ప్రముఖ కొరియోగ్రఫర్ రాకేష్ మాస్టర్ ఇటీవల కన్నుమూసిన విషయం అందరికి తెలిసిందే. ఆయన మరణంతో ఇండస్ట్రీ మంచి కొరియోగ్రఫర్ ని కోల్పోయింది. రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో హాస్పటల్ లో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త వినగానే టాలీవుడ్ తో పాటుగా మాస్టర్ శిష్యులు, ఆడియెన్స్ షాక్కి గురయ్యారు.
రాకేష్ మాస్టర్ శిష్యులు శేఖర్, గణేష్, జానీ మాస్టర్స్ రాకేష్ మాస్టర్ పాడె మోసి తమకు డాన్స్ నేర్పిన గురువు రుణం తీర్చుకున్నారు. ఇటీవల నిర్వహించిన రాకేష్ మాస్టర్ సంతాప సభలో ఆయన శిష్యులు శేఖర్, సత్య మాస్టర్లు పాల్గొని, ఆయన గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
రాకేష్ మాస్టర్ పెద్దకర్మ కార్యక్రమంలో ఆయన భార్య, కుమారుడు, కుమార్తెలు పాల్గొన్నారు. ఈ సంతాప సభకు సినీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖ డైరక్టర్ వైవీఎస్ చౌదరి హాజరు అయ్యారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన దేవదాసు మూవీలో 4 సూపర్ హిట్ సాంగ్స్కి రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఆయన శిష్యులు రాకేష్ మాస్టర్ కోసం ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రతి సంవత్సరం రాకేష్ మాస్టర్ పేరుతో జాతీయ పురస్కారాన్ని అందిస్తామని తెలిపారు.

చాలామందికి డ్యాన్స్ నేర్పించిన రాకేష్ మాస్టర్ ని మర్చిపోకుండా ఉండేందుకు శేఖర్, సత్య మాస్టర్లు ఈ జాతీయ పురస్కారాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఈ విషయాన్ని మాస్టర్ సంతాప సభలో తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా టెక్నిషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయిన నాగబాల సురేష్ కుమార్ ప్రకటించారు. ఇదిలా ఉంటే శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ గురించి చెప్తూ ఢీ షోలో కన్నీరు పెట్టుకున్నారు. ఈ షోకి ఆయన జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
లేటెస్ట్ ఢీ షో ఎపిసోడ్ ప్రోమోలో రాకేష్ మాస్టర్ ఓల్డ్ వీడియో ప్లే చేశారు. శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ కాళ్లు మొక్కిన వీడియో చూసిన శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ, “మాస్టర్ గారితో 7, 8 ఏళ్ల జర్నీ. చాలామంది తెలిసీ, తెలియక మాట్లాడుతుంటే చాలా బాధగా అనిపిస్తుంది. పై నుంచి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని కంటతడి పెట్టుకున్నారు.
Also Read: ARTHAMAYYINDHA ARUN KUMAR : “ఆహా” లో రిలీజ్ అయిన ఈ సిరీస్ అలరించిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ‘ఇండియన్ 2’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో ఉంది. తాజాగా ఆమె ఇన్స్టాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చింది.
ఈ క్రమంలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, తాను కూడా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ను ఎదుర్కొన్నట్లు తెలిపింది. స్త్రీలు ఎవరైనా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ సమస్యతో బాధపడుతుంటే ఫ్యామిలీ వారికి అండగా ఉండాలని సూచించింది. ఆ సమయం తనకు చాలా భారంగా ఉండేదని, అప్పుడే ట్రైనర్ ఆధ్వర్యంలో ఎక్కువ సమయం వర్కౌట్లు చేయడం ప్రారంభించాను.
అలాగే ఇష్టమైన వారితో, ఫ్యామిలీ మెంబర్స్ తో ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నించే దాన్ని. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ తో ఇబ్బంది పడుతున్న సమయంలో నా భర్త గౌతమ్ ఎంతో మద్దతుగా నిలిచారని కాజల్ అగర్వాల్ తెలిపింది. తనను అర్థం చేసుకునే ఫ్యామిలీ మెంబర్స్ ఉండటం వల్ల ఆ డిప్రెషన్ నుంచి త్వరగా బయటకు రాగలిగానని చెప్పింది.
అయితే అదే కంపెనీలో పని చేస్తున్న షాలినీ(తేజస్వి మదివాడ) టీమ్లో పని చేసే ఛాన్స్ వస్తుంది. దాంతో ఆమె దగ్గర కొద్ది రోజుల్లోనే మంచి మార్కులు తెచ్చుకుంటాడు. దాంతో ఇద్దరి మధ్య పర్సనల్ రిలేషన్ ఏర్పడుతుంది. ఆ తరువాత ఏం అయ్యింది? దీనిలో పల్లవి (అనన్య) క్యారెక్టర్ ఏమిటి? చివరికి ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే..
రివ్యూ:
ఆఫీస్ కి వెళ్ళిన దగ్గర నుండి టీలు చేసే వర్క్ ఇస్తారు. కార్పొరేట్ ప్రపంచంలో ఒక పల్లెటూరి కుర్రాడు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? పనిలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆఖరికి తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా అనే విషయాన్ని 5 ఎపిసోడ్లలో చూపించారు.
హర్షిత్ రెడ్డి అరుణ్ కుమార్ ఇంటర్న్ పాత్రలో ఒదిగిపోయాడు. అమాయకంగా కనిపిస్తూ, ఆఫీస్ లో చెప్పిన పనులన్ని చేస్తూ మెప్పించాడు. అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంది. డామినేషన్, స్వార్ధం కలిగిన టీమ్ లీడర్ షాలినీ క్యారెక్టర్ లో తేజస్వి పర్వాలేదనిపించింది. పల్లవిగా అనన్య ఒకే. ఆఫీస్ బాయ్ పాత్రలో వాసు ఇంటూరి నవ్వించేందుకు ట్రై చేశారు. మిగతా వాళ్ళు తమ పాత్రల మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్:
రేటింగ్:
ఈ చిత్రంతో విశ్వక్ సేన్ హీరోగా గుర్తింపును పొందాడు. ఈ మూవీ తరువాత విశ్వక్ ‘మాస్ కా దాస్’ గా మారారు. ఈ చిత్ర డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అటు దర్శకుడిగా, ఇటు నటుడిగా రెండిటిలోనూ రాణిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ సమయంలో మొదటి రోజు 70 లక్షలు మాత్రమే కలెక్షన్ రాబట్టింది. ఇక ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం రీ రీలీజ్ మాత్రం రికార్డ్ సృష్టించింది. ఈ మూవీ రీ రీలీజ్ కోసం యూత్ చాలా ఆసక్తితో ఎదురుచూశారు.
ఇక ఈ సినిమా రీ రిలీజ్ లో భారీ వసూళ్లను సొంతం చేసుకుందని సమాచారం. ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీ మొదటి రోజే కోటి డెబ్బై లక్షల రూపాయల గ్రాస్ ను కలెక్ట్ చేసి, రికార్డ్ సృష్టించింది. దాంతో ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా పెద్ద చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది.
ఈ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు పోకిరి, ఒక్కడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఖుషి, జల్సా , మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ ఆరెంజ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ దేశముదురు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ సింహాద్రి లాంటి చిత్రాల పక్కన చోటు సంపాదించుకుంది.


ఈరోజు మెగా ప్రిన్సెస్కు నామకరణం చేయబోతున్నట్లు ఉపాసన వెల్లడించారు. నేడు మెగా ప్రిన్సెస్ బారసాల వేడుక గ్రాండ్ గా జరగనుంది. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ పాల్గొననున్నారు. సన్నిహితులు, ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. బారసాల వేడుక సందర్భంగా రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ రామ్ చరణ్- ఉపాసన జంటకు ఒక ఖరీదైన బహుమతి పంపించారట.
ఈ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ముఖేష్ అంబానీ పంపిన ఆ బహుమతి ఏమిటంటే బంగారు ఊయల. దాని కోసం కోటి రూపాయలకు కన్నా ఎక్కువే ఖర్చు అయ్యిందని సమాచారం. అయితే ఈ విషయం గురించి ఎవరు అఫిషియల్ గా ప్రకటన చేయలేదు.
2001లో విడుదల అయిన గదర్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో సన్నీ డియోల్, అమీషా పటేల్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా గదర్ 2 మూవీ తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే ఆఖరి షెడ్యూల్లో పాల్గొన్న అమీషా పటేల్ చిత్రబృందం పై ట్విట్టర్ లో షాకింగ్ కామెంట్స్ చేసింది.
అమీషా పటేల్ ట్వీట్లో ‘సాంకేతిక నిపుణులు, కాస్ట్యూమ్ డిజైనర్లు, మేకప్ ఆర్టిస్టులు, ఇతర స్టాఫ్ కి వేతన బకాయిలు ఇవ్వలేదని, షూటింగ్ ఆఖరి రోజు చండీగఢ్ ఎయిర్ పోర్ట్ కు వెళ్ళడానికి, ఫుడ్ బిల్లులకు డబ్బు చెల్లించలేదు. యాక్టర్స్ కు, స్టాఫ్ కి కార్లను అరెంజ్ చేయలేదు. షూటింగ్ దగ్గరే ఒంటరిగా వదిలి వేశారు.
అయితే జీ స్టూడియోస్ టీమ్ వెంటనే అన్ని బకాయిలను చెల్లించి, అనిల్ శర్మ ప్రొడక్షన్స్ చేసిన తప్పులను సరి దిద్దారు. సమస్యను సాల్వ్ చేసిన నీరజ్ జోషి, షరీక్ పటేల్, కబీర్ ఘోష్, నిశ్చిత్ లకు కృతజ్ఞతలు. జీ స్టూడియోస్ యూనిట్ ఎప్పుడు టాప్ ప్లేస్ లోనే ఉంటుంది’ అని ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే గదర్ 2 సినిమాలో అమీషా పటేల్ సన్నీ డియోల్ సరసన హీరోయిన్ గా నటించింది.
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్కు చెందిన అలోక్ మౌర్య తన భార్యను చాలా కష్టపడి చదివించి ఆమె కల అయిన ప్రభుత్వ ఉద్యోగం సాధించేలా చేశాడు. తీరా సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ జాబ్ వచ్చిన తరువాత ఆమె అతడిని మోసం చేసింది. పైగా అతడి పై వరకట్నం కేసు పెట్టి జైలుకు పంపించింది. ఈ విషయం పై ఎంతోమంది సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చిన్మయి కూడా స్పందించారు. నెటిజెన్లు ఆమెను, రాహుల్ రవీంద్రన్ ట్యాగ్ చేస్తూ కామెంట్స్ చేస్తూన్నారు. దీనిపై తాజాగా రాహుల్ రవీంద్రన్ ట్విట్టర్ లో ఇలా చెప్పుకొచ్చారు.
“మీరు అందరూ ఆమెతో పోరాడిన తరువాత నన్ను ట్యాగ్ చేస్తూనే ఉన్నారు. ఆమె ఎత్తి చూపుతున్న మైండ్ సెట్ ప్రాబ్లెమ్స్ గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు అంగీకరించినా, అంగీకరించకపోయినా, ఆమె మాట వినండి. ఆ పై ఆమెకు కొంచెం ప్రేమను ఇవ్వడానికి ప్రయత్నించండి. ఆమె మీ పై ప్రేమను కురిపిస్తుంది. ఆమె మీకు ఇష్టమైన అక్కగా మారుతుంది.
నాకు లభించిన అతి పెద్ద ఆశీర్వాదాలలో ఆమె కూడా ఒకటి. ఆమె పరిమితి లేకుండా ప్రేమిస్తుంది. మరియు మీకు భరోసా ఇస్తుంది. ఇతరుల వైపు నుండి సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, మీ జీవితంలో ఉన్న స్త్రీలు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు. మరియు మీరు మీ కంటే ఎక్కువగా వారిని గౌరవించండి. అప్పుడు ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో మీకు తెలియదు” అని చెప్పుకొచ్చారు.
ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ అనేవారు. కానీ టాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రాలతో దేశవ్యాప్తంగా టాలీవుడ్ పేరు మారుమోగింది. ఆ తరువాత వచ్చిన ‘ఆర్ ఆర్ ఆర్’ తో అంతర్జాతీయంగా తెలుగు సినిమాకు క్రేజ్ ఏర్పడింది. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ వంటి డైరెక్టర్ ప్రశంసలు కురిపించాడు అంటే తెలుగు సినిమా ఖ్యాతి గురించి అర్ధం చేసుకోవచ్చు. జక్కన్న నెక్స్ట్ సినిమా కోసం ఇండియా వైడ్ గానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఒక మలయాళ సినిమాలో టాలీవుడ్ పై సెటైర్ వేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘త్రిశంకు’ అనే మలయాళ మూవీలో హీరోయిన్, ఆమె ఫ్రెండ్స్ కూర్చోని మాట్లాడుకుంటూ ఉంటారు. అపుడు హీరోయిన్ వల్ల నాన్న పెళ్లికి ఒప్పుకోడు ఏమో అంటుంది. అప్పుడు పక్కన ఉన్న అమ్మాయి తెలుగు సినిమాలలో లాగా లేచిపో అని చెప్తుంది. నిజానికి అన్ని తెలుగు సినిమాలూ అలా ఉండవు. కానీ ఈ సినిమాలో ఆ పదం వాడేసారు. ఈ వీడియో చూసిన కొంత మంది తెలుగువాళ్ళు మా సినిమాలు అన్నీ అలా ఉండవు అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఆదిపురుష్ సినిమా మొదట్లో ప్రభాస్ ఎంట్రీ సన్నివేశంలో జరిగిన ఫైట్ ను ఎలా షూట్ చేశారు? ఫైట్ షూటింగ్ ముందు ఎలా వర్కవుట్ చేశారో తెలిపే వీడియో రిలీజ్ అయ్యింది. అయితే ఈ వీడియోలో ప్రభాస్ కు బదులుగా ఫైటర్స్ తో రిహార్సల్స్ ఫైట్ ను చిత్రీకరించారు. ఆ తరువాత అదే ఫైట్ ను ప్రభాస్ పై షూట్ చేశారు. ఆ ఫైట్ సీన్స్ కు గ్రాఫిక్స్ యాడ్ చేశారు.
ఇక ఈ వీడియో చూసిన వారు ఇంత కష్టపడి పోరాట సన్నివేశాలను చిత్రీకరించారా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు డమ్మీ ఫైటర్స్తో చిత్రీకరించిన ఈ ఫైట్ సీన్ని, అనంతరం డమ్మీ ఫైటర్ ఫేస్ కు బదులుగా ప్రభాస్ ఫేసును అతికించే ఛాన్స్ ఉందని కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోలో చూపించిన ఫైట్ సీన్స్ ఎంతో క్లిష్టంగా ఉన్నాయి. వీటిని ట్రైనింగ్ తీసుకున్న ఫైటర్ మాత్రమే చేయగలడని, హీరో ప్రభాస్ అంత క్లిష్టమైన ఫైట్ ను ఫ్లెక్సిబుల్గా పోరాడగలరా అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిన సినిమా ఆదిపురుష్. ఈ మూవీలో హీరో ప్రభాస్ రాముడిగా, సీతాదేవిగా కృతి సనన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, హనుమంతుడి పాత్రలో దేవదత్ నగరే, రావణాసురుడుగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం చేయగా, ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ నిర్మించారు.