మాస్ సినిమాలకి పెట్టింది పేరు బోయపాటి శ్రీను. మాస్ డైలాగులైన, యాక్షన్ సీన్లు అయినా తన ఎనర్జీతో ఇరగదీసే రామ్ పోతినేని. వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా స్కంద. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుందని అనుకున్నారు అంత. కానీ ఊహించని విధంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. అయితే దీన్ని నెలలో పై ఓటీటీలోకి తీసుకురావాలని భావించారు.
కొన్ని అనివార్య కారణాలవల్ల ఓటిటి రిలీజ్ వాయిదా పడి తర్వాత నవంబర్ 2న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయింది. అయితే స్కంద సినిమాను ఓటిటిలో ఎగబడి మరీ చూస్తున్నారంట. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్కంద స్ట్రీమింగ్ అవుతుంది.

ఏడాది హాట్ స్టార్ లో రిలీజ్ అయిన సినిమాల్లో మొదటి 24 గంటల్లో ఎక్కువ మంది వీక్షించిన సినిమాగా స్కందా నిలిచిందని తెలుస్తుంది. శ్రీ లీల రామ్ కాంబోలో వచ్చిన డాన్సులు అయితే ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. బోయపాటి మాస్ టేకింగ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. రామ్ ఇంట్రడక్షన్ సీన్ అయితే తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఒక లెవెల్ లో ఉంది.

అప్పట్లో బోయపాటి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం జయ జానకి నాయక బాక్సాఫీస్ దగ్గర ఆడకపోయినా యూట్యూబ్ లో మాత్రం రికార్డులు తిరగరాసింది. ఇప్పుడు ఇదే ట్రెండ్ హాట్ స్టార్ లోనూ కనిపిస్తుంది మరో పక్క స్కంద సినిమా ఎడిటింగ్ లో కొన్ని లోపాలు ఉన్నాయి అంటూ విమర్శలు వస్తున్న వాటన్నిటిని దాటుకుని ఈ సినిమా ఓటిటిలో దూసుకుపోతుంది. ఒకపక్క ట్రోలింగ్ జరుగుతున్న మరోపక్క ట్రెండింగ్ లో ఉండడం బోయపాటి సినిమాలు కే సాధ్యమని తెలుగు ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు.రానున్న రోజుల్లో స్కందా సినిమా ఓటీటీలో ఇంకా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అంటూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Also Read:నటుడు “ఈశ్వరరావు” మరణానికి కారణం ఏంటో తెలుసా..? చివరి రోజుల్లో ఎక్కడ ఉన్నారు అంటే..?

బరువు తగ్గడం వృత్తిపరంగా అవసరం అయితే తాను బరువు తగ్గడానికి కూడా సిద్ధమేనని తెలిపారు. నేను ఖచ్చితంగా చేస్తానని తెలిపారు. నిజానికి మా పెళ్లిలో కూడా కొంత మంది దీని పై కామెంట్ చేశారు. ఇంతకు ముందు ఇలాగే ఉండేవారు. నా శరీరంతో ఇప్పుడు నేను కంఫర్టబుల్గా ఉన్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు బరువు తగ్గవచ్చని, ఫిట్నెస్ తో ఉన్నాను. నేను నా శరీరంతో సంతోషంగా ఉన్నాను. నేను లావుగా ఉండడం వల్ల ఇతరులకు ఎలా, ఎందుకు ఇబ్బందిగా ఉందో నాకు తెలియడం లేదు అని తెలిపింది.
నటి మంజిమా మోహన్ కొన్ని నెలలుగా షూటింగ్స్ నుండి విరామం తీసుకుంది. పెళ్లి తరువాత మీరు సినిమాల్లో నటిస్తారా అన్న ప్రశ్నకు సినిమాలు చేయడానికి సిద్ధమేనని మంచి స్టోరీ కోసం చూస్తున్నానని, త్వరలోనే కొత్త సినిమా గురించి వివరాలను తెలియచేస్తానని చెప్పారు.
ట్రోల్స్ పై మంజిమా మోహన్ స్పందించిన నేపథ్యంలో ఇప్పటి నుండి అయిన ఆమె పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆగుతాయో చూడాలి మరి. మంజిమా మోహన్ కు తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటి. నాగచైతన్య తో నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక అసలు షయానికొస్తే, బాలకృష్ణ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న వీరసింహా రెడ్డి మూవీ నుండి జై బాలయ్య పాట శుక్రవారం రిలీజ్ అయ్యింది. తమన్ సంగీతం అందించిన ఈ పాట పై సోషల్ మీడియాలో పెద్ద దుమారం వచ్చింది. ఈ సాంగ్ పై నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి. దీనిని ఓసేయ్ రాములమ్మ సాంగ్ తో పోలుస్తూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఆయన మళ్లీ కాపీ కొట్టారని విమర్శిస్తున్నారు. మరి కొందరు ఈ పాట రాసిన రచయిత రామజోగయ్య శాస్త్రీని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఆయన పేరులోని సరస్వతీ పుత్ర పేరును తొలగించాలని అంటున్నారు.
మేకర్స్ సోషల్ మీడియాలో సినిమా కంటెంట్ బాగుంటే బాగా ప్రమోట్ చేసుకుంటారు. కంటెంట్ బాగుంటే నెటిజన్స్ కూడా సపోర్ట్ చేస్తారు.అయితే సినిమా బాలేనప్పుడు మాత్రం వాటిని ట్రోలర్స్ పని దొరికినట్టే ఇక.నెటిజెన్స్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటారు. ప్రస్తుతం తమన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన వీరసింహారెడ్డి నుండి ఫస్ట్ సాంగ్ ‘జై బాలయ్య’ విడుదల చేసారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిచారు. అంతే కాకుండా ఈ లిరికల్ వీడియో సాంగ్ లో ఇప్పటివరకు వేసుకొని డ్రెస్ లో తమన్ కనిపించడమే కాకుండా స్టెప్స్ కూడా వేశారు.
అయితే అఖండ తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఈ పాటను నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని బాలయ్య అభిమానులు ఊహించుకున్నారు. కానీ ఈ పాట నిరాశ పరిచింది. అంతే కాకుండా ఒసేయ్ రాములమ్మ సినిమాలో పాటలా ఉందని ట్రోలింగ్స్ మొదలయ్యాయి.దీంతో నెటిజెన్స్ సోషల్ మీడియాలో తమన్ పై ట్రోల్స్ స్టార్ట్ చేశారు. మీమర్స్, ట్రోలర్స్ తమ చేతికి పని చెప్పారు. బ్రహ్మానందం ఫోటోలతో, వీడియోలతో రెచ్చి పోతున్నారు. డ్రెస్సింగ్ మీద పెట్టిన ఇంట్రెస్ట్, సాంగ్ మీద పెట్టలేదంటూ కామెంట్స్ పెడుతున్నారు.
బాలకృష్ణ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకుడు.రాయలసీమ బ్యాక్ డ్రాప్తో వస్తున్న ఈ మూవీలో శ్రుతీ హాసన్ హీరోయిన్. ఈ మూవీలో వరలక్ష్మి శరత్కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా సంక్రాంతి 2023 కి థియేటర్స్లో సందడి చేయటానికి రెడీ అవుతోంది.

















