గంధపు చెక్కల స్మగ్లర్ గా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వీరప్పన్ పేరు వినని ఇండియన్స్ ఉండరని చెప్పవచ్చు. వీరప్పన్ జీవితం ఆధారంగా ఇప్పటికే పలు చిత్రాలు, డాక్యుమెంటరీలు తెరకెక్కాయి. వీరప్పన్ లైఫ్ లోని మరిన్ని సీక్రెట్స్ చెబుతామంటూ ఒక వెబ్ సిరీస్ తెరకెక్కింది.
కూసే మునిస్వామి వీరప్పన్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ డిసెంబర్ 14 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటుగా తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
ఈ సిరీస్ కి శరత్ జోతి దర్శకత్వం వహించగా, ప్రభావతి నిర్మించారు. వీరప్పన్ స్వయంగా చెప్పిన విషయాల ఆధారంగా ‘కూసీ మునుసామి వీరప్పన్’ డాక్యుమెంటరీ సిరీస్ ను రూపొందించారు. 1993-1996 కాలంలో వీరప్పన్ ఇంటర్వ్యూ కోసం గోపాల్ అనే విలేకరి అడవిలోకి వెళ్లి, తీసిన వీడియోలు, తన గురించి తానే వీరప్పన్ చెప్పిన దాని ఆధారంగా ఆరు ఎపిసోడ్ లతో ఈ సిరీస్ను తెరకెక్కించారు.
ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే, స్వయంగా వీరప్పన్ తన గురించి, తన లైఫ్ గురించి వివరించారు. వేటగాళ్ల ఫ్యామిలిలో కూసే మునిసామి వీరప్పన్ ఐదుగురు పిల్లలలో రెండో అబ్బాయిగా జన్మించాడు. చిన్నవయసులో తన ఆకలిని తీర్చుకోవడానికి కుటుంబ వృత్తి వేటాడడం ప్రారంభించాడు. మొదట్లో ఆకలి తీర్చుకోవడం కోసం వేటాడినా, కాలక్రమేణా దాని వల్ల కోట్ల రూపాయలు సంపాదించాడు. వీరప్పన్ దశాబ్దాల పాటు తమిళనాడు, కర్ణాటక బార్డర్ లోని అడవులను దోచుకున్నాడు.
వీరప్పన్ కనిపించిన గంధపు చెట్టునల్లా అమ్మడం, ఏనుగులను చంపి వాటి దంతాలు కూడా అమ్మడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో వీరప్పన్ వందలాది మందిని చంపేశాడు. అంతేకాకుండా తనకు వ్యతిరేకంగా ఉన్న పోలీసు ఆఫీసర్లను, పోలీస్ ఇన్ఫార్మర్ అనే సందేహం కలిగినా కూడా చంపేశాడు. తను ఇంతగా ఎందుకు మారాడు? వీరప్పన్ జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను గురించి తానే స్వయంగా చెప్పాడు. ఆ విషయాలన్ని తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే..
Also Read: DUNKI REVIEW : “షారుఖ్ ఖాన్” కి ఈ సినిమాతో మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

బిగ్బాస్ 7 గ్రాండ్ ఫినాలే ఈవెంట్ ఈనెల 17న అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. విజేతగా పల్లవి ప్రశాంత్, రన్నర్ గా అమర్దీప్ నిలిచారు. ఈ సందర్భంగా వారిని కలవడానికి అన్నపూర్ణ స్టూడియో వద్దకు వచ్చిన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కు, అమర్దీప్ ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు అమర్దీప్ కారుపై రాళ్లు విసిరారు. మరో బిగ్బాస్ కంటెస్టెంట్ అశ్విని, గీతూ రాయల్ కారు అద్దాలను పగలగొట్టారు. అంతేకాకుండా రోడ్డుపై ఉన్న ఆర్టీసీ బస్సుల అద్దాలను కూడా ధ్వంసం చేశారు.
అక్కడికి బందోబస్తు కోసం వచ్చిన పంజాగుట్ట ఏసీపీ కారు అద్దం, బెటాలియన్ బస్సు అద్దాన్ని సైతం పగలగొట్టారు. దీంతో పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఈ దాడులకు కారణం పల్లవి ప్రశాంత్ అని తేల్చారు. చెప్పిన పట్టించుకోకుండా ఫ్యాన్స్ దగ్గరికి పల్లవి ప్రశాంత్ వెళ్లాడని పోలీసులు చెప్పారు. ఈ కేసులో ప్రశాంత్తో పాటుగా ఇంకో నలుగురిపై కూడా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేశారు.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో ఏ1, ఏ2 లుగా ఉన్న ప్రశాంత్, అతని సోదురుడిని అరెస్టు చేశారు. వారిని చంచల్గూడ జైలుకు తరలించారు. ఏ3, ఏ4ల నిందితులను ను అరెస్ట్ చేసి, రిమాండ్కు పంపించారు. కాగా, పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ దాడి విషయంలో తన ప్రమేయం ఏం లేదని అన్నారు. ఫ్యాన్స్ తాను రెచ్చగొట్టలేదని వెల్లడించారు.







అలాగే ఇప్పుడు మరొక నటుడు పాత్ర కోసం 15 కేజీలు బరువు తగ్గి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. పై ఫోటోలో డీ గ్లామరైజ్ గా కనిపిస్తున్న ఈ హీరోని గుర్తుపట్టారా ఇప్పటివరకు మనం మాట్లాడుకుంటుంది ఈ హీరో గురించే. వెర్సటైల్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇతను ఏ పాత్ర ఇచ్చిన అందులో ఇమిడిపోతాడు. ఇతను కేవలం నటుడే కాదు మంచి నిర్మాత అలాగే మంచి సింగర్ కూడా.





