Tollywood: జబర్ధస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ హీరోగా వచ్చిన చిత్రం ‘గాలోడు’. ఈ సినిమాతో తొలిసారి హీరోగా సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్. గెహ్నా సిప్పి ఈ మూవీలో హీరోయిన్గా నటించింది.
జబర్దస్త్,ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్స్ ద్వారా టెలివిజన్ ప్రేక్షకులకి చేరవైన సుడిగాలి సుధీర్కి యూత్లో క్రేజ్ ఉంది. ఇప్పుడు అదే సుధీర్కి సినిమాల్లో అవకాశాలను తీసుకొస్తుంది. సుధీర్ ఇప్పటికే రెండు సినిమాల్లో హీరోగా చేశాడు. కానీ అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. తనకు ఛాన్స్ వచ్చిన ప్రతిసారి వెండితెర పై సుధీర్ అదృష్టాన్ని పరీక్షించుకుంటునే ఉన్నారు. అక్కడ సక్సెస్ కావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూన్న సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ సినిమాతో హీరోగా ఫస్ట్ హిట్ అందుకున్నారు.
అయితే గత కొన్నేళ్లలో ఆడియెన్స్ అభిరుచుల్లో చాలా మార్పు వచ్చింది.మరి ముఖ్యంగా కరోనా తర్వాత ఆడియెన్స్ ఓటీటీ ఫ్లాట్ఫామ్లో చూడడానికి అలవాటు పడ్డారు. మిగతా భాషల సినిమాలు చూడడానికి అలవాడు పడ్డారు. ఈక్రమంలో పెద్ద స్టార్స్ నటించిన సినిమాలైనా కూడా కథ, కథనం బాగుందనే టాక్ వస్తే తప్ప చూడట్లేదు. అది కూడా థియేటర్స్లో మాత్రమే చూడాల్సిన సినిమా అంటేనే థియేటర్స్ కు వెళ్తున్నారు. లేకపోతే ఓటీటీలో వచ్చాక చూద్దాం అని అనుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో సుడిగాలి సుధీర్ నటించిన సినిమాకు మొదటి రోజు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ కూడా  బాగా నమోదయ్యాయి. పెద్ద హీరోల మూవీస్ చూడటానికి పెద్దగా ఇష్టపడని ఆడియెన్స్ సుడిగాలి సుధీర్ సినిమా చూసేందుకు రావడం ఆసక్తికర విషయమే. తెలంగాణ,ఏపీలోని బీ,సీ సెంటర్స్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ‘గాలోడు’ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.2.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయ్యింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.2.7 కోట్ల వరకు షేర్ ను రావాలి. ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకుంది. పదకొండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 4.38 కోట్ల వసూళ్లను రాబట్టింది.



గోవాలో జరుగుతోన్న 53వ అంతర్జాతీయ చలన చిత్ర ఉత్సవాల్లో పాల్గొన్న దర్శకుడు బోయపాటి చేసిన వాఖ్యలను బట్టి నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది. బోయపాటి మాట్లాడిన సమయంలో బాలకృష్ణ కూడా పక్కనే ఉన్నారు. మోక్షజ్ఞని మీరే పరిచయం చేస్తారా అని ప్రశ్నించగా బోయపాటి అవునని కానీ, కాదని కానీ చెప్పకుండా, అతన్ని సిని పరిశ్రమకి ఎలా, ఎప్పుడు పరిచయం చేయాలి అని వారి కుటుంబానికి కూడా ఒక ప్లాన్ ఉంటుంది. మోక్షజ్ఞకి ఏ డైరెక్టర్ సెట్ అవుతాడు. అతని బాడీ లాంగ్వేజ్,ఇమేజ్ కి ఎలాంటి స్టోరీ అయితే సెట్ అతనే లాంచ్ చేస్తాడని బోయపాటి అన్నారు.
ఇంకా మాటాడుతూ నేనే పరిచయం చేస్తానని చెప్పలేను.ఆ సమయం వస్తే, ఎంట్రీ అలా జరిగిపోతుంది. మన చేస్తుల్లో ఏం లేదు, అంతా దైవేచ్చ. ఆ అప్పటిదాకా మనమంతా ఎదురుచూడాలి అని మోక్షజ్ఞ ఎంట్రీ గురిచి చెప్పారు. పక్కనే ఉన్న బాలయ్య చిన్నగా నవ్వాడు.కానీ ఏం మాట్లాడలేదు. ప్రస్తుతం బోయపాటి రామ్ పోతినేని హీరోగా పాన్ ఇండియా సినిమాని తీస్తున్న సంగతి తెలిసిందే. హీరో నందమూరి బాలకృష్ణ తన 107వ చిత్రం వీరసింహారెడ్డితో సంక్రాంతి పండుగాకి బరిలోకి దిగుతున్నారు.


తమిళంలో విజయం పొందిన క్లాసిక్ ‘ఓ మై కడువులే’ మూవీకి రీమేక్గా ఈ సినిమా వచ్చింది. విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమా ఫాంటసీ రొమాంటిక్ కామెడీ చిత్రం. వెంకటేష్ మోడ్రన్ దేవుడిగా నటించి మెప్పించారు. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే పాత్రలో విశ్వక్ సేన్ నటించాడు.మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్స్గా నటించారు. దీనిని పెరల్ వి. పొట్లూరి మరియు పరమ్ వి. పొట్లూరి పివిపి సినిమా బ్యానర్పై నిర్మించారు. మరియు అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాశారు.
ఓరి దేవుడా ఏరియా వైజ్ వసూళ్లు చూస్తే, నైజాంలో రూ.2.06 కోట్లు, రాయలసీమ రూ. 0.56 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 0.78 లక్షలు, వెస్ట్ గోదావరి రూ. 0.21 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 0. 29 లక్షలు,కృష్ణ రూ. 0.47 లక్షలు, గుంటూరు రూ. 0.38 లక్షలు, నెల్లూరు రూ. 0.12 లక్షలు, ఏపీ, తెలంగాణ కలిపి రూ. 4.87 కోట్లు, UA: రూ 0.78 కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా మొత్తంగా పైనల్ కలెక్షన్స్ రూ. 5.72 కోట్లు (రూ. 10.50 కోట్ల గ్రాస్).
ఇక అసలు షయానికొస్తే, బాలకృష్ణ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న వీరసింహా రెడ్డి మూవీ నుండి జై బాలయ్య పాట శుక్రవారం రిలీజ్ అయ్యింది. తమన్ సంగీతం అందించిన ఈ పాట పై సోషల్ మీడియాలో పెద్ద దుమారం వచ్చింది. ఈ సాంగ్ పై నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి. దీనిని ఓసేయ్ రాములమ్మ సాంగ్ తో పోలుస్తూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఆయన మళ్లీ కాపీ కొట్టారని విమర్శిస్తున్నారు. మరి కొందరు ఈ పాట రాసిన రచయిత రామజోగయ్య శాస్త్రీని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఆయన పేరులోని సరస్వతీ పుత్ర పేరును తొలగించాలని అంటున్నారు.


 రాహుల్ రామకృష్ణ మరియు ప్రియదర్శి తాజాగా ఏబీఎన్ రాధా కృష్ణ షోలో పాల్గొన్నారు. ఆర్కే ఈ సందర్భంగా మాట్లాడుతూ “సినిమా ఇండస్ట్రీ రంగులరాట్నం లాంటిది. ఏమరపాటున ఉంటే చాలా ప్రమాదకరమైందని, అది ఎంత పైకి తీసుకెళ్తుందో, అంతే వేగంగా కింద పడేస్తుందని, ఇదే విజయ్ దేవరకొండ ‘లైగర్’ విషయంలో జరిగింది. ఓవర్ నైట్ స్టార్ గా మరి ఎక్కడికో వెళ్ళిపోయాడు. కానీ అలానే టక్కున కిందికి రావాల్సి వచ్చిందని చెప్పాడు.
అయితే దీనికి రాహుల్ రామకృష్ణ స్పందిస్తూ మేము ఇద్దరం కలిసి ‘ఖుషి’ మూవీ చేస్తున్నాం. కానీ సమంతకు ఆరోగ్యం బాలేకపోవడంతో హోల్డ్ లో వుంది. నెక్స్ట్ షెడ్యూల్ మొదలవగానే విజయ్ దేవరకొండని కలుస్తాను. అయితే ఈమధ్య కాలంలో మాట్లాడుకోలేదు. హి ఈజ్ మేడ్ ఆఫ్ స్టీల్. ఏదైనా తట్టుకుంటాడు అని అన్నాడు. ప్రియదర్శి విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ హిట్ అండ్ ఫ్లాప్ అనేవి కామన్, విజయ్ చాలా డిఫరెంట్, అతను ఖచ్చితంగా మళ్లీ హిట్టు కొడతాడని అన్నారు.
మరోవైపు విజయ్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నటు కనిపిస్తున్నాడు. ఈ మధ్య జరిగిన ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ అందరు ఎక్కడికి వెళ్ళినా కంబ్యాక్ ఇవ్వాలి అన్నా అంటున్నారని, అయితే తాను ఎక్కడికీ పోలేదని, ఇక్కడే ఉన్నానని తన స్టైల్లో చెప్పి ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచాడు.


