న్యాచురల్ స్టార్ నాని సినిమాలు అంటే మినిమం గ్యారెంటీ. ఏటువంటి వారైనా అవును నాని సినిమా చూడొచ్చు, నానీని నమ్మొచ్చు, నానీ సినిమాలు బాగుంటాయి అనే ముద్ర పడిపోయింది. దానికి తగ్గట్టే నాని వరుస సినిమాలతో దూసుకుపోతూ… అందరికి చేరువయ్యారు.
నానీని హీరోగా కంటే కూడా మనోడే మన పక్కిందు కుర్రాడే అనే ఫీలింగ్ లోనే ఎక్కువగా ఉంటారు. ఇక నానీ కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో దాటుకుని సొంతంగా ఇప్పుడు తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్నారు.

ప్రస్తుతం హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ… దసరా మూవీ ద్వారా శ్రీకాంత్ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. నాని కొత్త డైరెక్టర్లకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నారు. అయితే నాని ఇప్పటికే హాయ్ నాన్న వంటి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫాదర్, డాటర్, మదర్ ఎమోషన్స్ తో కూడిన సినిమాను కొత్త డైరెక్టర్ శౌర్యువ్ తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో నాని సరసన మృణాళ్ ఠాకూర్ నటిస్తున్నారు. ఇది కూడా మంచు హిట్ అవుతుందని ఆడియన్స్ ఫిక్స్ ఐపోయారు. ఇదిలా ఉంటే నాని వరస పెట్టి సినిమాలు తీసెయ్యలని ఫిక్స్ అయ్యి… అందరూ కొత్త డైరెక్టర్ల దగ్గర కథలు వింటున్నారు. ఇక తరువాత సింపుల్ కూల్ గా కాకుండా యాక్షన్ ఓరియంటెడ్ నేపథ్యంలో… డివీవి దానయ్య నిర్మాణంలో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మరో చిత్రాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తదుపరి మోహన్ రాజాతో కలిసి చేసేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం.

అయితే తమిళంలో ఎంతో మంచి హిట్స్ ఉన్న మోహన్ ఇప్పుడు తెలుగులో అడుగుపెట్టి తొలుత నాగార్జున 100వ సినిమా తీయనున్నట్లు ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. కానీ దానికంటే ముందే మోహన్ రాజాకి వేరే ప్లాన్స్ ఉన్నందుకు లేక కథలో ఉన్న పట్టు వల్లనో, ముందు నానితో చెయ్యాలని పట్టు పట్టి రెండు కథలు వినిపించారు. మొదటి కథ నచ్చకపోవడంతో ఇంకో మంచి కమర్షియల్ కథ వినిపించారట. దీనికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి నానితో ముందు సినిమా ఓకే చేయించుకుని నాగార్జున సినిమా పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
ALSO READ : “దుల్కర్ సల్మాన్” నెక్స్ట్ సినిమా కథ ఇదేనా..? ఏంటంటే..?






బ్రో మూవీలో సాయి తేజ్ కి ఇద్దరు సిస్టర్లు ఉంటారు. వారిలో ఒకరు ప్రియా వారియర్ కాగా, రెండవ సిస్టర్ గా యువ లక్ష్మి నటించింది. ఆమె అసలు పేరు యువశ్రీ లక్ష్మి. ఆమె కోలీవుడ్ నటి, తమిళంలో పలు సినిమాలలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళనాడు లోని కారైకాల్ లో 2000వ సంవత్సరంలో డిసెంబర్ 25న జన్మించింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన యువలక్ష్మికి భరతనాట్యం అంటే చాలా ఆసక్తి. ఆ నృత్యం నేర్చుకున్న ఆమె జాతీయ అవార్డుతో సహా అనేక అవార్డులను పొందింది.
ఆమె మొదటిసారి 2016 లో వచ్చిన అమ్మ కనక్కు అనే తమిళ చిత్రంలో అమలా పాల్ మరియు సముద్రఖనితో కలిసి నటించింది. ఆ తరువాత సముద్రఖని ‘అప్పా’ లో ప్రధాన పాత్రలో నటించింది. ఆమె ‘ఆకాశమిత్తయి’ అనే సినిమా ద్వారా మలయాళంలో ఎంట్రీ ఇచ్చింది.
ఆ తరువాత శివకార్తికేయన్ నటించిన ‘వేలైకారన్ ‘ రాఘవ లారెన్స్ మూవీ కాంచన 3లో కూడా సహాయక నటి పాత్రలో యువ లక్ష్మి నటించింది. సముద్రఖని దర్శకత్వం వహించి, నటించిన వినోదయ సీతమ్ సినిమాలో కూడా యువ లక్ష్మి కీలక పాత్రలో నటించింది. దూరదర్శన్ లో ప్రసారం అయిన సూపర్ కుటుంబంలో కూడా చేసింది. బ్రో మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
















ఇటీవల వచ్చిన ‘గుడ్ నైట్’ సినిమాలో హీరోకు ‘గురక’ సమస్య ఉన్నట్టే, ‘జానకి జానే’ మూవీలో హీరోయిన్ కు ‘భయం’ అనే మానసిక సమస్య ఉంటుంది. ఆ సమస్య ఆమె జీవితాన్ని ఎలా మార్చిందో ఈ మూవీలో చూపించారు. సైజు కురుప్, నవ్య నాయర్ ప్రధాన పాత్రలలో నటించగా, జానీ ఆంటోనీ, కొట్టాయం నజీర్, జార్జ్ కోరా, అనార్కలి మరికర్, షరఫ్ వంటివారు ఇతర కీలక పాత్రలలో నటించారు.
ఈ మూవీ కథ విషయనికి వస్తే, మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి జానకి (నవ్య నాయర్), చిన్నప్పుడే తండ్రి మరణించడంతో ఫ్యామిలీ భారం ఆమె పైనే పడుతుంది. అమ్మతో ఉంటూ ఒక ప్రెస్ లో వర్క్ చేస్తుంటుంది. అయితే జానకికి భయం ఎక్కువగా ఉంటుంది. గట్టిగా ఎవరైనా మాట్లాడినా, ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లాలన్నా, చీకటిగా ఉన్న చాలా భయపడుతుంది. ఒకసారి భయంతో జానకి స్పృహ తప్పి పడిపోగా, రోడ్ కాంట్రాక్టర్ అయిన ఉన్ని ముకుందన్ (సైజు కురుప్) రక్షించి, ఇంటికి తీసుకెళ్తాడు.
జానకిని ప్రేమించిన ఉన్ని ముకుందన్ వారి పెద్దలను ఒప్పించి మరి జానకిని పెళ్లి చేసుకుంటాడు. సంతోషంగా సాగుతున్న వీరి లైఫ్ లో ఎదురైన అనుకోని సంఘటన ఏమిటి ? దాన్ని రాజకీయ ప్రత్యర్థులు అయిన షాజీ (కొట్టాయం నజీర్), మార్టిన్ (జార్జ్ కోరా) ఎలా ఉపయోగించుకున్నారు? దానివల్ల ఉన్ని, జానకి ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? ఆఖరికి ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.