ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన బేబీ సినిమాలో సెకండ్ హీరోగా విరాజ్ అశ్విన్ నటించారు. ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కిన బేబీ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లలో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ మూవీకి సి రాజేష్ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో హీరోయిన్ ను నెగెటివ్ గా చూపించారు. అయితే ఇలాంటి సినిమాలు అంటే హీరోయిన్ ను నెగెటివ్ గా చూపించిన సినిమాలు గతంలో ఎక్కువగానే వచ్చాయి. వాటిలో ఎక్కువ శాతం చిత్రాలు విజయం సాధించాయి. అయితే కథానాయకను నెగటివ్ షేడ్స్ లో చూపించిన సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. బేబీ:
చిన్నప్పటి నుండి ప్రేమించిన వ్యక్తిని మోసం చేసే పాత్రలో హీరోయిన్ వైష్ణవి చైతన్య నటించింది.
2. ఆర్ ఎక్స్ 100:
కార్తికేయ హీరోగా నటించిన ఈ మూవీలో హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ హీరోని ప్రేమించి, మోసం చేసే ఇందు అనే పాత్రలో నటించింది.
3. డిజే టిల్లు:
సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రంలో రాధికగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నేహాశెట్టి నటించింది.
4. రారండోయ్ వేడుక చూద్దాం:
నాగచైతన్య హీరోగా నటించిన ఈ మూవీలో రకుల ప్రీత్ సింగ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది.
5. మన్మధ:
శింబు హీరోగా నటించిన ఈ చిత్రంలో హీరోని మోసం చేసే వైష్ణవి అనే పాత్రలో సింధు తులానీ నటించింది.
6. నీవెవరో:
ఆదిపినిశెట్టి హీరోగా నటించిన ఈ మూవీలో తాప్సీ కళావతి అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది.
7. వల్లభ:
శింబు, నయనతార హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో ప్రేమించిన హీరోని ఇబ్బంది పెట్టె నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రీమా సేన్ నటించింది.
8. శుభలగ్నం:
శుభలగ్నం సినిమాలో డబ్బు కోసం భర్తనే అమ్ముకునే పాత్రలో హీరోయిన్ ఆమని నటించింది.
9. ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు:
ఈ చిత్రంలో హీరోయిన్ రమ్యకృష్ణ నెగెటివ్ షేడ్స్ ఉన్న శిరీష పాత్రలో నటించింది.
10. ప్రేమించాను నిన్నే:
ఈ చిత్రంలో మంజుల కుమార్తె హీరోయిన్ శ్రీదేవి హీరోని మోసం చేసే పాత్రలో నటించింది.
11. ధర్మయోగి:
హీరోయిన్ త్రిష రుద్ర అనే పాత్రలో ప్రేమించిన హీరోనే చంపే పాత్రలో నటించింది.
12. గుండెల్లో గోదారి:
హీరోయిన్ తాప్సీ ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న సరళ అనే పాత్రలో నటించింది.
13. బస్ స్టాప్:
ఈ చిత్రంలో ఆనంది నెగెటివ్ షేడ్స్ ఉన్న సీమా అనే పాత్రలో నటించింది.
14. సూర్య వంశం:
ఈ చిత్రంలో చదువు లేదని ప్రేమించిన హీరోని కాకుండా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునే పాత్రలో సంఘవి నటించింది.
Also Read: నటకిరీటి “రాజేంద్ర ప్రసాద్” ఎంత గొప్ప నటుడో తెలిపే 10 సినిమాలు..! లిస్ట్లో ఉన్న సినిమాలు ఏవంటే..?

రాజశేఖర్ దంపతులు మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై 2011లో మీడియా సమావేశంలో చిరంజీవి బ్లడ్బ్యాంక్ సేకరించిన బ్లడ్ ని ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఈ విషయం పై చిరంజీవి బావ మరిది అయిన అల్లు అరవింద్ అప్పట్లోనే రాజశేఖర్, జీవిత చేసిన విమర్శలు చేసినందుకు కోర్టును ఆశ్రయించారు.
చిరంజీవి పేరిట నడుస్తున్న ట్రస్టు, సేవా కార్యక్రమాల పై తప్పుడు ఆరోపణలు చేసారని పరువు నష్టం కేసు వేశారు. ఎన్నో సంవత్సరాల విచారణ తరువాత మంగళవారం నాడు నాంపల్లి 17వ మెట్రోపాలిటిటన్ కోర్టు రాజశేఖర్, జీవితలకు సంవత్సరం జైలు శిక్ష మరియు 5 వేల రూపాయల జరిమానా విధించింది. ఈ కేసు పై అప్పీలుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఇచ్చింది.
ఎన్నికల సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసినపుడు రాజశేఖర్, జీవితలు మెగాస్టార్ చిరంజీవి పై ఎన్ని విమర్శలు చేశారో అందరికీ తెలిసిందే. అప్పుడు చిరు అభిమానులు కొందరు ఆ విమర్శలను తట్టుకోలేక వారిపై దాడి చేయడం జరిగింది. తన ఫ్యాన్స్ దాడి చేయడంతో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వారి ఇంటికి వెళ్లి, క్షమించమని కోరిన విషయం కూడా తెలిసిందే.
బేబీ కల్ట్ బ్లాక్బస్టర్ వేడుకలను సోమవారం నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా అల్లు అరవింద్, విజయ్ దేవరకొండ, నాగబాబు, నిర్మాత రవి శంకర్ లు హాజరు అయ్యి, మూవీలో నటించిన ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్యల నటన పై ప్రశంసలు కురిపించారు. అయితే ఈ ఈవెంట్ లో దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ బేబీ మూవీ విషయంలో ఒక హీరో తనను అవమానించిన సంగతిని బయటపెట్టారు.
ఆయన మాట్లాడుతూ, బేబీ మూవీ కథను ఒక హీరోకు చెప్పాలనుకుంటే ఆ దర్శకుడు అయితే స్టోరీ కూడా వినని ఆ హీరో అవమానించాడని, అలాంటి సమయంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య తనను నమ్మి మంచి మూవీకి డైరెక్టర్ ను చేశారు. ఎస్.కె.ఎన్ తనను నమ్మి ఇంత ఖర్చు పెట్టాడు. దర్శకుడు మారుతిగారు మా కన్న ఎక్కువగా మూవీ పై నమ్మకం ఉంచారని చెప్పారు.
ఫ్యూచర్లో కూడా ఇలాంటి మంచి చిత్రాలే తెరకెక్కిస్తానని మాటిస్తున్నానని వెల్లడించారు. అయితే కథ వినకుండానే బేబీ మూవీని మిస్ చేసుకున్నహీరో ఎవరని నెటిజెనలు సెర్చ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆ హీరో ఎవరంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ హీరో ఎవరనే విషయాన్ని సాయి రాజేష్ లేదా ఆ హీరో కానీ రివీల్ చేస్తారేమో చూడాలి.
సంప్రదాయ ప్రకారంగా నలుపు రంగును కీడును శంకించే రంగుగా భావిస్తారు. నల్లని రంగు శని దేవుడికి ప్రీతికరమైన రంగు, కాబట్టి నల్లటి బట్టలు వేసుకోకూదని కొందరు చెబుతారు. సైన్స్ ప్రకారం చూసినట్లయితే నలుపు రంగు వేడిని ఎక్కువగా గ్రహిస్తుంది. అందువల్ల ఎండలో వెళ్ళినపుడు నలుపు రంగు దుస్తులు వేసుకుని వెళ్లీనట్లయితే అవి వేడిని ఎక్కువ గ్రహించడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. దాంతో శరీరంలో నీటి శాతం తక్కువ అయ్యి డీహైడ్రేషన్ కు గురి అవుతారు. అందుకే ఎండకాలంలో బయటికి వెళ్ళేప్పుడు నల్లటి బట్టలను వేసుకోవద్దు అని అంటారు.
సద్గురు నలుపు రంగు బట్టలు ఎందుకు ధరించకూడదనే విషయం గురించి ఈ విధంగా వివరించారు. ‘నలుపు ప్రతి దాన్ని గ్రహిస్తుంది. మీ చుట్టూ ఉన్న దానిని గ్రహించాలి అనుకునేటువంటి ప్రదేశంలో మీరు ఉన్నప్పుడు నల్లని రంగు బట్టలను ధరించాలి. అయితే మీ చుట్టూ ఏదైతే ఉందో దానిని మీరు గ్రహించవద్దు అనుకునేటువంటి ప్రదేశంలో ఉన్నప్పుడు నల్ల దుస్తులు వేసుకున్నట్లు అయితే మీరు అక్కడ ఉన్న రకరకాల విషయాలను గ్రహించడం మొదలు పెడతారు.
ప్రజలు ఇబ్బంది పడుతున్న మానసిక ఘర్షణలు దాదాపుగా ఇరవై, ఇరవై ఐదు శాతం ఎందుకు జరుగుతున్నాయి అంటే చాలా ఎక్కువ సమయాలు అన్నీ రకాల పరిస్థితుల్లో నల్ల దుస్తుల్లో ఉండిపోవడం వల్ల, అలాంటి చోట్ల అలా ఉండకూడదు’ అని సద్గురు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియోను చూడండి.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరాలో ఒక నిరుపేద ఫ్యామిలిలో కానన్ దేవి 1916 ఏప్రిల్ 22న జన్మించింది. రతన్ చంద్రదాస్, రాజోబాలదాస్ కానన్ తల్లిదండ్రులు. కానన్కు సంగీతంలో శిక్షణ ఇచ్చే తండ్రి, కొద్దికాలనికే మరణించడంతో ఆ కుటుంబాన్ని కష్టాలు వెంటాడాయి. ఇంటి అద్దె చెల్లించకపోవడంతో ఇంటి ఓనర్ ఇంట్లో నుంచి వారి కుటుంబాన్ని వెళ్లగొట్టాడు. ఏం చేయాలో తెలియని స్థితిలో తల్లీకూతుళ్లు డబ్బున్న వారింటిలో పని మనుషులుగా చేరారు. ఉండడానికి ఇల్లు లేని వారికి ఒక బంధువు ఇల్లు ఇచ్చి ఆదుకున్నాడు.
కానీ అంతలోనే అతడు తన నిజస్వరూపం చూపించాడు. ఏడేళ్లు కూడా నిండని కానన్ మరియు ఆమె తల్లితో చాకిరీ చేయించుకోవడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది భరించలేకపోయిన కానన్ తల్లితో పాటుగా ఆ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది. ఆ స్థితిలో కోల్కతాను విడిచి తిరిగి హౌరాకు వెళ్ళి, వేశ్యాగృహాలకు దగ్గరలో ఒక గది తీసుకుని ఉన్నారు. ఆ సమయంలో కానన్ ను చూసిన వారి ఫ్యామిలీ ఫ్రెండ్ ఆమె సినీ రంగంలో రాణించగలదని గ్రహించాడు. అలా కానన్ 10 సంవత్సరాల వయసులో ‘జైదేవ్’ అనే మూవీలో ఛాన్స్ వచ్చింది.
ఆ మూవీ కోసం కానన్ తీసుకున్న నెల జీతం ఐదు రూపాయలు. ఆ తరువాత అవకాశాలు రావడంతో 1928-31 మధ్య బాలనటిగా అనేక సినిమాలు చేసింది. అదే టైమ్ లో సింగర్ గానూ సత్తా చాటింది. శంకరాచార్య, జోరేబరత్, విష్ణుమాయ, రిషిర ప్రేమ్, ప్రహ్లాద్ సినిమాలలో తన నటనతో ఆడియెన్స్ అలరించింది. విష్ణుమాయ, ప్రహ్లాద్ చిత్రాలలో బాలనటుడిగా చేసింది. ఇక 21 సంవత్సరాలకే హీరోయిన్గా నటించిన కానన్ దేవి నటనకు, అందానికి, ఫిదా అవనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు.
తక్కువకాలంలోనే ఆమె సూపర్స్టార్గా మారింది. పాట పాడినందుకు లక్ష, హీరోయిన్గా ఐదు లక్షలు రెమ్యూనరేషన్ అందుకునేది. ఆమె 40 పాటలు పాడగా, సుమారు 57 చిత్రాలలో నటించింది. హీరోలకు మాత్రమే సలాం కొట్టే రోజుల్లో కానన్ ను అందరు మేడమ్ అని పిలిచేవారు. మేడమ్ అనిపించుకున్న తొలి హీరోయిన్ కానన్ దేవి. ఆమె కేఎల్ సెఘల్, ప్రథమేశ్ బరువా, పంకజ్ మాలిక్, పహరి సాన్యల్, అశోక్ కుమార్, చబీ బిస్వాస్ వంటి అగ్ర హీరోలతో నటించి, వారికి తీసిపోని విధంగా కోటీశ్వరురాలిగా ఎదిగింది.
1940 డిసెంబర్లో కానన్ బ్రహ్మ సమాజ మెంబర్ అయిన హిరంబ చంద్ర మిత్ర తనయుడు అశోక్ మిత్రాను వివాహం చేసుకుంది. అయితే పెళ్లైన 5 ఏళ్లకే భర్తకు విడాకులిచ్చింది. ఆ తరువాత బెంగాల్ గవర్నర్ వద్ద ఏడీసీగా వర్క్ చేసిన హరిదాస్ భట్టాచార్జిని వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత హరిదాస్ డైరెక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే ఇండస్ట్రీలో అందరూ హరిదాస్ ని కానన్ భర్తగా మాత్రమే చూశారు. ఇది భరించలేకపోయిన హరిదాస్ 1987లో ఏప్రిల్ 4న కానన్ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు. విడాకులు తీసుకోకుండానే ఇద్దరు విడివిడిగా జీవించారు.
76 ఏళ్ల వయసులో కానన్ దేవి అనారోగ్యంతో 1992లో జూలై 17న మరణించింది. హరిదాస్ కానన్ దేవిని ఆఖరిసారి చూడడానికి కూడా రాలేదు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న కానన్ చివరికి ఒక అనాధగా ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయింది. సినీ ఇండస్ట్రీకి కానన్ దేవి చేసిన సేవలకు గానూ 2011లో తపాలా శాఖ ఆమె పేరిట ఒక స్టాంపును రిలీజ్ చేసింది.
మనిషి గత జన్మకి సంబంధించిన గుర్తులను కొంతమంది ఫిలాసఫికల్ సైంటిస్టులు కొన్ని సంవత్సరాల పాటు పరిశోధనలు చేసి కనుగొన్నారు. వాటివల్ల పునర్జన్మ ఉందని చెబుతున్నారు.
4. ఫియర్స్ మరియు ఫోబియా:
7. అన్ కంట్రోలబుల్ హాబిట్స్:
ఈ జన్మలో చేసిన పాపాలకి వచ్చే జన్మలో ఎలా పుడతారంటే..
గంగోత్రి మూవీ రిలీజ్ అయ్యి, 20 ఏళ్లు అవుతోంది. ఈ చిత్రం ద్వారా అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్, హీరోయిన్ ఆర్తి అగర్వాల్ చెల్లెలు ఆదితి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా టాలీవుడ్ లో అడుగు పెట్టారు. ఈ మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. తొలి మూవీ హిట్ అవడంతో ఇద్దరు ఈ మూవీ తరువాత ఆఫర్స్ ను అందుకున్నారు. కానీ అల్లు అర్జున్ వరుస సినిమాలు చేస్తూ, అవి హిట్ అవడంతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగారు. గంగోత్రి సినిమా రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 101 వ మూవీ కావడం విశేషం.
మాలయళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ చేసే పాత్ర ఏదైనా అద్భుతంగా నటిస్తాడనే విషయం తెలిసిందే. రీసెంట్ గా ఫహాద్ ఫాజిల్ ‘ధూమం’ అనే మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీని యూటర్న్ మూవీ దర్శకుడు పవన్ కుమార్ తెరకెక్కించాడు. కేజీఎఫ్ మూవీ నిర్మాణ సంస్థ అయిన హోంబలే ఫిల్మ్స్ ఈ మూవీని నిర్మించింది. ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి, రోషన్ మాథ్యూ ముఖ్యమైన పాత్రలలో నటించారు. ధూమం సినిమాను సందేశాత్మక కమర్షియల్ సినిమాగా తెరకెక్కించారు. ఈ సినిమా జూన్ 23న థియేటర్లలో రిలీజైంది.
ధూమం కథ విషయనికి వస్తే, ఒక సిగరెట్ కంపెనీలో అవినాష్ (ఫహాద్ ఫాజిల్) సేల్స్ హెడ్గా వర్క్ చేస్తూ, తన టాలెంట్ తో, మార్కెటింగ్ స్ట్రాటజీస్తో ఆ కంపెనీ సేల్స్ ను అధికంగా పెంచుతాడు. దాంతో అవినాష్ను ఆ కంపెనీ ఎమ్డీ సిద్ధార్థ్ (రోషన్ మాథ్యూ) ఉద్యోగిల కాకుండా ఫ్రెండ్ ల చూస్తుంటాడు. అయితే అవినాష్ సిద్దార్థ్ తో అభిప్రాయ భేదాలు రావడంతో సడెన్ గా జాబ్ కి రిజైన్ చేస్తాడు. నెక్స్ట్ డే అవినాష్ తన భార్య దియా (అపర్ణ బాలమురళి)తో కలిసి కారులో వెళ్తుండగా అతడి పై ఒక ముసుగు వ్యక్తి దాడి చేసి డ్రగ్ ఇంజెక్షన్స్ అవినాష్ కి ఇస్తాడు.
డ్రగ్ ఎఫెక్ట్ నుండి అవినాష్ బయటకు వచ్చేసరికి ఒక కొండ ప్రాంతంలో ఉన్నట్టు గుర్తిస్తాడు. అప్పుడు ఒక అపరిచితుడు అవినాష్ కు ఫోన్ చేసి. దియా బాడీలో ఓ మైక్రో బాంబ్ పెట్టామని, ఆ బాంబ్ పేలితే దియా ప్రాణాలు పోతాయని, అలా జరగకూడదు అంటే తెము చెప్పినట్టు వినాలని బ్లాక్ మెయిల్ చేస్తాడు. కోటి రూపాయల్ని అతను చెప్పిన దగ్గర ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. తనను ఫోన్లో బెదిరిస్తోన్న వ్యక్తి ఎవరో అవినాష్ కనిపిపెట్టాడా? తన భార్యను కాపాడుకున్నాడా? ఆ ట్రాప్ నుంచి అవినాష్ ఎలా బయటపడ్డాడు? అనేది మిగతా కథ.
ధూమం సినిమా ద్వారా డైరెక్టర్ చెప్పాలనుకున్న మెసేజ్ బాగున్నప్పటికీ, చెప్పిన విధానంలో కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంది. సాధారణంగా సినిమా మొదలయ్యే ముందు వచ్చే ముఖేష్ యాడ్ ని వివరంగా చూపించినట్టు అనిపిస్తుంది. ఫహాద్ ఫాజిల్ ట్రాప్లో ఇరుక్కుకోవడం మరియు ట్రాప్ నుండి బయటపడే సీన్స్ లో థ్రిల్లింగ్ మిస్ అవడమే కాకుండా రిపీటెడ్ సన్నివేశాలతో చాలా స్లోగా సాగుతాయి. విలన్ ఎవరనేది ఊహించే విధంగా ఉంటుంది. ఈ మూవీ ఫహాద్ వన్ మెన్ షో అని చెప్పవచ్చు. అవినాష్ క్యారెక్టర్ లో ఫహాద్ ఫాజిల్ జీవించాడు. సింపుల్ కథని తన నటనతో నిలబెట్టేందుకు ప్రయత్నించాడు.
రాజమౌళి సీరియల్ దర్శకుడిగా కెరీర్ ను మొదలు పెట్టారు. స్టూడెంట్ నెంబర్ వన్ సినీ దర్శకుడిగా మారారు. రెండవ చిత్రం సింహాద్రితో ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. మగధీర మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని భారతీయ సినీ ప్రేక్షకుల అందరిని తెలుగు ఇండస్ట్రీ వైపు దృష్టి పెట్టేలా చేశాడు. ఇక బాహుబలితో భారతీయ సినీ ఇండస్ట్రీ రికార్డులన్నిటిని తిరగ రాయడమే కాక, అంతర్జాతీయ ప్రేక్షకులు సైతంఆకట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటారు. అందని ద్రాక్షగా ఉన్న ఆస్కార్ ను తెలుగు ఇండస్ట్రీకి అందించారు.
ప్రస్తుతం రాజమౌళి నెక్స్ట్ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్ హాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ఎదురుచూస్తుండడం విశేషం. ఇది ఇలా ఉంటే ప్లాప్ ఎరుగని రాజమౌళి సినిమాలు నిర్మాతలకు పెట్టినదానికన్న రెండు మూడు రెట్లు ఎక్కువ లాభాలను కురిపిస్తాయి. కానీ ఆయన తీసిన సినిమాలలో ఒకటి మాత్రం కమర్షియల్ గా విజయం సాధించిన కూడా కలెక్షన్స్ పరంగా బిగ్గెస్ట్ హిట్ అందుకోలేదని అంటున్నారు. అదే నితిన్ నటించిన ‘సై’ మూవీ. ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకుంది.
దాదాపు ఎనిమిది కోట్ల బడ్జెట్ తో ‘సై’ మూవీని నిర్మించారట. అయితే ఈ మూవీ లాంగ్ రన్ లో పన్నెండు కోట్లను మాత్రమే కలెక్ట్ చేసిందట. కమర్షియల్ గా ఈ మూవీ విజయం సాధించినా, కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్ లకు అనుకున్న రేంజ్ లో లాభాలు రాలేదని, కొద్దిపాటి నష్టాలు వచ్చాయని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.
‘బేబీ’ మూవీని చూసినవాళ్లకు సెన్సార్ వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్ ఒక మూవీ నుండి మరొక మూవీకి రూల్స్ లో ఏమైనా మార్పులు ఉంటాయా అనే సందేహం వస్తోంది అని అంటున్నారు. దానికి కారణం ఏంటి అనేది బేబీ మూవీ చూసినవారికి తెలుస్తుంది. లేదంటే ఆ మూవీ చూసినవాళ్లను అడిగినా ఈ విషయంలో క్లారిటీ వస్తోంది. ఇక ఈ విషయం పై సోషల్ మీడియాలో కూడా కామెంట్లు బాగానే వినిపిస్తున్నాయి. ఎందుకంటే బేబీ మూవీలో బూతులను ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించారని టాక్.
అమ్మాయిలని అసభ్యకరంగా తిట్టే ఒక పదం ఈ చిత్రంలో అనేక సార్లు వినిపించిందట. అయితే కొన్నిచోట్ల మాత్రమే తిట్టు వాడినపుడు బీప్ పడింది. కానీ కొన్ని చోట్ల మాత్రం బీప్ లేకుండా అలానే వదిలేశారని అంటున్నారు. అది మాత్రమే కాకుండా కొన్ని మాటలు సెన్సార్ కట్ ను దాటి వచ్చాయని కూడా వినిపిస్తోంది. ఇక ఈ మూవీలో లాంగ్ లిప్ లాక్ను కూడా అలాగే ఉంచేశారట. మరొక చోట కళ్లు – కాళ్లు అనే ఒక డైలాగ్ కొంచెం అతి అయ్యిందని అంటున్నారు.
ఓవర్సీస్కి వెళ్లిన బేబీ చిత్రంలో ఇలాంటివి ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. ఈ మూవీలోని డైలాగ్స్ వెబ్ సిరీస్లలో ఉండే డైలాగ్స్ తో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉన్నాయని టాక్. దీంతో నెటిజెన్లు ఈ మూవీ విషయంలో సెన్సార్ బోర్డ్ ఇలాంటి వాటిని ఎందుకు అలాగే వదిలేసింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.