చిన్నప్పుడు తమ సినిమా కెరీర్ ని మొదలు పెట్టి తరువాత యాక్టర్లుగా పరిచయమయ్యి తమకంటూ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్లలో స్టార్ హీరోలు ఉన్నారు ,ఇంకా ఎందరో క్యారెక్టర్ ఆర్టిస్ట్లు కూడా ఉన్నారు. ఇంక అసలు విషయానికి వస్తే వర్షం సినిమాలో ప్రభాస్ మేనల్లుడు పాత్రలో నటించిన బాబు గుర్తుండే ఉంటాడు.

అంతకుముందే అతను సంతోషం సినిమాలో నాగార్జున కొడుకుగా కనిపించాడు. అతను ఎవరో తెలుసా? అతని పేరు అక్షయ్ బచ్చు. అక్షయ్ బాల నటుడిగా తన కెరీర్ మొదలు పెట్టాడు. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సినిమాల్లో, సీరియల్స్ లో, ఇంకా ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ లో నటించాడు.

బ్లాక్ బస్టర్ సినిమా పోకిరి ని హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా వాంటెడ్ పేరుతో రీమేక్ చేసిన విషయం అందరికి తెలిసిందే. అందులో హీరోయిన్ అయేషా టాకియా తమ్ముడి పాత్రలో నటించాడు అక్షయ్. అక్షయ్ ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నాడు. ఆన్ మై కే రోల్ అనే ఒక కాస్టింగ్ ఏజెన్సీలో ఉద్యోగం చేస్తున్నాడు.

అక్షయ్ కి నటనతో పాటు సింగింగ్ లో కూడా ప్రావీణ్యం ఉంది. బ్లాక్ బస్టర్ పాటలను తన వెర్షన్ లో పాడి, వీడియో రూపొందించి తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తూ ఉంటాడు అక్షయ్. మిగతా చైల్డ్ ఆర్టిస్ట్స్ లాగానే అక్షయ్ కూడా మళ్లీ హీరోగా మనల్ని పలకరిస్తాడేమో, వేచి చూద్దాం.
































రామాయణం ఇతిహాసంలోని ప్రధాన పాత్రల్లో శూర్పణఖ కూడా ఒకటి. ఆమె లంకాధిపతి రావణాసురుడి చెల్లెలు. శూర్పణఖ రాముడు వనవాసంలో ఉన్న సమయంలో చూసి ఇష్టపడుతుంది. ఆ విషయం గురించి రాముడికి చెబుతుంది. అయితే ఆ సమయంలో లక్ష్మణుడు వచ్చి శూర్పణఖ ముక్కును కొస్తాడు. ఈ క్యారెక్టర్ ను ఆదిపురుష్ సినిమాలో చూపించారు. తేజస్విని పండిట్ శూర్పణఖ క్యారెక్టర్ లో నటించింది.
ఆదిపురుష్ సినిమాలో క్రూరమైన శూర్పణఖగా కనిపించిన తేజస్విని పండిట్ నిజ జీవితంలో ఆమె ఒక స్టార్ హీరోయిన్. మరాఠా సినీ ఇండస్ట్రీలో తేజస్విని పాపులర్ హీరోయిన్. తేజస్విని పండిట్ 2004 లో రిలీజ్ అయిన మారాఠి సినిమా ‘అగా బాయి అరేచా’ తో సినీ కెరీర్ మొదలు పెట్టింది. ఆమె తొలి సినిమాలోనే నెగిటీవ్ క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకుంది. తేజస్విని సినిమాలలోనే కాకుండా టెలివిజన్ ఆడియెన్స్ కూడా ఆకట్టుకుంది.
తేజస్విని బెస్ట్ హీరోయిన్ గా అనేక ఫిల్మ్ ఫేర్ అవార్డులను పొందింది. తేజస్విని తెరపైనే కాకుండా బయట కూడా చాలా గ్లామరస్ గా కనిపిస్తుంది. తేజస్విని తన చిన్ననాటి ఫ్రెండ్ భూషణ్ బోప్చేని 2012లో పెళ్లి చేసుకున్నారు. భూషణ్ బిజినెస్ రామేశ్వర్ రూప్చంద్ బోప్చే కుమారుడు. తేజస్విని పండిట్ ఇటీవల వెబ్ సీరీస్ లో నటిస్తుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉటుంది. తరచు తన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది.
ఆదిపురుష్ మూవీలో ఎక్కువగా ట్రోల్ అవుతున్నది రావణాసురిడి పాత్ర. ఈ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించాడు. రావణాసురుడికి పది తలలు ఉంటాయనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో రావణాసురుడికి ఉండే పది తలలు ఒకే వరుసలో ఉండకుండా రెండు వరుసలలో ఐదు తలల చొప్పున కనిపిస్తాయి.
ఈ సీన్ ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే గ్రాఫిక్స్ లేని కాలంలో కూడా పది తలల రావణాసురిడిని చక్కగా చూపించారని, గ్రాఫిక్స్ ను సరిగా వాడలేదని అంటున్నారు. ఇక రెండవ సన్నివేశం ఏమిటంటే, అయోధ్యలో రాముడు తన తండ్రి దశరథునితో మాట్లాడే సన్నివేశం.
ఈ సీన్ లో ప్రభాస్ ఎప్పుడు కనిపించని విధంగా కనిపించాడు. తెల్లటి వస్త్రాల ధరించి, జట్టును వదిలేసి డిఫరెంట్ గా కనిపించారు. ఈ సన్నివేశం పై కామెంట్స్, ట్రోల్ చేస్తున్నారు. ఈ గెటప్ ట్రైలర్ లో లేదా ఎక్కడ కూడా కనిపించలేదు. డైరెక్ట్ థియేటర్ లో చూసిన ప్రేక్షకులు ఇంకా నిరాశ చెందారు. కొందరు ప్రభాస్ దశరధుడి పాత్రలో కూడా నటించారని అంటున్నారు. కానీ ప్రభాస్ రాముడి పాత్రలో మాత్రమే నటించాడు.






సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆదిపురుష్ హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్నారు. సీతాదేవిగా బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్, రావణసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. తానాజీ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని ఈ నెల 16న తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ, హిందీ భాషల్లోలలో చాలా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.
ఈ క్రమంలో ఆదిపురుష్ మూవీ బడ్జెట్ దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. బిజినెస్ గురించి చూసినట్లయితే ఇప్పటివరకు ఈ మూవీకి శాటిలైట్, మరియు డిజిటల్ రైట్స్ అన్ని భాషలకు 250 కోట్లు వచ్చాయట. అయితే ఈ చిత్రం మ్యూజిక్ రైట్స్ ను మాత్రం అమ్మలేదని సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాలలో ముందుగా యువి క్రియేషన్స్ విడుదల చేస్తుందని అనుకున్నా, ఆ తరువాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ 185 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఓవర్సీస్, ఇతర భాషలకు ఆ రాష్ట్రాలలోని లోకల్ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా టి సిరీస్ సొంతంగా విడుదల చేయాలని అనుకుంటునట్లు తెలుస్తోంది. సినిమాకు మంచి టాక్ వస్తే ఫస్ట్ వీకెండ్ లోనే ప్రొడ్యూసర్లు సేఫ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తోంది. ఈ రోజు తిరుపతిలో ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ఈ వేడుకకు చినజీయర్ స్వామి చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు.

