ప్రకృతికి కోపం వస్తే ఎలా ఉంటుంది.. ప్రకృతి ప్రకోపం ఎలా ఉంటుంది.. అనేది రీసెంట్గా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అర్థమై ఉంటుంది. వరదల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు ఎంత నష్టాన్ని చవి చూశాయో అందరికీ తెలిసిందే. ప్రకృతిని కాపాడుకుంటే.. అది మనల్ని కాపాడుతుంది.. చెట్లను పెంచి.. చెరువుల్ని కబ్జాలు చేయకుండా ఉంటే.. ఇలాంటి ప్రకృతి విళయతాండవాలు జరగవు. వృక్షో రక్షతి రక్షితః అనే కాన్సెప్టుతో సింబా సినిమాను తీశారు.

సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం సింబా. మురళీ మనోహర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో అనసూయ, జగపతి బాబు, వశిష్ట, శ్రీనాథ్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంగా థియేటర్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇలాంటి మెసెజ్ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రశంసలు వస్తాయి. కానీ థియేటర్లో ఆడియెన్స్ నుంచి అంతగా రెస్పాన్స్ రాదు.
కానీ అలాంటి చిత్రాలనే ఓటీటీలో రిలీజ్ చేస్తే టాప్లో ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా సింబా మూవీ టాప్లో ట్రెండ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్, ఆహాలో ఈ సింబా మూవీ గత పది రోజులుగా ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో టాప్ 6లో సింబా చిత్రం ట్రెండ్ అవుతోంది. ప్రకృతి విళయతాండవం చేస్తున్న టైంలో సింబాలోని డైలాగ్స్, సీన్స్ బాగానే వైరల్ అయ్యాయి. చెట్లను పెంచాల్సిన బాధ్యత మన మీద ఎంత ఉంది? ఎందుకు ఉంది? అనేది సింబాలో చక్కగా చూపించారు.
డైరెక్టర్ మొదటి సినిమాతోనే మంచి మెసెజ్ ఇచ్చే చిత్రాన్ని తీశారు. సంపత్ నంది కథ.. డైరెక్టర్ మురళీ మనోహర్ విజన్, మేకింగ్ కు ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. సింబాకి ఓటీటీలో ప్రస్తుతం మంచి ఆదరణ అయితే దక్కుతోంది. ఓటీటీలోకి కొత్త చిత్రాలు వస్తూ ఉన్నా కూడా సింబా ఇప్పటికీ టాప్లోనే ట్రెండ్ అవుతోంది.

రజనీకాంత్ 1950లో డిసెంబరు 12న మైసూరురాష్ట్రంలోని బెంగళూరులో మరాఠీ ఫ్యామిలిలో జన్మించాడు. రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఆయన తల్లి గృహిణి, తండ్రి పేరు రామోజీరావు గైక్వాడ్. పోలీస్ కానిస్టేబుల్ గా పని చేసేవారు. వీరి ఫ్యామిలీ మహారాష్ట్ర నుంచి బెంగళూరుకు వచ్చి, స్థిరపడ్డారు. నలుగురు పిల్లల్లో రజినీకాంత్ చిన్నవాడు. రజినీకాంత్ 9 ఏళ్లు ఉన్నప్పుడు తల్లిని కోల్పోయాడు.
రజినీకాంత్ గవర్నమెంట్ కన్నడ ప్రైమరీ స్కూల్ లో చదువుకున్నాడు. ఆ తరువాత రజినీకాంత్ ను రామకృష్ణ మఠంలో చేర్చారు. అక్కడ ఆధ్యాత్మిక పాఠాలతో పాటుగా నాటకాలలో పాల్గొనేవాడు. మఠంలో ఒకసారి జరిగిన పౌరాణిక నాటకంలో రజినీకాంత్ ఏకలవ్యుడి స్నేహితుడి పాత్రలో నటించారు. రజిని నటనకు ప్రముఖ కన్నడ కవి డిఆర్.బెంద్రే ప్రశంసించారు. అప్పటి నుండి ఆయనకు నటన పట్ల ఆసక్తి పెరుగుతూ వచ్చింది. చదువు పూర్తి అయిన తరువాత రజనీకాంత్ కూలీపనితో సహా ఎన్నో పనులు చేశాడు.
ఆ తర్వాత బెంగుళూరు ట్రాన్స్పోర్ట్ లో బస్ కండక్టర్గా జాబ్ వచ్చింది. ఆ ఉద్యోగం చేస్తున్న కొత్తగా ఏర్పాటు చేసిన మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రకటన కనిపించింది. దానిలో చేరి నటనలో శిక్షణ తీసుకోవాలనుకున్నాడు. అతని ఫ్రెండ్, సహోద్యోగీ రాజ్ బహదూర్ ఇన్స్టిట్యూట్ లో చేరేలా ప్రోత్సహించడమే కాకుండా, ఆర్థికంగా కూడా సహాయం చేశాడు. అక్కడే తమిళ దర్శకుడు కె.బాలచందర్ రజినికాంత్ ను గుర్తించాడు. అయితే కోలీవుడ్ లో శివాజీ గణేశన్ స్టార్ హీరోగా ఉన్నారు. ఇద్దరి పేర్లు ఒకేలా ఉండడంతో బాలచందర్ శివాజీ పేరును రజినీకాంత్ గా మార్చారు.
అలాగే తమిళంలో మాట్లాడటం కూడా నేర్చుకోమని సలహా ఇచ్చాడు. రజనీకాంత్ ఆ సలహాను పాటించి తమిళం నేర్చుకున్నారు. 1975 లో బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అపూర్వ రాగంగళ్;సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసిన రజినికాంత్, 1977 లో తెలుగులో తొలిసారిగా ‘చిలకమ్మ చెప్పింది’ అనే సినిమాలో హీరోగా నటించారు. ఆ తరువాత పలు తెలుగు సినిమాలలో నటించిన రజినికాంత్ సౌత్ సూపర్ స్టార్ గా ఎదిగారు. ప్రస్తుతం జైలర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
ఇప్పుడు ఈ షాట్ గమనించండి. ఇది పైన మెన్షన్ చేసిన దానికి కంటిన్యూషన్ షాట్. కానీ రెండిట్లో తేడా ఏంటో ఈ పాటికే మీకు అర్ధమైపోయి ఉంటుంది. ఒక షాట్ లో బ్లాక్ కలర్ లో ఉన్న కార్స్, నెక్స్ట్ షాట్ లో వైట్ కలర్ లో ఉంటాయి.
మనం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఈ ఒక్క సినిమా ఏంటి? ఎన్నో సినిమాల్లో ఎన్నో చిన్న చిన్న పొరపాట్లు కనిపిస్తాయి. ఇలా సినిమాల్లో పొరపాట్లు జరగడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే ఒక దానికి సంబంధించిన సన్నివేశాలను ఒకటే రోజు చిత్రీకరించరు.
వాళ్ల సమయాన్ని బట్టి, షెడ్యూల్ ని బట్టి సీన్స్ షూట్ చేస్తారు. కాబట్టి ఒకవేళ ఒక సీన్ ఎక్కువ రోజులు షూట్ చేస్తే, యాక్టర్స్ ఒకటే గెటప్ లో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే అప్పుడు బహుశా ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి.














గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో సినీ తారల చిన్ననాటి ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. పైన ఫోటోలో ఉన్న పిల్లల్లో ఒకర టాప్ హీరో ఉన్నారు. ఆ హీరోని గుర్తుపట్టగలరా? ఆయన ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరో. ఆ హీరోకి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హీరోలలో సైతం ఆయనకు అభిమానులు ఉన్నారు.
ఆ హీరో మాటలకు పదును ఎక్కువ. ఆయన పేరు ఆయన ఫ్యాన్స్ కు మంత్రం. కొందరికి బ్రాండ్. ఆయనకు టాలీవుడ్ లో ప్రాణాలిచ్చే ఫ్రెండ్స్, ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన కున్న ఫాలోయింగ్ టాలీవుడ్ లో ఎప్పుడు సెన్సేషన్ అని చెప్పవచ్చు. ఆ హీరో మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా అంతటా పవన్ నామస్మరణ జరుగుతోంది.
ఎక్కడ చూసిన పవన్ కళ్యాణ్ ఫోటోలు కనిపిస్తూ, వైరల్ గా మారుతున్నాయి. అలా పవన్ చిన్నప్పటి పలు ఫోటోలు కూడా నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నటిస్తూన్న సినిమాల నుండి కూడా అప్డేట్స్ రిలీజ్ అయ్యాయి. ఓజి మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్ కు ఫ్యాన్స్ నుండి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. టీజర్ లో గ్యాంగ్ స్టార్ గా కనిపించిన లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.


ఇక చెన్నై బ్యూటి త్రిష ఇండస్ట్రీకి ఇచ్చి ఇరవైమూడు ఏళ్లు గడుస్తున్నా వన్నె తరగని అందంతో ఇంకా నటిస్తూనే ఉంది. హీరోయిన్స్ పది ఏళ్లలోనే పరిశ్రమ నుండి ఫేడ్ అవుట్ అయ్యే రోజుల్లో కూడా 23 ఏళ్లుగా అగ్ర నటిగా నిలదొక్కుకున్న ఘనత త్రిషాకే దక్కింది. ఆ మధ్య సరైన హిట్స్ లేక కాస్త వెనక్కి తగ్గిన ఆమె ps-1 సినిమాతో కమ్బ్యాక్ అయ్యింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా త్రిష కెరీర్ను మళ్ళీ మలుపు తిప్పింది. కుందవై యువరాణి పాత్రలో అద్భుతంగా నటించి మ్యాజిక్ చేసింది.
ఇక అసలు విషయంలోకి వస్తే త్రిష, ప్రకాష్ రాజ్ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు.కానీ ఒకే హీరోయిన్ కి లవర్ గా, మామగా, నాన్నగా, అన్నగా ఇలా అన్ని పాత్రల్లోనూ చేసిన ఒకే ఒక నటుడు ప్రకాష్ రాజ్, ఆ హీరోయిన్ త్రిష. ఇలా వీరు నటించిన ఆ సినిమాల్లో వీరిద్దరూ పోటీ పడి నటించారు. ఆ ఘనత విరిద్దరికే దక్కుతుంది. ఆకాశమంతా సినిమాలో తండ్రి కూతుర్లుగా జీవించారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీలో త్రిష ప్రేమించిన అబ్బాయి తండ్రిగా, కాబోయే కోడలికి మంచితనం గుర్తించే మామగా, సైనికుడు సినిమాలో విలన్ బావమరిదిగా, త్రిషకి వరుసకి అన్నగా చేసాడు.
తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన గిల్లీ సినిమా,ఇది తెలుగులో మహేశ్ ‘ఒక్కడు’ సినిమాకి రీమేక్. ఇక్కడ హీరోయిన్ గా భూమిక నటించగా, తమిళ్ లో త్రిష నటించింది.త్రిషను ప్రేమించే విలన్ గా రెండు చోట్లా ప్రకాష్ రాజ్ నటించాడు. ఇలా తండ్రీ కూతుళ్లు గా, నాయికా ప్రతినాయకులుగా ఎలా కనిపించినా కూడా ప్రకాశ్రాజ్, త్రిష కాంబోను ఇటు తెలుగు ఆడియెన్స్ , అటు తమిళ ఆడియెన్స్ ఆదరించారు. తాజాగా వీరిద్దరు ముఖ్య పాత్రలు పోషించిన ‘పొన్నియిన్ సెల్వన్ 1’సూపర్ హిట్ అయ్యింది.
ఒకసారి దీపిక పెళ్లికి ముందు డేటింగ్ చేసిన ఏడుగురు వ్యక్తుల గురించి తెలుసుకుందాం…!


























