Nayanthara: సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అనగానే గుర్తొచ్చే పేరు నయనతార. నయనతార మలయాళంలో మనస్సినక్కరే అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ మూవీలో హీరో జయరామ్. 2005లో వచ్చిన తమిళంలో అయ్యా, రజనీకాంత్ చంద్రముఖి మూవీ నయనతారకు మంచి విజయాన్ని ఇచ్చాయి. ఆ తర్వాత నయనతార నటించిన గజిని, లక్ష్మి, బాస్, యోగి సినిమాలు ఆమెను తమిళ మరియు తెలుగు సినీ పరిశ్రమల్లో బిజీ నటిగా మార్చాయి. అగ్ర నటులందరితోనూ నటించి, మెప్పించింది. సౌత్ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ నయనతార.
సినిమాల ద్వారా ఎంతో పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్న నయనతార ఇటీవల తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ని వివాహం చేసుకుంది.పెళ్లి అయిన నెలకే సరోగసి ద్వారా తల్లి అయ్యి వార్తల్లో నిలిచింది. నయన్ ఆస్తుల విలువ దాదాపు రూ. 100 కోట్లు అని అంచనా. దక్షిణ భారతదేశంలోని అత్యంత ధనిక హీరోయిన్స్ లో ఒకరు. ఆమెకు చెన్నైలో విలాసవంతమైన విల్లాలు, అపార్ట్మెంట్లు, విలాసవంతమైన కార్లు మరియు ప్రైవేట్ జెట్ కూడా ఉన్నాయి.
నయనతారకు ఉన్న 8 ఖరీదైన వస్తువుల జాబితా ఏంటో చూద్దాం..
1. రౌడీ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ విలువ రూ. 50 కోట్లు
నయనతార మరియు విఘ్నేష్ శివన్ కలిసి రౌడీ పిక్చర్స్ బ్యానర్ను మొదలుపెట్టారు. ఇది 50 కోట్ల రూపాయల విలువ ఉన్న నిర్మాణ సంస్థ.
2. విలువైన ఆస్తులు
నయన్ హైదరాబాద్, చెన్నై, ముంబైలలో 4 BHK అపార్ట్మెంట్లతో సహా రూ. 100 కోట్ల ఆస్తి ఉంది.
3.కాస్మెటిక్ బ్రాండ్ ‘ది లిప్ బామ్ కంపెనీ’
కాస్మెటిక్ సర్జన్ అయిన రెనితా రాజన్తో కలిసి నయనతార కాస్మెటిక్ బ్రాండ్ ‘ది లిప్ బామ్ కంపెనీ’స్టార్ట్ చేసింది. దీని విలువ రూ.10 కోట్లు
4. ప్రైవేట్ జెట్
నయనతార & విఘ్నేష్ శివన్ లకు రూ. 50 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ను ఉన్నట్లు తెలుస్తోంది.
5. మెర్సిడెస్ GLS 350D
రూ. 88 లక్షల విలువ కలిగిన మెర్సిడెస్ GLS 350D ఉంది.
6.BMW 7-సిరీస్ ధర రూ. 1.76 కోట్లు
7.టయోటా ఇన్నోవా క్రిస్టా విలువ రూ. 30 లక్షలు
8. రూ. 74.50 లక్షల విలువైన BMW 5 సిరీస్

https://wirally.com/expensive-things-owned-by-nayanthara/

















మహేష్ బాబు జక్కన్నతో మొదటిసారి భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ చిత్రం మహేష్ 29వ సినిమాగా రాబోతుంది. ఇక ఈ మూవీ మొదలుపెట్టక ముందే అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ అనంతరం అంతకుమించి ఉండేలా మహేష్ తో మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమా గురించి రకరకాల ప్రచారాలు, వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ తిరుగు తున్నాయి. ఇక రాజమౌళికి మోహన్ లాల్ అంటే చాలా అభిమానమని, తన గత చిత్రాల కోసం మోహన్ లాల్ ను జక్కన్న సంప్రదించారని వినిపిస్తోంది.
అయితే ఆ టైంలో మోహన్ లాల్ ఇతర చిత్రాలతో బిజీగా ఉండటంతో జక్కన్న చిత్రాలకు అంగీకరించలేదు. అయితే జక్కన్న మోహన్ లాల్ కోసం ఇప్పటి నుండి సంప్రదిస్తున్నారు. కాబట్టి ఈ చిత్రంలో మోహన్ లాల్ నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కొందరు మహేష్ రాజమౌళి కాంబో సినిమాలో మోహన్ లాల్ తప్పకుండా నటిస్తారని అంటున్నారు.
1. రాజశేఖర్ :
2. అనుపమ పరమేశ్వరన్ :
3. రాశి :
4.పృథ్వీ రాజ్ :
Also Read:
మహేష్ వయసు పెరిగే కొద్దీ ఆయన అందం కూడా పెరుగుతోంది. తనయుడు గౌతమ్ పక్కన నిలబడితే బ్రదర్స్ లా కనిపిస్తున్నారు. ఇంతవరకు ఒక్క పాన్ ఇండియా సినిమాలో నటించకుండానే దేశవ్యాప్తంగా మహేష్ కు మిలియన్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు తన ఇరవై ఏళ్ల కెరీర్లో చాలా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. ఇప్పటికీ కూడా అదే జోష్తో కొనసాగుతున్నారు. అయితే మహేష్ మూవీ షూటింగ్ లో ఉంటారు. లేదంటే కటుంబంతో కలిసి గడుపుతారు. పక్కా ప్యామిలీ పర్సన్.
ఒక్క రూమర్ లేకుండా, వివాదాలకు దూరంగా ఉంటారు. అంతే కాకుండా వ్యాపారంలో పెట్టుబడులు, యాడ్స్ ద్వారా మహేష్ ఓ రేంజ్లో సంపాదిస్తున్నారు. ఇక ఇప్పుడు మహేష్ తన పారితోషికాన్ని పెంచినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేసే సినిమా కోసం మహేశ్ 70 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ మూవీ తర్వాత, రాజమౌళి సినిమాలో మహేష్ నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం 110 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ మూవీ మహేష్ కెరిర్ లో 29వ చిత్రంగా తెరకెక్కుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి గ్లోబల్ వైడ్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. దాంతో ఈ మూవీ షూటింగ్ మొదలు కాక ముందే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మహేష్ ఈ మూవీ కోసం ఎక్కువ రోజులను కేటాయించబోతున్నాడని, అందుకే ఈ మూవీకి 110 కోట్ల భారీ పారితోషికం తీసుకుంటున్నాడని అంటున్నారు.
ఇటీవల కాలంలో ఇలాంటి గేమ్ షోలు ఇండియాలో ఎక్కువగానే ప్రసారం అవుతున్నాయి. అనేక టీవి ఛానెల్స్ ఇలాంటి గేమ్ షోలను ప్రారంభించాయి. ఈ షోలలో పాల్గొని, గెలవడం ద్వారా డబ్బును గెలుచుకోవచ్చు. బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ 2000లో ప్రారంభించిన “కౌన్ బనేగా కరోడ్ పతి” టీవీ షోకు దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. అదే షోని తెలుగులో “మీలో ఎవరు కోటీశ్వరుడు” పేరుతో 2014 నుంచి మాటీవీలో ప్రారంభం అయ్యింది. తెలుగులో కూడా ఈ షో సక్సెస్ అయ్యింది.
తొలి 3 సీజన్లకి నాగార్జున హోస్ట్, 4వ సీజన్కి మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా చేశారు. 5 వ సీజన్కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా అలరించారు. అయితే ఐదో సీజన్ జెమిని టీవిలో ప్రసారం అయ్యింది. ఈ షో పేరును “ఎవరు మీలో కోటీశ్వరులు” గా మార్చారు. ఈ షోలలో ఇప్పటివరకు చాలా మంది ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. అయితే ఈ షోలలో మనీని గెలుచుకున్న పోటీదారులకు మనీని నిజంగానే ఇస్తారా? ఒకవేళ ఇస్తే ఆ మనీని ఎవరు ఇస్తారనే సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. షోలో గెలిచినవారికి వారికి ఆ షో నిర్మాత డబ్బును ఇస్తారు.
సినిమాలకు ప్రొడ్యూసర్స్ ఎలా ఇస్తారో అలాగే షోను హోస్ట్ చేసిన వ్యక్తికి, అలాగే గెలిచిన కంటెస్టెంట్ కి కూడా నిర్మాతనే డబ్బును ఇస్తారు. ఈ షో మధ్యలో వచ్చే ప్రకటనల ద్వారా నిర్మాతలకు అధిక మొత్తంలో డబ్బు వస్తుంది. ఈ షో రాత్రి పూట మాత్రమే టెలికాస్ట్ చేస్తారు. ఏ భాషలో అయినా సరే ఈ షో రాత్రి పూట వస్తుంది. అందుకు కారణం ఏంటంటే ఆ సమయంలో టిఆర్పి చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో టిఆర్పి ఎక్కువగా ఉంటే యాడ్స్ కూడా ఎక్కువగా వస్తాయి.
సినిమా చూసిన ప్రేక్షకులను మీడియా మూవీ ఎలా ఉందని రివ్యూ చేస్తుంది. ఆ క్రమంలోనే ఒక వ్యక్తిని ఆదిపురుష్ ఎలా ఉందని మీడియా అడుగగా, అతను బాలేదని చెప్పాడు. ప్రభాస్ అన్న నటన గురించి మాట్లాడట్లేదు. ఆచార్యలో చిరంజీవిని ఎలా చూపించారో, అలాగే ఆదిపురుష్ లో త్రీడీ ప్రభాస్ ను చూపించారని అన్నారు. ప్లే స్టేషన్ లో ఉండే రాక్షసులను ఈ మూవీలో చూపించారు. హనుమాన్, బీజీఎమ్, కొన్ని త్రీడీ షాట్స్ తప్పా సినిమాలో ఏం లేదని అన్నాడు. ప్రభాస్ రాముడిగా అస్సలు సెట్ కాలేదు. ప్రభాస్ ను దర్శకుడు సరిగా చూపించలేదని తెలిపాడు.
ఆ వ్యక్తి మాటలు విన్న ప్రభాస్ ఫ్యాన్స్ అతనిపై మండిపడ్డారు. నువ్వు అసలుఏం చూశావ్, కళ్లు కనిపిస్తాయా అని తిట్టారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో అని ఆగ్రహాం వ్యక్తం చేశారు. అయితే ఆ వ్యక్తి కూడా ఫ్యాన్స్ తో వాగ్వాదానికి దిగడంతో అతన్ని ఫ్యాన్స్ చితక బాదారు. అక్కడున్న మీడియా వారిని ఆపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ గా మారింది.
