తెలుగు సినీ పరిశ్రమకి ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు రెండు కళ్లలా లాంటివారు. హీరోలుగా అడుగుపెట్టి తమ ప్రతిభతో అత్యున్నత స్థాయికి చేరుకోవడమే కాకుండా తెలుగు ఇండస్ట్రీ కోసం ఎంతో కృషి చేశారు.
మద్రాసు నుండి సినీపరిశ్రమ హైదరాబాద్ కు తరలి రావడానికి చాలా కృషి చేశారు. వందల సినిమాలలో నటించి, ప్రేక్షకులను అలరించారు. తెలుగు సినీ ఇండస్ట్రీ ఎప్పటికీ మరచిపోలేని గొప్పనటులు వీరు. ఈ మహా నటుల ఇద్దరి మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 1964లో ప్రవేశపెట్టిన నంది అవార్డులు ఎన్టీఆర్, ఏయన్ఆర్ నటించిన సినిమాలకు వచ్చాయి. వీరిద్దరూ హిందీ, తమిళ చిత్రాలలో నటించారు. అలాగే వీరిద్దరూ కృష్ణా జిల్లాకు చెందినవారు. ఎన్టీఆర్ నిమ్మకూరు నుండి వస్తే, ఏయన్నార్ గుడివాడలోని వెంకట రాఘవపురం నుండి వచ్చారు. వీరిద్దరూ ఇండస్ట్రీకి తమ వారసులను అందించగా, వారిద్దరూ టాలీవుడ్ లో టాప్ హీరోలుగా ఇప్పటికీ రాణిస్తున్నారు.
నందమూరి, అక్కినేని కుటుంబాల నుండి మూడవ జనరేషన్ వారసులు ఇండస్ట్రీలో అడుగుపెట్టి, స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అలాగే కళ్యాణ్ రామ్, తారకరత్న, చైతన్య కృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇక ఏయన్ఆర్ మనవళ్ళు నాగ చైతన్య, అఖిల్ మాత్రమే కాకుండా సుమంత్, సుశాంత్ కూడా పలు సినిమాలలో నటించారు.
ఎన్టీ రామరావు తన భార్య పేరుతో బసవ తారకం క్యాన్సర్ హాస్పటల్ ను నిర్మించగా, ఏయన్ఆర్ తన భార్య పేరుతో అన్నపూర్ణ స్టూడియోను నిర్మించారు. వీరిద్దరి భార్యలు వీరి కన్నా ముందు మరణించారు. ఎన్టీ రామరావు రాజకీయాల్లోకి అడుగుపెట్టి, పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఏయన్ఆర్ తో సంప్రదించారు. ఏయన్ఆర్ ని పాలిటిక్స్ లోకి ఆహ్వానించారు. నాగేశ్వరరావు ఆరోగ్య సమస్యల వల్ల రాలేనని, ఎన్టీ రామరావుకు అభినందనలు తెలిపారు.
ఎన్నో సినిమాలలో కలిసి నటించిన వీరు అభిప్రాయభేదాలతో చాలా ఏళ్లు మాట్లాడుకోలేదు. ఆ తరువాత మళ్ళీ కలిసిపోయారు. ఎంతో అనుబంధం ఉన్న వీరిద్దరు ఎన్ని అభిప్రాయ భేదాలు వచ్చినా, ఏరోజు బహిరంగంగా నిందించుకోలేదు. తెలుగు ఇండస్ట్రీకి క్రమశిక్షణ, స్టార్డమ్ నేర్పిన ఈ లెజండరీ నటులిద్దరూ జనవరి నెలలోనే తుదిశ్వాస విడిచారు.
Also Read: విజయ్ ఆంటోనీ కూతురు చనిపోయే ముందు రాసిన చివరి లెటర్..! “వాళ్లని మిస్ అవుతాను..!” అంటూ..?






యాంకర్ సుమ తెలుగులో టాప్ మరియు స్టార్ యాంకర్ గా రాణిస్తున్నారు. సుమ చాలా బిజీగా ఉండే, అత్యంత కాస్ట్లీ మరియు టాలెంటెడ్ యాంకర్. యాంకర్ లలో ఎక్కువగా సంపాదిస్తున్న యాంకర్ కూడా సుమనే అని చెప్పవచ్చు. ఒక వైపు షోస్, మూవీ ఈవెంట్స్ చేస్తూ, మరోవైపు తన యూట్యూబ్ ఛానెల్లో వీడియోలు పెడుతూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.
ఇదిలా ఉంటే, సుమ, నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి, 24 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సుమ కెరీర్ మొదట్లో నటిగా పలు సీరియల్స్ లో, సినిమాలలో నటించింది. ఒక సినిమాలో హీరోయిన్గా కూడా నటించింది. ఈ క్రమంలోనే సుమ దేవదాస్ కనకాల సీరియల్ లో నటిస్తున్న సమయంలో రాజీవ్ కనకాలతో పరిచయం, అది కాస్త ప్రేమ, ఆ తరువాత పెళ్లి దాకా వెళ్లింది. వీరి పెళ్లి 1999లో ఫిబ్రవరి 10న జరిగింది. ఈ జంటకి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.
సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే సుమ తరచూ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన పెళ్లి కార్డ్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ పోస్ట్ కి ” మీరు కార్డు చదివారా?




కుమార్తె మీరా మరణంతో విజయ్ ఆంటోనీ దుఃఖాన్ని ఆపడం ఎవరి వల్ల కావడం లేదు. పోస్ట్ మార్టం అనంతరం మీరా భౌతిక కాయాన్ని విజయ్ ఆంటోనీ దంపతులు ఇంటికి తరలించారు. మీరాను కడసారి చూడడం కోసం తమిళ ఇండస్ట్రీ ప్రముఖులు విజయ్ నివాసానికి తరలి వస్తున్నారు. విజయ్ ఆంటోనీని ఓదారస్తున్నారు. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోకు ధైర్యం చెప్తూ పోస్ట్ లు పెడుతున్నారు.
మీడియాతో చాలా తక్కువగా మాట్లాడే విజయ్ ఆంటోనీ గతంలో ఆత్మహత్యకు వ్యతిరేక అవగాహన కలిగించే ప్రోగ్రామ్స్ కు ప్రచారకర్తగా పాల్గొన్నారు. అప్పుడు మాట్లాడిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కానీ ఆయన కుమార్తె అలా చేసుకోవడం అందరినీ వేదనకు గురిచేస్తోంది. మీరా మృతి పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మీరా స్కూల్, ఆమె ఫ్రెండ్స్ ను విచారించారు. మీరా ల్యాప్టాప్ మొదలుకొని ఆమె ఉపయోగించే వస్తువులను పరీక్షిస్తున్నారు.
ఈ కేసు దర్యాప్తులో మీరా సోమవారం రాత్రి 11 గంటల వరకు తన ల్యాప్టాప్ను ఉపయోగించిందని, ఆ తర్వాత మీరా ఉరివేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. మీరా పాఠ్యపుస్తకంలో ఒక లెటర్ దొరికిందని అంటున్నారు. ఆ లెటర్ లో మీరా తన ఫ్రెండ్స్ ను, టీచర్స్ ను మిస్ అవుతున్నానని పేర్కొంది. అందరూ సురక్షితంగా మరియు సంతోషంగా ఉండండి. లవ్ యూ ఆల్ !! థాంక్యూ ఆల్ !! అని రాసినట్టు చెబుతున్నారు.
అతిథి వెబ్ సిరీస్ ను ప్రవీణ్ నిర్మించగా, భరత్ వై.జి. తెరకెక్కించారు. హీరో వేణు తొట్టెంపూడి ప్రధాన పాతరలో నటించిన ఈ సిరీస్ లో అవంతిక మిశ్రా, అదితి గౌతమ్ ,వెంకటేశ్ కాకుమాను, రవి వర్మ కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే, స్టోరీ రైటర్ రవి వర్మ (వేణు తొట్టెంపూడి), సంధ్య (అదితి గౌతమ్) భార్యాభర్తలు. సంధ్య నిలయం అనే పెద్ద భవనంలో జీవిస్తూ ఉంటారు. రవివర్మ భార్య సంధ్యకు పక్షవాతం రావడం వల్ల బెడ్ కే పరిమితమవుతుంది. రవివర్మ భార్యకు సేవలు చేస్తూ, కథలు రాస్తూ జీవిస్తుంటాడు.
ఒక రోజు అతను రాసిన స్టోరీలోలానే వర్షం కురిసిన ఆ రాత్రి రవివర్మ బంగ్లాకి మాయ (అవంతిక) అనే యువతి వస్తుంది. మరోవైపు యూట్యూబర్ అయిన సవేరి (వెంకటేష్ కాకుమాను) దెయ్యాలు లేవనే కాన్సెప్ట్ తో వీడియోలు తీసి తన ఛానెల్ లో పెడుతుంటాడు. ఆ క్రమంలోనే సవేరి తనను దెయ్యం వెంబడిస్తుందనే భయంతో రవివర్మ బంగ్లాకి వస్తాడు. సవారి మాయను దెయ్యం అని సందేహపడుతాడు. కానీ ఆ ఇంట్లోనే మాయ మరణిస్తుంది. ఆమె చనిపోవడానికి కారణం ఎవరు? మాయ దెయ్యం అనుకున్న సవారి సందేహం నిజమైందా? ఆఖరికి ఏం జరిగింది అనేది మిగిలిన కథ.
ఆరు ఎపిసోడ్ లతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ లో తొలి మూడు ఎపిసోడ్స్ క్యూరియాసిటీ కలిగేలా చేశాయి. అయితే ఆ తర్వాత ఎపిసోడ్ లు రొటీన్ ఫార్మేట్లోకి వచ్చిన భావన కలుగుతుంది. హీరో వేణు ఇప్పటివరకు కామెడీ పాత్రలను ఎక్కువగా చేశాడు. ఇందులో పూర్తిగా సీరియస్ పాత్రలో కనిపిస్తారు. రచయిత రవి వర్మగా సెటిల్డ్ గా నటించాడు. అధితి గౌతమ్ సంధ్యగా పర్వాలేదనిపించింది. మాయ పాత్ర చేసిన అవంతిక నటనతో ఆకట్టుకుంది.





షారుక్ ఖాన్, నయనతార జంటగా నటించిన జవాన్ మూవీ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సాధించి, వెయ్యి కోట్ల వసూళ్ల వైపు దూసుకెళ్తోంది. ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ విజయంతో అట్లీ సంతోషంలో మునిగిపోయాడు. ఈ క్రమంలోనే అట్లీ తన మూవీ జవాన్ ను ఆస్కార్ బరిలో దింపాలని కోరుకుంటున్నాడు. ఈ విషయం గురించి దర్శకుడు అట్లీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అట్లీ మాట్లాడుతూ, ఏ దర్శకులకు అయినా అవార్డుల పైన ఆశ ఉంటుందని అన్నారు. జాతీయ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్ వంటివాటిని అందుకోవాలని కలలు కంటారని అన్నారు. అన్నీ కరెక్ట్ గా సెట్ అయితే, జవాన్ మూవీని ఆస్కార్ బరిలో నిలబెట్టాలని భావిస్తున్నామని, ఈ విషయం గురించి షారుఖ్ సర్ని అడగాలని, ఆయన ఎలా రెస్పాండ్ అవుతారో అని అట్లీ చెప్పుకొచ్చారు.
అయితే అట్లీ చేసిన ఈ కామెంట్స్ పై నెటిజెన్లు అట్లీని ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. కొందరు నెటిజెన్లు అన్నీ సినిమాలను కలిపి తీసావు. ఏ విభాగంలో ఆస్కార్ ఇవ్వమని అంటావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ వంటి మూవీ కేటగిరీలో ఆస్కార్ ఇస్తారా? అని, రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే జవాన్ మూవీని సౌత్ లో ఆదరించక పోయినా, బాలీవుడ్ లో ఈ మూవీని విపరీతంగా చూస్తున్నారు. దాంతో బాలీవుడ్లో అతిపెద్ద రికార్డులను సృష్టిస్తోంది.