మన సినిమా ఇండస్ట్రీలో కొంత మంది హీరోలు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చారు. కొంత మంది హీరోలు బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చారు. అయితే ప్రతి యాక్టర్ ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు. అలా మన తెలుగు ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉన్న కొంత మంది హీరోలు ఎవరో, వారి కుటుంబాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

#1 మెగా ఫ్యామిలీ
మెగా ఫ్యామిలీ నుండి మెగాస్టార్ చిరంజీవి తో పాటు పవన్ కళ్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్, వైష్ణవ్ తేజ్ ,నిహారిక కొణిదెల, కళ్యాణ్ దేవ్, అలాగే అల్లు అరవింద్ గారి కుటుంబం నుంచి శిరీష్ అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఎంతో కష్టపడి తమకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు.

#2 నందమూరి ఫ్యామిలీ
నందమూరి ఫ్యామిలీ నుండి నందమూరి తారక రామారావు గారి తో పాటు నందమూరి హరికృష్ణ గారు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న అలాగే కళ్యాణ్ చక్రవర్తి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

#3 దగ్గుబాటి ఫ్యామిలీ
దగ్గుబాటి ఫ్యామిలీ నుండి విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

#4 అక్కినేని ఫ్యామిలీ
అక్కినేని ఫ్యామిలీ లో అక్కినేని నాగేశ్వర రావు గారితో పాటు అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ ,అలాగే వారి బంధువులు అయిన సుమంత్, సుశాంత్, సుప్రియ కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.

#5 కృష్ణ ఫ్యామిలీ
సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీ నుండి రమేష్ బాబు, మహేష్ బాబు, మంజుల, అలాగే గౌతమ్ కూడా వన్ నేనొక్కడినే సినిమాలో నటించాడు.

#6 మోహన్ బాబు ఫ్యామిలీ
మోహన్ బాబు గారి ఫ్యామిలీ నుంచి మంచు లక్ష్మి, మంచు విష్ణు, మంచు మనోజ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

#7 సాయి కుమార్ ఫ్యామిలీ
సాయి కుమార్ గారి తండ్రి పీజే శర్మ గారు కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. వారి ఫ్యామిలీ నుంచి అయ్యప్ప పి శర్మ, రవి శంకర్, ఆది కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

#8 కమల్ హాసన్ ఫ్యామిలీ
కమల్ హాసన్ గారి ఫ్యామిలీ నుండి చారుహాసన్ గారు, సుహాసిని, అను హాసన్, శృతి హాసన్, అక్షర హాసన్ కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

#9 ఉప్పలపాటి ఫ్యామిలీ
ఉప్పలపాటి కుటుంబం నుండి కృష్ణంరాజు గారి తో పాటు ప్రభాస్ కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అలాగే ప్రభాస్ సోదరుడు ప్రమోద్, అలాగే సోదరి ప్రసీద యు.వి.క్రియేషన్స్ బాధ్యతలు నిర్వహిస్తారు.


“విరాటపర్వం విడుదలై ఈరోజుతో ఏడాది పూర్తయింది. విరాట పర్వానికి ముందు ఉన్న ‘నేను’ దాని విడుదల తర్వాత ఉన్న ‘నేను’ ఒకటి మాత్రం కాదు. విరాటపర్వం అందమైన అనుభూతుల్ని ఇచ్చింది. ఎందరో బుద్ధి జీవుల ప్రగతిశీల ప్రేక్షకుల అభిమానాన్ని, ప్రేమను ఇచ్చింది. అదే సమయంలో మార్కెట్ కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించింది. కాలి కింద మందుపాతర పేలినట్టయింది. కొన్ని నెలలపాటు నిద్ర లేని రాత్రులనిచ్చింది. ఈ వైరుధ్యం నన్ను ఆలోచనలో పడేసింది.”
“నాకు నా ప్రేక్షకులకు మధ్య అనుబంధాన్ని పునః సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని విప్పి చెప్పింది. ఈ ఏడాది పాటు నాలో సృజనాత్మక వ్యక్తిత్వాన్ని నేను మరింత అర్థం చేసుకోవడానికి విరాటపర్వం స్ఫూర్తినిచ్చింది. అందుకే విరాట పర్వం నాకు ఒక సెల్ఫ్ డిస్కవరి లాంటిది. తీయబోయే చిత్రాలకు ఉపోద్ఘాతం లాంటిది.”




ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి మూవీ పై విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాలోని వీఎఫ్ఎక్స్, పాత్రల వస్త్రధారణ పై మరియు పాత్రల చిత్రీకరణ పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. మూవీ డైరెక్టర్ ఓం రౌత్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఆదిపురుష్ పై నెట్టింట్లో చర్చ జరుగుతున్న సమయంలో ఓం రౌత్ పాత ట్వీట్ ఒకటి వైరల్ గా మారింది. అది కూడా 2016లో చేసిన ట్వీట్.
దీనిని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అభిమానులు తెరపైకి తీసుకొచ్చి, ఓం రౌత్ను ట్రోల్ చేస్తున్నారు. అయితే ఓం రౌత్ ఆ ట్వీట్ లో షారుక్ ఫ్యాన్ సినిమాతో పొలుస్తూ మరాఠీ సినిమా ‘సైరాట్’ పై ప్రశంసలు కురిపించాడు. అయితే షారుక్ ఫ్యాన్స్ అతని పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓం రౌత్ ‘మరాఠీ సినిమా ‘సైరాట్’ షారుఖ్ ‘ఫ్యాన్’ సినిమాని క్రాస్ చేసి 80 కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది’ అని ట్వీట్ చేశాడు.
ఆదిపురుష్ సినిమాతో ట్రోల్ అవుతున్న ఓం రౌత్ను షారుక్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అది కూడా షారుక్ ఒక సందర్భంలో కర్మ గురించి చేసిన ట్వీట్ తో ట్రోల్ చేస్తున్నారు. 500 కోట్ల ‘ఆదిపురుష్’ సినిమా కన్నా 4 కోట్ల బడ్జెట్తో తీసిన ‘సైరాట్’ మూవీ వీఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ బాగున్నాయని కామెంట్స్ చేస్తున్నారు.




ఏషియన్ మల్టిప్లెక్స్ థియేటర్స్ లో మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ కి ఆడియెన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ పొందింది. హైదరాబాద్ లో ఏఎంబి సినిమాస్ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇటీవల ఏషియన్ సినిమాస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పార్టనర్ షిప్ తో ఏఏఏ సినిమాస్ అమీర్ పెట్ లో నిర్మించారు. తాజాగా ఈ మల్టిప్లెక్స్ థియేటర్ ను ప్రారంభించారు. ఈ వేడుకకు తెలంగాణ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నిర్మాత అల్లు అరవింద్ హాజరయ్యారు.
అమీర్ పెట్ లో ఒకప్పుడు బాగా ఫేమస్ అయిన సత్యం థియేటర్ ని పడగొట్టి, ఏఏఏ సినిమాస్ ని నిర్మించారు. 3 లక్షల స్క్వేర్ ఫీట్ లో దీనిని నిర్మించారు. పార్కింగ్ కోసం 2 ఫ్లోర్స్ ని కేటాయించారంట. ఇందులో మొత్తం 5 స్క్రీన్ లు ఉండగా, ఒక్కో స్క్రీన్ 1 67 ఫీట్ల పొడవుతో బార్కో లంజెర్ ప్రొజెక్షన్ తో చిత్రాలను ప్రదర్శిస్తారని తెలుస్తోంది.
రెండవ స్క్రీన్ ఎపిక్ లక్సన్ స్క్రీన్. ముంబైలో తప్ప ఎక్కడ ఈ LED స్క్రీన్ లేదట. ఏఏఏ సినిమాస్ ద్వారా ఈ టెక్నాలజీని మొదటిసారిగా హైదరాబాద్ కి పరిచయం చేస్తున్నారు. ఇక ఈ స్క్రీన్ కి ప్రొజెక్టర్ తో పని లేదంట. కనెక్షన్ ద్వారానే మూవీ ప్లే అవుతుంది. మిగిలిన 3 స్క్రీన్స్ 4K ప్రొజెక్షన్ మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టం కలిగి ఉంటుందట. ఆడియెన్స్ కి మూవీ చూస్తే ఇలాంటి థియేటర్ లోనే చూడాలనే అనుభూతి కలుగుతుందని చెబుతున్నారు.
















































