టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగాడు సునీల్. తర్వాత హీరోగా కూడా రెండు మూడు సినిమాలు హిట్ కొట్టాడు. కెరియర్ లో ఎన్నో ఒడిదుడుకులు చవిచూశాడు. ప్రస్తుతం మళ్లీ విలన్ గా చేస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు సునీల్. ఒకప్పుడు సునీల్ కోసమే సినిమాలకి వెళ్లిన ప్రేక్షకులు చాలా మంది ఉండేవారు.
ఎంతో కష్టపడి కమెడియన్ గా ఎదిగిన సునీల్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకున్నాడు. బ్రహ్మానందం లాంటి స్టార్ కమెడియన్స్ కి కూడా గట్టి కాంపిటేషన్ ఇచ్చాడు.

అయితే కమెడియన్ గా కెరియర్ పీక్స్ లో ఉండగానే హీరోగా మారి తన సక్సెస్ఫుల్ కెరీర్ ని డిస్టర్బ్ చేసుకున్నాడు.అటు హీరోగాను సక్సెస్ కాలేక ఇక్కడ ఇటు కామెడీ రోల్స్ కూడా ఎవరు ఇవ్వక దాదాపు కెరియర్ ఎండింగ్ స్టేజ్ కి వచ్చాడు. అయితే మళ్లీ తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన సునీల్ విలన్ గా రాణిస్తున్నాడు. కలర్ ఫోటో సినిమాలో సునీల్ విలనిజం పండించిన తీరు విమర్శకులను సైతం మెప్పించింది. తర్వాత పుష్ప టు, జైలర్ సినిమాలలో కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు సునీల్.

ప్రస్తుతం తమిళంలో కూడా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. అక్కడ కూడా కమెడియన్ గా, విలన్ గా వరుస అవకాశాలు ఆయన కెరీయర్ ని మళ్లీ పునర్నిర్మిస్తున్నాయి. లేటెస్ట్ తమిళ్ మూవీ ఆంటోనీ లో కూడా సునీల్ నటించిన మెప్పించాడు. అయితే సునీల్ హీరోగా నటించిన టైంలో మూడు నుంచి నాలుగు కోట్లు డిమాండ్ చేసేవాడట, అప్పట్లో అది చాలా పెద్ద డిమాండ్ అని అనుకోవాలి.

కానీ ఇప్పుడు కమెడియన్ గా విలన్ గా మారిన తరువాత రెమ్యూనరేషన్ విషయంలో సునీల్ కాస్త తగ్గినట్లే కనిపిస్తున్నాడు. టాలీవుడ్ లో 40 లక్షల వరకు ఇస్తున్నారని అయితే తమిళంలో ఎక్కువ సినిమాలు చేయటం, అక్కడ సునీల్ కి డిమాండ్ పెరుగుతూ ఉండటంతో 60 నుంచి 80 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సినీ వర్గాల టాక్. తమిళం లో ఇతని క్రేజ్ పెరిగితే ముందు ముందు మళ్ళీ మూడు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.

ఎడతెగకుండా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం దేశవ్యాప్తంగా వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. పెట్రోలు ధర రూ.96 – 108 మధ్య విక్రయిస్తుండగా, డీజిల్ రూ.94 నుంచి రూ.100 మధ్య విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ. 109.66 కి విక్రయిస్తున్నారు. ఇక ఇంధన ధరలు పెరగడం వెనుక అనేక కారణాలున్నాయి. కానీ, ప్రస్తుత ధర సామాన్యుడి వెన్ను విరిచే స్థాయికి చేరి, వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతోంది.
కొన్నేళ్ల నుంచి పెట్రోలు ధర ఎక్కువగానే ఉన్నా, కొన్ని దశాబ్దాల క్రితం దాని ధర చాలా తక్కువ. 1963లో పెట్రోల్ లీటరుకు 72 పైసలకు అమ్మినట్టు ఒక పాత బిల్లు ద్వారా తెలుస్తోంది. ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నారు. 1963లో ఫిబ్రవరి 2 కు సంబంధించిన పెట్రోల్ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ బిల్లు భారత్ పెట్రోల్ సప్లై కో నుండి వచ్చింది. ఇది సీరియల్ నంబర్ ‘7560’ కలిగి ఉన్న ఫిల్లింగ్ స్టేషన్. ఐదు లీటర్ల పెట్రోల్కు మొత్తం రూ. 3.60. అంటే ఒక లీటర్ పెట్రోల్ ధర కేవలం 72 పైసలు మాత్రమే. ఈ బిల్లు చూసిన నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
ఒక నెటిజెన్ “60వ దశకంలో మధ్యతరగతి వారి జీతం దాదాపు 50-100 రూపాయలు. నేడు ఆ జీతం దాదాపు 50 వేల నుండి లక్ష రూపాయల వరకు ఉంది. భారీ దిగుమతులు మరియు చాలా తక్కువ ఎగుమతులు చేయడం వల్ల రూపాయి పతనమైంది” అని కామెంట్ చేశాడు.


మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో సినిమాను తాజాగా ప్రకటించారు. రవితేజ హరీష్ శంకర్కు డైరెక్టర్ గా ‘షాక్’ మూవీతో ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆ మూవీ ఆశించినంత విజయం సాధించలేదు. ఆ తర్వాత రవితేజ ‘మిరపకాయ్’ సినిమాతో హరీష్కు రెండవసారి అవకాశం ఇచ్చారు. ఈ మూవీ విజయం సాధించింది. ఈ మూవీతోనే రవితేజకు మాస్ మహారాజా ట్యాగ్ వచ్చింది. పన్నెండేళ్ళ తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతుంది. వీరిద్దరూ కలిసి చేస్తున్న మూడవ సినిమా ఇది. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది.
ఈ మూవీ బాలీవుడ్ మూవీకి రీమేక్ అని తెలుస్తోంది. అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించిన ‘రైడ్’ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారని సమాచారం. 2018లో వచ్చిన రైడ్ మూవీలో అజయ్ దేవగణ్, ఇలియానా జంటగా నటించారు. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఒక విలేజ్ లో అక్రమాస్తులు, బ్లాక్ మనీ అన్యాయంగా సంపాదించి, దాచిపెట్టిన వ్యక్తి ఇంటి పైకి రైడింగ్ చేసే ఇన్ కమ్ టాక్స్ అధికారి కథనే ఈ మూవీ.
కోలీవుడ్ హీరో సూర్య నటించిన ‘గ్యాంగ్’ మూవీతో పోలికలు ఉంటాయి. అయితే ఈ మూవీ అక్షయ్ కుమార్ నటించిన బాలీవుడ్ మూవీ ‘స్పెషల్ 26’ రీమేక్ గా తెరకెక్కిందని తెలుస్తోంది. ఆల్రెడీ వచ్చిన ఈ మూడు సినిమాలను ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులు చూశారు. మళ్ళీ రీమేక్ చేయడానికి అంతగా ఏముందని అంటున్నారు.

