“మైసూర్” ని కాదని “బెంగళూర్” నే కర్ణాటక రాజధానిగా ఎందుకు చేసారో తెలుసా..?

“మైసూర్” ని కాదని “బెంగళూర్” నే కర్ణాటక రాజధానిగా ఎందుకు చేసారో తెలుసా..?

by Anudeep

Ads

కర్ణాటక రాజధాని బెంగళూర్ అన్న సంగతి మనకి తెలిసిందే. నిజానికి మైసూర్ చాలా పెద్దది. బెంగళూర్ అనేది మైసూర్ రాజ్యం లో ఓ పార్ట్ మాత్రమే. కానీ.. మైసూర్ ని కాదని బెంగళూర్ ని మాత్రమే ఎందుకు రాజధానిగా చేసుకున్నారు..? మీకెప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా..?

Video Advertisement

దీనికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బెంగళూరు తో పోలిస్తే మైసూర్ కి చాలా చారిత్రాత్మిక నేపధ్యం ఉంది. అయినప్పటికీ బెంగళూర్ నే రాజధానిగా ఎంచుకోవడానికి ప్రముఖ కారణం బ్రిటిషర్లు.

mysore 2

ఈ విషయమై కొంత లోతుగా ఆలోచిస్తే.. మైసూర్ రాజ్యాన్ని 14 వ శతాబ్దం నుంచి వడియార్లు పరిపాలించారు. భారత దేశాన్ని బ్రిటిషర్లు పాలిస్తున్న ఆ రోజుల్లో.. వారితో సంధి చేసుకుని.. వారికి అనుగుణంగానే వీరు పాలన సాగించేవారు. బెంగళూర్ మైసూర్ లో ఓ పార్ట్ గానే ఉండేది. దానిపై బ్రిటిష్ వారి ఆధిపత్యమే ఎక్కువగా ఉండేది.

bangalore

వారు బెంగళూర్ ని అభివృద్ధి వైపు నడిపించారు. వారి అవసరాల కోసమే బెంగళూర్ ని డెవలప్ చేసారు. బెంగళూర్ వాతావరణం కూడా వారికి అనువుగా ఉండడం మరొక కారణం. మైసూర్ లో మొదటగా విద్యుత్ వచ్చిన ప్రాంతం కూడా బెంగళూరు. టెలిఫోన్, టెలిగ్రామ్ వంటి సౌకర్యాలు, అలానే బ్రిటిష్ నుంచి వచ్చే వ్యాపారస్తుల కోసం రైల్వే లైన్స్, థియేటర్లు, హాస్పిటల్స్, యూనివర్సిటీలు.. చివరకు బ్రిటిష్ కాలనీలు కూడా వెలిసాయి. బెంగళూరు చాలా అభివృద్ధి చెందింది. ఇక, స్వతంత్రం వచ్చాక.. పూర్తిగా అభివృద్ధి చెందిన బెంగళూర్ నే రాజధానిగా ఎంచుకున్నారు.


End of Article

You may also like