• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

మహా భారత యుద్ధం తరువాత అసలేం జరిగింది..? పాండవులు ఏమయ్యారు..?

Published on April 21, 2022 by Lakshmi Bharathi

మహాభారతం అందరికి తెలిసినదే.. కానీ పూర్తి గ్రంధాన్ని తెలుసుకున్న వారు చాలా తక్కువ మందే ఉంటారు. ఈ మధ్య కాలం లో మహాభారతం పైన కధలు, వెబ్ సిరీస్ లు ఎక్కువ గా వస్తున్నాయి కాబట్టి ఈ మాత్రం అవగాహనా అయినా ఏర్పడుతోంది. మహాభారతం ఎన్ని సార్లు చదివినా.. చూసినా.. ప్రతిసారి ఓ కొత్త విషయం బోధపడుతూ ఉంటుంది. చాలామంది.. కురుక్షేత్ర యుద్ధం తో మహాభారతం ముగిసింది అనుకుంటూ ఉంటారు.

pandavas 3

కానీ అది అవాస్తవం. మహాభారత యుద్ధం జరిగాక చాలా ఘట్టాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం మనం యుద్ధం పూర్తి అయ్యాక అసలు ఏమి జరిగిందో.. పాండవులు ఏమయ్యారో తెలుసుకుందాం. కురుక్షేత్రం లో యుద్ధం దాదాపు పద్దెనిమిది రోజుల పాటు సాగింది. ఈ యుద్ధం లో కౌరవులు ఓడిపోతే.. పాండవులు విజయం సాధించారని మనందరికీ తెలుసు. దాదాపు ఎనభై శాతం మంది పురుష జనాభా ఈ యుద్ధం లో మరణించింది. ఈ యుద్ధం పూర్తయ్యాక ఎవరెవరు బతికారు.. వారు ఏమి చేసారు అన్నది చాలా తక్కువ మందికి తెలుసు.

pandavas 4

పాండవులు విజయం సాధించాక.. వారు హస్తినాపురానికి రాజులు అయ్యి.. పాలనా కొనసాగించారు. కౌరవులు యుద్ధం లో ఓడిపోయి మరణించడం తో.. కౌరవుల తల్లి అయిన గాంధారి శ్రీకృష్ణుడిని శపిస్తుంది. నా కొడుకులలానే చనిపోతావు అంటూ శాపం పెడుతుంది. అందుకే అవతార పరిసమాప్తి సమయం లో శ్రీకృష్ణుడు అడవిలో ఓ చోట కూర్చుండగా… ఆయన కాళ్ళకి ఉన్న పారాణిని చూసి.. ఓ వేటగాడు జంతువు అనుకోని భ్రమపడి చాటు నుంచి బాణం వేస్తాడు.

pandavas 6

రామావతారం లో వాలి పెట్టిన శాపం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. చాటు గా రాముడు వాలి పై బాణం వేసాడని మనందరికి తెలుసు. అప్పుడు వాలి రాముడికి కూడా అలాంటి చావు తప్పదంటూ శపిస్తాడు. మరొక అవతారం లో ఆ శాపాన్ని అనుభవిస్తానని రాముడు మాట ఇస్తాడు.. కృష్ణావతారం లో ఇలా చాటు గా వేటగాడు బాణం వేయడం వలన మరణిస్తాడు. ఇక పాండవుల విషయానికి వస్తే.. దాదాపు 36 సంవత్సరాల పాలన తరువాత వారు కూడా కృష్ణుడి మరణాన్ని తెలుసుకుని తమ జన్మని చాలించే సమయం ఆసన్నమైందని అనుకుంటారు.

pandavas 2

ద్వాపర యుగం పూర్తయ్యి కలియుగం ప్రారంభం అవ్వబోతోందని వారు గ్రహిస్తారు. శ్రీ కృష్ణుని మరణానంతరం పాండవులు కూడా తమ గమ్యం పూర్తి అయిందని భావించారని వేదవ్యాసుడు చెబుతాడు. వారంతా స్వర్గాన్ని చేరుకోవడం కోసం హిమాలయాలను ఎక్కడం ప్రారంభిస్తారు. వారికి తెలియకుండా యమ ధర్మరాజు కూడా శునకం రూపం లో వారితోనే వెళుతూ ఉంటాడు.

pandavas 1

హిమాలయాలు ఎక్కుతున్న సమయం లోనే.. ద్రౌపది, భీముడు.. ఇలా ఒక్కొక్కరి నెలకొరుగుతూ ఉంటారు. వారు చేసిన కొన్ని పాప కర్మల వలన వారు నరకానికి చేరుకుంటారు. ఇక యుధిష్టరుడు మాత్రం చివర వరకు ఎక్కగలుగుతాడు. యుధిష్టరుడు ఒక్కడు మిగిలిపోయినతరువాత.. యమధర్మ రాజు శునకరూపాన్ని వీడి.. అసలు రూపం ధరిస్తాడు. తన సోదరులు ఎలాంటి పనులకు ఎలాంటి శిక్షలు అనుభవిస్తున్నారో చూపిస్తానని నరకానికి తీసుకెళ్లి చూపిస్తాడు. ఆ తరువాత.. స్వర్గలోకాధిపతి ఇంద్రుడు ఆయనను స్వర్గానికి తీసుకెళ్ళిపోతారు. వీరంతా.. ఈ భూమిని విడిచిపెట్టాకే కలియుగం మొదలైందని చెబుతుంటారు.


We are hiring Content Writers. Click Here to Apply



Search

Recent Posts

  • ఆ హీరోయిన్ ను రష్మిక మాజీ ప్రియుడు పెళ్లి చేసుకోబోతున్నారా..? షాక్ లో ఉన్న స్టార్ హీరోయిన్..!
  • “ఇక్కడ వదిలేస్తే నేను బతకలేను.. భయమేస్తోంది నాన్న..” వైరల్ అవుతున్న విస్మయ ఆడియో క్లిప్.. అసలేం జరిగిందంటే?
  • “మురళి విజయ్”తో ఎఫైర్ పెట్టుకొని భర్తకు విడాకులు… “దినేష్ కార్తీక్” గురించి ఇది తెలిస్తే రియల్ హీరో అంటారు.!
  • “NTR 31” పోస్టర్ లో ఇది గమనించారా..? అంటే ఎన్టీఆర్ వాళ్లద్దరికీ పుట్టబోయే కొడుకు అవుతాడా..?
  • పాపం అఖిల్.. అప్పుడు బిగ్ బాస్ టివిలో వచ్చినప్పుడూ అంతే.. ఇప్పుడు ఓటిటిలో కూడా…?

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions