Ads
ఏదైనా మంత్రమో.. మహిమో చూపిస్తే మనం ఎవరినైనా నమ్మేస్తూ ఉంటాం. చాలా మంది మేజిక్ లకు పడిపోతూ ఉంటారు. అలా చేసి చూపించే వారికి ఏవో మహిమలు ఉన్నాయని అనుకుంటూ ఉంటారు. వారు ఏది చెప్తే అది చేయడం ప్రారంభిస్తారు. గుడ్డి గా నమ్మేస్తూ ఉంటారు. ఇలా మోసం చేసే వారి గుట్టుని ఈ వీడియో లో రట్టు చేసారు.
Video Advertisement
కొంతమంది దొంగ బాబాలు ఎక్కువ గా ఈ విధమైన మోసం చేస్తూ ఉంటారు. కింద ముగ్గు వేసి.. మంత్రించిన బియ్యం, చెంబు ని పెట్టమని చెబుతారు. రకరకాల మంత్రాలు చదువుతూ ఆ బియ్యాన్ని చెంబు లో పోస్తారు. ఆ తరువాత ఒక కత్తిని తీసుకుని ఆ బియ్యం లోపలకు బయటకు తోస్తూ ఉంటారు.
కొంతసేపటికి మంత్రాలు పూర్తి ఐయ్యాక ఆ చెంబు కత్తితో పాటు పైకి లేస్తుంది. ఇదేదో మేజిక్ అని చాలా మంది అనుకుంటారు. కానీ.. దీని వెనకాల ఒక సైన్స్ ఉంది. చెంబు నిండా బియ్యం పోసాక బియ్యపు గింజల మధ్య గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ లో గాలి ఉంటుంది. అందుకే వారు కత్తితో దానిని కదిలించడం వలన ఆ గ్యాప్ తొలగిపోయి గాలి బయటకు వచ్చేస్తుంది.
ఆ తరువాత ఆ కత్తి బియ్యం లోపల టైట్ గా ఫిట్ అవుతుంది. అప్పుడు దానిని పైకి లేపినపుడు బియ్యం తో పాటు చెంబు కూడా పైకి లేస్తుంది. ఇదేమి మంత్రించిన బియ్యం మహిమో, కత్తి మహిమో కాదు. చిన్నపాటి సైన్స్ అంతే. ఇది తెలియక చాలా మంది మోసపోతూ ఉంటారు. ఇది ఎలా జరుగుతుందో మీరు ఈ కింద వీడియో లో చూడచ్చు.
Watch Video:
End of Article