కొంతమంది ఎప్పుడు ఎక్కడ కూర్చున్న కూడా అదే పనిగా రెండు కాళ్ళు ఊపుతూ ఉంటారు. చిన్నతనంలో ఇలా చేసినపుడు బామ్మలు లేదా అమ్మమ్మలు కాళ్లు ఊపడం దరిద్రం అంటూ తల పై మొట్టికాయలు వేయడం, లేదా కాళ్ళు ఊపకూడదని కోప్పడేవారు.
ఎక్కువగా ఖాళీగా కూర్చున్న సమయంలో కాళ్ళు ఊపడం అనేది కనిపిస్తుంటుంది. కొంతమంది అయితే గ్యాప్ లేకుండా కాళ్లను ఊపుతూనే ఉంటారు. ఇలా కాళ్ళు ఊపుతుంటే వారు చేస్తున్న వర్క్ పై మీద దృష్టి ఉండదని చెబుతుంటారు. అయితే కాళ్ళు ఊపడం మంచిదో? కాదో ఇప్పుడు చూద్దాం..
బీబీసి తెలుగు న్యూస్ కథనం ప్రకారం, కాళ్ళు ఊపడం వెనుక ఒక కారణం ఉందని తెలుస్తోంది. ఇతరుల దృష్టిని ఆకర్షించడం కోసం కొందరు కాళ్ళు ఊపుతూ ఉంటారట. ఈ విధంగా చేయడాన్ని ఫిజెటింగ్ అని పిలుస్తారు. అయితే ఫిజెటింగ్ పై ఉన్న ఈ అభిప్రాయనికి భిన్నమైన అభిప్రాయాన్ని తాజాగా చేసిన కొత్త అధ్యయనంలో తెలిసింది. ఆరోగ్యకరమైన బరువు కోసం, స్ట్రెస్ ను అధిగమించడం కోసం మరియు ఎక్కువ కాలం బ్రతకడం కోసం ఈ ఫిజెటింగ్ దోహదపడుతుందని ఈ అధ్యయనం వెల్లడించింది.
“ఒకే చోట కదలకుండా ఎక్కువ సేపు కూర్చుని ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే కూర్చుని ఉన్నప్పుడు కాళ్ళను తరచూ ఊపడం లేదా కదిలించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని” అని న్యూట్రిషనిస్ట్గా యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్లో వర్క్ చేసే జానెత్ కాడే వెల్లడించింది. గంటల తరబడి కుర్చీలో కూర్చుని ఉండటం వల్ల, బాడీలోని మెటాబాలిజం రేటు తగ్గిపోతుంది. దానివల్ల బ్లడ్ షుగర్ను, బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేసే సామర్థ్యం పై ఎఫెక్ట్ పడుతుంది. అలాగే శరీరంలోని ఫ్యాట్ ను కరిగించేందుకు అడ్డంకిగా కూడా మారుతుంది.
ఒకే చోట కూర్చుని ఉండటం కన్నా, ఎప్పుడూ కదులుతూ ఉండటం ద్వారా బరువు తగ్గేందుకు ఈ ఫిజెటింగ్ సహాయ పడుతుందని అధ్యయనం తెలుపుతోంది. ఫిజెటింగ్ లా కాళ్లను ఊపడం ద్వారా శరీరంలో ఉన్న అదనపు బరువును తగ్గించుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు.






తలుపులు, కిటికీలు, లేని ట్రైన్స్ ఉంటాయి. కొన్నిట్రైన్స్ బోగీలకు తలుపులు, కిటికీలు ఉండవు. పూర్తిగా క్లోజ్ చేసి ఉంటుంది. వీటిని ఎన్ఎంజీ ట్రైన్స్ అంటారు. మిగతా రైళ్లతో పాటుగా ఎన్ఎంజీ ట్రైన్ ను కూడా ఇండియన్ రైల్వే నడుపుతోంది. సాధారణంగా రైలు ప్రయాణం చేసేవారు ఎక్కడో ఒక చోట ఎన్ఎంజీ రైలును గమనించే ఉంటారు. ప్యాసింజర్ ట్రైన్స్ ను ఎన్ఎంజీ రైళ్లుగా మారుస్తారు.
ఎన్ఎంజీ రైలు అంటే..
ప్యాసింజర్ – ఎన్ఎంజీ రైళ్లు..
లోపల ఉండే సీట్లన్నీ తొలగిస్తారు. లైట్లు, ఫ్యాన్లు తీసివేసి, దృఢంగా మార్చడం కోసం ఐరన్ స్ట్రిప్స్ ను వాడతారు. దీనినే ఎన్ఎంజీ అంటారు. కార్లు, ట్రాక్టర్లు, మినీ ట్రక్కులు వంటి వెహికిల్స్ ను ట్రాన్స్ పోర్ట్ చేయడానికి ఉపయోగిస్తారు.
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో గాంధీ నడిచిన దారిని ఇప్పటికీ గాంధీ రోడ్డు అని పిలుస్తుంటారు. ఈ రోడ్ లో ఒక ఓల్డ్ బేకరీ ఉంది. అది ఇప్పటిది కాదు. స్వతంత్రం రాకముందు, 1933 లో ప్రారంభించిన రామకృష్ణ బేకరీ ఇది. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ఈ షాప్ లో లభించే స్వీట్ చాలా ఫేమస్. ఈ బేకరీలో ఇప్పటికీ స్వాతంత్ర ఉద్యమ ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. ఈ బేకరిని 1936 లో శ్రీ రామ కృష్ణయ్య మొదలుపెట్టారు. ఇప్పటికీ వారి వారసులు దానిని కొనసాగిస్తున్నారు.
గాంధీజీ 1921 లో ఈ మార్గం గుండా నడిచారని చెబుతారు. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాంతంలో గత తొంబై సంవత్సరాలుగా రామకృష్ణ బేకరీ ఒక ప్రత్యేక స్వీట్ ను అందిస్తోంది. ఆ స్వీట్ పేరు బాసంతి. దీనిని బాసుంది అని కూడా పిలుస్తారు. ఈ స్వీట్ ని చూస్తే స్థానీకులకే కాకుండా తిరుపతికి వచ్చే టూరిస్టులకు కూడా నోరూరుతుంది. పాలకోవాను ఇష్టపడే స్వీట్ లవర్స్ బాసంతిని సైతం అంతే ఇష్టంగా తింటారు.
బాసంతి కప్పు ధర 50 రూపాయలు. దీనిని ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. ఈ బేకరిని గాంధీజీ కూడా సందర్శించారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఆ బేకరీలో కనిపిస్తాయి. “90 సంవత్సరాలుగా బాసంతి తయారీలో ఎటువంటి మార్పులు చేయలేదని, అప్పటిలానే ఇప్పుడు తయారు చేస్తూ వస్తున్నమని” నిర్వాహకులు కుమార్ వెల్లడించారు.





రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో నటించిన ‘ఆ నలుగురు’ సినిమా 2004 లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి చంద్ర సిద్ధార్థ దర్శకత్వం వహించారు. నటి ఆమని, కోటా శ్రీనివాసరావు, శుభలేఖ సుధాకర్, హీరో రాజా లాంటి వారు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ నటన అపూర్వం. తన నటనతో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించారు.
విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఇప్పటికీ ఈ మూవీ టీవిలో వస్తే చూసే ఆడియెన్స్ ఉన్నారు. అలాంటి సినిమాకి హీరోగా ముందుగా అనుకున్నది రాజేంద్రప్రసాద్ కాదు. సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ. చంద్ర సిద్ధార్థ ఈ కథను సూపర్ స్టార్ కృష్ణ చెప్పడంతో ఆయనకు బాగా నచ్చి, నటించాలని అనుకున్నారంట. కానీ ఆయన వయసు రీత్యా ఎక్కువ నిడివి పాత్రలో నటించలేనని అన్నారంట.
అలా రాజేంద్రప్రసాద్ నటించారు. అలాగే సినిమాలో హీరోయిన్ కోసం గౌతమి, లక్ష్మి, సుహాసిని, భానుప్రియ, రోజా వంటి వారిని సంప్రదించారట. వారు రిజెక్ట్ చేయడంతో రాజేంద్ర ప్రసాద్ ఆమనిను సూచించడంతో ఆమెను తీసుకున్నారంట. ఈ మూవీ రాజేంద్ర ప్రసాద్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోయింది.