యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర పలు షోలకు యాంకరింగ్ చేస్తూ, మరో వైపు సినిమాలలో డిఫరెంట్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
యాంకర్గా కెరీర్ ప్రారంభించిన అనసూయ, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అటు ఫ్యామిలీని, ఇటు కెరీర్ ను బాలెన్స్ చేసుకుంటూ కొనసాగుతున్నారు. రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అనసూయ గురించి వెల్లడించిన విషయాలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన అనసూయ భరద్వాజ్, సినిమాలలో నటిస్తూ బిజీగా మారారు. వరుసగా ఆఫర్స్ రావడంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూరాణిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అనసూయ లేటస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఆమె ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు నెట్టింట్లో ట్రోల్స్ కు గురి అయ్యి, ఇబ్బందులు సైతం పడ్డారు. రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ ఒక ఇంటర్వ్యూలో అనసూయ గురించి మాట్లాడుతూ, ‘అలీ టాకీస్’ అనే టాక్ షో చేసే సమయంలో అనసూయ పడిన కష్టాల గురించి వెల్లడించారు.

ఎపిసోడ్ షూటింగ్ పూర్తయిన తరువాత నెక్ట్స్ ఎపిసోడ్కి రాత్రి ఏడు గంటలకు వచ్చి అర్ధరాత్రి ఒకటి దాకా అనసూయ రిహార్సల్ చేసేదని అన్నారు. ఆ సమయంలో అనసూయ భర్త భరద్వాజ్ బయట కారులో ఎదురుచూసేవారని చెప్పారు. న్యూ షోకు టెస్ట్ షూట్ కోసం అన్ని ఫిక్స్ చేసుకున్నామని, కానీ షూటింగ్ కి 2 రోజుల ముందు ఆమె డెలివరీ అయ్యింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన నెక్స్ట్ డే విశ్రాంతి తీసుకుని 3వ రోజు షూటింగ్ కి వచ్చారని వెల్లడించారు. షూటింగ్లో పాల్గొంటూనే అరగంటకి ఒకసారి వెళ్ళి తన బిడ్డకి ఫీడింగ్ ఇస్తూ, షోకి యాంకరింగ్ చేసిందని, ఆ విధంగా ఎవరూ చేయలేరని చెప్పుకొచ్చారు.
ఆ ఒక్కరోజు షూటింగ్ లో పాల్గొన్నందుకు అనసూయ ఇప్పటి దాకా డబ్బులు కూడా అడగలేదని చెప్పారు. ఆల్టర్నేట్ అయినా చూసుకోమని చెప్పలేదని, ఆ సమయంలో వాళ్లింట్లో వాళ్లు అంగీకరించడం గ్రేట్ అని ప్రసన్న కుమార్ అన్నారు. నెట్టింట్లో చాలామంది అనసూయ గ్లామర్ చూసి ట్రోల్ చేస్తారని, ఆ కామెంట్స్ చూస్తే వారు చిన్నగా అనిపిస్తారని చెప్పుకొచ్చారు. అనసూయ లాంటి టఫ్ అమ్మాయిని ఇండస్ట్రీలో చూడలేదని, చాలా స్ట్రాంగ్ మహిళ అని చెప్పారు. ప్రస్తుతం ప్రసన్న కుమార్ చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Also Read: OORU PERU BHAIRAVAKONA COLLECTIONS: బ్రేక్ ఈవెన్ కి దగ్గర్లో ఉన్న ఊరి పేరు భైరవకోన..











శాకుంతలం చిత్రంలో సమంత శకుంతలగా, దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటించారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలకపాత్రలో నటించాడు. శకుంతల దుష్యంతుల కుమారుడు భరతుడిగా స్టార్ హిరో అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ నటించింది. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. కానీ వాటిని అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఫస్ట్ షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. సమంత, దర్శకుడు గుణశేఖర్ విమర్శల పాలయ్యారు. సోషల్ మీడియాలో డైరెక్టర్ ను తీవ్రంగా ట్రోల్ చేశారు. సమంత ఆ పాత్రకు సెట్ అవలేదని విమర్శించారు.
ఈ చిత్రం ఓటిటిలో రిలీజ్ కాగా, అక్కడ కూడా డిజాస్టర్ గానే నిలిచింది. ఓటీటీ రిలీజ్ లోనూ ట్రోలింగ్ తప్పలేదు. అయితే ఈ చిత్రం ప్లాప్ అయిన భరతుడిగా అల్లు అర్హ నటనను, డైలాగ్స్ ను మాత్రం అందరు మెచ్చుకున్నారు. అల్లు అర్హకు బాలనటిగా ఇదే మొదటి చిత్రం. అయినప్పటికి ఎలాంటి భయం లేకుండా అద్భుతంగా నటించడంతో పాటుగా, తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది. అర్హ నటించిన సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా నిలిచాయి.
అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాలోని ఒక వీడియో షికారు చేస్తోంది. దేవ్ మోహన్ అల్లుఅర్హను ఎత్తుకుని మాట్లాడుతున్న సన్నివేశంలో అల్లుఅర్హ వస్తున్న నవ్వును ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. దానిని చూసిన నెటిజెన్లు కొంచెం చూసుకోవాలి కదా ఎడిటర్ గారూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


















ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎంతో మంచి మనసున్నటువంటి వ్యక్తిగా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నటువంటి ఎంవీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి అనకాపల్లిలో ఎంపీగా పోటీ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు కానీ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలాంటి ఒక పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి పారిశ్రామికవేత్త తమ పార్టీలోకి వస్తే పార్టీకి ఆర్థికంగా సహాయంగా ఉండటమే కాకుండా తప్పకుండా విజయం సాధిస్తుందని పార్టీ నేతలు ఆకాంక్షిస్తున్నారు.