టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందరో కామెడియన్స్ ఉన్నారు. వారు తమ హస్యంతో ఆడియెన్స్ ను అలరిస్తుంటారు. కామెడీ ప్రధానంగా వచ్చిన సినిమాలు సంచలన విజయాలను సాధించాయి. కామెడీ సీన్స్ లేకుండా ఉన్న సినిమాలు తక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు.
బ్రహ్మానందం, ఎం ఎస్ నారాయణ, సునీల్ వంటి కమెడియన్స్ తమ పాత్రల ద్వారా, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించారు. అయితే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన హాస్యనటులు కొందరు సీరియస్ పాత్రలలో నటించి, తమ నటనతో ఆడియెన్స్ ను ఏడిపించారు. వారెవరో? ఏ సినిమాలలో సీరియస్ పాత్రలు చేశారో ఇప్పుడు చూద్దాం..
1. బ్రహ్మానందం – రంగమార్తాండ:
కెరీర్ మొదటి నుండి కమెడియన్ గా అలరించిన బ్రహ్మానందం కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ సినిమాలో సీరియస్ పాత్రలో నటించారు. తన నటనతో ప్రేక్షకులను ఏడిపించారు. ఆయన ఇప్పటివరకు దాదాపు 1250కి పైగా చిత్రాలలో నటించి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు.
2. ఎల్ బి శ్రీరామ్ – అమ్మో ఒకటో తారీఖు:
ప్రముఖ రచయిత నటుడు అయిన ఎల్ బి శ్రీరామ్ తన కామెడీ టైమింగ్ తో ఎన్నో సినిమాలలో నటించి అలరించారు. అయితే ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన అమ్మో ఒకటో తారీఖు సినిమాలో మధ్యతరగతి తండ్రిగా సీరియస్ పాత్రలో నటించారు.
3. రఘుబాబు- మురారి:
నటుడు రఘుబాబు కెరీర్ మొదట్లో విలన్ గా , ఆ తరువాత కామెడీ పాత్రలలో నటిస్తూ పాపులర్ అయ్యాడు. రఘుబాబు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి సినిమాలో సీరియస్ రోల్ లో నటించాడు.
4. సునీల్ – మాస్:
కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టి, ఆ తరువాత హీరోగా మారారు. సునీల్ తన కామెడీ టైమింగ్ తో పాపులర్ అయ్యాడు. నాగార్జున నటించిన మాస్ లో మూవీని మలుపు తిప్పే పాత్రలో నటించాడు.
5. వెన్నెల కిషోర్ – గూడాచారి:
కమెడియన్ సునీల్ తరువాత అంత పాపులర్ అయిన కమెడియన్ వెన్నెల కిషోర్. వెన్నెల సినిమాతో నటుడుగా మారిన ఆయన గుడాచారి మూవీలో సీరియస్ పాత్రలో నటించారు.
6. వేణు మాధవ్ – అన్నవరం:
కమెడియన్ వేణుమాధవ్ అతి తక్కువ కాలంలోనే స్టార్ కమెడియన్ గా మారారు. ఆయన పవన్ కళ్యాణ్ నటించిన అన్నవరం మూవీలో పవన్ ఫ్రెండ్ గా నటించారు.
Also Read: “అల్లు అర్జున్ – త్రివిక్రమ్” సినిమా కథ ఇదేనా..? ఈసారి ఇలా ఆలోచించారా..?

పెద్దల సమక్షంలో నిహారిక, చైతన్య జొన్నలగడ్డల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కానీ వీరిద్దరూ ప్రస్తుతం విడి విడిగా ఉంటున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో నిహారిక, చైతన్యలు ఒకరినొకరు అన్ ఫాలో కావడంతో వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు మొదలు అయ్యాయి. అంతేకాక మెగా కుటుంబంలో జరిగే వేడుకల్లో చైతన్య లేకుండా నిహారిక మాత్రమే కనిపిస్తుండటం వల్ల ఈ జంట విడిపోతున్నారని ప్రచారం జరుగుతోంది.
రీసెంట్ గా జరిగిన నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్, లావణ్యల ఎంగేజ్మెంట్ కి, అలాగే రామ్ చరణ్ ఉపాసనల పాప బారసాలలో కూడా చైతన్య లేకుండా నిహారిక ఒక్కరే హాజరు అయ్యారు. కానీ విడిపోతున్నారని వస్తున్న ప్రచారం పై అటు నిహారిక, ఇటు చైతన్య ఎక్కడా స్పందించలేదు. ఈ క్రమంలో చైతన్య సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. విడాకుల వార్తల తరువాత అతను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం లేదు.
చైతన్య జొన్నలగడ్డ 4 నెలల అనంతరం ఒక మెడిటేషన్ సెంటర్ ఫోటోను షేర్ చేస్తూ, ‘నన్ను ఇక్కడికి నడిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. గత 10 రోజులుగా, విపాసన యోగా చేయడంతో నా లైఫ్ లో కాస్త ఉల్లాసంగా ఉందని, ఎక్కడికైనా మనం ఎటువంటి ఆలోచనలు లేకుండా వెళ్ళినపుడు జ్ఞానంతో బయటకు వస్తాం. ఈ చోటు కూడా అలాంటిదే’ అని చైతన్య రాసుకొచ్చాడు.
దాంతో క్రమంగా ముఖేష్ ఆరోగ్యం పూర్తిగా పాడైంది. ఫ్యామిలీ మెంబర్స్ ఎంత చెప్పినా కూడా వినిపించుకోలేదు. ఆఖరికి ముఖేష్ ప్రాణాలను పోగొట్టుకున్నాడు. ఇక ఈ యాడ్ చేయడం కోసం కొంతమంది ముఖేష్ దగ్గరికి వెళ్లి అడిగిన సమయంలో ముఖేష్ మాట్లాడే కండిషన్ లో లేడు. ఆఖరికి ప్రకటన చేయడానికి అంగీకరించాడు.
ముఖేష్ అతి కష్టం మీద గుట్కా తినకూడదని, గుట్కా తినకూడదని, మానేయమని తన కుటుంబ సభ్యులు ఎన్నో సార్లు తనకు చెప్పారని,కొన్ని సందర్భాల్లో మా అమ్మ నన్ను కొట్టింది గుట్కా మానేయమని చెప్పింది. కానీ అప్పుడు ఎవరి మాట వినలేదు అని ముఖేష్ చెప్పడం జరిగింది. తాను ఆ విధంగా చెప్పడం వల్ల కొందరయినా మారుతారనే ఉద్దేశ్యంతో ముఖేష్ ఈ ప్రకటన చేయడానికి అంగీకరించాడట.
అతను 2009లో కన్నుమూశారు. అతను మరణించిన తరువాత 2011 నుండి ముఖేష్ యాడ్ ని ఉపయోగించడానికి ‘నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ టొబాకో ఏరాడికేషన్ సంస్థ’ అనుమతిని ఇచ్చింది. అప్పటి నుండి ప్రసారం అయిన ఈ యాడ్ 2013 దాకా కొనసాగించారు. తనలా మరొకరు మరకూడదు అనే మంచి ఉద్దేశ్యంతో మాట్లాడలేని స్థితి అయినప్పటికి ఈ ప్రకటన చేసిన ముఖేష్ ను చూసి అయినా ఇటువంటి చెడు అలవాట్లకు అందరు దూరంగా ఉంటే చాలా మంచిది.
మణికందన్, మీరా రఘునాథ్ ప్రధాన పాత్రలలో నటించిన ‘గుడ్ నైట్’ సినిమా ఈ ఏడాది మే 23న తమిళంలో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి వినాయక్ చంద్రశేఖరన్ ద్రశకత్వం వహించారు. ఇక కథ విషయానికి వస్తే, సాఫ్ట్ వేర్ జాబ్ చేసే మోహన్ కు ఒక సమస్య ఉంటుంది. అతను నిద్రపోయాడంటే గురక రీసౌండ్ వస్తుంది. ఆ గురకకి పక్కింటివాళ్లు సైతం భయపడిపోవాలి. తన గురక వల్ల అందరూ తిడుతుంటారు.
ఒక రోజు ఊహించని పరిస్థితుల్లో అను పరిచయమవుతుంది. అందరితో అంతగా కలవని అను, మోహన్ ను ప్రేమిస్తుంది. కొద్ది రోజులకే వారి పెళ్లి జరుగుతుంది. మొదటిరాత్రి రోజు మోహన్ కు గురక సమస్య ఉందని అనుకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? చివరకు భార్యభర్తలు కలిశారా? లేదా అనేదే మిగతా కథ.
హీరోకు సమస్య ఉన్న కథతో టాలీవుడ్ లోనూ సినిమాలు వచ్చాయి. మహానుభావుడు, భలే భలే మాగాడివోయ్ వంటివి. ఆ కోవలో వచ్చిందే గుడ్ నైట్ మూవీ. హీరోకు ఉన్న గురక సమస్యతో ఇంట్లోవారు, పక్కింటివారు ఇలా అందరూ ఇబ్బందులు పడుతుంటారు. గురక సమస్యను హీరోకు పెట్టి, దర్శకుడు వినాయక్ చంద్రశేఖరన్ విజయం సాధించాడు. సినిమా మొదలవగానే హీరోకు గురక ఉందని అర్థమవుతుంది. గురకతో హీరో చుట్టు పక్కల వాళ్ళు పడే ఇబ్బందులను దర్శకుడు చక్కగా చూపించాడు. ఇక వాళ్లు అనే మాటలు నవ్విస్తాయి.
మెగా ఫ్యామిలీ నుండి నాగబాబు డాటర్ నిహారిక యాంకర్ గా సినీ పరిశ్రమ అడుగు పెట్టింది. ఆ తరువాత హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించారు. కానీ నిహారిక నటించిన చిత్రాలు అంతగా విజయం సాధించలేదు. దాంతో ఆమె నిర్మాతగా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు. నిహారిక సినిమాలు నిర్మిస్తూ, అప్పుడప్పుడు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ప్రస్తుతం ఇండస్ట్రీలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా కొనసాగుతూ, ఆ తరువాత ప్రొడ్యూసర్ గా స్థిరపడ్డారు. అయితే సుస్మిత గతంలో ఒక సినిమాలో హీరోయిన్ గా నటించిందంట. చిరంజీవి సుస్మితను హీరోయిన్ పరిచయం చేయాలని అనుకున్నారంట. కానీ సుస్మితను ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నప్పుడల్లా ఏదో ఒక అడ్డంకి వస్తుండడంతో ఆ ఆలోచనను చిరంజీవి పక్కకు పెట్టారని సమాచారం.
సుస్మిత హీరోయిన్ గా ఒక చిత్రంలో నటించారట. అయితే ఆ మూవీ షూటింగ్ మధ్యలోనే ఆగిపోవడంతో రిలీజ్ కు నోచుకోలేదు. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఇందులో ఉదయ్ కిరణ్, సుస్మిత జంటగా నటించారట. ఈ మూవీ మొదటి సగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నది. అయితే సెకండ్ హాఫ్ షూటింగ్ కంప్లీట్ కాలేదంట. దాంతో ఆ మూవీ రిలీజ్ కాలేదని తెలుస్తోంది.
ఈసారి అంతకుమించి అనేలా కొత్త కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో చేస్తున్నాడు అందువల్ల త్రివిక్రమ్ అల్లు అర్జున్ రేంజ్ కు తగిన విధంగానే స్టోరీని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం వినిపిస్తున్నటాక్ ప్రకారం వీరి కాంబోలో రాబోయే మూవీ సోషియో ఫాంటసీ నేపథ్యంలోనే ఉంటుందట.
గతంలో త్రివిక్రమ్ ఎన్నోసార్లు ఈ కాన్సెప్ట్ తో కొన్ని స్టోరీలను అనుకున్నాడు. అయితే అవి సెట్స్ పైకి వెళ్లలేదు. గుణశేఖర్ తెరకెక్కించాలనుకున్న ‘హిరణ్యకశిప’ సినిమాకు మాటలను అందించాలని త్రివిక్రమ్ భావించాడు. కానీ సినిమా ముందుకు వెళ్లలేదు. త్రివిక్రమ్ బన్నీతో చేయబోయే మూవీ ఏమిటి అనే విషయం పై అందరికి ఇంట్రెస్ట్ కలిగింది. అయితే అది సోషియో ఫాంటసీ మూవీ అని బలంగా వినిపిస్తోంది.
అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ ఎటువంటి చారిత్రాత్మక కథను ఎంపిక చేసుకుంటారనే క్యూరియాసిటీ అందరిలోనూ ఏర్పడింది. మాటల మాంత్రికుడుగా గా పేరుగాంచిన త్రివిక్రమ్ పెన్ పవర్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పైగా త్రివిక్రమ్ హిస్టరీ, మైథలాజికల్ కథల పై పట్టున్న రైటర్. అయితే త్రివిక్రమ్ ఎటువంటి ఫాంటసీ స్టోరీ పై దృష్టి పెడతాడో అని అనుకుంటున్నారు.
ఇండియాలో అత్యంత ధనికులలో ఒకరు అయిన సుధా మూర్తి చాలా సాధారణంగా ఉంటారు. ఆమె తన సింప్లిసిటీతో అందరి మనసులను గెలుచుకున్నారు. అంతేకాకుండా ఆమె సాధించిన విజయాలు ఇతరులకు స్పూర్తిగా నిలిచాయి. మనిషి ఎంత ఎదిగినా సంతోషంగా జీవించాలంటే ఎలా ఉండాలనే దాని గురించి ఆమె తన లైఫ్ లో పాటించిన సూత్రాలను ఇతరులకు కూడా చెబుతున్నారు.

తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబోలో నాలుగవ సినిమాను ప్రకటిస్తూ మేకర్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వార్త వల్ల మహేష్ ఫ్యాన్స్ లో నిరసన కనిపిస్తోంది. గుంటూరు కారం మూవీ షూటింగ్ సగం కూడా చేయలేదు. ఇప్పటికే పలుమార్లు వాయిదాలు, స్క్రిప్ట్ లో మార్పులు, పూజా హెగ్డేని తప్పించడం, తమన్ గురించి ఇలా చాలా ఆటంకాలతో వాయిదా పడింది.
కొన్ని రోజుల నుండి ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. దాంతో ఫ్యాన్స్ సర్లే షూటింగ్ మొదలయ్యింది. కాబట్టి సంక్రాంతికి రిలీజ్ చేస్తే చాలని ఫ్యాన్స్ మూవీ అప్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. తీరా చూస్తే త్రివిక్రమ్ నుండి అల్లు అర్జున్ అనౌన్స్ మెంట్ వచ్చింది. సూపర్ స్టార్ అభిమానులు ఫీలవడానికి కారణం కొన్ని నెలలు ఆగి గుంటూరు కారం మూవీ చివరి స్టేజ్ లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ తో మూవీ గురించి ప్రకటిస్తే బాగుండేది.
హఠాత్తుగా ఇప్పుడే ప్రకటించడం వల్ల మీడియా అటెన్షన్ మొత్తం ఆ ప్రాజెక్టు మీదనే ఉంటుందని అభిమానులు అనుకుంటున్నారట. ఆ మూవీ ఏ జానర్, సినిమాకి బడ్జెట్ ఎంత, కథ ఏంటి లాంటి ప్రశ్నలతో బన్నీ మూవీ గురించే చర్చలు జరుగుతాయని, అప్పుడు గుంటూరు కారం మూవీ పక్కకు వెళ్తుందని మహేష్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారట.
ప్రభాస్, దీపికా పదుకొనె హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమా, హాలీవుడ్ మార్వెల్ సినిమాల వలె చెడు పై మంచి సాధించే గెలుపు బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుండగా, దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ కథలో పురాణాలను కూడా చేర్చాడని సమాచారం. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ విష్ణుమూర్తి ఆఖరి అవతారం అయిన కల్కి పాత్రలో నటిస్తున్నాడని, ఈ మూవీ పోస్టర్లో కనిపిస్తున్న చేయి ఆయనదే అని నెట్టింట్లో వార్తలు షికారు చేస్తున్నాయి.
ప్రభాస్ టెక్నాలజీ సహాయంతో మోడరన్ విలన్స్తో ఎలా పోరాడతాడనేది స్టోరీ అని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో కమల్ హాసన్ నటిస్తున్నారని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ లో కమల్ హాసన్ నటిస్తున్నారనే వార్త కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ మూవీని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్, భారీ స్టార్ కాస్టింగ్తో నిర్మిస్తున్నారు. ఇండియన్ మోస్ట్ అవెయిటెడ్ సినిమాలలో ‘ప్రాజెక్ట్ కె’ ఒకటి. ఈ చిత్రంలో దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ అశ్వనీ దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ 2024 జనవరి 12న రిలీజ్ కానుంది.
పది సంవత్సరాల క్రితం ‘జులాయి’ మూవీతో ప్రారంభం అయిన త్రివిక్రమ్ – అల్లు అర్జున్ జర్నీ ‘అల వైకుంఠపురంలో’ వరకు వచ్చింది. వీరి కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో తెరకెక్కాయి. మళ్లీ వీరి కాంబో ఎప్పుడు వస్తుందా అని బన్నీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా వీరిద్దరు మరోసారి కలిసి సినిమా చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు.
అల్లు అర్జున్ కు ఇది 22వ చిత్రం. త్రివిక్రమ్-బన్నీ కాంబోలో నాలుగవ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కనుంది. ఈ సినిమాని గీత ఆర్ట్స్, హారిక అండ్ హాసిని కలిసి నిర్మిస్తున్నారు. ఈ ప్రకటనతో బన్నీ అభిమానుల్లో సంతోషం రెట్టింపైంది. ఇక ఈ మూవీ ఎలా ఉండబోతుంది. ఈ మూవీలో త్రివిక్రమ్ అల్లు అర్జున్ ను ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ రూపొందుతుందని తెలుస్తోంది.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.