ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో విషాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా గుండెపోటుతో చిన్నవయసులోనే, హఠాత్తుగా కొందరు నటులు మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ కన్నడ హీరో విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో కన్నుమూశారు.
ఫ్యామిలితో కలిసి బ్యాంకాక్కు వెళ్లిన స్పందన సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆమె హఠాన్మరణం ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు కన్నడ సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ ఫ్యామిలీకి హీరో విజయ్ రాఘవేంద్ర బంధువు అవుతాడు.
2007లో హీరో విజయ్ రాఘవేంద్ర, స్పందన వివాహం జరిగింది. స్పందన బెంగళూరు మాజీ పోలీస్ ఆఫీసర్ బీకే శివరామ్ కుమార్తె. ఈ జంటకి కుమారుడు శౌర్య ఉన్నాడు. విజయ రాఘవేంద్ర, స్పందన దంపతులకు కన్నడ పరిశ్రమలో భారీగా అభిమానులు ఉన్నారు. స్పందన 2016లో రిలీజ్ అయిన ‘అపూర్వ’ అనే కన్నడ చిత్రంతో పాటు పలు చిత్రాలలో నటించారు. అంతేకాకుండా భర్త విజయ్ రాఘవేంద్ర సినిమాలకు నిర్మాతగా స్పందన పలు సినిమాలను సైతం నిర్మించింది.
రీసెంట్ గా ఫ్యామిలితో కలిసి బ్యాంకాక్ టూర్కు వెళ్లిన స్పందన ఈరోజు (సోమవారం) ఉదయం గుండెలో నొప్పిగా ఉందని చెప్పినట్లు సమాచారం. ఆమెను హాస్పటల్ కి తరలించేలోపే స్పందన మరణించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మరో 19 రోజుల్లో విజయ్ రాఘవేంద్ర, స్పందనల 16వ వివాహ వార్షికోత్సవం రానుంది. ఈ లోపే స్పందన మరణించడం అందరినీ కలచివేస్తోంది. స్పందన భౌతికకాయం మంగళవారంలోగా బెంగళూరుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. స్పందన మరణం తీవ్రంగా కలచివేస్తోందని విజయ్ రాఘవేంద్ర సన్నిహితులు సామాజిక మధ్యమలలో పోస్టులు పెడుతున్నారు.
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా విజయ్ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కన్నడ ఇండస్ట్రీలో పాపులర్ హీరో అయిన విజయ్ రాఘవేంద్ర దాదాపు 50 చిత్రాలకు పైగా నటించారు. 20కు పైగా సాంగ్స్ ను పాడారు. ప్రస్తుతం ఆయన పలు టెలివిజన్ షోలలోని డ్యాన్స్ ప్రోగ్రామ్లకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.
Also Read: మెగాస్టార్ “చిరంజీవి”, నటసింహం “బాలకృష్ణ” లాగానే… కూతురి వయసు ఉన్న హీరోయిన్లతో జతకట్టిన 10 హీరోస్..!

ప్రజా గాయకుడు గద్దర్ అసలు పేరు విఠల్ రావు. ఆయన 1949లో తూప్రాన్లో జూన్ 5న జన్మించారు. మూడు రోజుల క్రితమే గద్దర్ అపోలో హాస్పటల్ లో గుండెకు చికిత్సను చేయించుకున్నారు. ఈ క్రమంలో వైద్యులు గుండె ఆపరేషన్ విజయవంతం అయినట్టుగా ప్రకటించారు. అయితే అంతలోనే గద్దర్ మరణించడం విషాదకరంగా మారింది. ఇక ఆయన చనిపోవడానికి గల కారణాల గురించి డాక్టర్స్ బులెటిన్ రిలీజ్ చేశారు. గద్దర్ మరణానికి గల ముఖ్యమైన కారణాలను అందులో తెలిపారు.
గద్దర్ ముఖ్యంగా ఊపిరితిత్తులు మరియు మూత్ర సమస్యలతో మృతి చెందినట్లు డాక్టర్స్ వెల్లడించారు. తీవ్రమైన గుండెజబ్బుతో గద్దర్ జూలై 20న హస్పటల్ చేరగా, ఆగస్టు 3వ తారీఖు ఆయనకు బైపాస్ సర్జరీ చేశారు. అది సక్సెస్ అయినా కానీ, గతంలో గద్దర్ కు ఉన్న లంగ్స్ సమస్య వల్ల ఆయన, కోలుకోలేక కన్నుమూసినట్లు వైద్యులు బులెటిన్లో ప్రకటించారు.
గద్దర్ అంత్యక్రియలను నేడు ఆల్వాల్ లోని మహా బోధా స్కూల్లో నిర్వహిస్తారని తెలుస్తోంది. గద్దర్ కు నివాళులు అర్పించడం కోసం ప్రజలతో పాటుగా, రాజకీయ, సినీ ప్రముఖులు, ప్రజాసంఘాల నేతలు ఎల్బీ స్టేడియానికి తరలివస్తున్నారు. గద్దర్ తో తమకున్న ఙ్ఞాపకాలను, అనుబంధాన్ని తల్చుకుంటూ వారు భావోద్వేగానికి లోనవుతున్నారు. జన సేనాని పవన్ కళ్యాణ్ గద్దర్ కన్నుమూసిన విషయం తెలిసిన వెంటనే వచ్చి, గద్దర్ బౌతీక కాయాన్ని సందర్శించి, ఆయన కుటుంబాన్ని పరామర్శించాడు.
విశాఖలోని వన్టౌన్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రమేష్ మర్డర్ కేసులో వీడియో లభించిన విషయం తెలిసిందే. అయితే ఆ వీడియో చూసిన పోలీసులు, రమేష్ వైఫ్ తెలివితేటలకు ఆశ్చర్యపోయారు. లవర్ రామారావుతో కలిసి రమేష్ భార్య మంగళవారం రాత్రి భర్తను ఊపిరాడకుండా చేసి చంపేసిన సంగతి తెలిసిందే. అయితే రమేష్ ను చంపడం కోసం ముందుగానే తన లవర్ తో కలిసి శివాని కుట్ర పన్నింది. హత్య విషయంలో తన పై సందేహం రాకుండా హత్య చేయకముందే రమేష్ తో చాలా ప్రేమగా ఉన్నట్లు వీడియో తీసింది.
మంగళవారం నాడు రాత్రి మటన్ కర్రీ చేసి, భర్తకు పెట్టి, మద్యం తాగించింది. తాను చాలా మంచిదని, మై వైఫ్, మై లైఫ్ అని రమేష్ తో చెప్పించి, వీడియోను రికార్డు చేసింది. ఆ తరువాత మద్యం మత్తులో ఉన్న భర్తను తీసుకెళ్ళి బెడ్ పై పడుకోబెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మర్దర్ కేసు తనపై పడకుండా ఉండడం కోసమే, తాను మంచిదాన్ని అని రమేష్ తో చెప్పించి, వీడియోను రికార్డ్ చేసినట్లు శివాని పోలీసులు ఎదుట ఒప్పుకుంది. దీంతో శివాని తెలివితేటలకు అందరూ షాక్ అవుతున్నారు.
విచారణలో శివాని తనకు పెద్దమ్మ కూతురు పైడమ్మ వల్లే రామారావుతో పరిచయం అయ్యిందని చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో రమేష్ మర్డర్ ఈ హత్య కేసులో పైడమ్మ హస్తం కూడా ఉందని శివాని పోలీసులను నమ్మించడానికి ప్రయత్నించిందని సమాచారం. ఇక ఈ కేసులో ప్రస్తుతం రమేష్ భార్య శివాని, ఆమె లవర్ రామారావు, మరియు అతని ఫ్రెండ్ నీలా మీద మాత్రమే కేసును నమోదు చేశామని పోలీసులు తెలిపినట్లు సమాచారం.
శాకుంతలం చిత్రంలో సమంత శకుంతలగా, దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటించారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలకపాత్రలో నటించాడు. శకుంతల దుష్యంతుల కుమారుడు భరతుడిగా స్టార్ హిరో అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ నటించింది. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. కానీ వాటిని అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఫస్ట్ షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. సమంత, దర్శకుడు గుణశేఖర్ విమర్శల పాలయ్యారు. సోషల్ మీడియాలో డైరెక్టర్ ను తీవ్రంగా ట్రోల్ చేశారు. సమంత ఆ పాత్రకు సెట్ అవలేదని విమర్శించారు.
ఈ చిత్రం ఓటిటిలో రిలీజ్ కాగా, అక్కడ కూడా డిజాస్టర్ గానే నిలిచింది. ఓటీటీ రిలీజ్ లోనూ ట్రోలింగ్ తప్పలేదు. అయితే ఈ చిత్రం ప్లాప్ అయిన భరతుడిగా అల్లు అర్హ నటనను, డైలాగ్స్ ను మాత్రం అందరు మెచ్చుకున్నారు. అల్లు అర్హకు బాలనటిగా ఇదే మొదటి చిత్రం. అయినప్పటికి ఎలాంటి భయం లేకుండా అద్భుతంగా నటించడంతో పాటుగా, తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది. అర్హ నటించిన సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా నిలిచాయి.
అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాలోని ఒక వీడియో షికారు చేస్తోంది. దేవ్ మోహన్ అల్లుఅర్హను ఎత్తుకుని మాట్లాడుతున్న సన్నివేశంలో అల్లుఅర్హ వస్తున్న నవ్వును ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. దానిని చూసిన నెటిజెన్లు కొంచెం చూసుకోవాలి కదా ఎడిటర్ గారూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
పెళ్లి అనేది జీవితంలో ముఖ్యమైన వేడుక. ఎన్నో కలలతో కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ అమ్మాయి మెట్టింట్లో అడుగు పెడుతుంది. సాధారణంగా పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు చాలా జాగ్రత్తలు చెప్తుంటారు. ఇక పెళ్ళిలో మగపెళ్ళి వారు కండిషన్లు పెడుతుంటారు. కానీ తాజాగా జరిగిన పెళ్ళిలో పెళ్లి కూతురి ఫ్రెండ్స్ వరుడికి కండిషన్లు పెట్టారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
వైరల్ వీడియోలో పెళ్లి చేసుకోబోయే జంట పెళ్లి మండపంలోకి వెళ్తుండగా, మండపంలోకి వెళ్ళకుండా పెళ్లి కూతురి ఫ్రెండ్స్ కాంట్రాక్ట్ పేపర్ ను పట్టుకుని ఉన్నారు. దానిపై సైన్ చేస్తే తప్ప మండపంలోకి వెళ్లనివ్వమని చెప్పడంతో పెళ్ళికుమారుడు ఆ అగ్రిమెంట్ పై సంతకం చేశాడు. ఆ తరువాత వధూవరులు వివాహం జరిగింది. ఈ వీడియోను వధువు కాజల్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.
వరుడు సంతకం చేసిన కాంట్రాక్ట్ లో ఏముందంటే, కాజల్ను ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. ఆమెను షరతులు లేకుండా ప్రేమించాలి. ఆమె ఎల్లప్పుడు సకరెక్ట్ గానే చేస్తుందని ఒప్పుకోవాలి. ఏడాదికి 3 సార్లు ఆమెను టూర్కు తీసుకెళ్లాలి. ఆమె ఆనందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ, ఎప్పుడూ ఆమె చలిగా ఫీల్ అవకుండా చూడాలి అని ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కమర్షియల్ చిత్రాలలో నటిస్తూనే, మరో వైపు హీరోయిన్ ప్రాధాన్య సినిమాలలో కూడా నటిస్తున్నారు. తెలుగులో కూడా పలు సినిమాలలో నటించిన ఐశ్వర్య సొప్పన సుందరి సినిమాలో లీడ్ రోల్ లో నటించింది. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, మధ్యతరగతి కుటుంబానికి చెందిన అహల్య (ఐశ్వర్య రాజేష్) ఒక బంగారు షాపులో పని చేస్తుంటుంది. ఆమెకు అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి, నాన్ స్టాప్ గా మాట్లాడే తల్లి, మాటలు రాని అక్క ఉంటారు. అన్నయ్య దొర(కరుణాకరన్) ప్రేమించి, పెళ్లి చేసుకుని వారికి దూరంగా వెళతాడు.
ఆ ఫ్యామిలీకి రోజు గడవడమే చాలా కష్టంగా ఉంటుంది. చాలా అప్పులు ఉండడడంతో కష్టంగా వారి జీవితం సాగుతుంటుంది. అలాంటి వాళ్ళకు ఒకరోజు హఠాత్తుగా ప్రముఖ నగల స్టోర్ లో తీసిన బంపర్ డ్రాలో పది లక్షలు విలువ చేసే కారు వస్తుంది. ఆ తరువాత వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? వారి జీవితంలోకి వచ్చే కొత్త వ్యక్తులు ఎవరు? దొర అతని బావ కలిసి ఏం చేశారు? చివరకు ఏం అయ్యింది? అనేది మిగతా కథ.
అహల్యగా నటించిన ఐశ్వర్య రాజేష్ పాత్రలో ఒదిగిపోయింది. మూవీ మొదలైనప్పటి నుండి ముగిసేవరకు డిఫరెంట్ వేరియేషన్స్ తో ఆకట్టుకుంది. డార్క్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం, థ్రిల్ కు గురి చేస్తూ కామెడీ పండించే విషయంలో దర్శకుడు విజయం సాధించాడు. ఈ మూవీ చూసినంతసేపు ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారని చెప్పవచ్చు.
వర్షాకాలంలో ఎక్కువగా కండ్ల కలక వ్యాధి ఇబ్బంది కలిగిస్తుంది. ఈ వ్యాధి నాలుగు రకాలుగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. బాక్టీరియా లేదా వైరస్, ఏదైనా ఫిజికల్ గాయం వల్ల లేదా ఎలర్జిక్ రియాక్షన్ వల్ల కూడా వస్తుంది. వర్షాకాలంలో బాక్టీరియా, వైరస్ లు పెరగడానికి అనువైన తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. దీనివల్ల ఇవి వేగంగా విస్తరిస్తాయి. కండ్లకలకను ఐ ఫ్లూ లేదా పింక్ ఐ అని వైద్య పరిభాషలో పిలుస్తారు.
ప్రస్తుతం వేగంగా కండ్ల కలక విస్తరిస్తున్న నేపథ్యంలో కంటి ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం అని డాక్టర్లు చెబుతున్నారు. ఇది అంటువ్యాధి కాబట్టి ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. ఈ కండ్ల కలక లక్షణాలు అందరిలో ఒకేలాగా ఉండక పోవచ్చు.
ఒక్కొక్కరిలో ఒక్కొలాంటి లక్షణాలు ఉంటాయి. అయితే అందరిలో కనిపించే కామన్ గా ఉండే లక్షణం అంటే జిగటగా ఉండే డిశ్చార్జ్ తో కళ్ళు ఎర్రగా మారుతాయి. కళ్ళు దురదగా అనిపించడం, కళ్ల నుంచి నీరు కారడం, లైట్ వెలుగును చూడలేకపోవడం, కళ్ళు తెరవలేకపోవడం, కళ్ల మంట, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు కండ్ల కలక సోకినవారిలో కనిపిస్తాయి.
తీసుకోవలసిన జాగ్రత్తలు:
మనిషి అరచేతిలోని రేఖలు అతని భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని చాలామంది నమ్ముతుంటారు. హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం చేతిలో ఉండే ప్రతి రేఖకు ఒక ప్రాముఖ్యత ఉంది. అరచేతిలో ఉండే రక రకాల గుర్తులు, రేఖలు ఫ్యూచర్ ను ప్రభావితం చేస్తాయి. కొంతమంది అరచేతిలో చేప గుర్తు ఉంటుంది. దీనిని మీనరేఖ అని కూడా పిలుస్తారు. ఇక హస్తసాముద్రికంలో చేప గుర్తు ప్రముఖమైనదని చెబుతారు. మీనరేఖ అనేది చాలా అద్బుతమైన రేఖ.
మరి అరచేతిలో ఉండే చేపగుర్తు వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మీనరేఖ అరచేతిలో ఏ ప్రదేశంలో ఉన్నా, మంచి యోగదాయకంగా ఉంటుంది. ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశం యొక్క శుభ ఫలితాలు వస్తాయి. చంద్ర స్థానంలో మీనరేఖ ఉంటే మంచి ప్రేమకలవారు అవుతారు. శుక్రస్థానంలో మీనరేఖ ఉన్నట్లయితే మంచి భార్య వస్తుంది. గురు స్థానంలో మీనరేఖ ఉన్నట్లయితే మంచి విద్య లభిస్తుంది. అలాగే కుజ స్థానంలో మీనరేఖ ఉంటే మంచి యోగదాయకమైన ఉద్యోగం వస్తుంది.
బుధ స్థానంలో మీనరేఖ ఉంటే వ్యాపారంలో బాగుటుంది. ఈ విధంగా మీనరేఖ ఏ స్థానంలో ఉన్నప్పటికీ మంచి ఫలితాన్ని ఇస్తుంది. వీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఏ విషయానికి లొంగిపోరు, ఈ గుర్తు అరచేతిలో ఉన్నవారు అన్ని విషయాలలో విజయం సాధిస్తారని హస్తసాముద్రిక నిపుణులు చెబుతున్నారు.
శివజ్యోతి ఏ విషయం అయినా సరే సూటిగా మాట్లాడుతుంటారు. జ్యోతక్క అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టిన శివజ్యోతి తాజాగా తన ఛానెల్ లో హోం టూర్ వీడియోను చేసింది. మణికొండలో ఆమె తీసుకున్న ఫస్ట్ హౌజ్ గురించి వివరించింది. ఆ ఇంటిని 2019లో కొనుగోలు చేసినట్లుగా, ఫిబ్రవరి 2020లో గృహప్రవేశం చేశామని తెలిపారు.
కొద్ది రోజుల క్రితమే ఆ ఇంటికి మారినట్లుగా చెప్తూ తన ఇంటిని, ఇంటి లోపల అంతా చూపించింది. ఇంటి లోపలి ఇంటీరియర్ ను దగ్గరుండి మరి డిజైన్ చేయించుకున్నానని వెల్లడించింది. ఇక వీడియో చివర్లో ఇంటిని అమ్మాలని అనుకున్నట్లుగా, తాము ఆ ఇంట్లో ఉండట్లేదని, ఆ ఇంటిని చాలా ఇష్టంగా కొన్నట్లు తెలిపింది.
తాను న్యూస్ ఛానల్ మొదలు పెట్టానని, అయితే ఆ ఛానెల్ కి వ్యూస్ రాలేదని, డిప్రెషన్కు గురి అయ్యానని తెలిపింది. ఈ ఇల్లు లక్ అనుకున్నానని, అందుకే ఛానల్ సక్సెస్ అవుతుందని భావించాను. కానీ అలా జరగలేదని, రెండు ఇళ్ళ ఈఎంఐలు కట్టాలని. అందుకే ఈ ఇంటిని అమ్మాలని అనుకున్నట్లుగా వెల్లడించింది. ఊరికనే నన్ను తిట్టకండి. అలా చేయడం వల్ల చాలా ప్రభావం చూపిస్తుంది’ అని శివజ్యోతి కన్నీరు పెట్టుకుంది.
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అంజుకు పాకిస్తాన్ కి చెందిన నస్రుల్లాతో ఫేస్ బుక్ లో పరిచయం కావడం, ఆ తరువాత అది ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో లవర్ ను కలుసుకోవడం కోసం అంజు దేశ సరిహద్దులను దాటి పాకిస్తాన్ కు వెళ్లింది. అక్కడ ఇస్లాం మతంలోకి మారి, పేరు సైతం ఫాతిమా మార్చుకుని, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మరో వారి పెళ్లి విషయం తెలిసిన అంజు ఆమె భర్త వారి పెళ్లి చెల్లదని చెబుతున్నారు. కానీ ఫాతిమా గా మారిన అంజు మాత్రం ఇక్కడి సంప్రదాయాలను మర్చిపోయి, అక్కడి వాటిని నేర్చుకునే ప్రయత్నం చేస్తోంది.
ఫాతిమా, నస్రుల్లా పెళ్లి చేసుకోవడంతో బంధువులే కాకుండా అక్కడి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా వారి ఇంటికి వెళ్ళి మరి బహుమతులు ఇస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ బిజినెస్ మెన్ మహమ్మద్ ఖాన్ అబ్బాసీ అంజుకి బహుమతుల అందచేశారు. ఆమెకు ఇల్లు కట్టుకోవడం కోసం స్థలం మరియు డబ్బును కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ఇతర మతాల నుండి తమ మతంలోకి వచ్చే వారికి సౌకర్యాలు కల్పించడమే తమ ఉద్దేశమని వెల్లడించారు. ప్రస్తుతం అతను చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.