హీరో మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ల కలయికలో వచ్చిన లేటెస్ట్ కామెడీ మూవీ ‘జిన్నా’. దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల చేశారు. అయితే ఈ సినిమాకి డీసెంట్ టాక్ వచ్చింది. కానీ దీపావళి పోటిలో మిగతా సినిమాలు ఉండడం వల్ల, ప్రేక్షకులు జిన్నా సినిమాను ఆదరించలేదు. దీంతో జిన్నా సినిమా బాక్సాఫీస్ నుండి ఫాస్ట్ వెళ్ళిపోయింది.
ఈ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా నిరాశ కలిగించాయి. సినిమా బడ్జెట్ ప్రకారం చూస్తే భారీ నిరాశనే మిగిల్చిచిందని చెప్పాలి. జిన్నా సినిమాకు 12.50 కోట్ల ఖర్చు చేశారని టాక్. అయితే ఇద్దరు హీరోయిన్స్ రెమ్యునరేషన్ ఎక్కువే తీసుకున్నారని, మూవీ ప్రొడక్షన్ కాస్ట్ కూడా చాలా ఎక్కువైందని, మూవీని క్వాలిటీగా తెరకెక్కించడం వల్ల బడ్జెట్ పెరిగిందని చెప్తున్నారు. అయితే బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి చెప్పాలంటే పెట్టిన బడ్జెట్ లో పది శాతం కూడా రికవరీ చేయలేదని తెలుస్తోంది.

జిన్నా సినిమా సోలోగా విడుదల చేసి ఉంటే సినిమాకి పెట్టిన బడ్జెట్ లో కొంత వరకు అయిన కలెక్షన్స్ దక్కేవి, కానీ పోటిలో విడుదల చేయడం వల్ల సినిమాకి పెద్ద దెబ్బ పడింది. జిన్నా (మంచు విష్ణు), లైఫ్ లో ఎలాంటి గోల్ లేకుండా, ఊరి నిండా అప్పులు చేసి, వాటిని తీర్చడం కోసం ఒక టెంట్ హౌస్ పెట్టుకొని, అది కూడా నష్టపోయి, ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉంటాడు. ఆ సమయంలో జిన్నా జీవితంలోకి వస్తుంది కోటీశ్వరురాలు రేణుక (సన్నీలియోన్). ఆమెను పెళ్లాడి, ఆమెకు ఉన్న కోట్ల రూపాయల ఆస్తి ద్వారా తన అప్పులన్నీ తీర్చేసుకోవాలనుకుంటాడు జిన్నా. అయితే అది ఫలిస్తుందా ?ఆమె ఎవరు అనేది ఈ సినిమా స్టోరీ.

తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో రూపొందిన ‘జిన్నా’ మూవీని ‘అవా ఎంటర్టైన్మెంట్’మరియు ’24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ’ కలిసి నిర్మించాయి. ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ ఫేమ్ ఈషాన్ సూర్య ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. కోన వెంకట్ కథ,స్క్రీన్ప్లే అందించారు.సంగీతం అనూప్ రూబెన్స్ అందించారు.

గోవాలో జరుగుతోన్న 53వ అంతర్జాతీయ చలన చిత్ర ఉత్సవాల్లో పాల్గొన్న దర్శకుడు బోయపాటి చేసిన వాఖ్యలను బట్టి నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది. బోయపాటి మాట్లాడిన సమయంలో బాలకృష్ణ కూడా పక్కనే ఉన్నారు. మోక్షజ్ఞని మీరే పరిచయం చేస్తారా అని ప్రశ్నించగా బోయపాటి అవునని కానీ, కాదని కానీ చెప్పకుండా, అతన్ని సిని పరిశ్రమకి ఎలా, ఎప్పుడు పరిచయం చేయాలి అని వారి కుటుంబానికి కూడా ఒక ప్లాన్ ఉంటుంది. మోక్షజ్ఞకి ఏ డైరెక్టర్ సెట్ అవుతాడు. అతని బాడీ లాంగ్వేజ్,ఇమేజ్ కి ఎలాంటి స్టోరీ అయితే సెట్ అతనే లాంచ్ చేస్తాడని బోయపాటి అన్నారు.
ఇంకా మాటాడుతూ నేనే పరిచయం చేస్తానని చెప్పలేను.ఆ సమయం వస్తే, ఎంట్రీ అలా జరిగిపోతుంది. మన చేస్తుల్లో ఏం లేదు, అంతా దైవేచ్చ. ఆ అప్పటిదాకా మనమంతా ఎదురుచూడాలి అని మోక్షజ్ఞ ఎంట్రీ గురిచి చెప్పారు. పక్కనే ఉన్న బాలయ్య చిన్నగా నవ్వాడు.కానీ ఏం మాట్లాడలేదు. ప్రస్తుతం బోయపాటి రామ్ పోతినేని హీరోగా పాన్ ఇండియా సినిమాని తీస్తున్న సంగతి తెలిసిందే. హీరో నందమూరి బాలకృష్ణ తన 107వ చిత్రం వీరసింహారెడ్డితో సంక్రాంతి పండుగాకి బరిలోకి దిగుతున్నారు.
తమిళంలో విజయం పొందిన క్లాసిక్ ‘ఓ మై కడువులే’ మూవీకి రీమేక్గా ఈ సినిమా వచ్చింది. విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమా ఫాంటసీ రొమాంటిక్ కామెడీ చిత్రం. వెంకటేష్ మోడ్రన్ దేవుడిగా నటించి మెప్పించారు. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే పాత్రలో విశ్వక్ సేన్ నటించాడు.మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్స్గా నటించారు. దీనిని పెరల్ వి. పొట్లూరి మరియు పరమ్ వి. పొట్లూరి పివిపి సినిమా బ్యానర్పై నిర్మించారు. మరియు అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాశారు.
ఓరి దేవుడా ఏరియా వైజ్ వసూళ్లు చూస్తే, నైజాంలో రూ.2.06 కోట్లు, రాయలసీమ రూ. 0.56 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 0.78 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 0.21 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 0. 29 లక్షలు,కృష్ణ రూ. 0.47 లక్షలు, గుంటూరు రూ. 0.38 లక్షలు, నెల్లూరు రూ. 0.12 లక్షలు, ఏపీ, తెలంగాణ కలిపి రూ. 4.87 కోట్లు, UA: రూ 0.78 కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా మొత్తంగా పైనల్ కలెక్షన్స్ రూ. 5.72 కోట్లు (రూ. 10.50 కోట్ల గ్రాస్).
ఇక అసలు షయానికొస్తే, బాలకృష్ణ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న వీరసింహా రెడ్డి మూవీ నుండి జై బాలయ్య పాట శుక్రవారం రిలీజ్ అయ్యింది. తమన్ సంగీతం అందించిన ఈ పాట పై సోషల్ మీడియాలో పెద్ద దుమారం వచ్చింది. ఈ సాంగ్ పై నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి. దీనిని ఓసేయ్ రాములమ్మ సాంగ్ తో పోలుస్తూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఆయన మళ్లీ కాపీ కొట్టారని విమర్శిస్తున్నారు. మరి కొందరు ఈ పాట రాసిన రచయిత రామజోగయ్య శాస్త్రీని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఆయన పేరులోని సరస్వతీ పుత్ర పేరును తొలగించాలని అంటున్నారు.


రాహుల్ రామకృష్ణ మరియు ప్రియదర్శి తాజాగా ఏబీఎన్ రాధా కృష్ణ షోలో పాల్గొన్నారు. ఆర్కే ఈ సందర్భంగా మాట్లాడుతూ “సినిమా ఇండస్ట్రీ రంగులరాట్నం లాంటిది. ఏమరపాటున ఉంటే చాలా ప్రమాదకరమైందని, అది ఎంత పైకి తీసుకెళ్తుందో, అంతే వేగంగా కింద పడేస్తుందని, ఇదే విజయ్ దేవరకొండ ‘లైగర్’ విషయంలో జరిగింది. ఓవర్ నైట్ స్టార్ గా మరి ఎక్కడికో వెళ్ళిపోయాడు. కానీ అలానే టక్కున కిందికి రావాల్సి వచ్చిందని చెప్పాడు.
అయితే దీనికి రాహుల్ రామకృష్ణ స్పందిస్తూ మేము ఇద్దరం కలిసి ‘ఖుషి’ మూవీ చేస్తున్నాం. కానీ సమంతకు ఆరోగ్యం బాలేకపోవడంతో హోల్డ్ లో వుంది. నెక్స్ట్ షెడ్యూల్ మొదలవగానే విజయ్ దేవరకొండని కలుస్తాను. అయితే ఈమధ్య కాలంలో మాట్లాడుకోలేదు. హి ఈజ్ మేడ్ ఆఫ్ స్టీల్. ఏదైనా తట్టుకుంటాడు అని అన్నాడు. ప్రియదర్శి విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ హిట్ అండ్ ఫ్లాప్ అనేవి కామన్, విజయ్ చాలా డిఫరెంట్, అతను ఖచ్చితంగా మళ్లీ హిట్టు కొడతాడని అన్నారు.
మరోవైపు విజయ్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నటు కనిపిస్తున్నాడు. ఈ మధ్య జరిగిన ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ అందరు ఎక్కడికి వెళ్ళినా కంబ్యాక్ ఇవ్వాలి అన్నా అంటున్నారని, అయితే తాను ఎక్కడికీ పోలేదని, ఇక్కడే ఉన్నానని తన స్టైల్లో చెప్పి ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచాడు.

మేకర్స్ సోషల్ మీడియాలో సినిమా కంటెంట్ బాగుంటే బాగా ప్రమోట్ చేసుకుంటారు. కంటెంట్ బాగుంటే నెటిజన్స్ కూడా సపోర్ట్ చేస్తారు.అయితే సినిమా బాలేనప్పుడు మాత్రం వాటిని ట్రోలర్స్ పని దొరికినట్టే ఇక.నెటిజెన్స్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటారు. ప్రస్తుతం తమన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన వీరసింహారెడ్డి నుండి ఫస్ట్ సాంగ్ ‘జై బాలయ్య’ విడుదల చేసారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిచారు. అంతే కాకుండా ఈ లిరికల్ వీడియో సాంగ్ లో ఇప్పటివరకు వేసుకొని డ్రెస్ లో తమన్ కనిపించడమే కాకుండా స్టెప్స్ కూడా వేశారు.
అయితే అఖండ తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఈ పాటను నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని బాలయ్య అభిమానులు ఊహించుకున్నారు. కానీ ఈ పాట నిరాశ పరిచింది. అంతే కాకుండా ఒసేయ్ రాములమ్మ సినిమాలో పాటలా ఉందని ట్రోలింగ్స్ మొదలయ్యాయి.దీంతో నెటిజెన్స్ సోషల్ మీడియాలో తమన్ పై ట్రోల్స్ స్టార్ట్ చేశారు. మీమర్స్, ట్రోలర్స్ తమ చేతికి పని చెప్పారు. బ్రహ్మానందం ఫోటోలతో, వీడియోలతో రెచ్చి పోతున్నారు. డ్రెస్సింగ్ మీద పెట్టిన ఇంట్రెస్ట్, సాంగ్ మీద పెట్టలేదంటూ కామెంట్స్ పెడుతున్నారు.
బాలకృష్ణ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకుడు.రాయలసీమ బ్యాక్ డ్రాప్తో వస్తున్న ఈ మూవీలో శ్రుతీ హాసన్ హీరోయిన్. ఈ మూవీలో వరలక్ష్మి శరత్కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా సంక్రాంతి 2023 కి థియేటర్స్లో సందడి చేయటానికి రెడీ అవుతోంది.

ఈ సినిమా పదకొండు వందలకోట్లకు పైగా వసూళ్లు సాధించింది.అంతే కాకుండా గోవాలో జరుగుతున్న 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శనకు ఎంపిక అయ్యింది. రాజమౌళి కూడా హాలీవుడ్లో గవర్నర్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం లాంటి అరుదైన గౌరవాలు దక్కాయి. అయితే గత నెలలో ‘ఆర్ఆర్ఆర్’గ్రాండ్గా జపాన్ లో విడుదల అయ్యింది. ఈ క్రమంలో అక్కడ ‘ఆర్ఆర్ఆర్’ మరో ఫీట్ సాధించింది. బాహుబలి’ రికార్డ్స్ ని బీట్ చేసి, అక్కడ అత్యధిక కలెక్షన్లు సాధించిన 2వ ఇండియాన్ సినిమాగా నిలిచింది.
ఇదే కాకుండా అత్యంత వేగంగా మూడు వందల మిలియన్ల క్లబ్లో చేరిన ఫస్ట్ భారతీయ సినిమాగా నిలిచి,రెండవ స్థానంలో ఉన్న బాహుబలి 2 ని వెనక్కి పంపింది. జపాన్లో విడుదలైన 34 రోజుల్లోనే అక్కడి కరెన్సీలో 305 మిలియన్ల యెన్లు వసూల్ చేసింది. అంటే మన కరెన్సీలో రూ.17.9 కోట్లు. అయితే 27 ఏళ్ల క్రితం సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘ముత్తు’ సినిమా విడుదలై రూ.23.5 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ అదే సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియాన్ సినిమాగా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. జపాన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఇన్ని ఏళ్లు గడిచిన ఆ రికార్డ్ రజినీ కాంత్ పేరిటే ఉందంటేనే తెలుస్తోంది. ముత్తు సినిమా తరువాత రెండో స్థానంలో నిలిచింది ఆర్ఆర్ఆర్.
ఇక జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో వచ్చే ఏడాది హాలీవుడ్ లేవల్లో అడ్వంచర్ సినిమాని ప్లాన్ చేస్తున్నారు.అయితే ఈ మూవీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్స్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ మూవీ కోసం ప్రిపేర్ సిద్ధం అవుతుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ లో ఉన్నాడు.