మహా భారత యుద్ధం తరువాత అసలేం జరిగింది..? పాండవులు ఏమయ్యారు..?

మహా భారత యుద్ధం తరువాత అసలేం జరిగింది..? పాండవులు ఏమయ్యారు..?

by Anudeep

Ads

మహాభారతం అందరికి తెలిసినదే.. కానీ పూర్తి గ్రంధాన్ని తెలుసుకున్న వారు చాలా తక్కువ మందే ఉంటారు. ఈ మధ్య కాలం లో మహాభారతం పైన కధలు, వెబ్ సిరీస్ లు ఎక్కువ గా వస్తున్నాయి కాబట్టి ఈ మాత్రం అవగాహనా అయినా ఏర్పడుతోంది. మహాభారతం ఎన్ని సార్లు చదివినా.. చూసినా.. ప్రతిసారి ఓ కొత్త విషయం బోధపడుతూ ఉంటుంది. చాలామంది.. కురుక్షేత్ర యుద్ధం తో మహాభారతం ముగిసింది అనుకుంటూ ఉంటారు.

Video Advertisement

pandavas 3

కానీ అది అవాస్తవం. మహాభారత యుద్ధం జరిగాక చాలా ఘట్టాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం మనం యుద్ధం పూర్తి అయ్యాక అసలు ఏమి జరిగిందో.. పాండవులు ఏమయ్యారో తెలుసుకుందాం. కురుక్షేత్రం లో యుద్ధం దాదాపు పద్దెనిమిది రోజుల పాటు సాగింది. ఈ యుద్ధం లో కౌరవులు ఓడిపోతే.. పాండవులు విజయం సాధించారని మనందరికీ తెలుసు. దాదాపు ఎనభై శాతం మంది పురుష జనాభా ఈ యుద్ధం లో మరణించింది. ఈ యుద్ధం పూర్తయ్యాక ఎవరెవరు బతికారు.. వారు ఏమి చేసారు అన్నది చాలా తక్కువ మందికి తెలుసు.

pandavas 4

పాండవులు విజయం సాధించాక.. వారు హస్తినాపురానికి రాజులు అయ్యి.. పాలనా కొనసాగించారు. కౌరవులు యుద్ధం లో ఓడిపోయి మరణించడం తో.. కౌరవుల తల్లి అయిన గాంధారి శ్రీకృష్ణుడిని శపిస్తుంది. నా కొడుకులలానే చనిపోతావు అంటూ శాపం పెడుతుంది. అందుకే అవతార పరిసమాప్తి సమయం లో శ్రీకృష్ణుడు అడవిలో ఓ చోట కూర్చుండగా… ఆయన కాళ్ళకి ఉన్న పారాణిని చూసి.. ఓ వేటగాడు జంతువు అనుకోని భ్రమపడి చాటు నుంచి బాణం వేస్తాడు.

pandavas 6

రామావతారం లో వాలి పెట్టిన శాపం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. చాటు గా రాముడు వాలి పై బాణం వేసాడని మనందరికి తెలుసు. అప్పుడు వాలి రాముడికి కూడా అలాంటి చావు తప్పదంటూ శపిస్తాడు. మరొక అవతారం లో ఆ శాపాన్ని అనుభవిస్తానని రాముడు మాట ఇస్తాడు.. కృష్ణావతారం లో ఇలా చాటు గా వేటగాడు బాణం వేయడం వలన మరణిస్తాడు. ఇక పాండవుల విషయానికి వస్తే.. దాదాపు 36 సంవత్సరాల పాలన తరువాత వారు కూడా కృష్ణుడి మరణాన్ని తెలుసుకుని తమ జన్మని చాలించే సమయం ఆసన్నమైందని అనుకుంటారు.

pandavas 2

ద్వాపర యుగం పూర్తయ్యి కలియుగం ప్రారంభం అవ్వబోతోందని వారు గ్రహిస్తారు. శ్రీ కృష్ణుని మరణానంతరం పాండవులు కూడా తమ గమ్యం పూర్తి అయిందని భావించారని వేదవ్యాసుడు చెబుతాడు. వారంతా స్వర్గాన్ని చేరుకోవడం కోసం హిమాలయాలను ఎక్కడం ప్రారంభిస్తారు. వారికి తెలియకుండా యమ ధర్మరాజు కూడా శునకం రూపం లో వారితోనే వెళుతూ ఉంటాడు.

pandavas 1

హిమాలయాలు ఎక్కుతున్న సమయం లోనే.. ద్రౌపది, భీముడు.. ఇలా ఒక్కొక్కరి నెలకొరుగుతూ ఉంటారు. వారు చేసిన కొన్ని పాప కర్మల వలన వారు నరకానికి చేరుకుంటారు. ఇక యుధిష్టరుడు మాత్రం చివర వరకు ఎక్కగలుగుతాడు. యుధిష్టరుడు ఒక్కడు మిగిలిపోయినతరువాత.. యమధర్మ రాజు శునకరూపాన్ని వీడి.. అసలు రూపం ధరిస్తాడు. తన సోదరులు ఎలాంటి పనులకు ఎలాంటి శిక్షలు అనుభవిస్తున్నారో చూపిస్తానని నరకానికి తీసుకెళ్లి చూపిస్తాడు. ఆ తరువాత.. స్వర్గలోకాధిపతి ఇంద్రుడు ఆయనను స్వర్గానికి తీసుకెళ్ళిపోతారు. వీరంతా.. ఈ భూమిని విడిచిపెట్టాకే కలియుగం మొదలైందని చెబుతుంటారు.


End of Article

You may also like