బాహుబలి సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి ఆరేళ్ళు కావొస్తున్నా.. ఇంకా మైండ్ లోంచి పోలేదు. ఆ గ్రాఫిక్స్ కానీ, విజువల్స్ కానీ అంత అందం గా డిజైన్ చేసారు.
అందుకే బాహుబలి సినిమా ఓ విజువల్ వండర్. జక్కన్న చెక్కిన ఈ సినిమా శిల్పం తెలుగు సినిమా గౌరవాన్ని మరింత పెంచింది.

అయితే.. ఈ సినిమాలో కూడా కొన్ని సీన్లు కాపీ వే ఉన్నాయి అంటూ చాలా వీడియోస్ వచ్చాయి. ఈ సినిమా స్టోరీ గురించి కానీ, కొన్ని సీన్ల గురించి కానీ ఎక్కడెక్కడ నుంచి కాపీ కొట్టారో చెప్పుకొచ్చారు. అసలు వీళ్ళు ఇవన్నీ ఎలా కనిపెడతారో కూడా తెలియదు. మనం చూసిన తరువాత “ఏంటి ఇది కాపీ నా”? అని అనుకుంటూ ఉంటాం.

రీసెంట్ గా, గులాబీ ఛానెల్ వారు కూడా కొన్ని ఒరిజినల్ సీన్స్ ను కంపేర్ చేస్తూ ఓ ట్రోలింగ్ వీడియో ను పోస్ట్ చేసారు. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. తమన్నా ఎంట్రీ, ప్రభాస్ ఎంట్రీ సీన్ లను కూడా కాపీ చేశారని అర్ధం అయిపోతుంది. కట్టప్ప ని ప్రభాస్ “నేనెవర్ని” అని అడుగుతాడు కదా.. ఆ సీన్ కూడా కాపీ చేసిన సీనే. ఏ సీన్ ని ఎక్కడనుంచి కాపీ చేసారో మీరు ఈ కింద వీడియో చూడొచ్చు.
Watch Video:
https://youtu.be/lg-9D6BsHoU

ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి మూవీ పై విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాలోని వీఎఫ్ఎక్స్, పాత్రల వస్త్రధారణ పై మరియు పాత్రల చిత్రీకరణ పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. మూవీ డైరెక్టర్ ఓం రౌత్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఆదిపురుష్ పై నెట్టింట్లో చర్చ జరుగుతున్న సమయంలో ఓం రౌత్ పాత ట్వీట్ ఒకటి వైరల్ గా మారింది. అది కూడా 2016లో చేసిన ట్వీట్.
దీనిని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అభిమానులు తెరపైకి తీసుకొచ్చి, ఓం రౌత్ను ట్రోల్ చేస్తున్నారు. అయితే ఓం రౌత్ ఆ ట్వీట్ లో షారుక్ ఫ్యాన్ సినిమాతో పొలుస్తూ మరాఠీ సినిమా ‘సైరాట్’ పై ప్రశంసలు కురిపించాడు. అయితే షారుక్ ఫ్యాన్స్ అతని పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓం రౌత్ ‘మరాఠీ సినిమా ‘సైరాట్’ షారుఖ్ ‘ఫ్యాన్’ సినిమాని క్రాస్ చేసి 80 కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది’ అని ట్వీట్ చేశాడు.
ఆదిపురుష్ సినిమాతో ట్రోల్ అవుతున్న ఓం రౌత్ను షారుక్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అది కూడా షారుక్ ఒక సందర్భంలో కర్మ గురించి చేసిన ట్వీట్ తో ట్రోల్ చేస్తున్నారు. 500 కోట్ల ‘ఆదిపురుష్’ సినిమా కన్నా 4 కోట్ల బడ్జెట్తో తీసిన ‘సైరాట్’ మూవీ వీఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ బాగున్నాయని కామెంట్స్ చేస్తున్నారు.




ఏషియన్ మల్టిప్లెక్స్ థియేటర్స్ లో మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ కి ఆడియెన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ పొందింది. హైదరాబాద్ లో ఏఎంబి సినిమాస్ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇటీవల ఏషియన్ సినిమాస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పార్టనర్ షిప్ తో ఏఏఏ సినిమాస్ అమీర్ పెట్ లో నిర్మించారు. తాజాగా ఈ మల్టిప్లెక్స్ థియేటర్ ను ప్రారంభించారు. ఈ వేడుకకు తెలంగాణ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నిర్మాత అల్లు అరవింద్ హాజరయ్యారు.
అమీర్ పెట్ లో ఒకప్పుడు బాగా ఫేమస్ అయిన సత్యం థియేటర్ ని పడగొట్టి, ఏఏఏ సినిమాస్ ని నిర్మించారు. 3 లక్షల స్క్వేర్ ఫీట్ లో దీనిని నిర్మించారు. పార్కింగ్ కోసం 2 ఫ్లోర్స్ ని కేటాయించారంట. ఇందులో మొత్తం 5 స్క్రీన్ లు ఉండగా, ఒక్కో స్క్రీన్ 1 67 ఫీట్ల పొడవుతో బార్కో లంజెర్ ప్రొజెక్షన్ తో చిత్రాలను ప్రదర్శిస్తారని తెలుస్తోంది.
రెండవ స్క్రీన్ ఎపిక్ లక్సన్ స్క్రీన్. ముంబైలో తప్ప ఎక్కడ ఈ LED స్క్రీన్ లేదట. ఏఏఏ సినిమాస్ ద్వారా ఈ టెక్నాలజీని మొదటిసారిగా హైదరాబాద్ కి పరిచయం చేస్తున్నారు. ఇక ఈ స్క్రీన్ కి ప్రొజెక్టర్ తో పని లేదంట. కనెక్షన్ ద్వారానే మూవీ ప్లే అవుతుంది. మిగిలిన 3 స్క్రీన్స్ 4K ప్రొజెక్షన్ మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టం కలిగి ఉంటుందట. ఆడియెన్స్ కి మూవీ చూస్తే ఇలాంటి థియేటర్ లోనే చూడాలనే అనుభూతి కలుగుతుందని చెబుతున్నారు.















































































