Ads
కొలంబో వేదికగా మంగళవారం రాత్రి జరిగిన రెండో వన్డేలో శ్రీలంకపై మూడు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 276 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన టీమిండియా 35.1 ఓవర్లు ముగిసే సమయానికి 193/7 చేసింది. మొదటి ఓవర్ లో హ్యాట్రిక్ ఫోర్లు చేసిన యువ ఓపెనర్ పృథ్వీ షా (13: 11 బంతుల్లో 3×4) మూడవ ఓవర్లో బౌల్డ్ అయ్యారు. ఆ తర్వాత కెప్టెన్ శిఖర్ ధావన్ (29: 38 బంతుల్లో 6×4) వికెట్ చేజార్చుకున్నారు.
Video Advertisement
ఒక ఎండ్ లో క్రీజ్ లో నిలిచిన సూర్యకుమార్ యాదవ్ (53: 44 బంతుల్లో 6×4) జట్టుని గెలుపు దిశగా నడిపించారు. సూర్యకుమార్ యాదవ్ కి సపోర్ట్ ఇచ్చిన మనీశ్ పాండే (37: 31 బంతుల్లో 3×4) రనౌట్ అయ్యి వెనుదిరగగా సూర్యకుమార్, కృనాల్ పాండ్య (35: 54 బంతుల్లో 3×4) వికెట్లు చేజార్చుకున్నారు. చివరి వరకు క్రీజ్ లో నిలిచిన దీపక్ చాహర్ (69 నాటౌట్: 82 బంతుల్లో 7×4, 1×6) చివరిలో ఫాస్ట్ బౌలర్లని టార్గెట్ చేస్తూ పరుగులు రాబట్టారు. అవసరమైన దశలో బౌండరీలు బాదుతూ వచ్చి భువనేశ్వర్ కుమార్ (19 నాటౌట్: 28 బంతుల్లో 2×4) తో మంచి కోఆర్డినేషన్ కనబరిచారు.
అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు ఓపెనర్ అవిష్కా ఫెర్నాండో (50: 71 బంతుల్లో 4×4, 1×6) జట్టుకు మెరుగైన ఆరంభం ఇవ్వగా మిడిల్ ఓవర్లలో చరిత అసలంక (65: 68 బంతుల్లో 6×4), చివర్లో చమిక కరుణరత్నె (44: 33 బంతుల్లో 5×4) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు, యుజ్వేందర్ చాహల్ మూడు వికెట్లు, దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17
End of Article