41 రోజులు 4 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన… “చంద్రయాన్-3” ఇప్పుడు ఏం చేయనుంది.?

41 రోజులు 4 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన… “చంద్రయాన్-3” ఇప్పుడు ఏం చేయనుంది.?

by Sainath Gopi

Ads

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ చంద్రయాన్‌ 3 విజయవంతంగా జాబిల్లి పై ల్యాండ్ అయ్యి, దక్షిణ ధ్రువంలో అడుగు పెట్టిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. చందమామ పై పరిశోధనలు చేయడం కోసం ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌ 3 విజయవంతమైంది.

Video Advertisement

ప్రపంచ వ్యాప్తంగా ఇస్రో సాధించిన విజయం పై ప్రశంసలు కురుస్తున్నాయి. చంద్రుడి ఉపరితలం పై ఆగస్టు 23 ల్యాండర్‌ సేఫ్‌గా ల్యాండింగ్‌ అయ్యింది. దీంతో వరల్డ్ లోనే ల్యాండర్‌ను చంద్రుడి పై దింపిన 4వ దేశంగా భారత్‌ రికార్డ్ క్రియేట్ చేసింది.

నాలుగు లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి “చంద్రయాన్-3 ” చంద్రుడి యొక్క సౌత్ పోల్ పైన ల్యాండ్ అయిపోయింది. ముఖ్యంగా సౌత్ పోల్ మీద ల్యాండ్ అవ్వడానికి కారణం ఏంటంటే అక్కడ నీళ్లు ఉన్నట్టుగా తెల్సింది అంట. అది నిజమైతే భవిష్యత్తులో మనుషులు చంద్రమండలం పై ఉండగలిగే అవకాశం ఉంది.

అంతేకాదు అక్కడ హీలియం గ్యాస్ కూడా ఎక్కువ ఉంది అని నమ్ముతున్నారు. ఇప్పుడు అది నిజమో కాదో చంద్రయాన్ 3 తెలుపనుంది. ఒకవేళ అదే నిజమైతే ఆ హీలియం గ్యాస్ ని భూమి మీదకి తీసుకొని రాగలిగితే… ఒక నగరానికి ఒక ఏడాది పాటు విద్యుత్తు శక్తిని ఉచితంగా అందించచ్చు అంట. అంతేకాదు మనకి ఉపయోగపడే మరిన్ని కెమికల్స్ కూడా చంద్రుడి యొక్క సౌత్ పోల్ మీద ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకే చంద్రయాన్ 3 ని సౌత్ పోల్ దగ్గరకి పంపించింది మన ఇస్రో.

చంద్రుడిపై ల్యాండ్ అయిన లాండర్ “విక్రమ్”…ఒక 14 రోజుల పాటు అక్కడ ప్రయాణించి ఈ ఇన్ఫర్మేషన్ అంతా సేకరించి ఇస్రో కి అందించనుంది. ఈ చంద్రయాన్ 3 కి 650 కోట్ల బడ్జెట్ అయ్యింది. ఇంత తక్కువ బడ్జెట్ లో చంద్రుడి యొక్క సౌత్ పోల్ పై అమెరికా, రష్యా కూడా వెళ్లలేకపోయారు. అందుకే భారత దేశానికి ఇదొక చారిత్రాత్మక సమయం.చంద్రయాన్-3 వల్ల ఇండియాకి కలిగే మరిన్ని ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..చంద్రయాన్‌ 3 సుమారు 41 రోజుల పాటు భూమి నుండి చంద్రుడి వైపు ప్రయాణించి ల్యాండర్‌ మాడ్యూల్‌ ‘విక్రమ్‌’ ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లి పై అడుగుపెట్టింది. చందమామ పై అడుగిడాలనే భారత్ ఎన్నో ఏళ్ల కల సాకారం అయ్యింది. చంద్రయాన్-3 వల్ల దేశానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
Chandrayaan-3

  • విక్రమ్ విజయవంతమైన ల్యాండింగ్ భారతదేశాన్ని ఎలైట్ క్లబ్ ఆఫ్ దేశాలలో చేర్చింది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే ఈ ఘనత సాధించగలిగాయి.
  • చందమామ ఉపరితలం నివాసయోగ్యమో, కాదో పరిశోధిస్తుంది. చందమామ మీద జరిగే మార్పులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని భూమికి చేరవేస్తుంది.
  • చంద్రయాన్-3 చంద్రునిపై సాఫ్ట్-ల్యాండ్ అవడం వల్ల ఇది భారతదేశంలో వ్యాపారానికి పెద్ద ప్రోత్సాహంగా మారుతుంది.
  • బిలియన్ల డాలర్లతో అభివృద్ధి చెందుతున్న “మూన్ ఎకానమీ” రంగంలో చంద్రయాన్-3 విజయంతో ఇండియా కూడా  భాగం అవుతుంది.
  • చంద్రయాన్ 3 విజయంతో ఇండియా ప్రైవేట్ స్పేస్-టెక్ పర్యావరణ వ్యవస్థ విస్తృతమైన అవకాశాలతో ప్రకాశిస్తోంది. రెండు సంవత్సరాల క్రితం, భారతదేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 2020లో $9.6 బిలియన్లకు పైగా విలువను కలిగి ఉంది. అయితే 2025 నాటికి, ఇది $13 బిలియన్లకు చేరుకోవచ్చని అంచనా. చంద్రయాన్-3 ప్రయోగంతో ఈ రంగానికి పెద్ద భుమ్ వస్తుంది.
  • చంద్రయాన్-3 యొక్క విజయవంతమైన ప్రయోగం ద్వారా ఇన్వెస్టర్స్ లో విశ్వాసాన్ని పెంచుతుంది.
  • అంతరిక్ష సాంకేతికతలో మరిన్ని ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించగలదు.
  • భూమిలాంటి లక్షణాలతో ఉన్న ఎక్సోప్లానెట్‌ల కోసం పరిశోధకులకు సహాయం చేస్తుంది.
  • అంతరిక్ష యాత్రలలో ఇండియా భాగస్వామ్యం అయ్యేందుకు మార్గం సుగమం చేస్తుంది.

Also Read: చంద్రయాన్-3 మిషన్ లో ఆ చివరి 17 నిమిషాలు మాత్రమే ఎందుకు కీలకం..? సాఫ్ట్ ల్యాండింగ్ ఎలా జరుగుతుందంటే..?


End of Article

You may also like