ఈ “కోట” వల్ల అప్పుల పాలు అయ్యారా..? అసలు ఎందుకు కట్టారు..?

ఈ “కోట” వల్ల అప్పుల పాలు అయ్యారా..? అసలు ఎందుకు కట్టారు..?

by kavitha

Ads

ఒకప్పుడు రాజులు ఉండేవారని వారు ఎన్నో రకాల రాజభోగాలను అనుభవించారని హిస్టరీ బుక్స్ లో చదువుకున్నాం. కానీ నేరుగా చూడలేదు. అయితే తెలంగాణ రాజధాని హైదరాబాద్ ను ఒకప్పుడు నిజాం రాజులు పాలించారు. నిజాం రాజులు ఎన్నో రకాల రాజాభోగాలను అనుభవించారు. అవి తెలుసుకోవాలి అంటే ఫలక్‌నుమా ప్యాలెస్ ను చూస్తే చాలు.

Video Advertisement

ప్రస్తుతం హోటల్ గా ఉన్న తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ లో ఒకప్పుడు పాలించిన నిజాం రాజుల వైభవం కనిపిస్తుంది. రాజకీయ నాయకుల నుండి పెద్ద పెద్ద బిజినెస్ మెన్ ల వరకు హైదరాబాద్ వస్తే ఇక్కడే ఉండాలని అనుకుంటారు. అయితే అలాంటి ప్యాలెస్ ను కట్టించిన వ్యక్తి అప్పుల పాలయ్యారంట. ఈ ప్యాలెస్ కు ఎందుకంత ఖర్చు అయ్యింది? ఈ ప్యాలెస్ లో ఏముందో ఇప్పుడు చూద్దాం..
ఫలక్‌నుమా ప్యాలెస్ అద్భుతమైన చరిత్ర ఉన్న ఇండియన్ వారసత్వ ప్యాలెస్‌లలో ఒకటి. తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ ప్రపంచంలోనే అత్యుత్తమమైన భవనాలలో ఒకటి. హైదరాబాద్ రాష్ట్ర నిజాం యొక్క అమూల్యమైన వారసత్వం. దీనిని అప్పటి హైదరాబాద్ ప్రధాని మరియు 6 వ నిజాం నవాబ్ మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ బహదూర్ యొక్క బావ నవాబ్ వికార్-ఉల్-ఉమ్రా ఫలక్‌నుమాలో 32 ఎకరాల ప్రదేశంలో నిర్మించారు. ‘ఫలక్-నుమా’ అనేది ఉర్దూ పదం, దీనికి
అర్ధం ఆకాశ దర్పణం. ఫలక్‌నుమా ప్యాలెస్ అలాగే ఉంటుంది.
సర్ వికార్ అని పేరుగాంచిన నవాబ్ వికార్-ఉల్-ఉమ్రా తన కలల అడుగుల ఎత్తైన కొండపై 1884లో మార్చి 3న పునాది రాయిని వేశారు. ఈ ప్యాలెస్ నిర్మాణం తొమ్మిది సంవత్సరాల పాటు సాగింది. దీని నిర్మాణం పూర్తిగా 1893లో పూర్తయింది. ఎంతో అందమైన ఈ ప్యాలెస్ దాదాపు 32 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించడం జరిగింది. ప్యాలెస్ 1,011,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ ప్యాలెస్ డిజైన్‌ను రూపొందించడానికి ఒక ఆంగ్ల ఆర్కిటెక్ట్‌ని పిలిచాడు. విలియం వార్డ్ మారెట్ అనే శిల్పి ఈ ప్యాలెస్ ను ‘ఆండ్రియా పల్లాడియో’ అనే శైలిలో నిర్మించాడు.
ఇక ఈ ప్యాలెస్ నిర్మాణానికి ఆ 130 సంవత్సరాల క్రితమే 40లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది. ఈ ప్యాలెస్ అంతా ఇటాలియన్, ట్యూడర్ శైలుల సమ్మేళనంతో ఉన్న ప్రత్యేకమైన నిర్మాణం. ఈ ప్యాలెస్ నిర్మాణం కోసం ఇటలీ నుండి తెప్పించిన నాణ్యమైన ఇటాలియన్ పాలరాతితో కట్టారు. ఈ భవనం తేలు ఆకారంలో కనిపిస్తుంది. సర్ వకార్ రాశి వృచ్చికం అందువల్ల ఈ ప్యాలెస్ ను తేలు ఆకారంలో నిర్మించారు.
తేలు ఆకారంలో ఉన్న ప్యాలెస్ మధ్యలో ప్రధాన భవనం, గోల్ బంగ్లా, జెన్నా మహల్, వంటగది, దక్షిణ వైపు పట్టపు రాణులు, వారి చెలికత్తెల కోసం నిర్మించారు. ఫలక్ నుమా ప్యాలెస్ లోని కిటికీలకు వాడిన రంగు రంగుల అద్దాల నుంచి వచ్చే సూర్య కాంతి ప్యాలెస్ లోని గదులకు ప్రత్యేక ఆకర్షణ కలుగచేస్తాయి.
ఇంత అందమైన ప్యాలెస్ లో సర్ వికార్ 1897-98 వరకు మాత్రమే వ్యక్తిగత నివాసంగా ఉపయోగించుకున్నాడు. ఈ ప్యాలెస్ అత్యంత ఖరీదైన నిర్మాణం. దీని నిర్మాణం కోసం చేసిన అప్పులను కట్టడానికి వికార్ కు ఎంతో కాలం పట్టిందట. ఆ తర్వాత ప్యాలెస్ యాజమాన్య బాధ్యతలను 6వ నిజాంకు అప్పగించారు.
సర్ వికార్ తన భార్య ఇచ్చిన సలహా ప్రకారం అప్పటి రాజు మహబూబ్ అలీ పాషా నిజాంను ప్యాలెస్ కు ఆహ్వానించారు. ప్యాలెస్ కు వచ్చిన మహెబూబ్ అలీ పాషా ప్యాలెస్ యొక్క నిర్మాణానికి ముగ్దులయ్యారు. దానిని చూసిన తరువాత చాలా ఖరీదు అయ్యిందని, ప్యాలెస్ కట్టడం కోసం వికార్ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాడని తెలుసుకుని వకార్ కు అవసరమయిన ఆర్థిక సహాయం చేశారు. ఆయన అక్కడ నెలరోజుల పాటు ఉన్నారు.
సర్ వికార్ ప్యాలెస్ ను మహబూబ్ అలీ పాషాకు బహుమతిగా ఇచ్చాడు.  కానీ అలీ పాషా దానిని బహుమతిగా స్వీకరించడానికి నిరాకరించాడు. ఆ ప్యాలెస్ కు  తగిన మొత్తాన్ని ఇచ్చి తీసుకున్నాడు. ఆయన తరువాత ఏడో నిజాం ఈ ప్యాలెస్‌ను ‘రాయల్ గెస్ట్ హౌస్‌’ గా ఉపయోగించుకున్నారు.ఫలక్‌నుమా ప్యాలెస్‌లోని లైబ్రరీ ఇంగ్లాండ్‌లోని విండ్సర్ కాజిల్ లైబ్రరీ వలె గంభీరంగా ఉంటుంది. విండ్సర్ కాజిల్ లైబ్రరీ తరహాలో రూపొందించబడింది. ఇది నిజాం కచేరీల నుండి అరుదైన మాన్యుస్క్రిప్ట్‌లు మరియు పుస్తకాలను కలిగి ఉంది. ప్యాలెస్ లోని గ్రంథాలయంలో ఇండియాలోని అతి అరుదైన ఖురాన్ గ్రంథాలు ఉన్నాయి.ఇక్కడి బిలియర్డ్స్ గదిలోని బిలియర్డ్స్ టేబుల్ చాలా అరుదు అయినది. ఇలాంటి అరుదైన టేబుల్స్ ప్రపంచంలో రెండు మాత్రమే ఉన్నాయి. ఒకటి ఫలక్‌నుమా ప్యాలెస్‌ లో ఉంది. మరొకటి లండన్‌ బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ఉంది. టేబుల్ అద్భుతమైన, విలాసవంతమై నిర్మాణాన్ని కలిగి ఉంది. ప్యాలెస్ గోడల పై ఉన్న ప్రముఖుల ఫోటోలు ఆయిల్ పెయింటింగ్ తో వేశారు. ఇలాంటి ఎన్నో విశేషాలు ఫలక్ నుమా ప్యాలెస్ సొంతం అని చెప్పవచ్చు.
ప్రపంచంలోనే అత్యంత పొడవైన 108 అడుగుల డైనింగ్ టేబుల్ లో ఒకేసారి 101 మంది కూర్చుని భోజనం చేయవచ్చు. ఈ భారీ డైనింగ్ హాల్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ కు ప్రత్యేక ఆకర్షణ. దీనిని ప్రత్యేకమైన కలపతో తయారు చేశారు. ఈ టేబుల్ 80 అడుగుల పొడవు, 5.7 అడుగుల వెడల్పు, 2.7 అడుగుల ఎత్తు ఉంది. ఈ టేబుల్‌ తయారీకి  టేకు, రోజ్‌ ఉడ్‌లను ఉపయోగించారు. చుట్టూ ఉన్న కుర్చీలకు పచ్చని రంగు కల అరుదైన లెదర్‌ని వాడారు.
2000 సంవత్సరం ముందు సాధారణ ప్రజలను ఫలక్ నుమా ప్యాలెస్‌లోకి రానివ్వలేదు. తాజ్ గ్రూప్ ఈ ప్యాలెస్ ను అద్దెకు తీసుకుని, మరింతగా ఆధునీకరించి ఫ్రాన్స్ నుండి తీసుకువచ్చిన అందమైన ఫర్నీచర్ మరియు హస్తకళా వస్తువులతో ఈ హోటల్ ను మరింత అందంగా అలంకరించారు. ఈ హోటల్ 2010 నవంబర్ లో ప్రారంభం అయ్యింది. ఈ హోటల్లో ప్రస్తుతం ఎవరైనా భోజనం చేయవచ్చు. ఈ ఇక్కడి డైనింగ్ టేబుల్‌ పై భోజనం చేయాలంటే మాత్రం కనీసం 40 మంది ఉండాలి. ఈ హోటల్ బస కూడా చాలా ఖరీదు. భోజనం ధర 5 వేలు. ప్రత్యేక టేబుల్‌ భోజనం రూ.18వేలు. ఒకరోజు ఇక్కడ ఉండటానికి దాదాపు 46,000. ఈ ప్యాలెస్‌ లో 60 గదులు మరియు 22 హాళ్లు ఉన్నాయి.

Also Read: “నిజాం” వారసుడి సంపద అయిన 4000 కోట్లు… ఎలా ఆవిరి అయ్యాయో తెలుసా..?


End of Article

You may also like