం పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పోటీ పడుతున్నాయి.

ఇప్పుడు ఇంగ్లాండ్ భారత్ చేతుల్లో ఓడింది. పాకిస్తాన్ ఇప్పటివరకు రెండు మ్యాచ్ ల్లో నెగ్గింది. ఇంకా మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అంటే చివరి మూడు మ్యాచ్ లలో గెలిస్తే పాకిస్తాన్ 10 పాయింట్లు సాధిస్తుంది. నెట్ రన్ రేట్ ప్రకారం చూసుకున్న, పాయింట్ల ప్రకారం చూసుకున్న ఇంగ్లాండ్ కన్నా మెరుగ్గా ఉంటుంది. అదే జరిగితే ఇంగ్లాండ్ కన్నా పాకిస్తాన్ కి సెమీస్ అవకాశాలు ఎక్కువ. నిన్న ఇంగ్లాండ్ ను ఓడించినందుకు పాక్ అభిమానులు భారత్ కి థాంక్స్ చెప్తున్నారు. ఇది అసలు కథ.

అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో క్రికెట్ అభిమానులను మరొక విషయం బాగా ఆకట్టుకుంది. అదంటంటే ఇండియన్ ఆటగాళ్ల చేతికి బ్లాక్ ఆర్మ్ బాండ్స్. అవి ఎందుకు ధరించారా అంటూ అందరూ ఎంక్వయిరీ చేయడం మొదలుపెట్టారు. దాని వెనుక ఉన్న అసలు విషయం ఏంటంటే అక్టోబర్ 23న కన్నుమూసిన టీమిండియా దిగ్గజ ఆటగాడు బిషన్ సింగ్ బేడికి నివాళిగా వీటిని ధరించినట్లు బీసీసీఐ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.



హార్దిక్ లేకపోతే బౌలింగ్ విభాగంలో కేవలం ఐదుగురు బౌలర్స్ తోనే బల్లోకి దిగి అవకాశం ఉంది. దీంతో ఆరో బౌలర్ సేవలను టీమిండియా కోల్పోనుంది.అయితే హార్దిక్ స్థానంలో అక్షర పటేల్ వంటి స్పిన్ రౌండర్ ని తీసుకురావాలని రోహిత్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అక్షర పటేల్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటుతున్నాడు. దీంతో ఒకవేళ హార్దిక్ గాయంతో దూరమైతే అక్షర్ కు అవకాశం ఉంది.
స్టార్ బౌలర్ షమి అయితే ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎన్నికయ్యాడు. బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ తన విశ్వరూపం చూపించగా, జడేజా కోహ్లీకి సహకారం అందించి భారత్ ను విజయతీరాలకు చేర్చారు.దాంతో ఈ ప్రపంచ కప్ లో ఓటమి ఎరగనీ జట్టుగా నిలిచింది. న్యూజిలాండ్ టీమిండియా తో ఓటమి తర్వాత రెండో స్థానానికి పడిపోయింది.భారత జట్టు అధికారికంగా టేబుల్ లో మొదటి స్థానంలో ఉన్న కూడా ఇంకా సెమిస్ కి ప్రవేశించలేదు.
సెమీఫైనల్ కు అర్హత సాధించాలంటే ఒక జట్టు కనీసం ఆరు విజయాలు సాధించాలి. రోహిత్ సేన ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ లోనూ విజయం సాధించింది కాబట్టి మరో మ్యాచ్ గెలిస్తే సెమీఫైనల్ బెర్త్ దక్కుతుంది. టీమిండియా కు ఇంకా నాలుగు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. వీటిలో ఒక్కటి గెలిచిన సరిపోతుంది.భారత్ కు సెమీస్ చేరడం పెద్ద కష్టమేమీ కాదు. దాదాపు భారత్, న్యూజిలాండ్ సెమీస్ కి అర్హత సాధించడం ఖాయమే. వీరితోపాటు మిగతా రెండు జట్లు ఏవి సెమీఫైనల్ కి చేరతాయి అనేది వేచి చూడాలి. 








