శ్రావణ మాసం వచ్చింది. ఈ శ్రావణ మాసంలో ఎంతో మంది పూజలను ఆచరిస్తారు. సాధారణంగా శ్రావణ మాసంలో మాంసాహారం జోలికి పోరు. ఇందుకు కారణం ఏంటో చాలా మందికి తెలిసే అవకాశం లేదు. ఆచారం కాబట్టి పాటిస్తున్నామని అనుకుంటాం. కానీ మనం పాటించే ఆచారం వెనుక ఒక కారణం ఉంటుంది. ఈ ఆచారం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

#1 సాధారణంగా హిందూ ధర్మం ప్రకారం మాంసాహారం నిషిద్ధం. కానీ చాలా మంది మాంసాహారం తీసుకుంటారు. అందుకే ధర్మం ప్రకారం ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో మాంసాహారం జోలికి వెళ్లరు. హిందూ మత గ్రంథాలైన భగవద్గీత, వేద పురాణం, మహాభారతంలో మాంసాహారం తీసుకోవడం తప్పు అని చెప్పారు.

దీనికి ఉదాహరణ, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా అంటారు, “నాకు ఎవరైనా భక్తితో ఒక పువ్వు కానీ, పండు కానీ ఆకు కానీ, నీరు కానీ ఇస్తే నేను అది తీసుకుంటాను” అని చెప్తారు. అంతే కాకుండా కృష్ణ జన్మాష్టమి, రాఖీ పండగ, నాగుల పంచమి ఈ పండుగలు అన్నీ కూడా శ్రావణ మాసంలోనే వస్తాయి.
హిందూ ధర్మం ప్రకారం ఏదైనా జీవిని చంపడం అనేది తప్పుగా భావిస్తారు. ఈ కారణంగానే చాలా మంది మాంసాహారం ముట్టుకోరు. అయితే శ్రావణ మాసంలో మాంసాహారం తినకపోవడానికి కొన్ని బలమైన కారణాలు మాత్రం ఇవే.









గత వారం యోగి మూవీని రీరిలీజ్ చేశారు. థియేటర్లు ఈ మూవీలోని ‘ఓరోరి యోగి’ పాటకు ఓ రేంజ్ లో ఊగిపోయాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో ఈ ట్యూన్ ఒరిజినల్ కన్నడ పాట కూడా నెట్టింట్లో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది. దాంతో తెలుగు సాంగ్ నే ఒరిజినల్ సాంగ్ అని అనుకున్నారు. తెలుగు పాటను కన్నడ సినిమా వాళ్ళు కాపీ చేశారనుకున్నారు.
అయితే ఆ సాంగ్ కన్నడలోనే ముందుగా వచ్చింది. కన్నడలో స్టార్ హీరో శివ రాజ్ కుమార్ హీరోగా నటించిన ‘జోగి’ మూవీ 2005 లో రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమాలోని లవ్ సాంగ్ ట్యూన్నే తెలుగువాళ్ళు కాపీ చేశారు. కన్నడలో మూవీలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చిన మంచి లవ్ సాంగ్ ను తెలుగులో ఐటం సాంగ్గా తెరకెక్కించారు.
ఇంత మంచి సాంగ్ ను ఐటం సాంగ్గా మార్చారు కదరా? అని నెటిజెన్లు ఈ పాట పై ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై మీమ్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. కన్నడ ఒరిజినల్ పాట ప్రస్తుతం తెలుగు పాట కన్నా ఎక్కువగానెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. అంతటా కన్నడ సాంగ్ నే వినిపిస్తోంది. ఈ సాంగ్ పై తీసిన రీల్స్, షార్ట్స్ తో కన్నడ పాట ట్రెండింగ్ లోకి వచ్చింది.

చంద్రయాన్-3 వల్ల ఇండియాకి కలిగే మరిన్ని ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..చంద్రయాన్ 3 సుమారు 41 రోజుల పాటు భూమి నుండి చంద్రుడి వైపు ప్రయాణించి ల్యాండర్ మాడ్యూల్ ‘విక్రమ్’ ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లి పై అడుగుపెట్టింది. చందమామ పై అడుగిడాలనే భారత్ ఎన్నో ఏళ్ల కల సాకారం అయ్యింది. చంద్రయాన్-3 వల్ల దేశానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.



‘వివాహ భోజనంబు’ డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా అనిల్ సుంకర సమర్పణలో ‘ఎకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మించారు. ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీ అక్కడ కూడా రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఈ మూవీ మొదటి నుండి క్లైమాక్స్ వరకు ఫన్ ఉంటుంది. ఇక క్లైమాక్స్ సైతం కన్విన్సింగ్ గా ఉంటుంది. ఇటీవల కాలంలో ఇంత ఫన్ ఉన్న మూవీ రాలేదని చెప్పవచ్చు. శ్రీవిష్ణు, నరేష్ ఇద్దరు పోటీపడి నటించారు.

