తాజ్ మహల్ లో మూత పడ్డ 22 గదుల్లో ఏముందో తెలుసా..? ఇన్నేళ్ల తరువాత వీడిన మిస్టరీ..!

తాజ్ మహల్ లో మూత పడ్డ 22 గదుల్లో ఏముందో తెలుసా..? ఇన్నేళ్ల తరువాత వీడిన మిస్టరీ..!

by Anudeep

Ads

భారత దేశంలోనే కాకుండా ప్రపంచ మొత్తంలో కూడా ఉన్న బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఒకటి తాజ్ మహల్. తాజ్ మహల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. షాజహాన్ తనకి ముంతాజ్ పై ఉన్న ప్రేమకు గుర్తుగా ఈ తాజ్ మహల్ నిర్మించారు. వేరే దేశంలో ఉన్న వాళ్లకు కూడా భారతదేశం అంటే టక్కున గుర్తుకు వచ్చేది తాజ్ మహల్.

Video Advertisement

అందుకే ఎన్నో దేశాల నుండి ఎంతో మంది ప్రజలు తాజ్ మహల్ ని చూడడానికి వస్తూ ఉంటారు. ఏ రోజైనా సరే తాజ్ మహల్ దగ్గర సందర్శకుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా?

tajmahal 2

సాక్షి కథనం ప్రకారం తాజ్ మహల్ లో ఓ 22 గదులు మూసివేసి ఉంటాయి. వాటిల్లో ఏమి ఉంటాయో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. ఇటీవల ఆ 22 గదులను తెరపించాలంటూ వేసిన పిటిషన్ ను అలహాబాద్‌ హైకోర్టు లక్నో బెంచ్ తిరస్కరించింది. దీనితో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. ఈ పిటిషన్ విచారణకు రాకముందే న్యూస్‌ లెటర్‌ జనవరి 2022 పేరిట తాజ్ మహల్ లో మరమ్మత్తులు జరుగుతున్న తాలూకు ఫోటోలను ఆర్కియాలజీ సర్కే ఆప్‌ ఇండియా(ఏఎస్‌ఐ) సోషల్ మీడియాలో హేండిల్ లో విడుదల చేసింది.

tajmahal 1

దీనితో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజ్ మహల్ పునరుద్ధరించడానికి ముందు ఫోటోలు, తరువాత ఫోట్లను ఏఎస్ఐ విడుదల చేసింది. సున్నపు ప్లాస్టర్‌ రీప్లాస్టర్‌గా స్క్రాప్‌ చేయడం, గోడలను, మెట్లను మర్రమ్మత్తులు చేయడం వంటి ఫోటోలను కూడా విడుదల చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. తాజ్ మహల్ బయటి వైపున, యమునా నది ఒడ్డున జరుగుతున్న మరమ్మత్తు పనుల తాలూకు ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. ఈ ఫోటోలను మీరు కూడా ఈ కింద ట్వీట్ లో చూసేయచ్చు.


End of Article

You may also like