Vinaya Chavithi Pooja : వినాయక చవితి పూజ విధానం.. వ్రత కథ.. పూర్తి తెలుగు లో మీకోసం..!

Vinaya Chavithi Pooja : వినాయక చవితి పూజ విధానం.. వ్రత కథ.. పూర్తి తెలుగు లో మీకోసం..!

by Anudeep

వినాయక చవితి పూజ ఏ పూజ కు అయినా ముందు వినాయకుడిని ఆరాధించడం తప్పనిసరి. అలాంటిది సాక్షాత్తు ఆ విఘ్నేశ్వరుడు జన్మించిన చవితి రోజున.. ఆయనకు మరింత విశేషం గా పూజలు చేసుకుంటూ ఉంటాం. ఈ పూజ ఎలా చేసుకోవాలి.. పూజ కోసం ఏ ఏ సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి అన్న విషయాలు మీకోసం స్పష్టం గా అందిస్తున్నాం.

Video Advertisement

Vinayaka Chavithi Vratham:

Vinayaka Chavithi Vratham:

పూజకు కావాల్సిన సామాగ్రి: 
వినాయకుని మట్టి విగ్రహం (మీరు ఏది ఏర్పాటు చేసుకుంటే అది)
పసుపు (పసుపు తో ప్రత్యేకం గా చిన్న పసుపు గణపతిని చేసుకోవాలి)
కుంకుమ
దీపారాధన కుందులు, వత్తులు, అగ్గిపెట్టె, ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె
సాంబ్రాణి లేదా అగరుబత్తులు
దూది (యజ్నోపవీతం చేసుకోవాలి, అలాగే వస్త్రాలు పెట్టలేనివారు దూదికే కొంచం గంధం, కుంకుమ అలంకరించి వస్త్రం లా సిద్ధం చేసుకోవాలి )
అక్షతలు (పూజకు ముందే తయారు చేసుకోవాలి. పాతవి వాడవద్దు)
పాలవెల్లి ( పాలవెల్లికి ఆకులతో అలంకరించి వినాయకుడికి పందిరి లా సిద్ధం చేయాలి)
ఛత్రం (గొడుగు)
21 రకాల పత్రీ
ఉమ్మెత్త,
పూలు
అరటిపండ్లు
కొబ్బరికాయలు
పంచపాత్ర, ఉద్ధరిణె
నైవేద్యం

పూజ చేసుకోబోయే ముందు ఏమి చేయాలంటే?
పూజకు కూర్చునే ముందే.. ఒక ఎత్తైన పీఠం పెట్టుకోవాలి. దానిపైన పసుపు కుంకుమ లతో అలంకరించి.. ముగ్గు వేసి.. ఆ పైన ఒక కొత్త గుడ్డను కప్పాలి. దాని పైన బియ్యం పోయాలి. ఆ పైన వినాయకుడి ప్రతిమను పెట్టుకోవాలి. వినాయకుడి కి పైన ఛత్రాన్నిపెట్టుకోవాలి. ఆ పైన పాలవెల్లి ని వేలాడతీసి దానికి మామిడాకులతో అలంకరించాలి. ఆ పాలవెల్లి కి ఉమ్మెత్త కాయలు, ఆపిల్, అరటి, జామ, వెలగ కాయలను నాలుగు వైపులా కట్టి అలంకరించుకోవాలి. ఇలా పూజకు మండపాన్ని సిద్ధం చేసుకున్నాక.. పూజకు అవసరమైన సామాగ్రిని దగ్గర గా పెట్టుకోవాలి.

రెండు కుందులను చెరోవైపుకు ఉంచి దీపారాధన చేయాలి. దీపారాధన చేసాక కుంకుమ తో అలంకరించి కుందుల వద్ద పుష్పాలను ఉంచాలి. ఆ తరువాత అగరబత్తీలను కూడా వెలిగించి పూజ ప్రారంభించాలి.

పూజ ప్రారంభము:

ఆచమనం:

ఓ కేశవాయస్వాహా
ఓ నారాయణస్వాహా
ఓ మాధవాయస్వాహా
అంటూ మూడు సార్లు నీటిని తీసుకుంటూ ఆచమనం చేయాలి. నాలుగవ సారి చేతిని శుభ్రం చేసుకుని నీటిని పళ్లెం లోకి వదిలేయాలి.

ఆ తరువాత,
గోవిందాయ నమః
విష్ణవే నమః
మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః
వామనాయ నమః
శ్రీధరాయ నమః
హృషీకేశాయ నమః
పద్మనాభాయ నమః
దామోదరాయ నమః
సంకర్షణాయ నమః
వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః
అనిరుద్దాయ నమః
పురుషోత్తమాయ నమః
అధోక్షజాయ నమః
నారసింహాయ నమః
అచ్యుతాయ నమః
ఉపేంద్రాయ నమః
హరయే నమః
శ్రీ కృష్ణాయ నమః,
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

అంటూ పూజించి.. ఘంటారావం చేయాలి (గంట కొట్టాలి).. వినాయకుడిని రమ్మని పిలుస్తూ మనస్సులోనే ధ్యానించుకోవాలి. అక్షతలను వినాయకుని దగ్గర వేయాలి.

(షోడశోపచార పూజ ను ప్రారంభించే ముందు పసుపు గణపతికి పూజ చేయాలి. కాబట్టి ఈ అక్షతలను పసుపు గణపతి వద్దే వేయాలి.)

అక్షతలను వేస్తూ ఇష్ట దేవతను, కుల దేవతను స్మరించుకోవాలి. అలాగే.. అక్షతలు వేస్తున్న సమయం లోనే ఈ కింద దేవతలను కూడా స్మరించుకుంటూ ఈ నామాలను ఉచ్చరించాలి.

ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః, ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శచీపురందరాభ్యాం నమః, ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః, ఓం శ్రీ సితారామాభ్యాం నమః, నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు..

ఆ తరువాత..
పూజను ప్రారంభించే సమయం లో మన చుట్టూ పక్కల కనిపించకుండా ఉండే భూత, ప్రేత పిశాచాలను ఓ మంత్రం ద్వారా పారద్రోలాలి.
“ఉత్తిష్ఠన్తు భూత పిశాచాహా
ఏతే భూమి భారకాః
ఏతేషాం అవిరోధేన
బ్రహ్మ కర్మ సమారభే..”

అంటూ శ్లోకం చదివి.. కుడి చేత్తో అక్షతలను వాసన చూసి, ఎడమ చేతి పక్క నుంచి వెనక్కు విసిరేయాలి.

ఆ తరువాత ప్రాణాయామం చేయాలి.
“ఓగ్ భూః, ఓగ్ భువః, ఓగ్ సువః, ఓగ్ మహాః, ఓగ్ జనః, ఓగ్ తపః, ఓగ్ సత్యం, ఓగ్ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్”

అని చేతిని అడ్డుపెట్టుకుని మనసులో చదువుకోవాలి.

(ఈ ఉపాసన మంత్రం ఎవరికి వారే చదువుకోవాలి.. వేరే వారు చూడకూడదు కాబట్టి.. పెదాల కదలికలు కనపడకుండా చేతిని అడ్డు పెట్టుకోవాలి. అంతే తప్ప ముక్కుని పట్టుకోకూడదు.)

మీరు పూజకు కూర్చున్న తరువాత మిమ్మల్ని, మీరు పూజ చేసుకుంటున్నప్లేస్ ను శుద్ధి చేసుకోవాలి. అందుకోసం ఈ శ్లోకాన్ని చదవాలి.

“అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా
యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః”

అంటూ పంచపాత్రలోని నీటిని నెత్తిమీద చల్లుకోవాలి.. పూజకు కూర్చున్న వారిపై కూడా చల్లాలి.

సంకల్పం:
మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పార్వతి పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహా విష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహ కల్పే.. వైవస్వత మన్వంతరే.. కలియుగే, ప్రధమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరో దక్షిణ దిగ్భాగే, …… నదీ సమీపే, శ్రీశైలస్య ……ప్రదేశే (శ్రీశైలానికి ఏ దిక్కుగా నివసిస్తున్నారో చెప్పుకోవాలి), వసతి/స్వ గృహే, అస్మిన్ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ ప్లవ నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, భాద్రపద మాసే, శుక్ల పక్షే, చతుర్థి తిథిభ్యామ్, భృగు వాసరే(శుక్ర వారం), శుభ నక్షత్రే, శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం, శుభతిధౌ శ్రీమాన్………… గోత్రో భవత్యహః…….. నామధేయస్య, మమ ధర్మ పత్ని……..సమేతస్య సకుటుంబ ఆయురారోగ్య, ఐశ్వర్య, అభివృధ్యర్ధం, ఇష్ట కామ్య సిద్ధ్యర్ధం, పుత్రపౌత్రాభివృధ్యర్ధం, సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధం శ్రీ వరసిద్ధి వినాయక దేవతాం ఉద్దిశ్చ, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్ధం యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యం. ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం పసుపు గణపతి పూజాం కరిష్యే.

Vinaya Chavithi Pooja vidhanam

Vinaya Chavithi Pooja vidhanam

సంకల్పం చదివాక.. కుడి చేతి ఉంగరం వేలితో పంచపాత్రలోని నీటిని తాకాలి.

ఆ తరువాత గణపతిని ధ్యానించి కలశారాధన చేయాలి.

శ్లోకం:
|| ఏకదంతం సూర్పకర్ణం గజవక్త్రం చతుర్భజం

పాశాంకుశ ధరమ్ దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ||

ఉత్తమం గణాధక్ష్య వ్రతం సంపత్కర శుభం

భక్తాభిష్టప్రదం తస్మాత్ ధ్యాయతం విఘ్ననాయకం||

ధ్యాయేత్ గజాననం దేవం తప్త కాంచన సన్నిభమ్

చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం ||

కలశారాధనం:
ముందు గా కలశం కోసం ఒక చెంబు తీసుకుని అందులో నీటిని తీసుకోవాలి. వినాయకుడికి ఎదురుగా ఒక తమలపాకు వేసి, దానిపై కలశాన్ని ఉంచాలి. అందులోనే సుగంధ ద్రవ్యాలు వేయాలి. కొందరు అందులోనే కాయిన్స్ ను వేస్తూ ఉంటారు. తమలపాకులు లేదా మామిడి ఆకులను కలశం లో ఉంచాలి. ఆ తరువాత శ్లోకం చదువుతూ కలశం లో అక్షతలను, పువ్వును, పసుపును వేయాలి.

కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః
మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణః స్థితాః
కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః
అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః

కలశాన్ని పూజించాక.. నదీజలాన్ని ఆ కలశం లో పోసినట్లు గా భావిస్తూ ఈ క్రింది శ్లోకం చదవాలి. తమలపాకుతో కానీ, మామిడాకులతో కానీ, పుష్పం తో కానీ ఆ నీటిని తిప్పుతూ శ్లోకం చదవాలి.

“గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు”

అంటూ చదవాలి. ఇప్పుడు పూజ కోసం పంచపాత్రలో నీటిని కాకుండా కలశం లో నదీజలాన్ని ఆవాహనం చేసిన నీటినే ఉపయోగించాలి.

షోడశోపచార పూజ:
ఈ పూజను ముందు గా పసుపు గణపతి కే చేస్తాము.

ఓమ్ శ్రీ మహా గణపతియే నమః అర్ఘ్యం సమర్పయామి.

(నీళ్లు పసుపు గణపతి వైపుకు చూపించి.. ఆ తరువాత కింద పళ్లెం లో పోయాలి)

ఓమ్ శ్రీ మహా గణపతియే నమః పార్ఘ్యం సమర్పయామి.

(నీళ్లు పసుపు గణపతి వైపుకు చూపించి.. ఆ తరువాత కింద పళ్లెం లో పోయాలి)

ఓమ్ శ్రీ మహా గణపతియే నమః ముఖే శుద్దాచమనీయం సమర్పయామి.

(నీళ్లు పసుపు గణపతి వైపుకు చూపించి.. ఆ తరువాత కింద పళ్లెం లో పోయాలి)

ఓమ్ శ్రీ మహా గణపతియే నమః శుద్దోదక స్నానం సమర్పయామి.

(ఆకుతో కానీ, పువ్వు తో కానీ నీటిని తీసుకుని గణపతి పై చల్లాలి.)

ఓమ్ శ్రీ మహా గణపతియే నమః స్నానానంతరం శుద్దాచమనీయం సమర్పయామి.

(నీళ్లు పసుపు గణపతి వైపుకు చూపించి.. ఆ తరువాత కింద పళ్లెం లో పోయాలి)

ఓమ్ శ్రీ మహా గణపతియే నమః యజ్నోపవీతం సమర్పయామి.

(దూది తో చేసిన యజ్నోపవీతం సమర్పించాలి.)

ఓమ్ శ్రీ మహా గణపతియే నమః వస్త్రం సమర్పయామి.

(దూది తో చేసిన వస్త్రం సమర్పించాలి.)

ఓమ్ శ్రీ మహా గణపతియే నమః గంధం సమర్పయామి.

(పసుపు గణపతికి పువ్వుతో గంధం సమర్పించాలి.)

ఓమ్ శ్రీ మహా గణపతియే నమః అలంకారణార్ధం అక్షతాన్ సమర్పయామి.

(కొన్ని అక్షతలను తీసుకుని పసుపు గణపతి వద్ద వేయాలి.)

ఓమ్ శ్రీ మహా గణపతియే నమః పుష్పాణి సమర్పయామి.

(పూవులను గణపతికి సమర్పించాలి.)

ఓమ్ శ్రీ మహా గణపతియే నమః సాక్షాత్ దీపం దర్శయామి.

(దీపాన్ని పసుపు గణపతికి చూపించాలి)

ఓమ్ శ్రీ మహా గణపతియే నమః ధూపమాఘ్రాణయామి.

(సాంబ్రాణిని పసుపు గణపతికి చూపించాలి)

ఓమ్ శ్రీ మహా గణపతియే నమః ధూప దీపానంతరం శుద్దాచమనీయం సమర్పయామి.

(నీళ్లు పసుపు గణపతి వైపుకు చూపించి.. ఆ తరువాత కింద పళ్లెం లో పోయాలి)

Happy Vinayaka Chavithi Telugu Wishes Quotes

Happy Vinayaka Chavithi Telugu Wishes Quotes

పసుపు గణపతికి అక్షతలు కానీ, పూవులు కానీ వేస్తూ షోడశనామాలతో పూజించాలి.
ఓం సుముఖాయ నమః,
ఓం ఏకదంతాయ నమః,
ఓం కపిలాయ నమః,
ఓం గజకర్ణాయ నమః,
ఓం లంబోదరాయ నమః,
ఓం వికటాయ నమః,
ఓం విఘ్నరాజాయ నమః,
ఓం ధూమకేతవే నమః,
ఓం గణాధ్యక్షాయ నమః,
ఓం ఫాలచం ద్రాయ నమః,
ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః,
ఓం శూర్పక ర్ణాయ నమః,
ఓం హేరంభాయ నమః,
ఓం స్కందపూర్వజాయ నమః,
ఓం గణాధిపతయే నమః.
షోడశ నామ పూజా సమర్పయామి

ఓమ్ శ్రీ మహా గణపతియే నమః నైవేద్యం సమర్పయామి.

(అవసర నైవేద్యం కింద.. బెల్లం ముక్కను పసుపు గణపతికి సమర్పించాలి.)

ఓమ్ శ్రీ మహా గణపతియే నమః తాంబూలం సమర్పయామి.

(రెండు తమలపాకులు, అరటిపండ్లు, వక్క ను ఉంచి పసుపు గణపతికి తాంబూలం ఇవ్వాలి.)

ఇప్పుడు పూర్వ సంకల్పం తోనే మహాగణపతిని పూజించాలి.

అధౌ పూర్వ సంకల్పేన.. శ్రీ వర సిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్ధం, శ్రీ వర సిద్ధి వినాయక దేవతా ముద్ధిశ్చ యావత్ శక్తీ, భక్త్యోపచార, షోడచోపచార పూజాం కరిష్యే.

కలశం లో నీటిని మార్చుకుని, తిరిగి అక్షతలు, పువ్వులు వేసి పూజించాలి.

ఆవాహనం:

అత్రాగచ్చ జగద్వంద్యా సురారాజార్చితేశ్వరా
అనాధనాధ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బావా ||
శ్రీ వరసిద్ధి వినాయకం ఆవాహయామి ఆవాహయామి ఆవాహయామి..

(కొన్ని అక్షతలు తీసుకుని వినాయకుని విగ్రహం వద్ద వేయండి. ఆయనను రమ్మని ఆహ్వానించండి.)

అర్ఘ్యం:

మౌక్తిఖై పుష్పరాగైశ్చ నానా రత్నైర్విరాజితం

రత్నసింహాసనం చారు ప్రీత్యర్ధం ప్రతిగృహ్యతాం ||

శ్రీ వరసిద్ధి వినాయక దేవతాం ఆసనం సమర్పయామి.
(కొన్ని అక్షతలు తీసుకుని వినాయకుని విగ్రహం వద్ద వేయండి)

పాద్యం:
గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియానందనా |

గృహఅజ్ఞం మాయాదత్తం గండపుష్పాక్షతేర్యుతం ||

శ్రీ వరసిద్ధి వినాయక దేవతాం అర్ఘ్యం సమర్పయామి
(వినాయక విగ్రహం చేతులపై నీళ్లు చల్లుకోండి)

ఆచమనీయం:
అనాధనాధ సర్వజ్ఞ గీర్వాణ గణపూజితా

గృహానాచమానం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో ||

శ్రీ వరసిద్ధి వినాయక దేవతాం ఆచమనీయం సమర్పయామి

(వినాయక విగ్రహం మీద నీరు చల్లుకోండి)

మధుపర్కం:
ధధియా క్షీరసమాయుక్తం మధ్యజ్యేన సమన్వితమ్

మధువర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే ||

శ్రీ వరసిద్ధి వినాయకాయ మధుపర్కం సమర్పయామి

(ఆవు పాలు, పెరుగు మరియు నెయ్యిని కొద్దిగా కలిపి దీనిని అందించండి)

పంచామృత స్నానం:
స్నానం పంచామృతీర్దేవ గృహన గణనాయక |

అనాధనాధ సర్వజన గీర్వాణ గణపూజిత ||

శ్రీ వరసిద్ధి వినాయకాయ పంచామృత స్నానం సమర్పయామి

(పంచామృతం అంటే – ఆవు పాలు, ఆవు పాలు నుండి పెరుగు, ఆవు నెయ్యి,

తేనె మరియు పంచదార) – పంచామృతం చేయడానికి పైన పేర్కొన్నవన్నీ కలపండి మరియు దానిని విగ్రహం పై చల్లుకోండి.

శుద్ధోదక స్నానం:
కలశం లోని నీటిని పుష్పం లేదా ఆకుతో స్వామి పై చల్లండి.

శ్రీ వరసిద్ధి వినాయకాయ శుద్ధోదక స్నానం సమర్పయామి.

యజ్నోపవీతం:
రాజతం బ్రహ్మసూత్రం చ కాంచసంచోత్తరీయకం ||

గృహాన దేవ సర్వజన భక్తుడు ఇష్టదాయక ||

శ్రీ వరసిద్ధి వినాయకాయ యజ్ఞోపవీతం సమర్పయామి

(విగ్రహం చుట్టూ ఉంచండి – ఒక తీగ లేదా వెండి తీగ మరియు ఒక తీగ లేదా బంగారు తీగ

యజ్ఞోపవీతం మరియు ఉత్తరీయం. ప్రత్యామ్నాయంగా దూది తో చేసిన థ్రెడ్‌ను ఉంచవచ్చు.

పత్రి పూజ:

సుగంధినీ చ పుష్పాణి వాతకుండ ముఖాని చ |

ఏకవింశతి పాత్రాని గృహాన గణనాయక ||

(పూజ కోసం ఆకులను తీసుకొని విగ్రహం వద్ద ఉంచండి (శరీర భాగానికి దగ్గరగా)

అథాంగ పూజ:
ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి – కాళ్లు

ఓం ఏకదమతాయ నమః గుల్భో పూజయామి – చీలమండలు

ఓం సూర్యకర్ణాయ నమః జానునీ పూజయామి – మోకాలి

ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి – దూడలు

ఓం అగువాహనాయ నమః ఊరూ పూజయామి – తొడలు

ఓం హేరంబాయ నమః కటిం పూజయామి – పిరుదులు

ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి – కడుపు

ఓం గణనాధాయ నమః నాభిం పూజయామి – నాభి

ఓం గణేశాయ నమః హృదయ పూజయామి – ఛాతి

ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి – గొంతు

ఓం స్కమదాగ్రహాయ నమః స్కందో పూజయామి – భుజాలు

ఓం పాసహస్తాయ నమః హస్తో పూజయామి – చేతులు

ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి – ముఖం

ఓం విఘ్నహంత్రే నమః నేత్రో పూజయామి – కళ్ళు

ఓం సూర్యకర్ణాయ నమః కర్ణో పూజయామి – చెవులు

ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి – నుదిటి

ఓం సర్వేశ్వరాయ నమః శిరము పూజయామి – తల

ఓం విఘ్నరాజాయ నమః సర్వాంగాణి పూజయామి – అన్ని అవయవాలు

ఏక వింశతి పత్ర పూజ:

సుముఖాయనమః – మాచీపత్రం పూజయామి,
గణాధిపాయ నమః – బృహతీపత్రం పూజయామి।
ఉమాపుత్రాయ నమః – బిల్వపత్రం పూజయామి,
గజాననాయ నమః – దుర్వాయుగ్మం పూజయామి
హరసూనవేనమః – దత్తూరపత్రం పూజయామి,
లంబోదరాయనమః – బదరీపత్రం పూజయామి,
గుహాగ్రజాయనమః – అపామార్గపత్రం పూజయామి,
గజకర్ణాయనమః – తులసీపత్రం పూజయామి,
ఏకదంతాయ నమః – చూతపత్రం పూజయామి,
వికటాయ నమః – కరవీరపత్రం పూజయామి
భిన్నదంతాయ నమః – విష్ణుక్రాంతపత్రం పూజయామి,
వటవేనమః – దాడిమీపత్రం పూజయామి,
సర్వేశ్వరాయనమః – దేవదారుపత్రం పూజయామి,
ఫాలచంద్రాయ నమః – మరువకపత్రం పూజయామి,
హేరంబాయనమః – సింధువారపత్రం పూజయామి
శూర్పకర్ణాయనమః – జాజీపత్రం పూజయామి,
సురాగ్రజాయనమః – గండకీపత్రం పూజయామి,
ఇభవక్త్రాయనమః – శమీపత్రం పూజయామి,
వినాయకాయ నమః – అశ్వత్థపత్రం పూజయామి,
సురసేవితాయ నమః – అర్జునపత్రం పూజయామి,
కపిలాయ నమః – అర్కపత్రం పూజయామి,
శ్రీ గణేశ్వరాయనమః – ఏకవింశతి పత్రాణి పూజయామి.

ఏక వింశతి పత్రాలతో పూజించాక ఆసక్తి ఉన్న వారు అష్టోత్తర శతనామావళి ని కూడా చదువుకోవచ్చు.

అష్టోత్తర శతనామావళి:
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీప్తాయ నమః
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హయగ్రీవాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బల్వాన్వితాయ నమః
ఓం బలోద్దతాయ నమః
ఓం భక్తనిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం భావాత్మజాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వ నేత్రే నమః
ఓం సర్వసిద్దిప్రదాయ నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః
ఓం కుంజరాసురభంజనాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థఫలప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళసుస్వరాయ నమః
ఓం ప్రమదాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షికిన్నరసేవితాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటవే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః
ఓం అభీష్టవరదాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం అవ్యక్త రూపాయ నమః
ఓం పురాణపురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అపాకృతపరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః
ఓం సఖ్యై నమః
ఓం సారాయ నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం విశదాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖలాయ నమః
ఓం సమస్తదేవతామూర్తయే నమః
ఓం సహిష్ణవే నమఃఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం విష్ణువే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్తజీవితాయ నమః
ఓం ఐశ్వర్యకారణాయ నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విష్వగ్దృశేనమః
ఓం విశ్వరక్షావిధానకృతే నమః
ఓం కళ్యాణగురవే నమః
ఓం ఉన్మత్తవేషాయ నమః
ఓం పరజయినే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః

ధూపం:
దశంగం గుగ్గులోపేతంశుగంధం సుమనోహరం

ఉమాసుత నమస్తుభ్యం – గృహాణ వరదో భవ

శ్రీ వర సిద్ధి వినాయకాయ నమః ధూపమాఘ్రాపయామి

దీపం:
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోతితం మయా

గృహన మంగళ దీపమీశపుత్ర నమోస్తుతే

శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః దీపం దర్శయామి.

నైవేద్యం:

సుగంధాన్ సుకృతమ్చివ మోదకాన్ ఘృతపచితాన్

నైవేద్యం గృహ్యతాం దేవ చానముద్గై ప్రకల్పితాన్

భక్ష్యం భోజ్యాంచ లేహ్యంచ చోష్యం పనీయమేవ్మాచ

ఇదం గృహన నైవేద్యం మాయదత్తం వినాయక

శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః నైవేద్యం సమర్పయామి..

సిద్ధం చేసిన అన్ని నైవేద్యాలను ఎదురుగా ఉంచి వాటిపై నీరు చల్లి, వాటిని స్వామికి అందించండి.

తాంబూలం:
ఫూగీ ఫల సమాయుక్తం నాగవల్లి దలైర్యుతం

ముక్తాచూర్ణ సంయుక్త తాంబూలం ప్రతిగృహ్యతామ్

శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః తాంబూలం సమర్పయామి.

నీరాజనం:

సదానందదా విఘ్నేస పుష్కాలనీ ధనానిచా

భూమ్యాన్ స్థితాని భగవాన్ స్వీకురుష్య వినాయక

శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః నీరాజనం సమర్పయామి.

దూర్వాయుగ్మ పూజ (గరిక తో పూజ)

ఓం గణాధిపతయే నమః దూర్వాయుగ్మము పూజయామి

ఓం ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మము పూజయామి

ఓం అఖువాహనాయ నమః దూర్వాయుగ్మము పూజయామి

ఓం వినాయకాయ నమః దూర్వాయుగ్మము పూజయామి

ఓం ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మము పూజయామి

ఓం సర్వసిద్ధిప్రదాయ నమః దూర్వాయుగ్మము పూజయామి

ఓం ఏకదంతాయ నమః దూర్వాయుగ్మము పూజయామి

ఓం ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మము పూజయామి

ఓం మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మము పూజయామి

ఓం కుమారగురువే వి నమః దూర్వాయుగ్మము పూజయామి

ఆ తరువాత అక్షతలు చేతిలో పట్టుకుని కథ చదువుకోవాలి. కథ పూర్తయ్యాక ఆ అక్షతలను శిరస్సుపై వేసుకోవాలి.

వినాయక చవితి కథా ప్రారంభః

వినాయకుని జననం:
భక్తుడైన గజాసురుడు పరమశివుడిని తన ఉదరం లో ఉంచుకుంటాడు కదా.. అతనిని విడిపించడానికి విష్ణువు గంగిరెద్దు నాటకం ఆడతాడు. ఎట్టకేలకు గజాననుడు కూడా శివుడిని విడిచిపెట్టాడు ఒప్పుకుంటాడు. ఐతే.. ఈ విషయం తెలిసిన పార్వతి చాలా సంతోషిస్తుంది. భర్త రాక కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.

స్నానానికి వెళ్ళబోతూ.. పసుపు ముద్దతో వినాయకుడిని చేసి ఒక చోట ఉంచుతుంది. తాను వచ్చే వరకు కాపలా గా ఉండమని చెబుతుంది. ఆ సమయం లోనే శివుడు ఇంటికి వస్తాడు. ఐతే ఆ బాలుడు శివుడిని అడ్డగిస్తాడు. దీనితో శివుడు కోపగించి వినాయకుని శిరస్సుని ఖండిస్తాడు. ఆ తరువాత పార్వతి దేవి వచ్చి జరిగినది తెలుసుకుని దుఃఖిస్తుంది. తన బాలుడిని తెచ్చి ఇవ్వాలని కోరుతుంది. దీనితో.. పరమేశ్వరుడు బాధపడి.. తాను బయటకు రావడం వలన చనిపోయిన గజాసురుని తలని తీసుకొచ్చి వినాయకుడికి అమర్చి తిరిగి ప్రాణం పోస్తాడు. అందుకే వినాయకుడిని గజాననుడు అని కూడా పిలుస్తారు.

విఘ్నాధిపతి గా నియామకం:
ఆ తరువాత కుమారస్వామి కూడా జన్మిస్తారు. వీరిద్దరూ చక్కగా ఉండేవారు. ఐతే.. సైన్యాధిపతి గా ఎవరిని నియమించాలి అన్న ప్రశ్న ఉదయిస్తుంది. దీనితో శివుడు ఆ కుమారులిద్దరికి ఓ పరీక్ష పెడతాడు. ఎవరైతే.. భూలోకం లో అన్ని పుణ్య నదులలో స్నానం చేసి వస్తారో.. వారే సైన్యాధ్యక్ష పదవి కి అర్హులని శివుడు చెబుతాడు. శివుడు చెప్పగానే.. కుమారస్వామి తన నెమలి వాహనం పై వెళ్ళిపోతాడు. ఐతే.. వినాయకుడు దుఃఖించి స్వామీ.. నా పరిస్థితి తెలిసినా ఇట్లు ఆనతి ఇవ్వడం తగునా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శివుడు తరుణోపాయం చెబుతాడు. తనను ధ్యానిస్తూ.. తల్లి తండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయమని చెబుతాడు. గణపతి అలానే తల్లితండ్రులను ధ్యానిస్తూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు.

అక్కడ కుమారస్వామి గంగ, యమునా, నర్మదా వంటి నదులలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు.. అప్పటికే వినాయకుడు స్నానం చేసి ఎదురు వస్తున్నట్లు కనిపించేది. అన్నీ నదులలోను స్నానం పూర్తి చేసుకున్న కుమారస్వామి తిరిగి కైలాసం చేరేసరికి గణపతి అప్పటికే అక్కడికి వచ్చేసినట్లు కనిపిస్తాడు. దీనితో అన్నగారి వద్దకు వచ్చి.. అన్నయ్యా.. మీ శక్తిని తక్కువ గా అంచనా వేసాను.. ఈ పదవి కి మీరే అర్హులని సెలవిస్తాడు. ఇక పరమేశ్వరుడు వినాయకుడిని విఘ్నాధిపతి గా నియమిస్తాడు.

పార్వతి దేవి శాపం:
ఆ తరువాత దీనిని వేడుక గా జరుపుకుంటారు. అద్భుతంగా నిర్వహించిన వేడుకలో, వినాయకుడిని శివుని సైన్యానికి సారథిగా నియమించారు. కార్యక్రమం తర్వాత, గణేష్ తన తండ్రి మరియు తల్లి ముందు సాష్టాంగపడ్డాడు. అతనికి పెద్ద బొడ్డు ఉన్నందున, అతను వందనం చేయలేకపోతాడు. దీనితో అక్కడకు వచ్చిన దేవతలందరు తమ నవ్వును అదుపు చేసుకున్నారు. కానీ, శివుడు ధరించిన చంద్రుడు అతన్ని చూసి నవ్వాడు. దీనితో పార్వతి కి కోపం వచ్చి.. ఎవరైతే నిన్ను చూస్తారో వారు నీలాపనిందలు పాలు అవుతారని శపిస్తుంది.

ఈ శాపం సంగతి తెలియక ఋషిపత్నులు ఒకసారి చంద్రుని చూడడం వలన వారి భర్తలతో అపనిందలు పడతారు. వారి భర్తలు వారిని వదిలేసి దూరం గా ఉంటారు. ఆ తరువాత జరిగినది తెలుసుకుని పశ్చాత్తాప పడి తిరిగి భార్యలను కలుసుకుంటారు. ఈ సంఘటన తరువాత దేవతలంతా పార్వతీదేవిని శాపం ఉపసంహరించుకోవాలని కోరతారు. అప్పుడు పార్వతి దేవి శాంతించి.. వినాయక చతుర్థి రోజు మాత్రం ఎవరైనా చూస్తే నీలాపనిందలు పొందుతారని చెప్పింది. అప్పటినుంచి వినాయక చవితి రోజు ఒక్కరోజు చంద్రుడిని చూడకుండా జాగ్రత్త గా ఉండేవారు.

శ్యమంతకోపాఖ్యానం:
ద్వాపర యుగం లో.. ద్వారకలో శ్రీ కృష్ణుడు వినాయక చవితి రోజున అందరికి చాటింపు వేయించాడు. ఈరోజు గణేష్ చతుర్థి కావున ఎవరు చంద్రుని చూడవద్దని చెప్పాడు. ఆరోజు సాయం కాలానికి ఆవునుంచి పాలు పితుకుతు.. పాలల్లో చంద్రుని చూస్తాడు. అయ్యో అందరికి చెప్పి.. నేనే చూసానే.. ఇప్పుడు ఎలాంటి నిందలు వస్తాయో అని శ్రీ కృష్ణుడు అనుకుంటూ ఉంటాడు.

ఓ సారి సత్రాజిత్తు వద్ద ఉన్న శ్యమంతకమణిని శ్రీకృష్ణుడు చూస్తాడు. అది బాగుందని.. తనకు ఇవ్వమని అడుగుతాడు. అందుకు సత్రాజిత్తు అంగీకరించలేదు. దీనితో.. కృష్ణుడు దాని గురించి మరిచిపోతాడు. ఓ రోజు సత్రాజిత్తు కు తెలియకుండా.. అతని తమ్ముడు ఆ మణిని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్తాడు. కానీ తిరిగి రాలేకపోతాడు. ఈ క్రమం లో మణి కోసమే శ్రీ కృష్ణుడు తన తమ్ముడిని హత్య చేయించి ఉంటాడు అని సత్రాజిత్తు భావిస్తాడు. ఇది క్రమం గా ప్రచారం అయ్యి కృష్ణుడి చెవిన పడుతుంది. వినాయక చవితి రోజున చంద్రుని చూడడం వల్లనే తనపై ఇటువంటి నీలాపనింద వచ్చిందని కృష్ణుడు తలుస్తాడు.

వెంటనే సత్రాజిత్తు వద్దకు వెళ్లి.. శ్యమంతక మణి తన వద్ద లేదని.. అది ఏమైందో తెలుసుకుని.. ఆధారాలతో సహా చూపిస్తానని శపధం చేస్తాడు. కృష్ణుడు కూడా అడవికి వెళ్లి సత్రాజిత్తు తమ్ముడి కోసం వెతుకుతాడు. ఆ మార్గం మధ్యలో సత్రాజిత్తు కళేబరం, ఆ పక్కనే ఓ సింహం కళేబరం, కొద్దీ గా దూరం గా ఎలుగుబంటి అడుగు జాడలు కనిపిస్తాయి. మణి కోసమే సింహం దాడి చేసి ఉంటుందని.. ఆ సింహాన్ని, సత్రాజిత్తుని ఎలుగుబంటి చంపేసి మణిని తీసుకుని వెళ్ళుంటుందని కృష్ణుడు అర్ధం చేసుకుంటాడు. ఆ ఎలుగు బంటి అడుగులు పడిన వైపుగా వెళతాడు.

అక్కడ ఉయ్యాలకు ఈ మణి కట్టబడి ఉంటుంది. ఆ ఉయ్యాలలో ఓ పాపాయి ఉంటుంది. ఈ మణిని చూసి ఆడుకుంటూ ఉంటుంది. కృష్ణుడు అక్కడకు వెళ్లి మణిని తీసుకుంటాడు. దానితో ఆ పిల్ల ఏడవడం మొదలుపెడుతుంది. వెంటనే ఎలుగుబంటి రూపం లో ఉన్న జాంబవంతుడు అక్కడకు వచ్చి ఆ మణి కోసం కృష్ణుడితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం లో జాంబవంతుడు ఓడిపోతాడు. తన కుమార్తె అయిన జాంబవతిని ఇచ్చి కృష్ణుడికి వివాహం చేసి.. ఆ మణిని కూడా కృష్ణుడికే ఇచ్చేస్తాడు.

ఆ తరువాత కృష్ణుడు ఆ మణిని తీసుకుని సత్రాజిత్తు వద్దకు వస్తాడు. జరిగినదంతా వివరిస్తాడు. కృష్ణుడిపై అట్టి నీలాపనిందను వేసినందుకు బాధపడి.. ఆ మణి నాకు వద్దు అంటూ కృష్ణుడిని ఉంచుకోమని ఇచ్చేస్తాడు. తన కుమార్తె ఐన సత్య భామ ను కూడా కృష్ణుడికే ఇచ్చి పెళ్లి జరిపిస్తాడు. ఆ తరువాత సాధుపుంగవులంతా.. కృష్ణుడి వద్దకు చేరి.. అయ్యా మీరు సమర్థులు కనుక మీ పై వచ్చిన నీలాపనిందను పోగొట్టుకున్నారు. మరి మాలాంటి సామాన్యులకు ఏదీ దారి అని అడుగుతారు. అప్పుడు శ్రీ కృష్ణుడు ఎవరైతే వినాయక చతుర్థి రోజు వినాయకుడిని పూజించి.. ఈ కథను చదువుకుంటారో.. వారికి ఎటువంటి నీలాపనిందలు ఉండవు అని కృష్ణుడు సెలవిస్తాడు. అప్పటి నుంచి వినాయక చతుర్థి రోజు పూజ చేసుకుని కథ చదువుకోవడం ఆనవాయితీ గా వస్తోంది.

మంత్రపుష్పం:

కుడి చేతిలో ఒక పువ్వు తీసుకొని కింది శ్లోకం చదవండి:

గణాధిప నమస్తేస్తు ఉమాపుత్రఘనాశన

వినాయకేశ తనయ సర్వసిద్ధి ప్రదాయక

ఏకదంతైక వదన తధా మూషిక వాహన

కుమార గురవే తుభ్యమార్పయామి సుమాంజలిమ్

శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః మంత్రపుష్పం సమర్పయామి

 

అర్ఘ్యం గృహాణ హేరంభ సర్వభద్ర ప్రదాయక

గంధపుష్పాక్షతైర్యుకటం ప్రతాస్థం పాపనాశన

శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః పునరర్ఘ్యం సమర్పయామి

చేతిలో నీరు తీసుకొని మూర్తి ముందు ఉన్న ప్రదేశంలో వదిలివేయండి – ఇలా 3 సార్లు చేయండి

వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియం

నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా

అని చదువుకుని ప్రదక్షిణాలు చేయండి.

క్షమా ప్రార్ధన:
మంత్రహీనం క్రియాహీనము శక్తి హీనం గణాధిపా
యత్ పూజితం మయా దేవం పరిపూర్ణం తదంతుతే..

అని చదువుకుని అక్షతలను చేతిలో వేసుకుని మూడు సార్లు నీరు పోస్తూ ఆ అక్షతలను పళ్లెం లోకి వదిలివేయాలి.

 

 

 

 

 

Happy Vinayaka Chavithi images

Happy Vinayaka Chavithi images


You may also like